వామన మహా పురాణము లోని సరో మహాత్మ్యము
అధ్యాయము 14
అచట నుంచి తీర్థసేవ చేయుగోరు బ్రాహ్మణోత్తముడు రామహ్రదాని కెళ్ళాలి. ఆ చోటనే మహాతేజస్వియయిన భార్గవరాముడు క్షత్రియ సంహారం చేసి వారల రక్తంతో అయిదు సరోవరాలను నింపాడు. ఈ విషయం మేము విన్నాము. ఆ జలాలతో పితృపితామహులకు తర్పణా లిచ్చాడు. అంతట పరమ ప్రీతులైరాముని పితరులు అతనితో యిలా అన్నారు. మహాపరాక్రమవంతుడవైన రామా! ణీ విక్రమానికి పితరులయెడ భక్తికి సంతోషించాము. మహాయశస్వీ! నీకేమి వరంకావలయునో అడుగుము. నీకు కళ్యాణమగుగాక. అంతట మహాబలశాలియైన భార్గవరాముడు ఆకాశాన నిలబడిన పితృదేవతలకు చేతులెత్తి నమస్కరించి యిలా అన్నాడు. మీరలు నాయెడ ప్రసన్నులైనచో నన్ననుగ్రహించునో మీ అనుగ్రహం వల్ల నేను మరల తపోసిద్ధి పొందవలెను. రోషాతిరేకంతో క్షత్రియ సంహారం చేసినందున నాకు గల్గిన పాపం నశింపవలెను. మీ ప్రభావంవల్ల ఈ అయిదు సరోవరాలు పవిత్ర తీర్థాలుగా ప్రసిద్ధి చెందవలె. రాముడు పలికిన ఈ శుభ వాక్యాలు విని హర్షంతో ఆయన పితరులు ప్రేమతో అభయమిచ్చారు. పుత్రా ! విశిష్టమైన ణీ పితృ భక్తివల్ల ణీ తపస్సు వర్ధిల్లుతుంది. కోపవశాన నీకు సంక్రమించిన క్షత్రియ వధపాతకం తొలగిపోయినది. ఆ క్షత్రియులు తమ దుష్కర్మల వల్లనే చంపబడ్డారు. నిస్సందేహంగా, నీవు నిర్మించిన ఈ సరస్సులకు తీర్థత్వం లభిస్తుంది. ఈ సరస్సులలో మునిగి ఎవరు తమ పితరులకు తర్పణాలు విడుస్తారో వారల కోర్కెలు వారి పితరులు సిద్ధింప చేస్తారు. వారలకు శాశ్వత స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా పరశురామునకు వరాలిచ్చి ఆయన పితృదేవతలు అంతర్ధానమైనారు. ఈ విధంగా మహాత్ముడగు భార్గవరామునిచే నెలకొల్పబడిన రామసరోవరాలు పరమ పవిత్రాలు. బ్రహ్మచారియై నియమంతో వానిలో స్నానంచేసి రాముని అర్చిస్తే బహుసువర్ణ ప్రాప్తి కలుగుతుంది.
జితేంద్రియుడగు తైర్థికుడు తన వంశాభివృద్ది కోసం వంశమూలంలో స్నానం చేసి ఆటనుండి కాయశోధనం అనే ముల్లోకాల్లో పేరుగన్న తీర్థంలో స్నానం చేసి తప్పకుండా కాయసిద్ధి పొందుతాడు. పరిశుద్ధమైన దేహం కలిగి పునరావృత్తి లేని లోకాలకు పోతాడు. తీర్థ పరాయణులైన సిద్ధులు కాయశోధనం పొందనంతవరకు తీర్థాటనం చేస్తూ ఉంటారు. ఆ తీర్థంలో స్నానం చేసి సంయతచిత్తులగు వారు పరమపదాన్ని చేరుకుంటారు. అనంతరం ఉత్తములగు విప్రులు, సకలప్రాణులు విష్ణువు చేత ఉద్ధరింపబడిన త్రిలోకఖ్యాతి గల లోకోద్ధారమను తీర్థంలో స్నానం చేసి శాశ్వత లోకాలను పొందుతారు. సనాతనులైన శివవిష్ణువులిరువును నిత్యం సన్నిహితులగుచోట, నా దేవులకు ప్రణమిల్లి ప్రసన్నుల గావించుకొని ముక్తిపొందనగును. ఆటనుండి పరమోత్తమమైన శాలగ్రామశ్రీ తీర్థంలో స్నానంచేసిన సదాపరమేశ్వరి సాన్నిధ్యం పొందవచ్చు. తర్వాత త్రిలోకఖ్యాతి గల కపిల తీర్థంలో స్నానం చేసి, దేవపితరులను అర్చించినచో, వేయి కపిలగోవులు దానమిచ్చిన ఫలం కలుగును. అచటనే కపిలరూపంలో వెలసిన మహాదేవుని, ఋషి పూజితుని దర్శించినచో ముక్తి కలుగును. ఆపైని, సూర్యతీర్థంలో స్నానం చేసి స్థిరచిత్తంతో ఉపవాసపూర్వకంగా పితరులను దేవతలను అర్చించిన, అగ్నిష్టోమ యాగఫలం కలిగి సూర్యలోకప్రాప్తి పొందనగును. జ్ఞానియగు నరుడు సహస్రఖరకిరణుడగు సూర్యదేవుని దర్శించి మోక్షగామి అవుతాడు. అనంతరం భవానివనం చేరి అచటనభిషేకాదులొనర్చిన గోసహస్రదాన ఫలం దక్కుతుంది. పూర్వకాలాన బ్రహ్మ అమృతపానంచేసి పుక్కిలించగా అందులోనుంచి సురభి (కామధేనువు) పుట్టి పాతాళానికి వెళ్ళింది. లోకమాత అయిన ఆ సురభికి ఎన్నో గోవులు జన్మించాయి. వానితో పాతాళం నిండి పోయింది. తర్వాత బ్రహ్మయజ్ఞం చేసినపుడు దక్షిణ యివ్వడానికి ఆ గోవులను పిలిచాడు. అవి ఒక బిల ద్వారాన ప్రయాణించి వెళ్ళాయి. ఆ బిలద్వార ముఖాన వేంచేసిన గణపతిని దర్శించినచో సకల కోర్కెలు సిద్ధిస్తాయి.
అనంతరం ముక్తినిలయమైన సంగిని తీర్థంలోని దేవీ తీర్థంలో స్నానంచేసి, నరుడు చక్కని రూపవంతుడు కాగలడు. అనంతైశ్వర్యాలు పుత్రపౌత్రులు గలిగి విస్తారమైన భోగాలననుభావించి పరమపదమందగలడు. బ్రహ్మావర్తంలో స్నాన మాడినవాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. స్వేచ్చామరణం పొందుతాడు. సందేహం లేదు. బ్రాహ్మణోత్తములారా! అచట నుండి రంతుకద్వారపాలుని సేవించాలి. మహాత్ముడగు నాయక్షేంద్రుని సరస్వతీతీర్థంలో ఉపవాసముండి స్నానమాడుచో యక్షప్రసాదం వల్ల కోరిన ఫలములు పొందనగును. ఆటనుండి మునిస్తుతమైన బ్రహ్మావర్తతీర్థంలో స్నానం చేసిన తప్పక బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. అచట నుండి దేవతలకు పితరులకు నిత్యనివాసమైన సుతీర్థకమను ఉత్తమ తీర్థంలో పితృదేవార్చనలు అభిషేకాదులు చేసి వారలను సంతోషపెట్టి అశ్వమేధ ఫలం పొందవచ్చు. అక్కడ నుంచి అన్బువనం వెళ్లి అచట కామేశ్వరతీర్థంలో భక్తితోస్నానంచేసినవాడు సర్వరోగముక్తుడై బ్రహ్మజ్ఞాని అవుతాడు. తప్పదు. అక్కడే మాతృతీర్థం ఉంది. అక్కడ భక్తితో స్నానంచేస్తే సంతానవృద్ధి కలిగి అనంతైశ్వర్యాలు లభిస్తాయి. అక్కడనుంచి నియతాహార సేవియై శీతవనానికి వెళ్ళాలి. బ్రాహ్మణులారా! అక్కడ అన్యత్ర దుర్లభమైన తీర్థం ఉంది. దర్శన మాత్రాన్నే పవిత్రం చేసే ఆ క్షేత్రం దండకం. అక్కడ శిరోముండనం చేసికొని మానవుడు పవిత్రుదౌతాడు. పాపాలు పోతాయి. అక్కడే స్వానులోమాయనమనే మరో త్రైలోక విఖ్యాతిగాంచిన తీర్థం ఉంది. అక్కడ మహాప్రాజ్ఞులైన తీర్థోపసేవులు ప్రాణాయామవిధిచే తమ శరీరం మీది రోమాలన్నీ పోగొట్టుకుంటారు. అలాంటి పవిత్రులు పరమపదం పొందుతారు. ఆవల దశాశ్వమేధిక తీర్థం ప్రఖ్యాతమైనది. అక్కడ భక్తితో స్నానం చేస్తే దశాశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. తర్వాత శ్రద్ధాళువులు, లోకవిఖ్యాతమైన మానుషతీర్థానికి వెళ్తారు. దానిని చూసినంతనే కిల్బిషాలు తొలగి ముక్తులౌతారు. పూర్వసమయాన ఆ ప్రదేశాన వేటకాని బాణాలకు గురియై కృష్ణమృగాలు ఆ సరస్సులోపడి మనుష్యశరీరాలు ధరించారు. అలావచ్చిన బ్రాహ్మణోత్తములను చూచి వేటగాళ్ళు వారలతో ఓ ఋషులారా! మా బాణాలు తగిలిన లేళ్ళు సరస్సులో మునిగిపోయాయి. అవి తర్వాత ఏమైనవని అడిగారు. అందులకా బ్రాహ్మణులు మేమే ఆ జింకలము. ఈ తీర్థమహిమ వల్ల ఉత్తమమానుష రూపములు ధరించాము. మీరు గూడ మా వలెనే మత్సర రహితులై స్నానం చేసి పాపాలనుండి ముక్తులవండి. అని చెప్పారు. అంతట వారు గూడ అందులోస్నానంచేసి పవిత్ర శరీరులై స్వర్గానికి వెళ్ళారు. ఓ విప్రోత్తములారా! యిలాంటి మహిమ గల మానుషతీర్థం గరిమనువిన్న శ్రద్ధాళువులు గూడ పరమపదం పొందుతారు.
అధ్యాయము 14 complete
