భాగవత మహా పురాణము
15 - పరశురామ కార్తవీర్యార్జునుల చరితము
శ్రీశుక ఉవాచ।
ఐలస్య చోర్వశీగర్భాత్ షడాసన్నాత్మజా నృప ।
ఆయుశ్శ్రుతాయుస్సత్యాయూ రయోSథ విజయో జయః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! ఇలాపు త్రుడగు పురూరవునకు ఊర్వశి గర్భమునుండి ఆయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుడు, విజయుడు, మరియు జయుడు అనే ఆర్గురు పుత్రులు కలిగిరి.
శ్రుతాయోర్వసుమాన్ పుత్రస్సత్యాయోశ్చ శ్రుతంజయః ।
రయస్య సుత ఏకశ్చ జయస్య తనయోSమితః ॥
శ్రుతాయువుయొక్క పుత్రుడు వసుమంతుడు. సత్యాయువు యొక్క పుత్రుడు శ్రుతంజయుడు. రయుని పుత్రుడు ఏకుడు. జయుని పుత్రుడు అమితుడు.
భీమస్తు విజయస్యాథ కాంచనో హోత్రకస్తతః ।
తస్య జహ్నుస్సుతో గంగాం గండూషీకృత్య యోSపిబత్ ।
జహ్నోస్తు పూరుస్తత్పుత్రో బలాకశ్చాత్మజోSజకః ॥
విజయుని పుత్రుడైతే భీముడు. భీముని పుత్రుడు కాంచనుడు. కాంచనుని పుత్రుడు హోత్రకుడు. హోత్రకుని పుత్రుడు జహ్నువు. జహ్నువు గంగను పుక్కిటబట్టి త్రాగివేసెను. జహ్నువుయొక్క పుత్రుడు పూరువు. పూరువు పుత్రుడు బలాకుడు. బలాకుని పుత్రుడు అజకుడు.
తతః కుశః కుశస్యాపి కుశాంబుస్తనయో వసుః ।
కుశనాభశ్చ చత్వారో గాధిరాసీత్కుశాంబుజః ॥
ఆ అజకుని పుత్రుడు కుశుడు. కుశునకు కుశాంబువు, తనయుడు, వసువు, కుశనాభుడు అనే నల్గురు పుత్రులు ఉండిరి. వారిలో కుశాంబుని పుత్రుడు గాధి.
తస్య సత్యవతీం కన్యామృచీక్వోయాచత ద్విజః ।
వరం విసదృశం మత్వా గాధిర్భార్గవమబ్రవీత్ ॥
ఆ గాధియొక్క కుమార్తె సత్యవతి. ఆమెను తనకిచ్చి వివాహము చేయుమని ఋచీకుడనే బ్రాహ్మణుడు కోరెను. కానీ, ఆయన తగిన వరుడు కాదని గాధి తలపోసి, భృగువంశీయుడగు ఆ ఋచీకునితో ఇట్లు పలికెను.
ఏకతశ్శ్యామకర్ణానాం హయానాం చంద్రవర్చసామ్ ।
సహస్రం దీయతాం శుల్కం కన్యాయాః కుశికా వయమ్ ॥
మేము కుశికవంశము వారము. మా కన్యకు కట్నముగా చంద్రుని వలె మెరిసిపోయే వేయి గుర్రములనీయవలెను. వాటికి ఒకవైపు (కుడి గా ని, ఎడమ గాని) చెవి నల్లగా నుండవలెను.
ఇత్యుక్తస్తన్మతం జ్ఞాత్వా గతస్స వరుణాంతకమ్ ।
ఆనీయ దత్త్వా తానశ్వానుపయేమే వరాననామ్ ॥
గాధి ఇట్లు పలుకగా ఆ ఋచీకుడు ఆయన అభిప్రాయమును తెలుసుకొని వరుణుని వద్దకు వెళ్లాను. ఆయనవద్దనుండి అట్టి గుర్రములను తీసుకువచ్చి ఇచ్చి సుందరముఖియగు ఆ కన్య (సత్యవతి) ను వివాహమాడెను.
స ఋషిః ప్రార్థితః పత్న్యా శ్వశ్వ్రా చాపత్యకామ్యయా ।
శ్రయిత్వోభమైర్మం త్రైశ్చరుం స్నాతుం గతో మునిః ॥
ఆ ఋచీక మహర్షిని భార్య మరియు అత్తగారు కూడ తమకు సంతానము కలగాలని కోరిరి. అపుడా మహర్షి బ్రాహ్మణ (తన భార్య) క్షత్రి యు (అత్తగారు) లిద్దరికి చెందిన మంత్రములతో హోమమును చేసే అన్న మును వండి, స్నానమును చేయుటకు వెళ్లాను.
తావత్సత్యవతీ మాత్రా స్వచరుం యాచితా సతీ ।
శ్రేష్ఠం మత్వా తయాఽయచ్ఛన్మాత్రే మాతురదత్స్వయమ్ ॥
ఆయన తిరిగి వచ్చే లోపులో సత్యవతియొక్క చరువు శ్రేష్ఠమైన దని భావించి ఆమె తల్లి ఆ చరువును కోరెను. సత్యవతి దానిని తల్లికి ఇచ్చి, తల్లియొక్క చరువును తాను భక్షించెను.
తద్విజ్ఞాయ మునిః ప్రాహ పత్నీం కష్టమకారషీః ।
ఘారో దండధరః పుత్రో భ్రాతా తే బ్రహ్మవిత్తమః ॥
ఆ విషయము తెలిసి ఋచీక మహర్షి ఇట్లు పలికెను -- హేయ మైన పనిని చేసితివి. నీకు క్రూరస్వభావము కలిగి శస్త్రములను ధరించే పుత్రుడు కలుగును. నీ తమ్ముడు వేదవేత్తలలో శ్రేష్ఠుడు అగును.
ప్రసాదితస్సత్యవత్యా మైవం భూదితి భార్గవః ।
అథ తర్హి భవేత్పౌత్రో జమదగ్నిస్తతోఽభవత్ ॥
ఈ విధముగా ఘటిల్లరాదు అని సత్యవతి భృగువంశీయుడగు ఋచీక మహర్షిని ప్రసన్నుని చేసుకొనెను. అప్పుడాయన -- అయైనచో, నీ పుత్రుని పుత్రుడు అట్టివాడు (శస్త్రధారీ) కాగలడు -- అని చెప్పెను. తరు. వాత ఆమెకు జమదగ్ని (శాంతస్వభావుడు) పుట్టెను.
సా చాభూత్సుమహాపుణ్యా కౌశికీ లోకపావనీ ।
రేణోస్సుతాం రేణుకాం వై జమదగ్నిరువాహ యామ్ ॥
మహాపుణ్యాత్మురాలగు ఆ సత్యవతి జనులను పవిత్రము చేసే కౌశికి అనే నదియై ప్రవహించెను. రేణు మహర్షియొక్క కుమార్తెయగు రేణుకను జమదగ్ని వివాహమాడెను.
తస్యాం వై భార్గవఋ షేస్పుతా వసుమదాదయః ।
యవీయాన్ జజ్ఞ ఏతేషాం రామ ఇత్యభివిశ్రుతః ॥
భృగువంశీయుడగు జమదగ్ని మహర్షికి రేణుకయందు వసుమం తుడు, వసువు, సుషేణుడు, రుమణ్వంతుడు అనే పుత్రులు కలిగిరి. వీరి తరువాత కనిష్ట పుత్రుడు జన్మించి, లోకములో (పరశు) రాముడు అనే పేరుతో చాల ప్రసిద్ధిని పొందెను.
యమాహుర్వాసుదేవాంశం హైహయానాం కులాంతకమ్ ।
త్రిస్సప్తకృత్వో య ఇమాం చక్రే నిఃక్షత్రియాం మహీమ్ ॥
హైహయుల వంశమును అంతమొందించిన ఆ పరశురాముడు శ్రీహరియొక్క అంశావతారమని చెప్పెదరు. ఆయన ఇరవై ఒక్క పర్యా యములు భూమండలముపై క్షత్రియులు లేకుండా చేసెను.
దుష్టం క్షత్రం భువో భారమబ్రహ్మణ్యమనీనశత్ ।
రజస్తమోవృతమహన్ ఫల్గున్యపి కృతేSoహసి ॥
రజస్తమోగుణములతో నిండి దుర్బుద్ధితో వేదవేత్తలను పీడించే క్షత్రియుల సముదాయమును -- వారు చేసిన తప్పు చిన్నదే అయిననూ -- ఆయన వారిని సంహరించి, భూభారమును తొలగించెను.
రాజోవాచ ।
కిం తదంహో భగవతో రాజన్యైరజితాత్మభిః ।
కృతం యేన కులం నష్టం క్షత్రియాణామభీక్ష్ణశః ॥
పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నించెను --- మనోనిగ్రహము లేని క్షత్రి యులు భగవానునియెడల అపరాధమును చేయుటచే వారి వంశము పలు మార్లు వినాశము చేయబడినది గదా! వారు చేసిన ఆ అపరాధమెయ్యది?
శ్రీశుక ఉవాచ ।
హైహయానామధిపతిరర్జునః క్షత్రియర్షభః ।
దత్తం నారాయణస్యాంశమారాధ్య పరికర్మభిః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- హైహయవంశీయుల అధిపతి, క్షత్రియులలో శ్రేష్ఠుడు అగు కార్తవీర్యార్జునుడు నారాయణుని అంశావతారమైన దత్తాత్రేయునకు పరిచర్యలను చేసి ఆరాధించేను.
బాహూన్ దశశతం లేభే దుర్ధర్షత్వమరాతీషు । అవ్యాహతేంద్రియౌజశ్శ్రీతేజోవీర్యయశోబలమ్ ॥
ఆయనకు దత్తాత్రేయుని అనుగ్రహముచే వేయి చేతులు, శత్రువు లచే పరాజయమును పొందకుండుట, మొక్కవోని ఇంద్రియపాటవము, సంపద, తేజస్సు, శక్తి, కీర్తి, మరియు బలములు లభించెను.
యోగేశ్వరత్వమైశ్వర్యం గుణా యత్రాణిమాదయః ।
చచారావ్యాహతగతిర్లోకేషు పవనో యథా ॥
ఆయన యోగేశ్వరుడై అణిమ (దూదివలె తేలిక యగుట), గరిమ (పర్వతము వలె బరువు అగుట) మొదలైన సిద్దులు గల ఈశ్వరభావమును పొందెను. ఆయన వాయువు వలె ఆటంకము లేని గమనముతో లోకములను సంచరించెను.
స్త్రీరత్నైరావృతః క్రీడన్ రేవాంభసి మదోత్కటః ।
వైజయంతీం స్రజం బిభద్రురోధ సరితం భుజైః ॥
గర్వముతో ఉద్రేకమును పొందియున్న ఆ కార్తవీర్యుడు గొప్ప యువతులు చుట్టువారియుండగా నర్మదానదీజలములలో విహరించుచుం డెను. ఆయన వైజయంతీ (తొమ్మిది రకముల మణుల) మాలను ధరించి యుండెను. ఆతడా నదీప్రవాహమును తన చేతులతో ఆపివేసెను.
విప్లావితం స్వశిబిరం ప్రతిస్రోతస్సరిజ్జలైః ।
నామృష్యత్తస్య తద్వీర్యం వీరమానీ దశాననః ॥
ఆ సమీపములో దశకంఠుడగు రావణుడు శిబిరములో నుండెను. కార్తవీర్యుడు నదిని అడ్డుకొనగా, ప్రవాహము వెనుకకు మళ్లీ ఆ శిబి రమును ముంచివేసెను. తాను గొప్ప వీరుడననే అభిమానము రావణునకు ఉండెను. కావుననే, ఆయన కార్యవీర్యుని అట్టి (నదిని ఆపివేసే శక్తిని చూసి సహించలేక పోయెను.
గృహీతో లీలయా స్త్రీణాం సమక్షం కృతకిల్బిషః ।
మాహిష్మత్యాం సంనిరుద్ధో ముక్తో యేన కపిర్యథా ॥
రావణుడు కార్తవీర్యుని యెడల అనుచితముగా ప్రవర్తించెను. అపుడాయన ఆ రావణుని స్త్రీల యెదుటనే అలవోకగా కోతిని వలె పట్టుకోని మాహిష్మతీ నగరములో బంధించి తరువాత విడిచి పెట్టెను.
స ఏకదా తు మృగయాం విచరన్ విపినే వనే ।
యదృచ్ఛయాఽఽశ్రమపదం జమదగ్నేరుపావిశత్ ॥
ఆ కార్తవీర్యుడు ఒకనాడు దట్టని అడవిలో వేటాడుతూ సంచరించే ను. ఆయన అనుకోకుండా (ఈశ్వరేచ్చచే) జమదగ్ని మహర్షియొక్క ఆశ్ర మస్థానమును ప్రవేశించెను.
తస్మై స నరదేవాయ మునిరర్హణమాహరత్ ।
ససైన్యామాత్యవాహాయ హవిష్మత్యా తపోధనః ॥
తపస్సే ధనముగా గల జమదగ్ని వద్ద కామధేనువు గలదు. దాని అనుగ్రహముతో ఆయన ఆ మహారాజునకు, ఆయన సైన్యమునకు, మంత్రులకు, వాహనములకు కూడ ఆతిథ్యమునిచ్చెను.
స వీరస్తత్ర తద్దృష్ట్వా ఆత్మైశ్వర్యాతిశాయనమ్ ।
తన్నాద్రియతాగ్నిహోత్ర్యం సాభిలాషస్సహైహయః ॥
వీరుడగు ఆ కార్తవీర్యుడు హైహయులతో కూడియుండెను. ఆతడు ఆ ఆశ్రమములో చూచిన సంపద (కామధేనువుచే సమకూర్చబడిన ఆతిథ్యము) తన ఐశ్వర్యమును అతిశయించి యుండెను. ఆయనకు ఆ కామధేనువునందు అభిలాష కలిగి, ఆ మహర్షి ఇచ్చిన ఆతిథ్యము సంతోష మును కలిగించలేదు.
హవిర్దానీమృ షేర్దర్పాన్నరాన్ హర్తుమచోదయత్ ।
తే చ మాహిష్మతీం నిన్యుస్సవత్సాం క్రందతీం బలాత్ ॥
ఆ రాజు గర్వముచే మహర్షియొక్క హోమధేనువును లాగుకొని రమ్మని తన అనుచరులను ఆదేశించెను. వారు కూడ ఆక్రోశించుచున్న ఆ కామధేనువును దూడతో సహా మాహిష్మతీ నగరమునకు బలాత్కారముగా లాగుకొని పోయిరి.
అథ రాజనీ నిర్యాతే రామ ఆశ్రమ ఆగతః ।
శ్రుత్వా తత్తస్య దౌరాత్మ్యం చుక్రోధాహిరివాహతః ॥
తరువాత మహారాజగు కార్తవీర్యుడు నిషమించెను. ఇంతలో రాముడు ఆశ్రమమునకు తిరిగి వచ్చెను. ఆయన ఆ కార్తవీర్యుని దుర్బు ద్ధిని గురించి విని, తోక తొక్కిన త్రాచు వలె, కోపించెను.
ఘోరమాదాయ పరశుం సతూణం చర్మ కార్ముకమ్ ।
అన్వధావత దుర్ధర్షో మృగేంద్ర ఇవ యూథపమ్ ॥
ఆ రాముడు భయంకరమగు గొడ్డలిని, డాలును, అంబుల పొదిని, ధనుస్సును తీసుకొని, నిలువరించ శక్యము కాని సింహము ఏనుగు వెంట బడినట్లుగా, ఆ కార్తవీర్యుని వెన్నంటి వేగముగా వెళ్లాను.
తమాపతంతం భృగువర్యమోజసా ధనుర్దరం బాణపరశ్వధాయుధమ్ । ఐజేయచర్మాంబరమర్కధామభిర్యుతం జటాభిర్దదృశే పురీం విశన్ ॥
కార్తవీర్యుడు నగరములో ప్రవేశిస్తూ, భృగువంశీయులలో శ్రేష్టు డగు రాముడు తన మీదకు వేగముగా వచ్చుచుండగా చూచెను. లేడి చర్మ మును వస్త్రముగా దాల్చి, ధనుస్సు, బాణములు, గండ్ర గొడ్డలి అనే ఆయుధములను ధరించియున్న ఆ రాముని జటలు సూర్యకిరణముల వలె ప్రకాశించుచుండెను.
అచోదయద్ధస్తిరథాశ్వపత్తిభిర్గదాసిబాణర్ ష్టిశతఘ్నిశక్తిభిః ।
అక్షౌహిణీస్సప్తదశాతిభీషణాస్తా రామ ఏకో భగవానసూదయత్ ॥
కార్తవీర్యుడు పది హేడు అక్షౌహిణీల సైన్యమును (క్రమముగా) రాముని పైకి పంపించెను. ఆ సేనయందు ఏనుగులు, రథములు, గుర్ర ములు మరియు పదాతులు ఉండిరి. గదలు, కత్తులు, బాణములు, ఈటెలు, ఇనుపముళ్ల కర్రలు మరియు చిల్లకోలలు అనే ఆయుధములతో ఆ సైన్యము చాల భయంకరముగ నుండెను. రాముడు ఒక్కడే ఆ సైన్యము నంతనూ సంహరించెను.
యతో యతోSసౌ ప్రహరత్పరశ్వధో మనోSనిలౌజాః పరచక్రసూదనః । తతస్తతశ్చిన్నభుజోరుకంధరా నిపేతురుర్వ్యాం హతసూతవాహనాః ॥
శత్రు సైన్యములను నుగ్గు నుగ్గు చేసే ఆ రాముడు మనస్సుయొక్క మరియు గాలియొక్క వేగమువంటి వేగముతో గండ్ర గొడ్డలితో కొట్టుచుండెను. ఆయన సైన్యములో ఎక్కడెక్కడైతే విక్రమించే నో, అక్కడక్కడ సైనికులు భుజములు, తొడలు, మెడలు తెగి క్రింద పడు చుండిరి. రథచోదకులు, గుర్రములు మొదలగు వాహనములు సంహరించ బడగా, వీరులు నేల గూలుచుండిరి.
దృష్ట్వా స్వసైన్యం రుధిరౌఘకర్దమే రణాజిరే రామకుఠారసాయకైః । వివృక్ణచర్మధ్వజచాపవిగ్రహం నిపాతితం హైహయ ఆపతద్రుషా ॥
ఆ యుద్ధరంగము రక్తప్రవాహములతో బురద ఆయెను. సైనికుల డాళ్లు, జెండాలు, ధనుస్సులు మరియు దేహములు కూడ రాముని గండ్ర గొడ్డలిచే మరియు బాణములచే తెగగొట్టబడి, ఆ సైన్యము నేల గూలెను. దానిని చూచి హైహయవంశీయుడగు కార్తవీర్యుడు కోపించి వేగముగా వచ్చెను.
అథార్జునః పంచశతేషు బాహుభిర్ధనుష్షు బాణాన్యుగపత్స సందధే,
రామాయ రామ్వోస్త్రభృతాం సమగ్రణీస్తాన్యేకధన్వేషుభిరాచ్ఛినత్సమమ్ ।
అప్పుడా కార్తవీర్యార్జునుడు అయిదువందల ధనుస్సులయందు బాణములను ఎక్కు పెట్టి ఒకేసారి రామునిపై ప్రయోగించెను. అస్త్రవేత్త లలో అగ్రేసరుడగు రామునివద్ద ఒకే ధనుస్సు గలదు. ఆయన అనేకబాణములను ఒకేసారి ప్రయోగించి కార్తవీర్యుని బాణములను ముక్కలు ముక్కలుగా చేసెను.
పునస్స్వహస్తైరచలాన్మృథేఽoఘ్రీపానుత్ క్షిప్య వేగాదభిధావతో యుధి ।
భుజాన్ కుఠారేణ కఠోరనేమినా చిచ్ఛేద రామః ప్రసభం త్వ హేరివ ॥
యుద్ధరంగమునందు కార్తవీర్యుడు మరల తన చేతులతో పర్వత ములను, వృక్షములను ఊడబెరకి పైకెత్తి వేగముగా రామునకు ఎదురుగా పరుగెత్తి వచ్చుచుండెను. రాముడు యుద్ధములో ఆతని చేతులను, పాము పడగలను వలె, వాడియంచు గల గండ్ర గొడ్డలితో బలముగా నరికెను.
కృత్తబాహోశ్శిరస్తస్య గిరేశ్శృంగమివాహరత్ ।
హతే పితరి తత్పుతా అయుతం దుద్రువుర్భయాత్ ॥
రాముడు ఆ కార్తవీర్యుని చేతులను నరికి పర్వతశిఖరమువంటి తలను ఊడగొట్టెను. ఈ విధముగా తమ తండ్రి సంహరించబడగా, ఆతనీ పుత్రులు పదివేలమంది పారిపోయిరి.
అగ్నిహోత్రీముపావర్త్య సవత్సాం పరవీరహా ।
సము పేత్యాశ్రమం పిత్రే పరిక్లిష్టాం సమర్పయత్ ॥
హోమధేనువు ఆశ్రమమునకు దూరమైనందులకు చాల దుఃఖ మును పొందియుండెను. శత్రువీరులను సంహరించిన రాముడు ఆ ధేను వును దూడతో సహా ఆశ్రమమునకు మళ్లించెను. ఆయన ఆశ్రమమును చేరుకొని ఆ ధేనువును తండ్రికి సమర్పించేను.
స్వకర్మ తత్కృతం రామః పిత్రే భ్రాతృభ్య ఏవ చ ।
వర్ణయామాస తచ్ఛ్రుత్వా జమదగ్నిరభాషత ॥
రాముడు తాను చేసిన ఆ పనిని గురించి తండ్రికి మరియు సోదరులకు కూడ వర్ణించి చెప్పెను. ఆ విషయమును విని జమదగ్ని ఇట్లు పలికెను.
రామ రామ మహాబాహో భవాన్ పాపమకారషీత్ ।
అవధీన్నరదేవం యత్సర్వదేవమయం వృథా ॥
ఓ రామా! రామా! నీవు గొప్ప భుజశక్తి గలవాడవు. కాని, నీవు సకలదేవతాస్వరూపుడగు నరపతిని వ్యర్థముగా సంహరించి పాపమునే చేసితివి.
వయం హీ బ్రాహ్మణాస్తాత క్షమయార్హణతాం గతాః ।
యయా లోకగురుర్దేవః పారమేష్ఠ్యమగాత్పదమ్ ॥
అబ్బాయీ! బ్రాహ్మణులమగు మనమైతే సహనముచే పూజనీ యులమగుదుము. అట్టి సహనగుణముండుట చేతనే జగత్తును సృష్టించిన బ్రహ్మదేవుడు సర్వాతిశాయియగు సత్యలోకమును పొందినాడు.
క్షమయా రోచతే లక్ష్మీర్బ్రాహ్మీ సౌరీ యథా ప్రభా ।
క్షమిణామాశు భగవాంస్తుష్యతే హరిరీశ్వరః ॥
వేదవేత్తల శోభ (సంపద) సహనగుణముచే సూర్యకాంతి వలే అధి కముగా ప్రకాశించును (వర్ధిల్లును). జగన్నాథుడగు శ్రీహరి భగవానుడు సహనగుణము గలవారల యెడల శీఘ్రముగా ప్రీతుడగును.
రాజ్ఞో మూర్థాభిషిక్తస్య వధో బ్రహ్మవధాధ్గురుః ।
తీర్థసం సేవయా చాంహో జహ్యంగాచ్యుతచేతనః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే నవమస్కంధే పంచదశోఽధ్యాయః ॥
సామ్రాజ్యపట్టాభిషిక్తుడైన మహారాజును వధించుట బ్రహ్మహత్య కంటె ఎక్కువ పాపము. నీవు బుద్దియందు అచ్యుతుని నిలిపి పుణ్య క్షేత్ర ములను సేవించి పాపమును పోగొట్టుకొనుము.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో పరశురామ కార్తవీర్యార్జునుల వృత్తాంతమును వర్ణించే పదునైదవ అధ్యాయము ముగిసినది .
Summary of chapter 16 of the Bhāgavata Mahā Purana is as follows:
In revenge for Kārtavīryārjuna's death, the sons of the slain king crept into Jamadagni's ashram while Paraśurāma was absent and brutally murdered the peaceful sage while he was absorbed in meditation. Returning to find His father murdered, Bhagavān Paraśurāma took a solemn vow to rid the earth of corrupt, tyrannical Kshatriya rulers who had abandoned Vaidika Dharma. Paraśurāma waged a relentless military campaign, cleansing the earth of impious monarchs twenty-one times, filling five great lakes at Samantapañcaka with their blood. After restoring righteous order, Paraśurāma performed grand horse sacrifices, gave the conquered earth in charity to the brāhmaṇas, placed Jamadagni's head on his body to revive him as one of the Saptarshis, and retired to Mount Mahendra to engage in unbroken meditation.