6 - సముద్ర మథనము - మందర పర్వతమును తీసుకువచ్చుట

శ్రీశుక ఉవాచ

             శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! దేవగణములీ విధముగా జగన్నాథుడగు శ్రీహరి భగవానుని స్తుతించగా, ఆయన వేయి సూర్యులు ఒక్కసారిగా ఉదయించినంతటి కాంతితో వారి యెదుట ఆవిర్భ వించెను.

             ఆ కాంతికి కన్నులు మిరిమిట్లు గొల్పుటచే దేవతలు కూడ ఆకాశ మును, దిక్కులను, నేలను, తమను కూడ చూడలేకపోయిరి. అట్టి స్థితిలో వారు శ్రీహరి విభుని ఎట్లు చూడగల్గుదురు?

             పూజనీయుడు, దేవశ్రేష్ఠుడు అగు బ్రహ్మగారు రుద్రునితో గూడి శ్రీహరియొక్క ఆ స్వచ్చమగు మూర్తిని దర్శించెను. ఇంద్రనీలమాణి క్యము వలె శ్యామలవర్ణము గల శ్రీహరి పద్మముయొక్క మధ్యభాగము వలె ఎర్రనైన కన్నులను కలిగియుండెను. పుటము పెట్టిన బంగారము వలె పచ్చగా ప్రకాశించే పట్టు వస్త్రమును దాల్చియున్న ఆయనయొక్క అవ యవములు అన్నీ ప్రసన్నముగను, సుందరముగను ఉండెను. అందమైన కనుబొమలు గల ఆయన గొప్ప మణికిరీటమును దాల్చియుండెను. ఆయన భుజములకు అంగదములను అలంకరించుకొనియుండెను. కుండ లముల కాంతి పడి చక్కగా ప్రకాశించే చెక్కిళ్లతో పద్మమువంటి ఆయన ముఖము వెలిగిపోవుచుండెను. నడుమునకు మొలనూలుతో కాలికి అందెలతో ప్రకాశించే ఆయన కౌస్తుభ మాణిక్యము అనే ఆభరణమును, వనమా లను ధరించియుండెను. సుదర్శన చక్రము, కౌమోదకీ గద మొదలైన ఆయన ఆయుధములు రూపులను దాల్చి ఆయనను సేవించుచుండెను. ఆ రూపమును చూచిన బ్రహ్మగారు రుద్రునితో గూడి ఆ పురుషోత్తముని స్తుతించెను. బ్రహ్మగారి వెంటనున్న సకలదేవగణములు నేలపై సాష్టాంగ పడిరి.

బ్రహ్మోవాచ

ఓ దేవా! నిర్గుణుడవగు నీకు జగత్తుయొక్క సృష్టిస్థితిలయము లతో సంగము లేదు. పరమానంద మహోదధివియగు నీవు సూక్ష్మతమ మగు ఆకాశముకంటె సూక్ష్మమగు స్వరూపము గలవాడవు. నీ స్వరూప మునందు దేశకాలముల కొలతలు (సీమలు) లేవు. సర్వోత్తమమగు ప్రభావము గల నీకు అనేక నమస్కారములు.

ఓ పురుషోత్తమా! సృష్టిని చేయువాడవు నీవే. నీ ఈ రూపమును శ్రేయస్సును కోరు జనులు వేదములో మరియు తంత్రములలో చెప్పిన ఉపాయములతో ఆరాధించెదరు. ఆహా! ఈ నీ విశ్వరూపమునందు నేను మమ్ములను మరియు ముల్లోకములను ఏకకాలములో చూచుచున్నాను.

            ఈ జగత్తు సృష్టికి పూర్వము, స్థితికాలమునందు, ప్రళయము తరువాత కూడ స్వతంత్రుడవగు నీయందే గలదు. కుండకు మట్లివలె, ఈ జగత్తుయొక్క ఆది-మధ్యము-అంతములయందు నీవే గలవు. జగత్తునకు ఉపాదానమగు ప్రకృతికంటె నీవు అతీతుడవు.

            నీవు నిన్ను ఆశ్రయించి ఉండే నీ మాయాశక్తిచే ఈ జగత్తును సృష్టించి, తరువాత దానియందు ప్రవేశించినావు. మనోనిగ్రహము గల వివే కులు సావధానచిత్తులై మననము చేసి, సత్త్వరజస్తమోగుణముల కార్యమే అయిననూ ఈ జగత్తునందు నిర్గుణుడవగు నిన్ను (అధిష్టానముగా) దర్శిం చెదరు.

            కట్టెను మథించి నిప్పును, ఆవులను పితికి అమృతమువంటి పొలను, నేలను దున్ని ధాన్యము మొదలగు ఆహారమును, నేలను త్రవ్వి నీటిని మానవులు పొందెదరు. మరియు, మానవులు తమ పురుషకారము నందు జీవికను సంపాదించెదరు. అదే విధముగా, వివేకులు సత్త్వరజస్తమో గుణకార్యములగు శబ్దాదులయందు నిన్ను సత్తాస్పూర్డుల రూపముగా పరి శుద్ధమగు బుద్ధితో గుర్తించెదరు; మరియు తమ అనుభవమును వర్ణించి చెప్పెదరు.

ఓ పద్మనాభా! నీవే మాకు నాథుడవు. మేము చాలకాలమునుండి కోరే పురుషార్థము (మోక్షము) నీ స్వరూపమే. నీవు మా ముందు ఆవిర్భ వించినావు. అట్టి నిన్ను చూచి ఈ నాడు మేము అందరము, కార్చిచ్చుచే పీడించబడి గంగాజలములను చేరుకున్న ఏనుగులు వలె, సుఖమును పొందినాము.

             మేము సకలలోకపాలకులము ఏ ప్రయోజనమును గోరి నీ పాద ముల మ్రోల చేరితిమో, అట్టి నీవు దానిని సంపాదించి పెట్టుము. నీవు సర్వమునకు లోపల, బయట కూడ వ్యాపించియున్నావు. నీవు సర్వమునకు సాక్షివి. అట్టి నీకు ఇతరులు విన్నవించ దగినది ఏమి ఉండును?

             ఓ ఈశ్వరా! నేను, రుద్రుడు, దేవతలు, దక్షుడు మొదలగువారు, అగ్నినుండి వెలువడిన మిణుగురులు వలె, నీ అంశలే అయిననూ, తాము నీకంటే వేరుగా ఉన్నామని భావించుచున్నారు. అట్టి మేము మాకు సుఖము కలిగే ఉపాయమును ఏమి తెలియగల్గుదుము? (తెలియలేము). కావున, వేదవేత్తలకు మరియు దేవతలకు సుఖము కలిగే ఉపాయమును మాకు ఉపదేశించి, నీవు కూడ దానిని చేయుము.

శ్రీశుక ఉవాచ

బ్రహ్మ మొదలగువారు శ్రీహరిని ఈ విధముగా స్తుతించిరి. ఆయన వారి హృదయములలోని అభిప్రాయమును యథాతథముగా తెలు సుకొనెను. వారు చేతులను జోడించి సర్వేంద్రియములను నియంత్రించి నిలిచియుండిరి. అపుడు శ్రీహరి మేఘగర్జనవలె గంభీరమైన వాక్కుతో వారితోనిట్లనెను.

దేవదేవుడగు శ్రీహరి ఒక్కడే స్వయముగా ఆ దేవకార్యమును సాధించుటకు సమర్థుడే. అయిననూ, ఆయన సముద్రమథనము మీద లగు లీలలతో విహరించగోరి, వారితో నిట్లనెను.

శ్రీభగవానువాచ

మంచిది. ఓ బ్రహ్మా! ఓ శంభూ! దేవయోనులగు గంధర్వులారా! ఓ దేవతలారా! మీరు అందరు సావధానముగా నా మాటను వినుడు. మీకు కల్యాణము కలిగే ఉపాయమును చేప్పెదను.

            వెళ్లుడు. మీకు మీ వృద్ధి సిద్దించునంతవరకు మీరు దితి దను వంశీయులగు ఆ రాక్షసులతో సంధి చేసుకొనుడు. ప్రస్తుతము వారిని కాలము అనుగ్రహించినది.

ఎందుకంటే, సాధించదగిన పని చాల ప్రయోజనకరమైనప్పుడు మనము శత్రువులతో కూడ సంధిని చేసుకొనవలెను. ఓ దేవతలారా! ప్రయోజనము సిద్ధించిన తరువాత నిశ్చయముగా పాము-ఎలుకలవలె చేయవచ్చును (ఒక పాము బుట్టలో బందీయై ఉండగా, లోపలికి ఎలుక వచ్చెను. పాము దానితో స్నేహము చేసి, దానిచే బుట్టకు చిల్లు చేయించి, ఆ తరువాత ఆ ఎలుకను భక్షించి, ఆ బుట్టలోనుండి పారిపోయెను).

మీరు విలంబము లేకుండా అమృతమును ఉత్పన్నము చేయు. టకు యత్నించుడు. మృత్యువు కోరలలో ఉన్న ప్రాణి అమృతమును త్రాగినచో మృత్యువును జయించును. ఇది నిశ్చయము.

ఓ దేవతలారా! సకలములైన పొదలను, గడ్డిమొక్కలను, తీగల ను, మందుచెట్లను పాల సముద్రములో వేయుడు. మందర పర్వతమును కవ్వముగా చేసుకొని, వాసుకుని త్రాడుగా చేసుకొని, సోమరిదనము లేకుండా గట్టిగా మథించుడు. నేను మీకు సాహాయ్యము నందించగలను. పైగా, రాక్షసులు మీ కష్టములో పాలు పంచుకోనగలరు. కాని, ఫలమును మాత్రమే మీరే తీసుకొనగలరు.

            ఓ దేవతలారా! రాక్షసులు ఏది కావాలంటే దానికి మీరు అంగీకరిం చుడు. సకలకార్యములు మంచిదనముతో సిద్ధించే విధముగా, కోపము వలన సిద్ధించవు.

సముద్రమునుండి కాలకూట విషము పుట్టును. మీరు దాని వలన భయపడకుడు. సముద్రమునుండి పుట్టే పదార్థముల యెడల తృష్ణను గాని, కామనను గాని, ఆ కామన సిద్దించనప్పుడు కోపమును గాని, మీరు ఏ కాలమునందైననూ చేయరాదు,

శ్రీశుక ఉవాచ

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ రాజా! స్వేచ్చచే ప్రవర్తిల్లే జగన్నాథుడైన పురుషోత్తమ భగవానుడు దేవతలనీ విధముగా ఆదేశించి, వారి మధ్యలో అంతర్ధానమాయెను.

తరువాత బ్రహ్మగారు, రుద్రుడు శ్రీహరి భగవానుని కొరకు నమ స్కరించి తమ లోకములకు వెళ్లిరి. దేవతలు బలి చక్రవర్తి వద్దకు వెళ్లిరి.

దేవతలు తమకు శత్రువులే. కాని వారు యుద్ధము చేయుటకు సంసిద్దులై రాలేదు. రాక్షస సేనానాయకులు ఆ సంగతిని గమనించి చాల కంగారు పడిరి. సంధికి, యుద్ధమునకు తగిన కాలముయొక్క పరిజ్ఞానము గల బలి చక్రవర్తి తన వారిని వారించెను. ఆయన ప్రశంసించ దగిన వ్యక్తి.

విరోచనుని పుత్రుడగు బలి సకలలోకములను జయించి సర్వో త్కృష్టమగు సంపదచే సేవించబడుచుండెను. రాక్షస సేనానాయకులు రక్షించుచుండగా, ఆయన సింహాసనముపై కూర్చుండి యుండెను. దేవ తలు ఆయనను సమీపించిరి.

మహేంద్రుడు గొప్ప బుద్ధిశాలి. ఆయన మధురమగు వాక్కుతో బలికి నచ్చజెప్పుతూ, తాను పురుషోత్తముని వద్ద నేర్చిన విషయములన న్నింటినీ ఆయనకు చెప్పెను.

ఆ ప్రతిపాదనము రాక్షసరాజగు బలికి నచ్చేను. అంతేగాక, అక్కడ ఉన్న శంబరుడు, అరిష్టనేమి మొదలగు రాక్షస నాయకులకు, త్రిపు రములలో నివసించే రాక్షసులకు కూడా అది నచ్చెను.

శత్రువులను తపింపజేసే ఓ మహారాజా! తరువాత దేవతలు, రాక్ష సులు మైత్రిని చేసుకొని ఒప్పందమును కుదుర్చుకొనిరి. అపుడు వారు అమృతము అనే ఫలమును గోరి, గొప్ప ఉద్యమమును చేసిరి.

వారందరు చాల గర్వించి యుండిరి. వారు సమర్థులు, గుదియల వంటి బాహువులు గలవారు. అపుడు వారు సింహనాదములను చేస్తూ బలముతో మందర పర్వతమును ఊడపీకి సముద్రము వైపునకు తీసుకు వెళ్లిరి.

ఆ పర్వతమును చాల దూరము పైకెత్తి మోయుట వలన ఇంద్ర డు, బలి మొదలగువారు అలసిపోయిరి. దానిని ముందుకు మోసుకి పోయే శక్తి వారికి లేకుండెను. అపుడు వారు స్వాధీనత తప్పి ఆ పర్వ మును మార్గములో విడిచి పెట్టిరి.

            ఆ పర్వతము బంగరు పర్వతమగుటచే దాని బరువు చాల ఎకి వ. కావుననే, దానిని కదల్చుట కఠినము. అది ఆ సమయములో మహా రముతో క్రింద పడినప్పుడు, దాని క్రింద పడి చాలమంది దేవతలు, రా సులు నలిగి మరణించిరి.

ఆ విధముగా వారి బాహువులు, తొడలు, మెడలు విరిగి వారి ఉత్సాహము వినష్టమగుట తెలిసిన శ్రీహరి భగవానుడు అచట ప్రత్యక్షమయ్యెను. ఆయన ధ్వజముపై గరుత్మంతుని చిహ్నము ఉండును.

             శ్రీహరి పర్వతము మీద బడి పిండి పిండి అయిన దేవతలను, రాక్షసులను చూచెను. ఆయన తన చూపుతో దేవతలను బ్రతికించెను. వారికి అప్పుడు గాయమే తగలలేదా యన్నట్లు ఉండెను.

శ్రీహరి ఆ పర్వతమును ఒక్క చేతితో అవలీలగా గరుడునిపైకి ఎక్కించి తాను కూడ గరుడుని అధిష్టించెను. అప్పుడాయన దేవతలు, రాక్షసుల గణములు చుట్టువారియుండ సముద్రమునకు పయనమయ్యేను.

పక్షులలో శ్రేష్ఠుడగు ఆ గరుత్మంతుడు తన భుజమునుండి ఆ పర్వతమును క్రిందకు దించి నీటి మధ్యలో విడిచి పెట్టెను. శ్రీహరి అనుమ తిని పొంది ఆతడు వెళ్లెను.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో  సముద్ర మథన వృత్తాంతములో మందర పర్వతమును తీసుకువచ్చుటను వర్ణించే ఆరవ అధ్యాయము ముగిసినది (6).