శ్రీ మద్భాగవతము - నవమ (9వ) స్కందము

Table of Contents

14 - ఊర్వశీ పురూరవుల చరితము

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! సూర్యవం శమును గురించి చెప్పితిని. ఈ వంశకీర్తనము చిత్తశుద్దికి హేతువు. కావున, ఈ పైన చంద్రవంశమును గురించి చెప్పెదను, వినుము. ఆ వంశములో పవిత్రమగు కీర్తిగల ఐలుడు మొదలగు రాజులు కీర్తించబడెదరు.

అనంతమగు శిరస్సులు గల పురుషోత్తముని నాభీ అనే సరస్సులో పుట్టిన పద్మమునుండి బ్రహ్మగారు ప్రకటమయ్యెను. బ్రహ్మగారి పుత్రు డగు అత్రి గుణములలో తండ్రితో సమానమైనవాడు. 

ఆ అత్రీయొక్క ఆనందబాష్పములనుండి అమృతస్వరూపుడగు చంద్రుడు పుత్రుడై జన్మించెను. ఆయనను బ్రహ్మగారు వేదవేత్తలకు, చెట్టు చేమలకు, నక్షత్రముల గణములకు ప్రభువుగా ఏర్పాటు చేసెను.

ఆ చంద్రుడు ముల్లోకములను జయించి రాజసూయ యాగమును చేసెను. అపుడు గర్వము పెరిగి, ఆయన తారయని ప్రసిద్ధి గాంచిన బృహస్పతియొక్క భార్యను అపహరించెను.

దేవతలకు గురువగు బృహస్పతి పలుమార్లు కోరిననూ చంద్రుడు గర్వము వలన ఆమెను విడిచి పెట్టలేదు. ఆమె కారణముగా దేవతలకు, రాక్షసులకు వైరము ఏర్పడెను.

శుక్రాచార్యుడు బృహస్పతి తనను ద్వేషించుటచే, రాక్షసుల అను మతితో చంద్రుని పక్షమును వహించెను. సకలభూతగణములచే చుట్టువార బడి యుండే రుద్రుడు, బృహస్పతి తనకు గురువగు అంగీరసుని పుత్రు డైన కారణముగా, అనురాగముతో ఆయన పక్షమున నిలిచెను.

దేవేంద్రుడు సకలదేవతాగణములతో గూడి బృహస్పతి పక్షమును సమర్దించెను. అప్పుడు తార నిమిత్తముగా జరిగిన యుద్దములో దేవతలు మరియు రాక్షసులు కూడ వినాశమును చెందిరి.

తరువాత అంగిరసుడు బ్రహ్మగారికి నివేదించగా, ఆయన చంద్రుని బెదిరించి తారను ఆమె భర్తయగు బృహస్పతికి అప్పజెప్పెను. కాని, ఆమె గర్భవతియని ఆయనకు తెలిసిపోయెను.

ఓసీ! నీవు దుర్బుద్ధి గలదానవు. ఇతరులచే (శత్రువులచే) ఆధానము చేయబడిన గర్భమును నాకు చెందిన క్షేత్రమునుండి దూరము చేయుము, దూరము చేయుము. అట్లు చేసినచో, నీవు యోగ్యురాలవు అగుదువు. నీవు దోషము చేసిననూ, నీవు స్త్రీవీ అయినందువలన, పైగా నేను సంతానమును కోరుచుండుట వలన, నేను నిన్ను బూడిదగా చేయ కుందును గాక!

తార సిగ్గు పడి బంగరు కాంతులు విరజిమ్మే పుత్రుని విడిచి పెట్టే ను. ఆ కుమారుని అంగిరసపుత్రుడగు బృహస్పతి మరియు చంద్రుడు కూడ కోరిరి.

ఈ బాలకుడు నావాడు, నీవాడు కాడు, అంటూ బృహస్పతి, చంద్రుడు వివాదపడుచుండిరి. అప్పుడు మహర్షులు, దేవతలు తారను ప్రశ్నించిరి. కాని, ఆమె సిగ్గు పడి సమాధానమును చెప్పనే లేదు.

ఆ బాలకుడు కోపించి తల్లితో ఇట్లు పలికెను -- దుష్టమగు నడ వడి గలదానా! సమాధానమును చెప్పవేమి? నీ సిగ్గు మిథ్య (వ్యర్థము), నీవు చేసిన చెడు పనిని గురించి నాకు వెంటనే చెప్పుము.

బ్రహ్మగారు ఆ తారను ఏకాంతములోనికి పిలిచి బుజ్జగిస్తూ ప్రశ్నించగా, చంద్రుని పిల్లవాడు అని ఆమె మెల్లగా చెప్పెను. అప్పుడు ఆ బాలకుని చంద్రుడు తీసుకొనెను.

ఓ పరీక్షిన్మహారాజా! ఆ బాలకునకు స్వయంభువుడగు బ్రహ్మ గారు బుధుడు అని పేరు పెట్టెను. సూక్ష్మబుద్ధియగు ఆ పుత్రునితో కూడి నక్షత్రరాజగు చంద్రుడు ఆనందమును పొందెను.

ఆ బుధునకు ఇలయందు పురూరవుడనే పుత్రుడు కలిగేనని ఇది వరలో చెప్పబడినది. దేవర్షియగు నారదుడు ఆ పురూరవుని రూపమును, గుణములను, పెద్ద మనస్సును, సచ్చీలమును, సంపదను, పరాక్రమ మును గురించి ఇంద్రుని భవనములో వర్ణించి చెప్పెను. ఆ విషయము లను విన్న ఊర్వశీదేవి మన్మథుని బాణములచే పీడను పొందినదై ఆ పురూరవుని వద్దకు వచ్చివేసెను.

మిత్రావరుణుల శాపముచే ఊర్వశి మనుష్యభావమును పొందెను. పురుషులలో శ్రేష్ఠుడు మరియు మన్మథునివలే అందగాడు అగు పురూర వుని గురించి విని, ఆ సుందరి ధైర్యమును చిక్కబట్టి ఆయన వద్దకు వచ్చి చేరెను.

ఆ ఊర్వశీదేవిని చూచినంతనే పురూరవ మహారాజునకు హర్ష ముతో కన్నులు విప్పారి, శరీరమంతయు గగుర్పాటు కలిగెను. ఆయన మధురమగు వాక్కుతో ఆమెను ఉద్దేశించి ఇట్లు పలికెను.

పురూరవ మహారాజు ఇట్లు పలికెను -- ఓ సుందరీ! నీకు స్వాగత ము. కూర్చుండుము. మేము నీకు ఏమి చేయవలెను? నీవు నాతో గూడి చక్కగా రమించుము. మన యిద్దరీ విహారము చాల సంవత్సరములు నిరంతరముగా కొనసాగు గాక!

ఊర్వశి ఇట్లు పలికెను --- సుందరుడవగు ఓ రాజా! ఏ స్త్రీయొక్క చూపు మరియు మనస్సు నీయందు లగ్నము కాకుండును? నిన్ను ఏకాంతమునందు పొంది రమించవలెనని మనస్సు ఉవ్విళ్లూరుచు న్నది సుమా!

మర్యాదను కాపాడే ఓ రాజా! ఈ రెండు పొట్టేళ్లను నీవద్ద ఉంచెద ను. వీటిని నీవు కాపాడుము. నీవు అట్లు చేసినచో, నేను నీతో కూడి రమించెదను. అప్సరసలకు (నీవంటి) కొనియాడ దగిన వ్యక్తియే భర్తయని చెప్పబడినది.

ఓ వీరుడా! నేను నెయ్యిని మాత్రమే ఆహారముగా తీసుకొనెదను; సంభోగమునందు తప్ప నీవు నాకు నగ్నముగా కనబడరాదు; అని ఊర్వశి షరతులను విధించేను. ఆనందముతో నిండియున్న మనస్సు గల ఆ మహా రాజు ఆ షరతులను యథాతథముగా అంగీకరించెను.

మానవలోకమునకు వ్యామోహమును కలిగించే నీ రూపము, నీ హావభావములు అచ్చెరువును గొల్పుచున్నవి. ఆహా! అప్సరసవగు నీవే స్వయముగా వచ్చినప్పుడు, ఏ మానవుడు నిన్ను సేవించకుండును?

అప్సరసల ప్రభావమునకు తగ్గట్లుగా ఆమే పురుషశ్రేష్ఠుడగు ఆ మహారాజును రమింపజేసెను. ఆయన ఆమెతో గూడి దేవతలు విహరించే చైత్రరథము, నందనము మొదలగు ఉద్యానములయందు యథేచ్ఛగా విహరించేను.

పద్మముల పుప్పొడియొక్క పరిమళము వంటి పరిమళము గల ఆ అప్సరసతో గూడి ఆ మహారాజు చాల నెలలను, సంవత్సరములను ఆనందముగా గడి పెను. ఆమే ముఖపరిమళముచే ఆయన ప్రలోభితుడా యెను.

ఇంద్రునకు ఊర్వశి కానరాలేదు. ఊర్వశి లేని నా ఆస్థానము అధి కముగా శోభిల్లుట లేదని చెప్పి, ఆయన ఆమెను తీసుకురండని గంధర్వు లను ప్రేరేపించెను.

పురూరవుని ప్రియురాలగు ఊర్వశి ఆయన వద్ద రెండు పొట్టేళ్లను భద్రముగా కాపాడుటకై ఉంచినది. అర్ధరాత్రమునందు చీకటి దట్టముగా నుండగా, ఆ గంధర్వులు వచ్చి ఆ రెండు పొట్టేళ్లను లాగుకొని పోయిరి.

ఊర్వశి ఆ పొట్టేళ్లను తన పుత్రులను వలె పాలించెను. గంధ ర్వులు లాగుకొని పోవుచుండగా అవి పెట్టిన మొరను విని ఆమె ఇట్లు పలి కెను -- నా భర్త దుష్టుడు, నపుంసకుడు. కాని, తాను వీరుడనని ఆతడు తలపోయును. అట్టి భర్త కారణముగా నేను భ్రష్టురాలనైతిని.

నేను నా ప్రియుని నమ్మి నష్టపోయినాను. నా స్వంతపిల్లలవంటి పొట్టేళ్లను చోరులు అపహరించినారు. ఈయన పగలైతే మగవాడే గాని, రాత్రి మాత్రము భయపడి స్త్రీవలె నిద్రించుచున్నాడు.

ఈ విధముగా ఊర్వశి, ఏనుగును అంకుశములతో పొడిచినట్లుగా, వాక్కులనే బాణములతో పురూరవుని పొడిచెను. అపుడాయన ఆ రాత్రి యందు నగ్నముగా కోపముతో కత్తిని పట్టుకొని చోరులు వెళ్లిన దిక్కువైపు పరుగెత్తాను.

ఆ గంధర్వులు పొట్టేళ్లను అక్కడనే విడిచి పెట్టి మెరుపులు మెరి యునట్లు చేసిరి. పురూరవ మహారాజు ఆ పొట్టేళ్లను తీసుకొని వచ్చుచుండెను. కానీ, ఆయన దిగంబరుడై యుండెను. ఆ మెరుపుల వెలుతురులో ఊర్వశీ నగ్నుడైయున్న తన భర్తను చూచెను.

ఇలాపుత్రుడగు పురూరవునకు శయ్యయందు తన భార్యయగు ఊర్వశి కానరాలేదు. ఆయన మనస్సు మిక్కిలి చెడి దుఃఖించెను. వ్యాకుల మైన చిత్తముతో ఆయన ఆమెనే ధ్యానిస్తూ పిచ్చివాడు వలె అస్వస్థుడై భూలోకములో తిరుగాడెను.

ఆ పురూరవునకు కురుక్షేత్రములో సరస్వతీ నదీతీరమునందు ఆ ఊర్వశి కనబడెను. ఆమెతో బాటుగా హర్షముతో నిండిన ముఖములు గల అయిదుగురు చెలికత్తెలు కూడ ఉండిరి. ఆపుడాయన ఈ క్రింది విధముగా మధురమగు పలుకులను పలికెను. ఆయన పలుకులు వేదప్రసిద్దమగు సూక్తము రూపములో నుండెను.

ఓ ప్రియురాలా! నిలు, నిలు. నాకు ఈ నాడైనా సంతోషమును కలిగించకుండా భయంకరమగు విరహదుఃఖములో పారవేయుట నీకు తగ దు. మనము మాటలాడుకొనవలెను.

ఓ దేవీ! నీవు నా ఈ సుందరమైన దేహమును దూరముగా విడిచి పెట్టి వెళ్లిపోతివి. నీ అనుగ్రహమునకు నోచుకోని ఈ దేహము ఇక్కడనే పడిపోవును. దీనిని తోడేళ్లు, గ్రద్దలు భక్షించును.

ఊర్వశి ఇట్లు పలికెను --- నీవు మరణించరాదు. నీవు మగవాడ వు. తోడేళ్లు వంటి ఈ ఇంద్రియములు నీన్ను భక్షించకుండు గాక!(ఇంద్రి యములను జయించుము). స్త్రీలకు ఏ వ్యక్తియందైననూ ప్రేమ, స్థిర ముగా నుండదు. స్త్రీల హృదయము తోడేళ్ల హృదయము వంటిది (క్రూర మైనది).

ఏలయనగా, స్త్రీలు దయ లేనివారు, క్రూరమగు స్వభావము గల వారు. వారికి సహనము సున్న. వారు తమకు నచ్చిన వాని (వస్తువు) విష యములో ఎంతటికైననూ తెగించెదరు. వారు చిన్న ప్రయోజనము కొరకై ననూ భర్తను, సోదరునీ కూడ దెబ్బ తీసెదరు. ఇతరులను లెక్క చేయరనీ వేరుగా చెప్పవలయునా?

స్వైరవృత్తి గల స్త్రీలు మూర్ఖులకు కపట విశ్వాసమును కలిగించి, ప్రేమను విడిచి పెట్టి, కొత్త కొత్త ప్రియులను కోరుకుంటూ యథేచ్ఛగా సంచరించెదరు.

ఓ ప్రభూ! నీవు సమర్థుడవు. సంవత్సరము తరువాత నీవు ఒక రాత్రి నిశ్చయముగా నాతో గడుపగలవు. పైగా, నీకు ఇంకనూ సంతాన ములు కలుగగలవు.

ఊర్వశి గర్భవతి అనే విషయమును గమనించి ఆ పురూరవుడు తన నగరమునకు వెళ్లాను. సంవత్సరము తరువాత ఆయన మరల ఆ కురు క్షేత్రమునకు వెళ్లి ఊర్వశిని చూచెను. ఆమె అప్పటికే వీరుడగు పుత్రునకు జన్మనిచ్చేను. ఆయన ఆమెతో కూడి ఆనందముగా ఆ రాత్రిని చక్కగా గడి పెను. మరునాడు ఆమెతోడి వియోగముచే వ్యాకులుడై దీనుడై యున్న ఈ మహారాజును ఉద్దేశించి ఆమె ఇట్లు పలికెను.

ఈ గంధర్వులను నీవు స్తుతించుము, వారు నన్ను నీకు ఈయగ లరు, అని ఊర్వశి చెప్పగా, ఆయన వారిని చక్కగా స్తుతించెను. ఓ పరీక్షి న్మహారాజా! గంధర్వులు సంతోషించి ఆయనకు అగ్నిని స్థాపించే పాత్రను ఇచ్చిరి (అగ్నియందు హోమమును చేసి దేవలోకమును పొందుమని వారి అభిప్రాయము). కాని, ఆ మహారాజు ఆ పాత్రయే ఊర్వశియని తలపోసె ను. ఆయన అడవిలో సంచరిస్తూ, అది కేవలము పాత్రయేనని తెలుసుకో నెను.

ఆ పురూరవ మహారాజు ఆ పాత్రను అడవిలో వదిలి, తన ఇంటికి వెళ్లి, ఆ ఊర్వశినే ధ్యానించుచుండెను. ఇంతలో త్రేతాయుగము ప్రారంభ మయ్యెను. అప్పుడు ఆయన హృదయములో కర్మను బోధించే మూడు (ఋగ్యజుస్సామలు) వేదములు ప్రకటమయ్యెను.

ఆ పురూరవ మహారాజు అడవిలో అగ్నిపాత్రను వదలి పెట్టిన చోటికి వెళ్లాను. అచట జమ్మి చెట్టు మొదట్లో మొలిచియున్న రావి చెట్టును చూచెను. దాని కట్టెతో రెండు నిప్పును మథించే కొయ్యలను చేసెను. అపుడాయన ఊర్వశియొక్క లోకమును పొందే కోరికతో, క్రింది కొయ్యను ఊర్వశినిగా, పై కొయ్యను తననుగా, వాటి మధ్యలోనుండే కట్టెను పుత్రునిగా మంత్రపూర్వకముగా ధ్యానిస్తూ అగ్నిని మథించెను.

ఆ కట్టెను మథించుట వలన అగ్ని పుట్టెను. ఈ అగ్నిని ఆరాధిం చుట వలననే మానవుడు సకలసంపదలను పొందును. మూడు వేదముల జ్ఞానముతో ఆ పురూరవ మహారాజు అగ్నిని ఆహవనీయము, గార్హపత్య ము, అనాహార్య పచనము అనే మూడు రూపములుగా విభాగము చేసి, ఆ అగ్నిని తన పుత్రుడుగా చేసుకొనెను.

ఊర్వశీలోకమును కోరే ఆ పురూరవ మహారాజు ఆ అగ్ని ద్వారా యజ్ఞేశ్వరుడగు శ్రీహరి భగవానుని ఆరాధించెను. సకలదేవతాస్వరూపు డగు శ్రీహరి ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరుడు కాడు.

పూర్వము (కృతయుగములో) సకలవాక్కులకు బీజమైన ఓంకార మొక్కటియే వేదము. దేవుడు నారాయణుడే కాని, మరియొకడు కాడు. అగ్ని ఒక్కటియే ఉండెడిది (మూడు కాదు). వర్ణము కూడ ఒక్కటీ (హంస) మాత్రమే ఉండెడిది.

ఓ పరీక్షిన్మహారాజా! త్రేతాయుగము ఆరంభములో పురూరవ మహారాజు ద్వారానే మూడు వేదములు ఆవిర్భవించేను. ఆ రాజు ఆ అగ్నిని ఆరాధించి, సంతానమును పొంది గంధర్వలోకమును చేరుకొనెను.

శ్రీమద్భాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో ఊర్వశీ-పురూరవుల వృత్తాంతమును వర్ణించే పదునాల్గవ అధ్యాయము ముగిసినది.