శ్రీ మద్భాగవతము - షష్థమ (6వ) స్కందము

Table of Contents

16 - చిత్రకేతువునకు పరమాత్మ సాక్షాత్కరించుట

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! తరువాత దేవర్షియగు నారదుడు మరణించిన రాజకుమారుని జీవుని (సూక్ష్మశరీరమును) దుఃఖించుచున్న బంధువులకు చూపించి, ఇట్లు పలికెను.

నారద మహర్షి ఇట్లు పలికెను --- ఓ జీవుడా! నీకు మంగళమగు గాక! నీ తల్లిదండ్రులను చూడుము. మిత్రులు, బంధువులు నీ కారణముగా కలిగిన దుఃఖముచే అధికమగు తాపమును పొంది యున్నారు.

నీ దేహములో నీవు ప్రవేశించుము. మిగిలియున్న ఆయుర్దాయమును నీ మిత్రులతో గూడి నీ తండ్రి ఇచ్చిన భోగములననుభవించుము. రాజ సింహాసనము నధిష్ఠించుము.

కర్మలు నన్ను దేవతలు, పశుపక్ష్యాదులు మరియు మానవుల జన్మలలో త్రిప్పుచున్నవి. ఆ జన్మలలో వీరు నాకు తండ్రులు, తల్లులు అయిన జన్మ ఏది?

వివిధజన్మలలో అందరు అందరికి పరస్పరము క్రమముగా బంధువులు, జ్ఞాతులు (ఒకే కుటుంబమువారు), శత్రువులు, మధ్యస్థులు, ఉదాసీనులు (కలుగజేసుకొనని వారు), ద్వేషించువారు అగుచునే యుందురు.

క్రయవిక్రయములు చేయదగిన బంగారము మొదలగు వస్తువులు జనులలో ఒకనినుండి మరియొకనికి, మరల వానినుండి ఇంకొకనికీ, ఈ విధముగా చుట్టూ తిరుగుచుండును. ఇదే విధముగా, జీవుడు తల్లిదండ్రు లలో తిరుగుచుండును.

స్థిరముగానుండే బంగారము మొదలగు వస్తువులకు కూడ మనుష్యులతోడి సంబంధము అనిత్యముగనే యున్నదని మనకు అనుభవములో తెలియుచునే యున్నది. ఒక వ్యక్తికి ఒక వస్తువుతో ఎంతవరకు సంబంధముండునో, అంతవరకు మాత్రమే మమకారము ఉండును గదా!

నిత్యుడగు జీవుడు తల్లి కడుపున జన్మించి ఆ దేహమునందు దేహియై ఉండును. జీవునకా దేహమునందు, నేను అనే ధారణ వాస్తవము కాదు. జీవుడు ఎంతవరకైతే ఒక దేహమునందు ప్రకటమగునో, అంతవరకు ఆ దేహమునందు, నేను నాది అనే ధారణను కలిగియుండును.

కాలమునకు అతీతుడు, అపక్షయము లేనివాడు, ఇంద్రియగోచరము కానివాడు, సర్వమునకు ఆశ్రయుడు, స్వయంప్రకాశస్వరూపుడు అగు ఈ జీవుడు, తన మాయాశక్తియొక్క సత్త్వరజస్తమోగుణములచే తానే జగద్రూపముగా ప్రకటమగుచున్న సర్వశక్తిమంతమగు పరబ్రహ్మ వాస్తవ ముగా ఒక్కటియే.

జీవుని యథార్జస్వరూపము అసంగ-ఆత్మ. అద్వితీయమగు ఆత్మకు ప్రియుడు గాని, శత్రువు గాని, తనవారు గాని, పరాయి వారు గాని లేరు. ధర్మాధర్మముల కర్తృత్వము బుద్ధినిష్ఠము. అట్టి బుద్ధిలోని వృత్తు లను ఆత్మ ప్రకాశింపజేస్తూ, దృక్-స్వరూపముగా నిలిచియుండును.

ఆత్మకు పుణ్యపాపములతో గాని, కర్మఫలములగు సుఖదుఃఖము లతో గాని సంగము లేదు. సర్వస్వతంత్రమగు ఆత్మ ఉదాసీనముగా స్వరూపమునందు నిలిచి, కారణకార్యములను ప్రకాశింపజేస్తూ, వాటికి సాక్షిగా నుండును.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- జీవుడు ఈ విధముగా పలికి నిషమించెను. అప్పుడు వాని ఆ జ్ఞాతులు తమలోని ఆసక్తి అనే సంకె లను ఛేదించి, శోకమును విడిచి పెట్టిరి.

జ్ఞాతులు తమ తియగు ఆ బాలకుని దేహమును దహించి, ఉత్తరక్రియలను యథోచితముగా చేసిరి. వారు ఆ బాలకునిపై గల ఆసక్తిని విడనాడిరి. విడిచి పెట్ట శక్యము కాని ఈ ఆసక్తియే మానవులకు దుఃఖమును, వ్యామోహమును, భయమును, మానసిక పీడను కలిగించుచుండును.

ఓ పరీక్షిన్మహారాజా! అప్పుడు బాలకుని చంపిన రాణుల ముఖ కాంతి బాలుని హత్యచే నశించెను. వారు తాము చేసిన పనికి సిగ్గు తెచ్చు కొని, అంగీరసుని ఉపదేశమును స్మరించిరి. వేదవేత్తలు బాలకుని హత్యకు ప్రాయశ్చిత్తమును ప్రతిపాదించిరి. అపుడు వారా ప్రాయశ్చిత్తమును యమునానదియందు నిర్వర్తించిరి.

నారదుడు, అంగిరసుడు చేసిన ఉపదేశము వలన చిత్రకేతువు యొక్క అంతఃకరణము జాగృతమయ్యెను. సరస్సులోని బురదనుండి ఏనుగు వలే, ఆయన ఇల్లు అనే అజ్ఞానాంధకారపు గుయ్యారమునుండి నిష్క్రమించెను.

ఆయన యమునానదిలో యథావిధిగా స్నానము చేసి, పవిత్ర మగు తర్పణాది కర్మలను నిర్వర్తించెను. తరువాత మౌనముగానుండి ప్రాణాయామమును చేసెను. పిదప ఆయన బ్రహ్మపుత్రులగు అంగీరస నారదులకు నమస్కరించెను.

తరువాత, భక్తుడగు చిత్రకేతువు మనోనిగ్రహము గలవాడై పూజనీ యుడగు నారదుని శరణు వేడెను. ఆయన సంతోషించి ఈ ఉపాసనను బోధించెను.

భగవంతుడగు వాసుదేవుని కొరకు, ప్రద్యుమ్న (శ్రీకృష్ణుని పుత్రు డు), అనిరుద్ద (మనుమడు), సంకర్షణుల (సోదరుడు) కొరకు మనస్సులో నమస్కారమును భావన చేయుచున్నాము. లేదా, ఆ నామములు గల నాలుగు వ్యూహములకు నమస్కారము. లేదా, సర్వజగన్నివాసుడు, ప్రకా శస్వరూపుడు, తేజస్స్వరూపుడు, స్వతంత్రుడు, ప్రేమస్వరూపుడై భక్తు లను తన వద్దకు ఆకర్షించువాడు అగు భగవానునకు, అనగా ఓ దేవా! నీకు, మనస్సులో నమస్కారమును భావన చేయుచున్నాము.

శుద్దజ్ఞానస్వరూపుడు, పరమానందఘనుడు, ఆత్మారాముడు (తన ఆనందము కొరకు ఇతరముపై ఆధారపడనివాడు), శాంతుడు (స్వరూపమునందు చలనము లేనివాడు), భేదదృష్టి లేనివాడు అగు భగవాను నకు నమస్కారము.

నీవు నీ స్వరూపమగు ఆనందముయొక్క అనుభూతి చేతనే మాయనుండి పుట్టే రాగద్వేషములను త్రోసిపుచ్చితివి. నీవు దేశపరిచ్ఛేద రహితుడవే అయిననూ, ఇంద్రియాధిపతివై ఉన్నావు. జగద్రూపముగా ప్రక టమై యున్న నీకు నమస్కారము.

  వాక్కు, మనస్సు కలిసి నామరూపములు లేని భగవానుని చేరు టకు ప్రయత్నించి విఫలమై వెనుదిరిగినవి (భగవానుడు వాక్కులకు, మన స్సునకు గోచరుడు కాడు). అద్వితీయుడు, శుద్ధచైతన్యమే స్వరూపముగా గలవాడు, కార్య (జగత్తు) కారణము (మాయాశక్తి) లకు అతీతుడు అగు ఆ పరమేశ్వరుడు మమ్ములను రక్షించు గాక!

ఈ జగత్తు పరబ్రహ్మనుండి పుట్టి, పరబ్రహ్మయందే మనుగడను సాగించి, పరబ్రహ్మయందే విలీనమగును. మట్టితో చేసిన ఘటాదుల యందు మట్టి అనుస్యూతముగ నుండును. అదే విధముగా, ఈ జగత్తు నందు పరబ్రహ్మ అనుస్యూతమై యున్నది. అట్టి పరబ్రహ్మవు నీవే. నీకు నమస్కారము.

పరబ్రహ్మ ఆకాశము వలె లోపల బయట కూడ వ్యాపించి యున్న ది. దానిని మనస్సు (సంకల్ప వికల్పాత్మకము), బుద్ధి (నిశ్చయాత్మకము), జ్ఞానేంద్రియములు తెలియలేవు. దానిని కర్మేంద్రియములు స్పృశించలే వు. అట్టి పరబ్రహ్మకు నేను నమస్కరించుచున్నాను.

ఈ దేహము, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు, బుద్ది అను నవి పరబ్రహ్మయొక్క చైతన్యాంశముచే ఆవేశించబడి, నిప్పులలో కాలిన గుండు ఇతరమును గ్రహించునట్లు, తమ తమ వ్యాపారములయందు ప్రవ ర్తిల్లుచున్నవి. అట్లు గానిచో, నిప్పులలో కాల్చని గుండు దేనినీ కాల్చలేని విధముగనే, అవి కూడ తమ వ్యాపారములను చేయలేవు. ఈ దేహేంద్రి యాదుల సంఘాతమునందు ఆ పరబ్రహ్మ చైతన్యము అభివ్యక్తమవుతూ, జాగ్రత్తు మొదలగు అవస్థలయందు ఆ అవస్థలకు సాక్షి అని వ్యవహరించ బడుచున్నది.

ఓమ్. గొప్ప మహిమ గలవాడు, గొప్ప విభూతులకు (లక్ష్మీదేవికి) ప్రభువు అగు పురుషోత్తమ భగవానునకు నమస్కారము. ఓ సర్వేశ్వరా! భక్తశిఖామణులందరు గుంపులుగా చేరి పద్మములవంటి తమ చేతులను జోడించి, మొగ్గలవంటి ఆ దోసిళ్లతో సర్వాతీతుడవగు నీ పద్మములవంటి పాదముల జంటను సేవించుచున్నారు. నీకు నమస్కారము.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! భక్తుడగు చిత్రకేతువు శరణు వేడగా, నారదుడు ఆయనకీ ఉపాసనను ఉపదేశించి, తరువాత అంగిరసునితో గూడి స్వయంభువుడగు బ్రహ్మగారి ధామమునకు వెళ్లాను.

నారదుడు ఉపదేశించిన ఈ మంత్రమును చిత్ర కేతువు యథాతథ ముగా ఏడు రోజులు మిక్కిలి ఏకాగ్రమగు చిత్తముతో జపించెను. ఆ సమ యములో ఆయన కేవలము నీటిని మాత్రమే ఆహారముగా తీసుకొనెను.

ఆ రాజు ఈ మంత్రమును ఏడు రోజులు జపించెను. అపుడాతనికి దాని ప్రభావముచే విద్యాధరులపై ఎదురు లేని అధీశ్వరత్వము లభించెను.

మంత్రప్రభావముచే ఆయన మానసిక ప్రవృత్తి చాల పరిశుద్ధము య్యేను. కొన్ని రోజుల తరువాత ఆయన దేవదేవుడగు ఆది శేషుని పాద ముల వద్దకు వెళ్లెను.

చిత్రకేతువు సిద్దేశ్వరుల గుంపుల మండలములోనున్న ఆది శేష ప్రభుని చూచెను. తామరతూడు వలె తెల్లని ఆదిశేషుడు నల్లని వస్త్ర మును దాల్చెను. ఆయన కిరీటము, భుజపురులు, మొలనూలు, కంకణ ములతో ప్రకాశించుచుండెను. ఆయన ముఖములు ప్రసన్నములుగను, కన్నులు ఎర్రగను ఉండెను.

చిత్ర కేతువు పాపములన్నియు ఆయన దర్శనముచే నశించి, అంతఃకరణము స్వచ్ఛము, నిర్మలము ఆయెను. మౌనముగానున్న ఆయన కళ్లు ప్రేమచే నీటితో నిండెను. శరీరమంతటా రోమములు గగుర్పా టును పొందెను. అధికముగా వర్ధిల్లిన భక్తితో ఆతడు, జగత్కారణుడు పూర్ణుడు అగు సంకర్షణ దేవుని యెదుటకు వచ్చి నమస్కరించెను.

 

ఆ చిత్రకేతువు పవిత్రకీర్తియగు సంకర్షణ దేవుని పాదపద్మముల పీఠమును ప్రేమచే తన కన్నులనుండి స్రవించే నీటి బిందువులతో అభిషే కించెను. అన్ని అక్షరముల ఉచ్చారణను భక్తిచే కలిగిన డగ్గుత్తిక అడ్డు కొనేను. చాల సేపటి వరకు ఆతడు ఆయనను చక్కగా స్తుతించనే లేక పోయెను.

తరువాత ఆ చిత్ర కేతువు సంకల్పశక్తిచే మనస్సును ఏకాగ్రము చేసి, తిరిగి ఉచ్చారణ శక్తిని పొందెను. ఆతడు ఇంద్రియములు బయటకు పోకుండా నియమించి సంకర్షణ దేవునితో నిట్లనెను. జగత్తునకు తండ్రి యగు ఆ దేవుడు భక్తి శాస్త్రము వర్ణించే రూపమును కలిగియుండెను (సాత్వతశాస్త్రమగు భాగవతమే ఆయన రూపము).  చిత్రకేతురువాచ ।

పరాజయము లేని ఓ దేవా! సర్వమునందు సముడగు ఈశ్వరుని దర్శిస్తూ మనస్సును జయించిన సత్పురుషులు నిన్ను తమ వశము చేసు కొనెదరు. నీవు కూడ వారిని నీ వశము చేసుకొనెదను. మనస్సులో కామనలు లేకుండా భక్తిని చేయువారలకు పరమదయామూర్తివగు నీవు నిన్నే సమర్పించెదవు.

ఓ భగవానుడా! జగత్తుయొక్క సృష్టి, స్థితి, లయము, మరల సృష్టిని అనుగ్రహించుట మొదలగు జగద్వ్యాపారములు నీ లీలావిలాస ములు మాత్రమే. జగత్తును సృష్టించే ప్రజాపతులు నీ అంశయగు హిరణ్య గర్బుని అంశలు. వారు ఆ జగత్తులో, మేము వేరుగా నున్నాము అనే అభి మానముతో వ్యర్థముగా పోటీ పడుతున్నారు.

మిక్కిలి చిన్నదియగు పరమాణువునుండి మొదలిడి మిక్కిలి పెద్ద దియగు మహత్తత్త్వము వరకు సకలపదార్థములయొక్క ఆది, మధ్య, అంతము నీవే. కాని, నీకు ఆది, అంతము, మధ్య లేవు. పదార్థముల యందు (కంఠాభరణము మొదలగునవి) ఏదైతే ఆది-అంతములలో స్థిర ముగానుండునో (బంగారము), మధ్యయందు కూడ అదియే ఉండును (అ నగా కర్ణాభరణము మిథ్య, బంగారము సత్యము. అదే విధముగా, జగత్తు మిథ్య, ఈశ్వరుడు సత్యము).

పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు అనే ఏడు తత్త్వములు ఒకదాని చుట్టుపోరి మరియొకటి పది రెట్లు చొప్పున ఈ బ్రహ్మాండము మొగ్గవలె నున్నది. ఇది, ఇటువంటి కోట్ల కోట్ల బ్రహ్మాండములు నీయందు ఒక కణమును పోలి తిరుగుచున్నవి. కావు ననే, నీవు అనంతుడని చెప్పబడుచున్నావు.

ఓ ఈశ్వరా! ఇంద్రియభోగములయందు తృష్ణ గల మానవులు పశుప్రాయులు. వారు సర్వోత్తముడవగు నిన్ను కాకుండా, నీ విభూతులైన ఇంద్రాది దేవతలను కొలిచెదరు. వారికి ఆ దేవతలచే అనుగ్రహించబడిన భోగములు, రాజకులము నశించుట తోడనే ఆ రోజు అనుగ్రహించిన సంప దలు వలె, ఆ దేవతలతో బాటే నశించును.

ఓ సర్వేశ్వరా! నీవు నిర్గుణచైతన్యస్వరూపుడవు గనుక, నీయందు చేయబడే సంకల్పములు కామనతో కూడినవే అయిననూ, వేయించిన విత్త నములు వలే కొత్త జన్మను కలిగించవు. ఈ జీవునకు సుఖదుఃఖాది ద్వంద్వముల పరంపర సత్త్వరజస్తమోగుణముల సముదాయము (గుణకార్యమగు ప్రపంచము) వలననే కలుగుచున్నది.

పరాజయమునెరుగని ఓ ఈశ్వరా! నీవేనాడైతే నిర్దోషమగు భాగ పత ధర్మమును ఉపదేశించితివో, ఆనాడు నీవు సర్వోత్కరగా సున్నావు. ఏలయనగా, అంచనులే (ప్రోగు చేయుట నేరుగనివారు) అయినవ ఆత్మస్వరూపమునందే రమించే మహర్షులు మోక్షము కొరకై ఆ ధర్మమునే ఉపాసించుచున్నారు.

భాగవత ధర్మము (నిష్కామభక్తి) లో నీవు, నేను, నీది, నాది అనే భేదబుద్ధికి తావు లేదు. సకామముగా చేసే ధర్మములో ఇట్టీ భేదబుద్ధి గలదు. వాస్తవములో సకామధర్మము భేదబుద్దిని పురస్కరించుకొనియే విధిం చబడుచున్నది. కావున, అది అంత పవిత్రమైనది కాదు. దాని వలన కలిగే ఫలములు కూడ శీఘ్రముగా నశించును. పైగా, దానిని ఆచరించుటలో హింస మొదలగు అధర్మము అధికముగనే యుండును.

కామన కొరకు చేసే ధర్మము తనకు, ఇతరులకు కూడ ద్రోహ మును చేయును. దాని వలన తనకు గాని, ఇతరులకు గాని ఏమి క్షేమము కలుగును? దాని వలన ఒరిగే ప్రయోజనమేంతటిది? దాని వలన వ్యక్తి ఆత్మద్రోహమునకు పాల్పడినప్పుడు, నీ అనుగ్రహమునకు దూరుడగును. పైగా, ఇతరులకు దాని వలన పీడ కలుగుటచే వానికి అధర్మము (పాపము) కూడ చుట్టుకొనును.

ఓ భగవానుడా! నీవు ఏ దృష్టితో నిష్కామ భక్తి అనే భాగవత ధర్మము నుపదేశించితివో, (జీవుడు కృతార్థుడు కావాలనే) ఆ దృష్టి ఎన్న టికీ సత్యదూరము కాదు. చరాచరజగత్తును ఆత్మకంటే అభిన్నముగా దర్శించే మహాత్ములు ఆ ధర్మమునే ఉపాసించుచున్నారు.

ఓ భగవానుడా! నీ దర్శనముచే మానవులకు సకలపాపములు నశించును అను వచనము అసంగతము కానే కాదు సుమా! ఏలయనగా, నీ నామమును ఒక్కసారి వినుటచే కసాయి కూడ సంసారబంధమునుండి విముక్తుడగుచున్నాడు.

ఓ భగవానుడా! కావున, నీ దర్శనముచే ఈనాడు మా అంతఃకర ణములోని మాలిన్యములు కడిగి వేయబడినవి. నీ భక్తుడు, దేవర్షి అగు నారదుడు చేసిన ఉపదేశము మరియొక విధముగా (వ్యర్థము) అగుట ఎట్లు సంభవము?

ఓ అనంతా! జగత్తు యొక్క పరమార్థ తత్త్వము నీవే. జగద్రూప ముగా నీవే ప్రకటమైనావు. అట్టి నీకు ఈ లోకములో జనులు చేసే సర్వము తెలియుచునే యుండును. నీవు తండ్రులకు తండ్రివి, గురువులకు, గురుడ వు. మిణుగురు పురుగులు సూర్యుని యెదుట ప్రకాశింప జేసేది ఏమి ఉండును? అదే విధముగా, నీ యెదుట విన్నవించేది (తెలుపుడుజేసేది) ఏమి ఉండును?

ఓ భగవానుడా! సకలజగత్తుయొక్క సృష్టిస్థితిలయములకు అధీశ్వరుడవు నీవే. కేవలము భేదమును మాత్రమే దర్శించే అయోగ్యులగు సాధకులు నీ యథార్థతత్త్వమును తెలియజాలరు. పరమహంస (ఆత్మజ్ఞాని) కు నీకు తేడా లేదు. సూర్యాదులను కూడ ప్రకాశింప జేసేది నీవే. నీకు నమస్కారము.

ఆ అనంతుని చేష్టను అనుసరించియే జగత్తును సృష్టించే ప్రజాప తులు చేష్టను చేయుచున్నారు (వారి శక్తి అనంతుని అధీనమై యున్నది). ఆయన ప్రాణులలో ఆత్మచైతన్యమై ప్రకాశించుచుండగా, ఆ ప్రకాశమున నుసరించి జ్ఞానేంద్రియములు శబ్దాది విషయములను ప్రకాశింప జేయుచు న్నవి. ఆయన పడగపై భూమండలము ఆవగింజ వలె నున్నది. అట్టి వేయి పడగల భగవానుని కొరకు నమస్కారము అగుగాక!

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కురువంశ శ్రేష్ఠుడవగు ఓ పరీక్షి న్మహారాజా! ఈ విధముగా విద్యాధరులకు ప్రభువగు చిత్రకేతువు అనంత భగవానుని చక్కగా స్తుతించెను. అపుడాయన ప్రసన్నుడై ఆతనితో నిట్లనె ను.

ఓ రాజా! నారదుడు, అంగిరసుడు నా ఉపాసనను నీకు ఉపదేశిం చినారు. దానిచే మరియు నన్ను దర్శించుటచే నీవు పూర్ణమగు సిద్ధిని (కృ తార్థతను) బడసితివి.

సకలప్రాణులు, సకలప్రాణుల ఆత్మ, సకలప్రాణులకు కారణము అన్నీ నేనే. వేదరూపముగా నేనే ఉన్నాను. వేదము, వేదములచే ప్రతిపా దించబడే పరబ్రహ్మ (సచ్చిదానందము) అనే రెండు నా రూపములే (ఒకటి రూపము, మరియొకటి స్వరూపము).

జగత్తు (నామరూపములు) నందు ఆత్మ (చిత్) యే వ్యాపించి యున్నది. జగత్తు ఆత్మయందే నిలిచియున్నది. ఈ రెండింటినీ నేనే (అఖండసత్, బ్రహ్మ) వ్యాపించియున్నాను. ఈ రెండు నాయందే ప్రకాశించుచు న్నవి.

అఖండసత్ యందు చిత్ (ఆత్మ) ఆవిర్భవించినది. ఆత్మయందు నామరూపాత్మకమగు జగత్తు ప్రకాశించుచున్నది. ఆత్మ తాను ప్రకాశింప జేసే జగత్తును వ్యాపించుచున్నది. తనను ప్రకాశింప జేసే ఆత్మయందు మాత్రమే జగత్తు నిలిచియున్నది. ఈ విధముగా, ఈ రెండింటికీ అధిష్ఠానమగు అఖండసత్త (పరబ్రహ్మ) నేనే.

నిద్రించిన మానవుడు కలలో జగత్తును తనయందే దర్శించును. కాని, ఆతడే నిద్ర లేచిన పిదప తాను ఒక చోట ఉన్నానని తలపోయును.

అదే విధముగా, జాగ్రత్తు మొదలగు జీవుని (బుద్ది ఉపాధిగా గల వాడు) అవస్థలు కేవలము అజ్ఞానముచే మాత్రమే ఆత్మయందు కల్పించ బడుచున్నవి. వాస్తవములో ఈ అవస్థలకు సాక్షియగు ఆత్మ పరబ్రహ్మయే. ఈ పరబ్రహ్మను సాధకుడు స్మరించవలెను (ఆత్మనిష్ఠుడై యుండవలెను).

గాఢనిద్రను పొందిన వ్యక్తికి ఆ నిద్రావస్థ (ప్రపంచము లేకుం డుట) యొక్క అనుభవము ఏ సాక్షి చైతన్యము వలన కలుగుచున్నదో, అట్టి ఆత్మ చైతన్యమే ఆనందఘనము, నిర్గుణము అగు పరబ్రహ్మ అనియు, ఆ పరబ్రహ్మయే సగుణబ్రహ్మనగు నా స్వరూపమనియు, తెలుసుకొనుము.

వ్యక్తి జాగ్రదవస్థలో ప్రపంచానుభవమును, నిద్రావస్థలో దాని అభావమును తెలుసుకొనుచుండును. ఈ రెండు అవస్థలలో వ్యాపించి యుండేది నిర్విశేషమగు జ్ఞానము (చైతన్యము). ఆ జ్ఞానము ఆ అవస్థల గుణస్వభావములకు విలక్షణముగనే యుండును. అట్టి ఆ నిర్విశేష జ్ఞానమే ఉపనిషతతిపాద్యమగు పరబ్రహ్మ.

వ్యక్తియొక్క యథార్థస్వరూపము (ఆత్మ) నాకంటే అభిన్నము. కాని, వ్యక్తి ఆ విషయమును విస్మరించినచో, తన స్వరూపమునుండి తానే వేరగును. అపుడు వానికి సంసారము, ఒక దేహము తరువాత మరియొకటి, ఒక మరణము తరువాత మరియొకటి వరుసగా కలుగుచుండును.

ఈ సృష్టిలో మానవజన్మయందు మాత్రమే ఆత్మయొక్క యథార్థ స్వరూపమును తెలుసుకొని అనుభవమునకు తెచ్చుకొనే అవకాశము గల దు. కాని, ఎవడైతే ఆత్మను తెలుసుకొనడో, వానికి ఎక్కడనైననూ (ఏ జన్మ లోనైననూ) శాంతి కరువగును.

కామనల కొరకై చేసే కర్మలలో అధికమగు క్లేశము మాత్రమే గాక, కోరినదానికి విరుద్దముగా దుఃఖఫలము కూడ కలుగుచుండును. కామనాని వృత్తియందు అభయమగు ఆత్మస్వరూపము లభించును. ఈ సత్యమును తెలుసుకున్న వివేకి కామనలను, వాటి కొరకై కర్మలను సంకల్పించరాదు.

లోకములో స్త్రీలు గాని, పురుషులు గాని, దుఃఖమునుండి విముక్తి ని, సుఖమును కోరి కామ్యకర్మలను చేయుచుందురు. కాని, వాటి వలన దుఃఖము తొలగుట లేదు, సుఖము లభించుట లేదు.

ఈ విధముగా తాము తెలివి గలవారమనే అభిమానము గల జనులు కామ్యకర్మలను చేసి విరుద్దఫలమును పొందుచున్నారు. మాన వుడు ఈ సంగతిని గమనించి, ఇంద్రియగోచరము కాని ఆత్మయొక్క యథార్థస్వరూపమును తెలుసుకొనవలెను. మానవజీవితములోని మూడు అవస్థలను ప్రకాశింప జేసేది ఆత్మయే అయినా, వాటికంటే ఆత్మ విలక్షణ ముగా నున్నది. మానవుడు తన వివేకశక్తిచే, కనబడే (ఇహలోక) మరియు వినబడే (పరలోక) భోగములనుండి బయటపడి, ఆత్మజ్ఞానమును సాధన చేసి, అనుభవము లోనికి తెచ్చుకొని, నా భక్తుడై ఉండవలెను.

మానవులు కర్మయోగమునభ్యసిస్తూ బుద్ధికి పదును పెట్టి పరబ్ర హ్మయే ఆత్మరూపముగా నున్నదని తెలుసుకొనుటకు సర్వవిధములుగా ప్రయత్నించవలెను. పురుషార్థము (జీవితలక్ష్యము) ఇది మాత్రమే.

ఓ రాజా! నీవు నా మాటను మరచిపోవద్దు. నా ఉపదేశమును బుద్దిలో నిలుపుము. దాని వలన నీవు శీఘ్రముగా ఆత్మజ్ఞానమును, ఆత్మా నుభవమును పొంది, జీవన్ముక్తుడవు కాగలవు.

జగత్తునకు తండ్రి, గురువు అగు శ్రీహరి భగవానుడే జగత్తు యొక్క యథార్థస్వరూపము కూడ. ఆయన చిత్రకేతువును ఈ విధముగా ఓదార్చి, ఆతడు చూచుచుండగనే అక్కడనుండి అంతర్ధానమయ్యెను.

శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో చిత్ర కేతువునకు పరమాత్మ సాక్షాత్కారమును వర్ణించే పదునారవ అధ్యాయము ముగిసినది (16).