భాగవత మహా పురాణము
1 - సుద్యుమ్న మహారాజు వృత్తాంతము
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను -- పదునాలు మన్వంతరముల ను, వాటియందు అనంతశక్తిశాలియగు శ్రీహరి తన మహిమను ప్రకటిస్తూ చేసిన కర్మలను కూడ తమరు వర్ణించి చెప్పగా, నేను వింటిని.
గడచిన కల్పముయొక్క అంతమునందు సత్యవ్రతుడని ప్రసిద్ధి గాంచిన రాజర్షి ద్రవిడదేశమునకు ప్రభువుగ నుండెను. ఆయన మత్స్య మూర్తియగు శ్రీహరిని సేవించి ఆత్మజ్ఞానమును పొందెను.
ఆ సత్యవ్రతుడే ఈ కల్పమునందు సూర్యుని పుత్రుడై శ్రాద్ధదేవుడనే మనువు ఆయెననియు, ఇక్ష్వాకుడు మొదలగువారు ఆయన పుత్రుల నియు నీవు చెప్పగా వింటిని.
ఓ మహర్షీ! నీవు మహాత్ముడవు. ఆ ఇక్ష్వాకుడు మొదలగువారి యొక్క వేర్వేరు వంశములను, వారి వంశములలో జన్మించినవారల తరు వాతి వృత్తాంతములను వర్ణించి చెప్పుము. మాకు నిరంతరముగా వినాలనే కోరిక గలదు.
ఆ వంశములో గడచిన కాలములోని వారు, వర్తమానములో నున్నవారు, భవిష్యత్తులో రాబోవువారు అగు రాజులందరియొక్క పరాక్ర మములను గురించి మాకు చెప్పడు. వారి కీర్తి పవిత్రమైనది.
సూత ఉవాచ ।
సూత మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా బ్రహ్మవేత్తల సభ యందు పరీక్షిన్మహారాజు పూజనీయుడైన శుక మహర్షిని ప్రశ్నించగా, పర మధర్మమగు భక్తిలో విద్వాంసుడగు ఆ మహర్షి ఇట్లు బదులు చెప్పెను.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- (లోపలి) శత్రువులను తపింప జేసిన ఓ మహారాజా! నేను మనువుయొక్క వంశములోని ప్రముఖములైన విషయములను చెప్పెదను, వినుము. ఆ వంశమును విస్తారముగా వర్ణించుటకు వందలాది సంవత్సరములైననూ చాలదు.
ఈ కనబడే జగత్తు ప్రళయమునందు ఆ పురుషోత్తముడుగనే యుండెను. ఇతరము ఏదియు లేకుండెను. పెద్ద-చిన్న ప్రాణులన్నింటికీ ఆత్మ (స్వస్వరూపము) ఆ పురుషోత్తముడే.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ పురుషోత్తముని నాభినుండి ప్రకాశించే బంగరు పద్మము పుట్టెను. దానియందు నాలుగు మోముల బ్రహ్మగారు ప్రకటమాయెను. బ్రహ్మగారు స్వయంభువుడు (పుట్టుక లేని చైతన్యమే స్వరూపముగా గలవాడు).
ఆ బ్రహ్మగారి సంకల్పమునుండి మరీచి మహర్షి పుట్టెను. మరీచికి కశ్యపుడు పుత్రుడు. కశ్యపునకు దక్షుని కుమార్తెయగు అదితియందు అధిక మగు ప్రకాశము గల సూర్యుడు పుత్రుడై పుట్టెను.
భరత వంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆ సూర్యునకు సంజ్ఞ యందు శ్రాద్ధదేవ మనువు పుత్రుడై పుట్టెను. శక్తిమంతుడు మరియు మనీ షి అగు ఆ మనువునకు శ్రద్ధయందు పదిమంది పుత్రులు కలిగిరి. ఇక్ష్వాకు వు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, ధృష్టుడు, కరూషకుడు, నరిష్యంతుడు, పృషధ్రుడు, నభగుడు, కవి అనునవి వారి పేర్లు.
ఇక్ష్వాకుడు మొదలగు పుత్రులు పుట్టుటకు ముందు, వైవస్వత మనువునకు సంతానము లేకుండెను. సమర్థుడగు వసిష్ణ భగవాడు అప్పుడు సంతానము కొరకై మనువుచే మిత్రుడు-వరుణుడు దేవతలుగా గల యజ్ఞమును చేయించేనట.
ఆ యజ్ఞమునందు మనువుయొక్క ధర్మపత్నియగు శ్రద్దాదేవి యజ్ఞనియమముననుసరించి కేవలము పాలను మాత్రమే ఆహారముగా తీసుకొనుచుండెను. ఆమె హోత (హోమమునకు ముందు దేవతలను ఆహ్వానించే ఋత్విక్కు) వద్దకు వెళ్లి ఆయనకు ప్రణమిల్లి, తనకు కుమార్తె కలుగునట్లుగా దేవతలను ప్రార్థించుమని కోరెను.
అధ్వర్యుడు హోమమును చేయుమనీ నిర్దేశించగానే హోతయగు బ్రాహ్మణుడు హవిస్సును చేతిలోకి తీసుకొనెను. ఆయన మిక్కిలి ఏకాగ్ర మగు చిత్తముతో శ్రద్ధ చెప్పిన ఆ వచనమునే ధ్యానిస్తూ, వషట్ అనే మంత్రమునుచ్చరించి ఆ హవిస్సును హోమము చేసెను.
ఆ విధముగా హోత తప్పుగా సంకల్పించి హోమమును చేయు టచే ఇల (వాక్కు) అని ప్రసిద్ధి గాంచిన కన్య పుట్టెను. ఆమెను చూచి మనువు చాల సంతోషపడలేదు, ఆయన గురువగు వసిష్ఠునితో నిట్లనెను.
ఓ పూజనీయా! బ్రహ్మవేత్తలగు మీయొక్క కర్మ విపరీతము ఎట్లు అయినది? అయ్యో కష్టము! ఈ తీరున మంత్రము విపరీతము కారాదు.
తమరు మంత్రవేత్తలు, తపస్సంపన్నులు. మీయందు సకలదోష ములు దహించి వేయబడినవి. అట్టి మీరు చేసిన సంకల్పము విపరీతమగు టకు కారణమేమి? దేవతల (విద్వాంసుల) యందు అసత్యము ఉండగల్గునా?
పూజనీయుడగు వసిష్ఠుడు మనువునకు ముత్తాత. ఆయన సూర్య పుత్రుడగు మనువు చెప్పిన ఆ మాటను విని హోత విపరీతముగా చేసినా డని తెలుసుకొనెను. అపుడాయన మనువుతో నిట్లనెను.
నీ హోత అసందర్భముగా ధ్యానమును చేయుట వలననే, ఈ విధముగా నీ సంకల్పమునకు విపరీతమగు ఫలము కలిగినది. అయిననూ పోయినదేమీ లేదు. నేను నా తేజస్సుతో నీకు చక్కని పుత్రసంతానము కలుగునట్లు చేసెదను.
పూజనీయుడగు వసిష్ఠుడు గొప్ప కీర్తి గలవాడు. ఆయన ఈ విధ ముగా నిశ్చయించుకొని, ఇలను మగవానిగా మార్చాలనే కోరికతో జగత్కా రణుడగు పురుషోత్తముని స్తుతించెను.
జగన్నాథుడగు శ్రీహరి భగవానుడు ఆ వసిష్ఠుని యెడల సంతోషించి కోరిన వరమును ఇచ్చెను. ఆ వరముచే ఇల సుద్యుమ్నుడనే గొప్ప పురుషుడుగా మారిపోయెను.
ఓ పరీక్షిన్మహారాజా! ఒకనాడా సుద్యుమ్నుడు కొందరు మంత్రులు చుట్టువారి రాగా, సింధుదేశమునందు పుట్టిన (మంచి) గుర్రము నెక్కి అడవికి వేటకు వెళ్లాను.
వీరుడగు సుద్యుమ్నుడు కవచమును వేసుకొని, అందమైన ధను స్సును మరియు మిక్కిలి అచ్చెరువును గొలిపే బాణములను కూడ పట్టు కొని, మృగముల వెంబడి ఉత్తరదిక్కు వైపునకు వెళ్లాను.
ఆ సుద్యుమ్న కుమారుడు మేరు పర్వతమునకు క్రిందనుండే ఇలావృతమనే అడవిలోనికి ప్రవేశించెను. ఆ అడవిలో సంహారకర్తయగు శివ భగవానుడు పార్వతితో కూడి రమించుచుండును.
ఓ పరీక్షిన్మహారాజా! సుద్యుమ్నుడు శత్రువీరులను దునుమాడే వీరుడు. ఆతడు ఆ అడవిలోనికి ప్రవేశిస్తూనే, తాను స్త్రీగను మరియు తన గుర్రము అడు గుర్రముగను మారిపోయినట్లు కనుగొనెను.
ఆ సుద్యుమ్నుని అనుచరులందరు తాము కూడ సుద్యుమ్నుని వలెనే స్త్రీలమైతిమని కనుగొని, ఒకరినొకరు చూచుకొనుచుండిరి. వారి మనస్సులు చెడిపోయెను.
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను -- పూజనీయుడవగు ఓ శుక మహర్షీ! ఆ స్థానమునకు ఆ లక్షణము (మగవానిని స్త్రీగా చేయుట) ను ఎవరు ఎట్లు కలిగించిరి? ఈ ప్రశ్నకు బదులిండు. ఎందుకంటే, మాకీ విష యమును తెలుసుకోవాలనే అధికమగు ఉత్కంఠ గలదు.
శ్రీశుక ఉవాచ ।
చక్కని ప్రతనిష్ఠగల మహర్షులు ఒకనాడు రుద్రుని దర్శించుటకై ఆ ఇలావృత వనమునకు విచ్చేసిరి. వారి కాంతులచే దిక్కుల చీకట్లు తొల గిపోయెను. వారి ప్రకాశము ముందు సర్వము వెలవెల బోవుచుండెను.
వస్త్రము తొలగియున్న పార్వతీదేవి వారిని చూచి చాల సిగ్గుపడి రుద్రుని అంకమునుండి వెంటనే పైకి లేచి, నడుము చుట్టూ వస్త్రమును సర్దుకొనెను.
పార్వతి, రుద్రుడు పరస్పరము అధికమగు ఆసక్తితో రమించుటను గాంచిన ఆ మహర్షులైతే అచటనుండి వెనుకకు మరలి, నరనారాయణుల ఆశ్రమమునకు వెళ్లిరి.
అప్పుడు రుద్ర భగవానుడు తన ప్రియురాలగు పార్వతికి ప్రియ మును చేయగోరి ఇట్లు పలికెను -- ఎవడైతే ఈ స్థానమునకు వచ్చునో, అట్టివాడు స్త్రీ అయి తీరును, అని.
రుద్రుని ఆ విధముగా శపించిన తరువాతి కాలములో మగవారు ఆ ఇలావృత వనమునకు ఆమడ దూరములో నుండజోచ్చిరి. ఇలగా మారిన సుద్యుమ్నుడు స్త్రీలుగా మారిన తన అనుచరులు వెంటరాగా, అచట ఒక ఉద్యానమునుండి మరియొక ఉద్యానమునకు విహరించెను.
తరువాత తన ఆశ్రమమునకు దగ్గరలో స్త్రీలు చుట్టువారి రాగా విహరించుచున్న ఆ ఇలను బుధుడు చూచెను. మత్తెక్కించే సుందరులలో గొప్పదియగు ఆమెను బుధుడు కామించెను.
బుధుడు ఓషధులకు ప్రభువగు చంద్రుని పుత్రుడు. చక్కని కను బొమలు గల ఆ ఇల బుధుని ప్రేమించి ఆయన తన భర్త కావాలని కోరేను. బుధునకు ఆమెయందు పురూరవుడనే పుత్రుడు కలిగేను.
మనుపుత్రుడగు సుద్యుమ్న మహారాజు ఈ విధముగా స్త్రీగా మారిపోయెను. ఆయన తమ కులగురువగు వసిష్ఠుని స్మరించెనని మేము వీంటిమి.
ఆ వసిష్ఠుడు సుద్యుమ్నుని ఆ అవస్థను గాంచి, దయచే మన స్సులో చాల కష్టపడెను. అపుడాయన సుద్యుమ్నుడు మరల మగవాడు కావాలనే కోరికతో శంకరుని సేవించెను.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ శంకర భగవానుడు ఆ వసిష్ట మహర్షి విష యములో సంతుష్టుడాయెను. ఆయన ఆ మహర్షికి ప్రీతిని కలిగించ గోరెను. ఆయన తన శాపవాక్యమును కూడ సత్యము చేయుచున్నవాడై, ఇట్లు పలికెను.
నీ శిష్యుడగు సుద్యుమ్నుడు నిండా నెల రోజులు మగవాడుగను, ఇంకో నెల స్త్రీగను అగును. ఈ విధమైన ఏర్పాటుతో ఆతడు యథేచ్చగా భూమిని పాలించుగాక!
గురువగు వసిష్ఠుని అనుగ్రహము వలన సుద్యుమ్నుడు తాను కోరుచున్న మగదనమును ఒక పద్ధతిలో (నెల రోజులు మగ, నెల ఆడ) పొంది, భూమిని యథేచ్చగా పాలించెను. కానీ, జనులు ఆయనను (నెల రోజులు కనబడక పోవుటచే) మెచ్చలేదు.
ఆ సుద్యుమ్నునకు ఉత్కలుడు, గయుడు, విమలుడు అనే ముగ్గురు కొడుకులు కలిగిరి. వారు ధర్మమునందు ప్రేమ గలవారు. వారు దక్షిణదేశమునకు రాజులైరి.
ప్రతిష్టాన నగరమును రాజధానిగా చేసుకొని పాలించిన సుద్యుమ్న మహారాజు తరువాత చాల కాలమునకు పెద్దవాడాయెను. అపుడాయన రాజ్యమును తన పుత్రుడగు పురూరవునకు అప్పజెప్పి వన మునకు (తపస్సు కొరకై) వెళ్లాను.
శ్రీమద్భాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో సుద్యుమ్న చరితమును వర్ణించే మొదటి అధ్యాయము ముగిసినది (1).
Summary of chapter 1 of the Bhāgavata Mahā Purana is as follows:
This chapter details the origin of the Solar and Lunar dynasties from Vaivasvata Manu, the progenitor of the current cosmic era. Desiring offspring, Vaivasvata Manu performed a solemn sacrifice through his priest Vasishṭha, resulting in the birth of a daughter named Ilā, who was subsequently transformed into a male named Sudyumna by the grace of Vasishṭha. While hunting in a sacred forest dedicated to Mahādeva Śiva, Sudyumna unknowingly entered an enchanted realm where all male beings were transformed into females by Śiva's decree. In her female form as Ilā, she wed Budha, the son of the moon god Chandra, giving birth to Purūravas, the progenitor of the Candravaṁśa. Through the powerful Vaidika sacrifices performed by Vasishṭha in honor of Bhagavān Vishṇu, Sudyumna was restored to his male form, eventually entrusting his kingdom to Purūravas and retiring to the forest to achieve liberation through devotion.