శ్రీ మద్భాగవతము - అష్టమ (8వ) స్కందము
14 - మనువుల పాలనను వర్ణించుట
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- పూజనీయుడవగు ఓ మహర్షీ! మన్వంతరములయందు మనువు, మనుపుత్రులు మొదలగు ఏయే వ్యక్తులను ఎవరు ఏ విధముగా ఏయే కర్మలయందు నియోగించేదరు? ఆ విషయమును నాకు చెప్పడు.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! మనువు, మను పుత్రులు, సప్తర్షులు, దేవగణములు, ఇంద్రులు అందరు కూడ పురుషోత్త ముని అదుపాజ్ఞలలో మాత్రమే ఉండెదరు.
ఓ మహారాజా! యజ్ఞుడు మొదలగు పురుషోత్తముని అవతారము లను నేను వర్ణించి చెప్పితిని. మనువు, మనుపుత్రులు మొదలగువారు ఈ అవతారములచే ప్రేరితులై జగత్తుయొక్క వ్యవస్థను నడిపించెదరు.
మహాయుగము అంతమైనప్పుడు కాలముచే కబళించబడిన వేద ముల సమూహములను యథాతథముగా మహర్షులు తపశ్శక్తిచే దర్శించి 8. సనాతమైన (కాలమునకు అతీతమైన) ధర్మమును నిలబెట్టేది ఆ వేదములే.
ఓ మహారాజా! మహర్షులు వేదములను దర్శించిన తరువాత, శ్రీహరి ఆదేశముచే మనువులు తమ తమ మన్వంతరములయందు సావ ధానచిత్తులై సాక్షాత్తుగా నాలుగు పాదములు గల ధర్మము భూమియందు సంచరించునట్లు (జనులు పాలించునట్లు) చేసెదరు.
మనుపుత్రులు దేశమును యథాగ్యముగా విభజించి మన్వం తరకాలమంతా ప్రజలను ధర్మబద్ధముగా పాలించెదరు. యజ్ఞకర్మల యందు సంబంధమును కలిగియుండే ఋషులు, పితరులతో బాటుగా దేవతలు ఆయా మన్వంతరములలో యజ్ఞభాగములను అనుభవించెదరు.
ఇంద్రుడు శ్రీహరి భగవానునిచే అనుగ్రహించబడిన గొప్పదైన ముల్లోకముల సంపదను అనుభవిస్తూ, మూడు లోకములను రక్షించును. ఇంద్రుడు లోకములో యథేచ్ఛగా బాగా వర్షించును.
శ్రీహరి ప్రతి యుగమునందు కపిలుడు మొదలగు సిద్దుల రూప మును దాల్చి జ్ఞానమును, యాజ్ఞవల్క్యుడు మొదలగు మహర్షుల రూప ముతో కర్మను, దత్తాత్రేయుడు మొదలగు యోగేశ్వరుల రూపముతో యోగమును ఉపదేశించును.
శ్రీహరి సత్త్వరజస్తమోగుణములను వేర్వేరుగా స్వీకరించి మరీచి మొదలగు ప్రజాపతుల రూపములో సృష్టిని కొనసాగిస్తూ, చక్రవర్తుల రూపములో చోరులను సంహరిస్తూ, కాలము రూపములో సకలప్రాణులను సంహారము వైపునకు కొనిపోవును.
జనులు నామరూపాత్మకమగు మాయచే వ్యామోహితులై యుందురు. వీరు అనేకములగు శాస్త్రముల ద్వారా భగవానుని మాత్రమే స్తుతించెదరు. కాని, వీరు భగవానుని తత్త్వమును దర్శించుట లేదు.
ఒక కల్పమునందు పదునాలుగు మన్వంతరములుండునని వ్యాసాది పురాణవేత్తలు చేప్పెదరు. ఈ విధముగా నేను కల్పములోని అవాంతరవిభాగములైన మన్వంతరములను విస్తారముగా చెప్పితిని..
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో మనువుల పాలనను వర్ణించే పదునాల్గవ అధ్యాయము ముగిసినది .
