శ్రీ మద్భాగవతము - అష్టమ (8వ) స్కందము
9 - సముద్ర మథనము - శ్రీహరి మోహినీ రూపమును దాల్చుట
ఆ రాక్షసులు ప్రేమను విడిచి పెట్టి దోపిడీగాండ్ర వలె ప్రవర్తిస్తూ ఆ కలశమును ఒకరినుండి మరియొకరు లాగుతూ విసిరి వేయుచుండిరి. ఇంతలో తమ వైపు వచ్చుచున్న యువతిని వారు కనుగొనిరి.
ఆహా! ఏమి రూపము! ఆహా! ఏమి కాంతి! ఆహా! ఈమె వినూత్న యౌవనవతి! అని వారు తలచిరి. వారి హృదయములో మన్మథుడు ఉద యించెను. అపుడు వారు ఆమె వైపు పరుగెత్తి ఇట్లు ప్రశ్నించిరి.
పద్మపత్రములవంటి కన్నులు గల ఓ సుందరీ! నీవు ఎవతెవు? ఎక్కడనుండి వచ్చితివి? ఏమి చేయగోరుచున్నావు? నీవు ఎవని దానవు? చెప్పుము. నీవు మా మనస్సులను కలచి వేయుచున్నట్లున్నావు.
దేవతలు, రాక్షసులు, సిద్దులు, గంధర్వులు, చారణులు, లోకపాల కులు కూడ నిన్ను ఇదివరలో స్పృశించి యుండరని మాకు తెలియక పోలే దు. నిన్ను మానవులు స్పృశించి యుండరని వేరుగా చెప్పవలయునా?
చక్కని కనుబొమలు గల ఓ సుందరీ! దైవము దయతో ప్రాణుల సకలేంద్రియములకు మనస్సునకు ప్రీతిని కలిగించుటకై నిన్ను పంపినాడా యేమి? అవును, అదియే నిశ్చయము.
సన్నని నడుము గల ఓ అభిమానవతీ! మేము జ్ఞాతులమే. అయి ననూ, ఒకే వస్తువు విషయములో పోటీ పడి గట్టి వైరమును పూనియుంటి మి. దైవముచే పంపబడిన నీవు మాకు (వైరమును తొలగించి) మఖమును కలిగించుము.
మేము కశ్యప ప్రజాపతి పుత్రులము, సోదరులము. అమృతము కొరకై మేము సమానముగా శ్రమించినాము. కావున, మాకు న్యాయమును అతిక్రమించకుండా, కలహము రాని విధముగా అమృతమును పంచి పెట్టుము. పంచి పెట్టుటలో భేదబుద్ధికి తావు ఉండనే రాదు.
కపటమగు యువతి వేషమును దాల్చియున్న శ్రీహరిని రాక్షసులీ విధముగా ప్రార్థించిరి. అపుడాయన నవ్వి, ప్రీతిని కలిగించే కడకంటి చూపు లతో వారిని చూస్తూ, ఇట్లు పలికెను.
శ్రీభగవానుడిట్లు పలికెను --- కశ్యప ప్రజాపతి పుత్రులగు మీరు కులటనగు నన్ను అనుసరించుటకు కారణమేమి? ఎందుకంటే, వివేకి కామ మును ఉద్దీపింపజేసే యువతిని ఏ కాలమునందైననూ విశ్వసించడు.
దేవతలను ద్వేషించే ఓ రాక్షసులారా! తోడేళ్లు కొత్త కొత్త మాంస మును, స్వేచ్చాచారిణులగు యువతులు కొత్త కొత్త పురుషులను వెదుకు చుందురు. వారు చేసే స్నేహములు అస్థిరములని పెద్దలు చెప్పేదరు.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను - ఈ విధముగా ఆమె పలికిన కపటపు మాటలచే రాక్షసులకు మనస్సులో విశ్వాసము కలిగెను. అపుడు వారు ఆమెయందలి ప్రేమ బయట పడకుండా, గంభీరముగా నవ్వి, అమృత కలశమును ఆమెకు ఇచ్చివేసిరి.
తరువాత శ్రీహరి ఆ అమృత కలశమును తీసుకొని, చిన్న చిరున వ్వుతో శోభిల్లే వాక్కుతో ఇట్లు పలికెను - ఏ అంశములోనైననూ నేను చేయబోయేది మంచిది గాని, చెడు గాని మీకు అంగీకారమయ్యే పక్షము లో, నేనీ అమృతమును పంచి పెట్టెదను.
ఆమె పలికిన ఈ మాటను ఆ రాక్షస శ్రేష్ఠులు వినిరి. ఆమె అభిప్రా యము వారికి తెలియలేదు. సరే అని వారు ఆమె షరతునకు తమ అంగీ కారమును తెలిపిరి.
తరువాత ఆమె ఒకరోజు ఉపవసించెను. మరునాడు ఆమె స్నానము చేసి అగ్నిలో హవిస్సును హోమము చేసి, ఆవులకు ఇతరప్రాణు లకు ఆహారమును వేదవేత్తలకు ధనాదికమును ఇచ్చి, వేదవేత్తలచే స్వస్తి వాచనమును పఠింప జేసెను.
వారందరు తమ ప్రీతికి తగ్గట్లుగా కొత్త వస్త్రములను ధరించి అలంకారములను చేసుకొనిరి. అపుడు వారు తూర్పు వైపు కొనలు గల దర్భలయందు కూర్చుండిరి.
మాలలతో మరియు దీపములతో అలంకరించి ధూపముతో పరి మళ భరితము చేయబడిన శాలయందు దేవతలు మరియు రాక్షసులు తూర్పునకభిముఖముగా కూర్చుండిరి. అప్పుడు సుందరమగు అవయవ ములు గల ఆ యువతీ బంగరు కాలియందేలు ప్రతిధ్వనించుచుండగా కల శము చేతబట్టి ఆ సభలో ప్రవేశించేను. ఆమె కన్నులు సంతోషముతో స్వాధీనత తప్పియుండెను. అందమైన చీరతో ప్రకాశించే విశాలమైన కటి భాగము గల ఆమె మెల్లగా నడచి వచ్చెను.
లక్ష్మీదేవితో సరిదూగే ఆమె సాక్షాత్తుగా పరదేవతా (పరబ్రహ్మ) రూపిణియే. ఆమె ముఖము బంగరు కుండలములతో అందమైన చెవులు ముక్కు మరియు చెక్కిళ్లతో ప్రకాశించెను. కంచుకముయొక్క కొన కొద్దిగా జారుచుండగా ఆమె చిరునవ్వుతో దేవతలను మరియు రాక్షసులను చూచుచుండెను. ఆమెను తదేకముగా చూచే ఆ దేవతలు, రాక్షసులు మోహమును పొందిరి.
పుట్టుకతోడనే క్రూరులైన రాక్షసులకు అమృతమునిచ్చుట సర్ప ములకు పాలను పోయుట వంటి నీతి విరుద్ధమగు చర్య. ఇట్లు తలపోసి శ్రీహరి అమృతమును వారికి పంచి ఈయలేదు.
జగన్నాథుడగు శ్రీహరి దేవతలకు, రాక్షసులకు ఇద్దరికీ వేర్వేరు పంక్తులనేర్పాటు చేసి, వారిని తమ తమ పంక్తులలో కూర్చుండ బెట్టెను.
శ్రీహరి కలశమును పట్టుకొని రాక్షసులకు దగ్గరగా సంచరిస్తూ వారిని వంచించి, దూరముగానున్న దేవతలకు అమృతమును త్రావించెను. అమృతమును త్రోవువారికి ముసలిదనము గాని, మరణము గాని ఉండవు.
ఓ మహారాజా! ఆ రాక్షసులకు ఆమెపై ప్రేమ ఏర్పడెను. పైగా వారు స్త్రీతో కలహించుట జుగుప్సను కలిగించే చర్య అని భావించిరి. కావుననే, వారు తాము చేసుకున్న ఒప్పందమును పాలిస్తూ మిన్నకుండిరి.
ఆ రాక్షసులకు ఆమెయందు అధికమగు ప్రేమ కలిగెను. ఆ ప్రేమకు భంగము కలుగునేమో యను భయము వారిలో ఉండెను. పైగా, ఆమే వారికి చాల మర్యాదనిచ్చెను. అది కూడ వారిని కట్టివేసెను. ఈ కార ణములచే, వారు పరుషముగా ఒక్క మాటనైననూ పలుకలేదు.
రాహువు తన యథార్థరూపము కనబడకుండా దేవతల గుర్తులను ధరించి వారి గుంపులో ప్రవేశించి అమృతమును త్రాగెను. కానీ, చంద్రుడు మరియు సూర్యుడు ఆయనను గుర్తు పట్టి శ్రీహరికి చూపించిరి.
శ్రీహరి వాడి యంచులు గల చక్రముతో అమృతమును త్రాగు చున్న రాహువు తలను నరికెను. అమృతము తగలని వాని మొండెము క్రింద పడి మరణించేను. (కేతువు రాహువుయొక్క ఛాయయే గాని, మొండెము కాదు).
కాని, తల అమరమయ్యెను. స్వయంభువుడగు బ్రహ్మగారు దానిని గ్రహముగా ఏర్పాటు చేసెను. ఆ రాహు గ్రహము వైరబుద్ధి గల దియై పూర్ణిమ, అమావాస్యలయందు సూర్యచంద్రులపై ఆక్రమణను చేయుచుండును.
దేవతలు ఇంచుమించు పూర్తిగా అమృతమును త్రాగిరి. అప్పుడు లోకములను పాలించే శ్రీహరి భగవానుడు, రాక్షస నాయకులు చూస్తుండ గానే వారిని సరకు చేయకుండా, తన అసలు రూపమును స్వీకరించెను.
దేవతల మరియు రాక్షసుల గణములు ఈ విధముగా ఒకే స్థాన ములో ఒకే కాలములో సమానమైన ఉపకరణములతో సమానమైన సంక ల్పముతో సమానమైన పరిశ్రమనే చేసిరి. అయననూ, వారికి లభించిన ఫలములలో చాల తేడాలు గలవు. వారిలో శ్రీహరి పాదపద్మముల ధూళిని ఆశ్రయించిన దేవతలకు అమృతము ఫలముగా తేలికగా లభించెను. కాని, భగవానునకు విముఖులగుటచే, రాక్షసులకు ఏదీ దక్కలేదు.
ప్రాణములు, సంపదలు, కర్మలు మరియు మనస్సులతో మాన వులు తమ దేహము, సంతానము మొదలగువాటి కొరకు చేసే సర్వము భేదబుద్ధితో కూడినది యగుట వలన వ్యర్థమే యగును. కాని, మానవుడు వాటితోనే భగవానుని ఆరాధనను చేసినచో, భగవంతునికంటె భిన్నముగా ఏదీ లేదు గనుక, ఆ సర్వము సఫలమగును. ఎందుకంటే, చెట్టు వేళ్లను తడిపినచో, చెట్టులోని సర్వమునకు నీరు అందును గదా!
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో సముద్ర మథన వృత్తాంతములో శ్రీహరియొక్క మోహినీ రూపమును వర్ణించే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది .
