శ్రీ మద్భాగవతము - సప్తమ (7వ) స్కందము

Table of Contents

3 - ప్రహ్లాదుని చరితము - హిరణ్యకశిపుడు  వరములను కోరుట

ఓ మహారాజా! హిరణ్యకశిపుడు. తాను ఇతరులు జయించ శక్యము కాని ఏకైక చక్రవర్తి కాగోరెను. తనకు వృద్ధాప్యము గాని మరణము గాని ఉండరాదనియు, తనకు ఎదురుగా నిలిచే ప్రతిపక్షి ఉండకూడదనియు ఆతని ఆకాంక్ష.

ఆతడు మందరపర్వతలోయయందు కాలి బొటనవ్రేలిని మాత్రమే నేలపై ఆన్చి నిలబడి, చేతులు పైకెత్తి ఆకాశము వైపు చూస్తూ, మిక్కిలి కఠినమగు తపస్సును చేసెను.

ఆతని జటల కాంతులు ప్రళయకాల సూర్యుని కిరణములను పోలి ప్రకాశించేను. ఆతడు తపస్సును చేయుచుండగా, దేవతలు తిరిగి తమ తమ స్థానము (పదవు) లను పొందిరి.

వాని తలనుండి తపస్సుచే వర్దిల్ల జేయబడిన అగ్ని పొగతో బాటుగా బయల్వెడలెను. అది అంతటా భూలోకమును మాత్రమే గాక ఊర్ధ్వలోకములను, పాతాళమును కూడ వ్యాపించి తపింప జేసెను.

నదులు, సముద్రములు కలచివేయ బడినవి. ద్వీపములతో మరియు పర్వతములతో సహా భూమి కంపించేను. గ్రహములు, తారలు. నేల గూలినవి. పది దిక్కులు కూడ మండజొచ్చెను.

ఆ అగ్నిచే తపింప జేయబడిన దేవతలు స్వర్గమును విడిచి పెట్టి బ్రహ్మలోకమునకు వెళ్లి, బ్రహ్మగారితో ఇట్లు విన్నవించు కొనిరి -- ఓ దేవ దేవా! జగన్నాథా! రాక్షసరాజగు హిరణ్యకశిపుని తపస్సుచే తపింప జేయబడిన మేము స్వర్గములో నిలువ లేకున్నాము. ఓ అనంతా! సర్వేశ్వరా! నీకు పూజలనందించే జనులు నశించే లోపులోనే, నీవు తలచుకున్నచో, ఆ అగ్నిని శాంతింప జేయుము.

చేయ శక్యము కాని తపస్సును చేయుటలో వానికి ఒక సంక ల్పము గలదు. అది మీకు తెలియకుండునా యేమి? అయిన, మేము విన్నవించెదము. వినుడు.

బ్రహ్మగారు తపోయోగమును నిష్ఠగా అనుష్ఠించి స్థావర జంగమా త్మకమగు ఈ జగత్తును సృష్టించి, ధామములన్నింటిలో శ్రేష్ఠమగు తన సత్యలోకమును అధిష్ఠించి యున్నాడు.

నేను కూడ అదే విధముగా వర్దిల్లే తపోయోగమునందలి నిష్టచే నాకు ఆ ప్రజాపతి స్థానమును సంపాదించుకొనెదను. ఎందుకంటే, దేహము నశించినా, ఆత్మ నశించదు. కాలము కూడ నిరంతరముగా ముందుకు పోతూనే ఉంటుంది. కావున, ఎంత కాలము పట్టినా, ఎన్ని జన్మలు వచ్చినా, ఆ స్థానమును సంపాదించెదను.

నేను నా తపశ్శక్తితో ఈ జగత్తును మరియొక విధముగా ఇదిత రలో ఎన్నడూ లేని విధముగా వ్యవస్థ చేసెదను (అనగా పాపము చేసినవా రికి స్వర్గము, పుణ్యము చేయువారలకు నరకము కలుగునట్లు చేయుట ఇత్యాది). విష్ణులోకము, ధ్రువలోకము మొదలగు ధామములు కూడ కల్పము అంతమయ్యేసరికి కాలగర్భములో కలిసిపోయేవే. అట్టి ధామము లతో నాకు పని యేమి?

ఆతడు ఈ విధమైన హఠమును కలిగియున్నాడని మేము విని యుంటిమి. ఆతడు సర్వాధికమైన తపస్సును చేసినాడు. ఓ బ్రహ్మా! నీవు ముల్లోకములకు ప్రభుడవు. ఈ విషయములో తరువాత చేయదగిన యోగ్యమగు కార్యమును నీవే స్వయముగా చేయుము.

ఓ జగన్నాథా! సర్వశ్రేష్ఠమగు నీ సత్యలోక ధామము వేదవేత్తలకు మరియు గోవులకు వృద్ధిని, కల్యాణమును, సంపత్తిని, క్షేమమును, విజయ మును సమకూర్చుటకై ఉన్నది.

ఓ మహారాజా! దేవతలీ విధముగా విన్నవించగా, స్వయంభువు డగు బ్రహ్మభగవానుడు, భృగువు దక్షుడు మరీచి మొదలగు ప్రజాప తులతో గూడి, రాక్షసరాజగు హిరణ్యకశిపుని ఆశ్రమమునకు వెళ్లాను.

హిరణ్యకశిపుని పుట్టలు, గడ్డి, వెదురు డొంకలు కప్పి వేసినవి. ఆతని దేహములోని క్రొవ్వు, చర్మము, మాంసము, రక్తములను చీమలు అంతటా తినివేసినవి. ఆతడు బ్రహ్మగారికి కనబడనే లేదు.

మేఘములచే కప్పివేయబడిన సూర్యుడు వలె తన తపస్సుచే లోకములను తపింప జేయుచున్న హిరణ్యకశిపుని చూచి, హంసవాహను డగు బ్రహ్మగారు ఆశ్చర్యపోయి నవ్వుతూ ఇట్లు పలికెను.

ఓ కశ్యప నందనా! లెమ్ము, లెమ్ము. నీకు మంగళమగు గాక! నీ తపస్సు సిద్ధించినది. వరములనిచ్చే నేను విచ్చేసినాను. నీకు ఇష్టమైన వర మును కోరుకొనుము.

గొప్ప ఆశ్చర్యమును గొల్పే నీ హృదయమునందలి బలమును నేను చూచితిని. ఎందుకంటే, అడవి ఈగలు మొదలగునవి దేహమును తినివేసినవి. అయిననూ, నీ ప్రాణములు ఎముకలయందు నిలిచియున్నవి.

పూర్వమునందలి మహర్షులు ఇట్టి తపస్సును చేయలేదు, భవిష్య తలో ఇతరులు చేయబోరు. వంద దివ్యసంవత్సరముల కాలము నీటినై నన త్రాగకుండా ప్రాణములను ఎవరు నిలిపి యుంచగలరు?

దితిపుత్రుడవగు ఓ హిరణ్యకశిపూ! ధైర్యశాలురగు మహర్షులు సైతము చేయ శక్యము కాని గొప్ప తపస్సును నీవు చేసితివి. నీ తపోని ష్ఠచే నేను నీకు వశుడనైతిని.

ఓ రాక్షసశ్రేష్ఠా! కావున, నేను నీ కోరికలనన్నింటినీ తీర్చెదను, మరణించే స్వభావము గల మానవుడవు నీవు. మరణము లేని దేవుడను నేను. నీకు నా దర్శనమైనది. అట్టి నీకు నా దర్శనము వృథా కాబోదు.

నారదుడిట్లు పలికెను --- సృష్ట్యాదియందు ప్రకటమైన ఆ బ్రహ్మ దేవుడు ఈ విధముగా పలికెను. హిరణ్యకశిపుని దేహమును చీమలు తిని వేసెను. అపుడాయన తన కమండలమునందలి దివ్యజలమును ఆతనిపై చల్లెను. ఆ నీటియొక్క ప్రభావము అమోఘమైనది.

ఆయన నీటిని చల్లుట వలన హిరణ్యకశిపుడు వెదురుడొంకలతో కప్పివేయబడియున్న చీమల పుట్టనుండి, కట్టెనుండి అగ్ని వలె, లేచి నిలబ డెను. అన్ని అవయవములతో ఒప్పారే ఆతని దేహము వజ్రము వలె దృఢ ముగ నుండెను. ఆతనియందు మనశ్శక్తి, ఇంద్రియశక్తి, దేహశక్తి నిండుగా నుండెను. ఆతడు పుటము పెట్టిన బంగారము వలె ప్రకాశించెను.

ఆ హిరణ్యకశిపుడు ఆకాశములో హంసవాహనముపైనున్న బ్రహ్మదేవుని చూచి గొప్ప ఉత్సాహమును పొందెను. అపుడాతడు నేలపై తలను ఆన్చి నమస్కరించెను.

బ్రహ్మదేవుని చూస్తూ ఉంటే హిరణ్యకశిపునకు గొప్ప హర్షముచే కన్నీరు స్రవించేను, ఒళ్లంతా గగుర్పాటు కలిగెను. ఆతడు పైకి లేచి చేతులు జోడించి, వినయముతో తలను వంచి బ్రహ్మగారికేసి చూస్తూ ఇట్లు స్తుతించెను.

కల్పము అంతమైనప్పుడు కాలముయొక్క ప్రభావముచే ఈ జగత్తు దట్టని తమోగుణముచే కప్పివేయబడి యుండెను. స్వయంప్రకాశ - స్వరూపుడగు పరమేశ్వరుడు అట్టి జగత్తును తన చైతన్యప్రకాశముతో ప్రకటము చేసెను. ఆయన తన మాయాశక్తియొక్క సత్వరజస్తమోగుణముల ద్వారా తానే పృథివి-నీరు-తేజస్సుల రూపముగా ప్రకటమై, వాటి ద్వారా ఈ జగత్తును సృష్టించి, రక్షించి, ఉపసంహారము చేయుచున్నాడు. సర్వ వ్యాపకుడగు అట్టి పరమేశ్వరుని కొరకు నమస్కారము.

జగత్తునకు మూలకారణము పరమేశ్వరుడే. శుద్ధచైతన్యస్వరూపు డగు ఆయనయే ప్రాణుల అంతఃకరణములయందు వివిధములగు విశేష జ్ఞానముల రూపముగా ప్రకటమగుచున్నాడు. ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనే కార్యముల రూపముగా ఆయనయే ప్రకటకై యున్నాడు. అట్టి పరమేశ్వరుని కొరకు నమస్కారము.

సర్వజగద్వ్యాపకమగు మహాశక్తి (ముఖ్యప్రాణము, తేక సూ త్రాత్మ) రూపముగా నీవు స్థావరజంగమములగు ప్రాణులకు అంతర్యామివై యున్నావు. ప్రాణులకు ప్రభుడవు నీవే. ప్రాణులలోని స్మృతి, బుద్ధి, మనస్సు, ఇంద్రియములకు ప్రభుడవు నీవే. సర్వోత్కృష్టుడవగు నీవే పంచభూ తములను, వాటి గుణములైన శబ్దాదులను, వాటి సంస్కారములను కూడ నియమించెదవు.

హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే నల్గురు ఋత్విక్కులచే నిర్వర్తించబడే యజ్ఞములను వేదము ప్రతిపాదించును. నీవు అట్టి వేదమే శరీరము కాగా -- అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉక్టము, షోడశి, వాజపేయము, ఆప్తోర్యామము, అతిరాత్రములనే ఏడు యజ్ఞములను విస్త రింప జేయుచున్నావు. సర్వజ్ఞుడవు, అంతర్యామివి అగు నీవే సకలప్రాణు ల అద్వయ-ఆత్మవు. సర్వకారణుడవగు నీకు దేశ-కాలపరిచ్చేదములు లేవు.

నీవే రెప్పపాటునెరుగని కాలము రూపములో ప్రాణుల ఆయుర్దా యమును లవము, క్షణము మొదలైన కాలఖండముల ద్వారా క్షీణింప జేయుచున్నావు. పుట్టుక లేని పరమేశ్వరుడవగు నీవే సకలప్రాణులలో జీవ శక్తి రూపముగా, ఆత్మచైతన్యరూపముగా ప్రకటమగుచున్నావు. నీకు పరి చ్ఛేదములు లేవు.

కారణము గాని, కార్యము గాని, కదిలేది గాని, కదలనిది గాని నీకంటే భిన్నముగా ఏదీ లేదు. సకలవిద్యలు, కళలు నీ రూపములే. సర్వజ గత్తునకు మూలమునందలి మహాశక్తి నీ స్వరూపమే. సత్త్వరజస్తమోగుణా త్మకమగు మాయకు అతీతమైన పరబ్రహ్మవు నీవే.

సర్వవ్యాపకుడవగు ఓ ప్రభూ! నీనుండి ప్రకటమైన ఈ జగత్తు నీ స్థూలశరీరమే. నీవు సర్వాతిశాయియగు సత్యధామమునందుంటూనే, ఈ బ్రహ్మాండశరీరముతో ఇంద్రియములు, ప్రాణము, మనస్సుల విషయములను భోగించుచున్నావు. ఇంద్రియగోచరము కానిది, పూర్ణము, ప్రాణిదేళ ములయందు ఉపలభ్యమయ్యేది, కాలాతీతము అగు ఆత్మతత్త్వము నీకే.

ఓ అనంతా! ఇంద్రియగోచరము కాని నీ రూపమే (చైతన్యము) ఈ జగత్తునంతనూ వ్యాపించి యున్నది. చైతన్యశక్తియగు జ్ఞానమునకు, జడశక్తియగు మాయకు నీవే అధిష్ఠానము. భగవానుడవగు అట్టి నీ కొరకు నమస్కారము.

ఓ ప్రభూ! నీవు వరములనిచ్చువారిలో ఉత్తముడవు. నాకు ఇష్ట మైన వరములను నీవు ఈయబోయే పక్షములో, -- నీచే సృష్టించబడిన ప్రాణుల వలన నాకు మరణము కలుగకుండు గాక!

లోపల గాని, బయట గాని, పగలు గాని, రాత్రి గాని, నేలపై గాని, ఆకాశమునందు గాని, మానవులచే గాని, మృగములచే గాని, నీచే సృష్టిం చబడని ప్రాణిచే ఆయుధములతో గాని, ప్రాణము లేనివాటిచే గాని, ప్రాణము ఉన్నవాటిచే గాని, దేవతలచే గాని, రాక్షసులచే గాని, గొప్ప నాగులచే గాని, నాకు మరణము కలుగరాదు. యుద్ధములో నా యెదుట నిలిచి పోరాడగలిగే ప్రతిపక్షి ఉండరాదు. ప్రాణులన్నింటికీ నేను ఏకచ్ఛత్రా ధిపతిని కావలెను.

లోకపాలకులందరిలో నీ మహిమయే గలదు. అటువంటి మహి మను నాకు కూడ ఇమ్ము, తపోయోగముయొక్క ప్రభావము గల సిద్దపురు షులయందలి అక్షయమగు ఐశ్వర్యమును కూడ నాకు ఇమ్ము,

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో ప్రహ్లాదచరితమునందు హిరణ్యకశిపుడు వరములను కోరుట అనే మూడవ అధ్యాయము ముగిసినది (3).