శ్రీ మద్భాగవతము - సప్తమ (7వ) స్కందము
1 - ప్రహ్లాదుని చరితమునకు ఉపక్రమము
పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నించెను -- ఓ శుక మహర్షీ! సకలప్రా ణులకు హితమును చేసే భగవానుడు ప్రేమస్వరూపుడు. ఆయనకు నావాడు పైవాడు అనే తేడా లేదు గదా! అట్టి భగవానుడు భేదబుద్ది గల వాని వలె ఇంద్రుని ప్రయోజనము కొరకు రాక్షసులను సంహరించుట ఎట్లు పొసగును?
ఎందుకంటే -- పరమానందస్వరూపుడు, నిర్గుణుడు అగు భగవ నునకు దేవతాగణముల సహకారముతో పొందదగిన ప్రయోజనము గాని, రాక్షసుల వలన భయము గాని, వారి యెడల. ద్వేషభావము గాని లేనే లేవు గదా!
భగవద్భక్తి అనే గొప్ప భాగ్యము గల ఓ మహర్షీ! మాకు సహాయ ణుని గుణములను గురించి ఈ విధముగా పెద్ద సందేహము కలిగినది. దానిని తొలగించుటకు నీవే అర్హుడవు.
శ్రీశుక ఉవాచ ।
ఓ పరీక్షిన్మహారాజా! నీవు శ్రీహరియొక్క ఆశ్చర్యమును గొల్పే గాథను గురించి చక్కగా ప్రశ్నించితివి. శ్రీహరి గాథలో భగవద్భక్తిని వర్ధిల్ల జేసే భగవద్భక్తుల మహిమ వర్ణించబడును.
పరమపవిత్రమగు శ్రీహరి గాథను నారదుడు మొదలగు మహర్షులు గానము చేయుచుందురు. నేను వేదవ్యాస మహర్షికి నమస్కరించి అట్టి గాథను చెప్పెదను.
మాయాశక్తికి అతీతుడైన భగవానుడు నిర్గుణుడు. పుట్టుక లేని ఆయనకు దేహేంద్రియాదులు లేవు. అయిననూ, ఆయన తన మాయాశక్తి యొక్క గుణములకు అధిష్టానమై యుండుటచే, దేవతలు రాక్షసులు పర స్పరము బాధించుకుంటూ ఉంటే అదంతా ఆయనకు సంక్రమించినది.
ఓ మహారాజా! సత్త్వము, రజస్సు, తమస్సు అనేవి మాయాశక్తి గుణములే గాని, ఆత్మవి కావు. అవి అన్నీ ఏకకాలములో క్షయమును గాని, వృద్ధిని గాని పొందవు.
భగవానుడు ఆయా కాలములకు తగ్గట్లుగా, సత్త్వగుణము వర్ధిల్లే లచుండు మతము ముగులు గగనము నందు భోగపరాయణులగు అసురులను, తమోగుణము వర్ధిల్లే కాలము నందు యక్షులను రాక్షసులను అనుగ్రహించును.
నిప్పు, నీరు మొదలైన పంచభూతములు వలె భగవానుడు అనేక రూపములలో ప్రకాశించుచున్నాడు. కాని, దేహేంద్రియమనస్సంఘాత ములయందు ఆత్మరూపముగానుండే ఆయనను మానవులు దేహాదుల కంటే విలక్షణముగా తెలియకున్నారు. కట్టెలోని నిప్పు మథించినచో ప్రకట మగును. అదే విధముగా, జ్ఞానులు ఆత్మవిచారమును చేసి అనాత్మను నిషేధిస్తూ, భగవానుని బుద్ధియందలి ఆత్మచైతన్యరూపముగా తెలుసుకో ని, ఆయనలో ఐక్యమగుచున్నారు.
రాజసూయ మహాయజ్ఞమునందు చేదిదేశపు రాజగు శిశుపాలుడు పోసుదేవ భగవానునియందు ఐక్యమయ్యెను. ఆ గొప్ప అద్బుతమును చూచి, పొండుపుత్రుడగు ధర్మరాజుయొక్క మనస్సు ఆశ్చర్యముతో నిండి పోయెను. ఆ సమయములో యజ్ఞశాలలో దేవర్షియగు నారదుడు కూర్చుండియుండెను. ఇతరమహర్షులు వినుచుండగా ఆ మహారాజు ఆయనను ఇట్లు ప్రశ్నించెను.
ధర్మరాజు ఇట్లు పలికెను --- ఆహా! ఇది అత్యద్బుతము సుమా! చేదిదేశపు రాజగు శిశుపాలుడు అధికముగా ద్వేషించి కూడ వాసుదేవ పర బ్రహ్మయందు ఐక్యమైనాడు. ఇది ఏకాంతభక్తులకు కూడ పొంద శక్యము కానిది.
ఓ మహర్షీ! మేమందరము ఈ విషయమును తెలియగోరుచున్నా ము. భగవంతుని నిందించిన వేనుని వేదవేత్తలు నరకములో పారద్రోసిరి..
దమఘోషుని పుత్రుడు, పాపి అగు శిశుపాలుడు ముద్దు పలుకుల నాటినుండి ఈ నాటి వరకు గోవిందునిపై కోపమును కలిగియే యున్నాడు. దుర్బుద్ధియగు దంతవక్తడు కూడ అంతే.
అవినాశియగు పరబ్రహ్మయే శ్రీమహావిష్ణువు. ఆయనయే శ్రీకృ ష్ణుడు. ఆయనను మాటిమాటికీ తిట్టుచున్న వీరిద్దరు అంధకారమయమగు నరకములో పడుట మాట అటుంచి, వారికి నాలుకపై తెల్లని మచ్చ కూడ పడలేదు.
భగవానుని స్వరూపమును పొందుట చాల కష్టము. జనులందరు చూచుచుండగా వీరిద్దరు సాక్షాత్తుగా ఆ భగవానునియందు ఐక్యమగుట ఎట్లు సంభవమయ్యేను?
ఇది మిక్కిలి అద్భుతము. దీని విషయములో నా బుద్ది, గాలిలోని దీపజ్వాల కదలాడినట్లు, భ్రమను పొందుచున్నది. పూజనీయుడవగు నీవు అట్లు జరుగుటకు గల కారణమును చెప్పుము.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను - పూజనీయుడగు నారద మహర్షి ధర్మరాజుయొక్క ఆ మాటను విని సంతోషించెను. ఆయన ధర్మరాజును సంబోధించి, సభాసదులందరు వినుచుండగా, గాథలను చెప్పెను.
ఓ మహారాజా! ప్రకృతికి, పరమాత్మకు మధ్యలో ఉండే తేడా తెలి యని కారణముగా ఈ దేహము కల్పితమై, నిందాస్తుతులకు, సత్కారతిర స్కారములకు యోగ్యమై యున్నది.
ఓ మహారాజా! ఈ లోకములో మానవులు భ్రాంతిచే దేహము నందు నేను-నాది అనే అభిమానము గలవారై, కొట్టుకొనుట మరియు పరు షముగా తిట్టుకొనుటల వలన కలిగే పీడకు గురియగుచుందురు. మాన వులు దేహమే ఆత్మ అనే దృఢమగు అభిమానముగలవారై, దేహముయొక్క వినాశము తమ మరణమేనని స్వీకరించెదరు. కాని సకల ప్రాణులను వారి కర్మలకనురూపముగా శిక్షించే పరమాత్మ అద్వితీయుడు, సర్వాత్మస్వరూపుడు. ఆయనయందు ఇట్టి ఆభిమానమునకు తావు లేదు. ఆయన విషయములో హింసయొక్క కల్పననైననూ ఎవడు చేయగలడు ?
కావున, వైరమును బూని గాని, వైరమునెరుంగని భక్తితో గాని, భయముతో గాని, మైత్రితో గాని, కామనచే గాని భగవానునియందు మన స్సును గట్టిగా నిలుపవలెను. ఈ ఉపాయములలోని భేదమును భగవా నుడు సరకు చేయడు.
మానవుడు గట్టిగా వైరమును బూని తన్మయుడై భగవానునితో సాయుజ్యమును పొందిన విధముగా భక్తియోగముతోనైననూ పొందలేడని నా నిశ్చితమైన అభిప్రాయము.
తుమ్మెద గ్రుడ్డునుండి వచ్చిన పురుగు (లార్వా) ను గోడచిల్లులో బంధించును. అది ద్వేషము-భయములతో తుమ్మెదనే స్మరిస్తూ, తుమ్మెద రూపమునే పొందును.
శ్రీకృష్ణ భగవానుడు మాయచే మానవరూపమును దాల్చిన పర మేశ్వరుడు. కొందరు ఆయనను ఆ పురుగు వలె వైరముతో ధ్యానించి, దానిచే పాపములు తొలగి ఆయనను పొందిరి.
భక్తులు భక్తితో భగవానుని పొందినట్లుగానే, చాల మంది కామనతో గాని, ద్వేషముతో గాని, భయముతో గాని, మైత్రితో గాని మనస్సును భగ. వానునియందు గట్టిగా నిలిపి, ఆయా దోషములను వదిలించుకొని, భగవా నుని సాయుజ్యమును పొందిరి.
ఓ మహారాజా! గోపికలు కామనచే, కంసుడు భయముచే, చేదిదేశ ప్రభువగు శిశుపాలుడు మొదలగు రాజులు ద్వేషముచే, యాదవులు, బంధుత్వముచే, మీరు మైత్రిచే, మేము భక్తిచే మనస్సును ఈశ్వరుని యందు నిలిపితిమి.
పరమేశ్వరుని యెడల చేసే (పైన చెప్పినవాటిలో కామనను మిన హాయించి) అయిదు రకముల భావనలలో దేనినైననూ వేనుడు చేయలేదు (కావుననే, నరకమును పొందెను). కావున, సాధకుడు ఏ ఉపాయముచేనై ననూ మనస్సును శ్రీకృష్ణునియందు గట్టిగా నిలుపవలెను.
పాండువంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! చేదిదేశప్రభుడగు. శిశుపాలుడు మీ పినతల్లి కొడుకు. ఆతడు, దంతవక్తడు విష్ణువుయొక్క అనుచరులలో ప్రముఖులు, బ్రహ్మవేత్తలగు సనకాదుల శాపముచే వారు తమ పదవినుండి జారిపోయిరి.
ధర్మరాజు ఇట్లు పలికెను --- శ్రీహరియొక్క భక్తులను తిరస్క రించే ఆ శాపమెట్టిది? ఎవరి శాపము? శ్రీహరియొక్క ఏకాంతభక్తులకు కూడ సంసారము కలుగుట నమ్మ శక్యము కాకుండా నున్నది.
వైకుంఠపురములో నివసించువారలకు ప్రాకృతములైన దేహములు, ఇంద్రియములు, ప్రాణములు ఉండవు. అట్టివారికి దేహముతోడి సంబంధము (జన్మనెత్తుట) ఎట్లు కలిగినదో, ఆ ఈ వృత్తాంతమును నీవు చెప్ప తగుదువు.
నారదుడిట్లు పలికెను --- బ్రహ్మగారి పుత్రులను సనందనుడు మొదలగువారలు ముల్లోకములను సంచరిస్తూ అనుకోకుండా (ఈశ్వరేచ్ఛచే) ఒకనాడు విష్ణులోకమునకు వెళ్లిరి.
అయిదారు సంవత్సరముల వయస్సు గల పిల్లలవలె కన్పట్టే దిగంబరులైన ఆ సనందనాదులు అందరికంటే ముందటివారైన మరీచి మొదలగు ప్రజాపతులకు కూడా ముందు జన్మించినవారు. వారు పిల్లలేనని తలపోసి, ఇద్దరు వైకుంఠ ద్వారపాలకులు వారిని అడ్డుకొనిరి.
ఈ విధమగు ఆటంకముచే కోపించిన ఆ సనకాదులు ఇట్లు శపించిరి -- మధువైరియగు శ్రీహరి చరణముల వద్ద రజస్తమోగుణములకు తావు లేదు. కావున, మీరిచట నివసించుటకు తగరు. ఓ మూర్ఖులారా! మీరు వెంటనే ఇక్కడనుండి జారిపోయి, పాపభూయిష్టమగు అసురజ న్మను పొందుడు.
ఈ విధముగా శపించబడి వారిద్దరు తమ భవనమునుండి పడిపో వుచుండగా, సనకాదులు వారితో మరల ఇట్లనిరి -- మూడు జన్మల తరు వాత శాపము సమాప్తమై మీరు వైకుంఠలోకమును పొందగలరు.
వారిద్దరు దితి పుత్రులై జన్మించి, దితిదానవవంశములకు చెందిన రాక్షసుల మన్ననలను పొందిరి. వారిలో పెద్దవాడు హిరణ్యకశిపుడు; హిర ణ్యాక్షుడు వాని తమ్ముడు.
శ్రీహరి నరసింహరూపమును దాల్చి హిరణ్యకశిపుని, వరాహరూ పమును దాల్చి భూమిని పైకి తీసుకువస్తూ హిరణ్యాక్షుని సంహరించెను.
హిరణ్యకశిపుని పుత్రుడగు ప్రహ్లాదుడు శ్రీహరి భక్తుడు, శ్రీహరికి ప్రియమైనవాడు. ఆతనిని హిరణ్యకశిపుడు చంపగోరెను. ప్రహ్లాదుని చంపు టకై హిరణ్యకశిపుడాతనిని అనేకములైన తీవ్రవేదనలకు గురి చేసెను.
ప్రహ్లాదుడు సర్వవ్యాపకమైన పరబ్రహ్మను దర్శించే జ్ఞాని యగుటచే, ఆతని మనస్సులో రాగద్వేషములకు తావు లేదు. సర్వప్రాణులకు ఆత్మరూపుడైయున్న ఆతనిని భగవానుని తేజస్సు వ్యాపించి యుండెను. కావుననే, శస్త్రాఘాతములు మొదలగు ప్రయత్నములను చేసిననూ, హిర ణ్యకశిపుడు ప్రహ్లాదుని సంహరించలేక పోయెను.
తరువాత వారిద్దరు విశ్రవసునకు కేశినియందు రావణకుంభక ర్ణులనే రాక్షసులై జన్మించి, సకలప్రాణులకు పీడను కలిగించిరి.
ఓ మహారాజా! వారిద్దరి ఆ జన్మయందు కూడ శ్రీహరి శ్రీరా ముడై అవతరించి వారిని సంహరించి శాపవిముక్తిని కలిగించెను. నీకు శ్రీరాముని పరాక్రమమును గురించి మార్కండేయ మహర్షి చెప్పగలడు.
వారిద్దరే ఇప్పుడు క్షత్రియకులములో నీ పినతల్లి కుమారులై జన్మించిరి. శ్రీకృష్ణుని చక్రముచే వారి పాపములు నశించగా, వారిప్పుడు శాపవిముక్తిని పొందిరి.
వారిద్దరు శ్రీహరియందు గట్టిగా వైరమును బూని ఆయననే ధ్యానిస్తూ ఆయనలో తన్మయులైనారు. ఆ ధ్యానఫలముగా వారు మరల శ్రీహరికి అనుచరులై ఆయన సన్నిధిని చేరుకొనిరి.
పూజనీయుడవగు ఓ మహర్షీ! తనకు ప్రియమైన పుత్రుడు మరియు మహాత్ముడు అగు ప్రహ్లాదునియందు హిరణ్యకశిపునకు అధిక మగు విద్వేషము కలుగుటకు కారణమేమి? ప్రహ్లాదుడు ఏ ఉపాయముచే శ్రీహరియందు తన్మయుడు కాగలిగెను? నాకీ విషయమును చెప్పుము.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో ప్రహ్లాదచరితమునకు ఉపక్రమించే మొదటి అధ్యాయము ముగిసినది (1).
