బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

25 - కైలాపమువకు నారదుడు వెళ్ళుట

సౌతిరువాచ - సౌతిమహర్షి ఇట్లనెను -

క్షణేన విప్రప్రవరో ముదాన్వితో జగామ శంభోస్సదనం మనోహరం

ఊర్ద్వం ధ్రువాద్యోజనలక్షమీప్సితం మహార్హరత్నౌఘు వినిర్మితం మహత్

నిరాశ్రయే యోగబలేన శంభునాదృతం విచిత్రం వివిధాలయాన్వితం

దృష్టం సుపుణ్యశయసాధకైర్వరై: మునీంద్రవర్యై: పరిపూరితం శుభం

మయూఖశూన్యం రవిచంద్రయోర్మునే హుతాశనైర్వేష్టితమేవ కేవలం

ప్రాకారరూఫైరతిరీక్తవర్ధితైః ఉచిరసంఖ్యాప్రమీలైః శిఖోజ్జ్వలైః

పురం వరం యోజనలక్ష విస్తృతం త్రికోటిరత్నేంద్ర గృహావితం సదా

 విరాజితం హీరకసారనిర్మీతైః చీత్రైర్వీవిదైర్మనోహరైః

మాణిక్యముక్తామణి దర్పణైర్యుతం న స్వప్నదృష్టం ద్వీజ విశ్వకర్మణః

ఆకల్పమేకై శివసేవితైరనైః నీషేవీతం సంతలమేవ శౌనక

సిద్ధైర్నియుక్తం శతకోటిలక్షకై: త్రికోటిలకైశ్చ యుతం స్వపార్షదైః

యుక్తం త్రిలకైర్వికటైశ్చ భైరవైః క్షేతైశ్చతుర్లక్ష శతైశ్చ వేష్టితం

సురద్రుమైరేష్టితమేవ సంతతం మందారవృక్షప్రవరైః సుపుష్పితైః

విరాజితం సుందరకామధేనుభీ: యథా బలాకాశతకైర్నభస్తలం

దృష్ట్యా మునిర్విస్మయమాస మానసే కిం నాత్రచిత్రం సురయోగినాం గురౌ

లోకం త్రిలోకాచ్ఛ విలక్షణం పరం భీమృత్యు రోగార్తీ జరాహరం వరం

నారదుడు క్షణకాలములో శివలోకమును చేరుకొనెను. ఆ శివలోకము ధ్రువలోకము పైన లక్షయోజనముల దూరమున నున్నది. ఆ లోకమునకు ఆధారమేమీ లేకున్నను శంకరుడే దానినీ తనయోగబలముచే పడిపోకుండ చేయుచున్నాడు. ఆలోకమున చిత్ర విచిత్రములైన ఆలయములున్నవి. మునిశ్రేష్ఠులందరు అచ్చట నుందురు. ఆలోకము గొప్ప పుణ్యము చేసికొనిన సాధకులకు మాత్రమే కన్పించును.

ఆ పట్టణమున సూర్యచంద్రులకాంతులు లేకున్నను అసంఖ్యాకమై చాలా ఎత్తు కలిగిన అగ్ని జ్వాలలతో నిత్యము ప్రకాశించుచుండును. ఆది లక్షయోజనముల వైశాల్యముగలది. విచిత్రములు, సుందరములు, మణులలో పరివేష్టితములైన వివిధ చిత్రములు గల మూడుకోట్ల రత్నగృహములు కలది. ఆది ఎల్లప్పుడు శివుని సేవించు జనములచే నిండిపోయినది. ఇంకను కోటి కోట్ల సంఖ్యలో నున్న సిద్ధులచే మూడు లక్షల కోట్ల ఆత్మ పరివారముతో, మూడులక్షల భైరవులచే నాలుగు కోట్ల పుణ్యక్షేత్రములతో కూడుకొనియున్నది.

అచ్చట అనేకములైన కల్పవృక్షములు, మందారవృక్షములున్నవి. అచ్చటనున్న కామధేనువులను చూచినచో తెల్లని కొంగలతో నిండిన ఆకాశము ఇకి వచ్చును.

ముల్లోకములకన్నను విలక్షణమైనది, భయము, ఆర్తీ, రోగములు ముసలితనము, మృత్యువు లేని ఆలోకమును దర్శించి నారదుడు చాలా విస్మయమందెను. వెంటనే అతడు దేవతలకు యోగులకు గురువైన మహేశ్వరుడున్న ఈ ప్రదేశమున పై చిత్రవిచిత్రములుండుట సహజమే అని తలపోసెను.

దూరే సభామండల మధ్యగం శివం దదర్శ శాంతం శివదం మనోహరం

పద్మశ్రినేత్రం వీధుపంచపక్షం గంగాధరం నిర్మల చంద్రశేఖరం

ప్రశస్తమాభజటాధరం ఏభుం దిగంబరం శుభ్రమనంతమక్షరం

మందాకినీ పుష్కరబీజమాలయా కృష్ణేతి నామైవ ముదా జపంతం

సునీల కంఠం భుజగేంద్రమండితం యోగీంద్ర సిద్ధేంద్ర మునీంద్ర వందితం

సిద్దేశ్వరం సిద్ద విధాన కారణం మృత్యుంజయం కాలయమాంతకారకం

 ప్రసన్నహాస్యాస్య మనోహరం వరం విశ్వశ్రయాణాం శివదం వరప్రదం

సదాశఽశుతోషం భవరోగవర్జితం భక్త ప్రియం భక్తజనైక బంధుం

నారదుడు సభా మధ్యలోనున్న శాంతి స్వరూపుడు, మంగళార్థ ప్రదాయి, మనోహరుడు, పద్మములవంటి మూడుకన్నులు గలవాడు, చంద్రుని వంటి ఐదు ముఖములు గలవాడు గంగాధరుడు, చంద్రుని శీరోలంకారముగా కలవాడగు శివుని దూరమునుండే చూచెను.

ఆ శివుడు స్వచ్ఛమైన బంగారు పంట జడలు ధరించినవాడు. దిగంబరుడు, ఆంతము లేనివాడు, నాశరహితుడు. నారదుడు చూచిన సమయమున శివుడు ఆకాశగంగలో పుట్టిన నల్లకలువల బీజములలో కూర్చిన మాలలో శ్రీకృష్ణనామజపము చేయుచుండెను. అతడు నీలకంఠుడు. అతని మెడచుట్టు సర్పముండెను. అతడు మృత్యుంజయుడు, కొలయములను ఆంతము చేయువాడు, చిరునవ్వుతో కూడిన ముఖము కలవాడు, అల్పసంతోషి భక్తులపై ప్రేమగలవాడు. స్వరభేదము లేక ప్రపంచమున నున్న ప్రాణులందరకు వరము లిచ్చువాడు. అతనిని ఎల్లప్పుడు ముని శ్రేష్ఠులు, యోగీంద్రులు, సిద్ధేంద్రులు సేవించుచుందురు.

గత్వాసమీపంమునిరేష శూలినం ననామమూర్ద్వాపులకాంక విగ్రహః

వీణాం త్రీతంత్రీం క్వణయన్ పునర్జగౌ కృష్ణం స తుష్టావ కలం సుకంఠః

దృష్ట్యా మునీంద్రప్రవరం చ సస్మితం విదే: సుతం వేదవీదాం వరిష్టం

యోగీంద్ర సిద్ధేంద్రమహర్షిభిః సమం హర్షేణ పీఠాదుదపశ్యదీశ్వరః

దదౌ చ తస్మై మునయే ససంభ్రమాత్ ఆలింగనం చాశిషమాసనాదికం

పప్రచ్చ భద్రాగమన ప్రయోజనం తపోధనం తం తపసాచ శౌనక

సద్రత్న సింహాసన సుందరే పరః చోవాస శంభుర్వర పార్శదైస్సహా

నోవాస ధాతుస్తనయ: కృతాంజలి: తుష్టావ భక్త్యా ప్రణత: ప్రభుం ద్విజ

గంధర్వరాజేన కృతేన నారదః స్తోత్రేణ రమ్యేణ శుభప్రదేన చ

శ్రుత్వా ప్రణామం పునరేవ కృత్వా భవాజ్ఞయోవాస భవస్య వామత:

చకార తత్రైవ నివేదనం శివే మనోఽభిలాషం నీజకామపూరకే

 శ్రుత్వా మునేస్తద్వచనం కృపానిధి: ద్రుతం ప్రతిజ్ఞాయ చకార చోమితి

నారదుడు శంకరుని సమీపమునకు వెళ్ళి, నమస్కరించి మూడు తీగలు కల తన వీణను మ్రోగించుచు మంచికంఠముతో శ్రీకృష్ణుని స్తుతించెను.

శంకరుడు బ్రహ్మ దేవుని పుత్రుడైన నారదుని చూచి చిరునవ్వుతో తన యొద్దనున్న యోగీంద్రులు, సిద్ధేంద్రులు, మహరులతో కలసి పీఠమునుండి లేచి నిలబడి నారదుని కౌగలించుకొని, ఆశీర్వదించి ఆసనమొసగి అతని కుశల ప్రశ్న చేసి, రాకకుగల కారణమడిగేను.

శంకరుడు తన అనుచరులు యోగీంద్రులు, సిద్ధేంద్రులు మహర్షులతో సహ ఆసనమున కూర్చున్నప్పటికి నారదుడు కూర్చొనక చేతులు జోడించి భక్తితో అతనికి నమస్కరించి స్తుతి చేసెను. ఆతరువాత మరల శంకరునకు నమస్కరించి అతని అనుజ్ఞపై శిపుని ఎడమ ప్రక్కనున్న ఆసనమున కూర్చొనెను.నారదుడు తన మనోభిలాషను శంకరునకు తెల్పగా దయాసముద్రుడగు శంకరుడు విని సరేయని అనెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే బ్రహ్మఖండే సౌతి శౌనక సంవాదే కైలాసం ప్రతి నారదాగమనం నామ పంచవింశతి తమోఽధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున సౌతి శౌనక మహర్షుల సంభాషణకల బ్రహ్మ ఖండమున కైలాసమునకు  నారదుడు చేరుట అను ఇరువది యెదవ అధ్యాయము సమాప్తము.