సౌతీరువాచ- సౌతి మహర్షి ఇట్లనెను –
బ్రహ్మ, ఈశ్వరుడు మొదలగు దేవతలు పాలసముద్రము యొక్క తీరములో కొంత సమయముండి మాలావతి ఉన్న ప్రదేశమునకు వెళ్ళిరి. మాలావతి దేవతలను చూచి నమస్కరించి తన భర్త శవమును దేవతల ముందుంచి ఏడ్వసాగిమ. ఆ సమయమున ఆతీమనోహరాకారుడు. చేతిలో దండమును, ఛత్రమును ధరించినవాడు అగు ఒక బ్రాహ్మణ బాలకుడు తెల్లని వస్త్రములను, ఉజ్వలమైన తిలకమును. చేతిలో తాళపత్ర గ్రంథమును ధరించి ప్రశాంతత, చిరునవ్వుతో కూడుకొనిన వాడై ఆ దేవతల సమీపమునకు వచ్చెను.
ఆ బ్రాహ్మణ బాలకుడు బ్రహ్మ తేజముతో ప్రకాశించుచు, విష్ణుమాయవలన విస్మయము చెందిన దేవతలనందరమ పలుకరించి చుక్కలమధ్య చంద్రుడున్నట్లు ఆ సభామధ్య భాగమున కూర్చుండి దేవతలతో, మాలావతీతో ఇట్లనెను.
బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను –
ఇక్కడ బ్రహ్మ, ఈశ్వరుడు మొదలగు దేవతలు ఎందుకున్నారు? ప్రపంచములనన్నిటిని సృజించు విధాత, సమస్త బ్రహ్మాండములను సంహరించు శంకరుడు, ముల్లోకములకు పాక్షీ భూతుడైన ధర్మదేవత, సూర్యుడు, చంద్రుడు, అగ్నిదేవుడు, కాలుడు, మృత్యుకన్య, యముడు మొదలగు దేవతలు ఎందుకున్నారు? ఓ మాలావతి వీఒడిలో మిక్కిలి శుష్కించిన శవమున్నది. ఇది ఎవరిదీ? బ్రతికియున్న స్త్రీయొక్క ఒడిలో పురుషుని శవమెందుకున్నది? అని ఆ బ్రాహ్మణుడనగా మాలావతి ఆతవికి నమస్కరించి ఇట్లనెను.
మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను –
బ్రాహ్మణ రూపియైన జనార్దమని సంతోషముగా నమస్కరించుచున్నాను. బ్రాహ్మణుని పూజించినచో శ్రీహరి, దేవలందరు సంతృప్తులైనట్లే భావించవచ్చును. శోకార్తనైన నా మాటలను శ్రద్ధగా ఆలకించుము. దయామూర్తులైన సజ్జనులు యోగ్యులపై అయోగ్యులపై సమానమైన కృప కలిగి ఉందురు.
నేను చిత్రరథుడను. గంధర్వునీ కూతురును. నా భర్త ఉపబృంహణుడనే గంధర్వరాజు. నమ్న మాలావతి అని పిలుతురు. నా భర్తతో కలిసి లక్ష దివ్యయుగములు సంతోషముగా క్రీడించితివి. పతివ్రతలైన స్త్రీలు తమ ప్రియునిపై పేహముతో మండుట సర్వశాస్త్ర సమ్మతము. అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు శాపమిచ్చుటవలన నాభర్త చనిపోయెను. అందువలన నా భర్త తీరిగి బ్రతుకవలెనని దేవతలనుద్దేశించి శోకించుచున్నాను.
ఈ ప్రపంచమున ప్రతివారు తమ పమలు సాధించుకొవ జూతురు. స్వార్థపరులు మంచి చెడులను గమనించక ప్రవర్తింతురు. మానవులు చేయు కర్మలవలన సుఖము, దుఃఖము, భయము, శోకము, సంతాపము, ఐశ్వర్యము, పరమానందము, జన్మ మృత్యువు, మోక్షము కలుగుచున్నవి.
దేవతలు సమస్త కర్మసలితములనిచ్చువారు. అట్లే కర్మ వృక్షములమ సమూలము నాశనము చేయుదురు. అట్టి దేవతల కన్న శ్రేష్టుడైన బంధుపు, బలవంతుడు, దయకలవాడు, దాత ఎవరు ఈ ప్రపంచమున లేరు. అందువలన నాకిష్టమైన వత దావము నిప్వుమనీ దేవతలను యాచించుచుద్ఘాను. వారు ధర్మర్థకామమోక్షములనే ఫలములనిచ్చు వృక్షములు.
దేవతలు నేను కోరుకుంటున్న ప్రతి దావము నొసగినచో వారికి మేలు జరుగును, లేనిచో స్త్రీవధ. చేసిన వారగుదురు. దేవతలకందరకు దుర్నివారణమైన శాపమువిత్తును. అని మాలతీ దుఃఖముచే విహ్వల అయి దేవతలముందు బ్రాహ్మణ కుమారునితో చెప్పగా. నాతడు మాలావతితో ఇట్లనెను.
బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను –
ఓ మాలతీ! మానవులు కర్షకుడి వలన ఏవిధముగా ధావ్యమును పొందుచున్నారో ఆట్లే దేవతల ద్వారా కర్మ ఫలితములను పొందుచున్నారు. గృహస్థ కర్షకుని ద్వారా తన క్షేత్రములో ధాన్యమును విత్తగా ఆది ఆంకురమై, వృక్షమై ఫలములు కలిగి ఆ తరువాత వరీపూర్ణముగా పక్వమైన ఫలములు కలిగి గృహస్థుకు అనుభవయోగ్యమైనట్లు కర్మఫలము కూడ క్రమముగా పరీవక్వమై ఆమభయోగ్యమగుచున్నది.
గృహస్తు విష్ణుమూర్తి యొక్క మాయచే ఈ ప్రపంచమున ధాన్యపుగింజను విత్తినచో అది కొంత కాలమునకు మొలకెత్తి వృక్షమై ఫలవంతమైనప్పుడు ఆ ఫలమును అనుభవించుచున్గాడు. ఆట్లే పుణ్యవంతుడు పుణ్యభూమిపై చాలాకాలము తపస్సు చేసినచో దేవతలు తప్పక తత్పలమునీతురు. బ్రాహ్మణులమఃఖమందు, చక్కని క్షేత్రమందు ఆదరములో ఏది చేసిన ఆది చక్కగా ఫలితమునిచ్చుమ, తపస్సులేక బలము, సౌందర్యము, ఐశ్వర్యము, ధనము, సుతులు, భార్య, భర్త ఎవరు లభించరు.
ఎవరు ప్రకృతిని జన్మజన్మలందు భక్తి శ్రద్ధలతో ఆరాధింతురో ఆతడు వినయవంతురాలు, పగుణవంతురాలు, సుందరియైన భార్యను పొందును.
ప్రకృతియొక్క అనుగ్రహమువలన స్థిరమైన సంపదను పుత్రులను, మనుమలను, భూమిని, ధనమును పొందును.
శివుడు, మంగళస్వరూపుడు, మంగళములను ఇచ్చువాడు, తత్కారణుడు, జ్ఞానానంద స్వరూపుడు, మహాత్ముడు, మృత్యుంజయుడు అగు ఈశ్వరుని ఎవరు జన్మజన్మలనుండి సేవింతురో. వాడు పురుషుడైనచో మంచి భార్యను, ప్రీయైనచో మంచి భర్తను పొందును. ఇంక విద్యను, జ్ఞానమును, మంచి కవిత చెప్పగలశక్తినీ, పుత్రపౌత్రులను, ఆంతులేని సంపదను, బలమును, పరాక్రమమును హరుని అనుగ్రహమున పొందును.
బ్రహ్మదేవుని సేవించినచో చక్కని సంతానమును, సంపదను, విద్యను, ఐశ్వర్యమును, ఆనందమును అతని ఆమగ్రహమున పొందును.
సూర్యుని పూజించినచో విద్య, ఆరోగ్యము, ఆనందము, ధనము, పుత్రులు కలుగుదురు.
గణేశ్వరుని పూజించినచో సర్వాగ్యపూజ, ఎల్లప్పుడు విఘ్నములు లేకుండుట, పరమానందము, ఐశ్వర్యము, పుత్ర పౌత్రాదులు, జ్ఞానము, విద్య, సుకవీత మొదలగునవి.. లభించును.
సురేశ్వరుడు, లక్ష్మీపతి యగు విష్ణుమూర్తినీ భక్తితో పూజించినచో కోరిన కోరికలన్నీ సిద్ధించును. ఏకోరికను కోరనిచో ముక్తి తప్పక లభించగలదు. శాంత స్వరూపుడు, సర్వ రక్షకుడగు విష్ణుమూర్తిని పూజించి సమస్త ధర్మములను గొప్పనైన కీర్తినీ వరముగా పొందినవాడు మూర్తుడు. ఆతడు బ్రహ్మదేవునిచే విష్ణుమాయచే మోహితుడగుచున్నాడు.
పర్వప్రకృతిస్వరూపిణి, ఈశ్వరియైన విష్ణుమాయ ఎవరిని అనుగ్రహించునో అతనికి విష్ణుమంత్రమును ఉపదేశించును.
ధర్మదేవతను సేవించినవాడు సమస్త ధర్మాచరణవలన కలుగు ఫలితమును, ఇహలోకసుఖముమ, ఆటుపిమ్మట వైకుంఠమును పొందును.
ఆయా దేవతలను భక్తితో సేవించి, తొలుత తదనుగ్రహమును పొందును. ఆయా దేవతాసారూప్యముమ కూడ పొంది కాలక్రమమున ఆయా దేవతలతో పాటు విష్ణమూర్తి యొక్క సాన్నిధ్యమును పొందును.
నిర్గుణస్వరూపుడు, ప్రకృతికి అతీతుడు, బ్రహ్మాదులచే సేవింపబడువాడు, సర్వకారణుడు, పరాత్పరుడు, క్షరుడు కానివాడు (వాశనములేక వ్యష్టి సమష్టి రూపమున నున్న పంప్రకృతి) పరబ్రహ్మస్వరూపుడు, భగవంతుడు, సనాతనుడు, పాకార నిరాకార స్వరూపుడు, జ్యోతిస్వరూపుడు, స్వేచ్ఛామయుడు, అన్నిటికి ఆధారభూతుడు, సర్వేశుడు, పరమానందరూపుడు, ఈశ్వరుడు, విర్లిపుడు, సర్వసాక్షి, భక్తులవనుగ్రహించు శ్రీకృష్ణుని సేవించు విద్వాంసుడు ఆ భగవంతునినుండి ఎట్టి పరమును కోరడు. అతడే జీవమ్మక్తుడు. అతడు సాలోక్య పారూప్య, పామీప్య, సాయుజ్యములను చతుర్విధముక్తులను తుచ్చముగా భావించి ఐశ్వర్యమును మట్టిగడ్డతో సమానముగ అశాశ్వతముగా తలచుము. అట్లే ఇంద్రత్వమును, మమత్వమును, చిరంజీవిత్వమును, నీటిబుడగవలె ఆతీ తుచ్ఛముగా తలంచును.
ఆతడు కలలోనైనా జాగ్రదావస్థలోనూ ఎల్లప్పుడు శ్రీహరి పేవనే కోరుకొనును. శ్రీహరి దాస్యము తప్ప ఇతరమైన దానినెప్పుడు కోరుకొవడు. శ్రీకృష్ణపదాబ్జములయందు దృఢమైన భక్తిని కలిగి పరిపూర్ణమైన పరబ్రహ్మమును సేవించుమ. అట్టివాడు తన వంశమునందు పుట్టిన కోటిమందిని, మాతామహుని ఇంటికి, మామగారి ఇంటికి చెందిన వందతరములను, తన భార్యా పుత్రులను, ఇంటిలోని దాస దాసీజనమును అందరిని ఉద్ధరించి గోలోకమునకు తప్పక వెళ్ళును.
శ్రీకృష్ణుని భజించనంతవరకు గర్భవాపము, యమయాతనలు, గృహస్థుగా ఉండుట, భోగములనర్జించుట అమనవి ఉండును. ఆచార్యుని ద్వారా విష్ణుమంత్రం ఎవరి చెవిలో పడునో ఆతని నోసటిరాతను భయములో యముడు దూరము చేయును. బ్రహ్మదేవుడు ముందుగనే అతని గురించి మధుపర్కాదికమును సిద్దము చేయును, ఇంకన అతడు బ్రహ్మయొక్క కళ్ళముందే గోలోకమునకు వెళ్ళుటను గమవీంచీ ఇతడు లోకమును దాటి పోవుచున్నాడని బాధపడును.
ఆ శ్రీకృష్ణభక్తునకు నూరుకోట్ల కల్పములకైనా ప్రాయశ్చిత్తముయొక్క అవసరముండదు. కోటి జన్మలలో చేసిన పాపములైనా గరుత్మంతుని చూచిన సర్పములవలె వెంటనే పారిపోగలవు, పూర్వజన్మలలో చేసిన శుభాశుభకర్మలను శ్రీకృష్ణుడు తన చక్రధారలచే చీల్చును. జరామృత్యువులు శ్రీకృష్ణుని చక్రమునకు భయపడిపోవును. లేనిచో సుదర్శన చక్రము వాటిని శతఖండములుగా చేయును. ఆభక్తుడు మానవశరీరమును వదలి దివ్య శరీరమును ధరించి శ్రీకృష్ణుని సేవించుటకు గోలోకమునకు వెళ్ళును. శ్రీకృష్ణుడు ఎంతవరకు గోలోకమున ఉండునో శ్రీకృష్ణభక్తుడు అచ్చట ఆంతవరకుండును. అతడు బ్రహ్మ దేవుని వయస్పును క్షణికమైనదని తలచుసు.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే బ్రహ్మఖండే సౌతి శౌనకసంవాదే విష్ణుమాలావతీ సంవాదో నామ చతుర్దశోఽధ్యాయః |
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున సౌతి శౌనక సంవాద రూపమైన బ్రహ్మ ఖండమున విష్ణమాలావతీ సంవాదమను పదునాలుగవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 14 of the Brahma Vaivarta Mahā Purana - Brahma Khaṇḍa is as follows:
Moved by the extraordinary grief and unshakeable chastity of Mālatī, who sat vigil beside the lifeless body of Upabarhaṇa, the Supreme Lord Śrī Vishṇu assumed the charming form of a radiant young Brāhmaṇa boy and approached her in the forest. With gentle words full of profound spiritual wisdom, the divine boy sought to solace her grieving heart by expounding upon the temporary nature of all material relationships, the inevitability of death for embodied beings, and the inescapable law of Karma. He counseled her to look beyond mortal attachment and place her ultimate faith in the eternal, unchanging protection of Lord Śrī Kṛshṇa, who alone is the true soul and eternal companion of every living entity.