సౌతిరువాచ- సౌత్ మహర్షి ఇట్లు పలికినాడు.
తరువాత బ్రహ్మదేవుడు మిగిలిన పుత్రులను సృష్టి చేయమని ఆజ్ఞాపించెను. నారదుడు తప్ప మిగిలిన అతని పుత్రులు సృష్టి చేయుటకు మొదలు పెట్టిరి.
మరీచి మహర్షి యొక్క మనస్సునుండి కశ్యపప్రజాపతి, అత్రిమహర్షి నేత్రమలము క్షీరసముద్రమున పడగా అందులోనుండి చంద్రుడు, ప్రచేతసునీ యొక్క మనస్సునుండి గౌతమ మహర్షి, పులస్త్యుని మనస్సునుండి మైత్రావరుణుడు ఉద్భవించిరి. మనువునకు ఆతని భార్యయైన శతరూపయందు ముగ్గురు కన్యలు ఉద్భవించిరి. వారి పేర్లు ఆకూతి, దేవహూతి ప్రసూతి. ఇంకను ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను ఇద్దరు కొడుకులు కలిగిరి. ఉత్తానపాదునీ పుత్రుడు పరమధార్మికుడైన ధ్రువుడు. మనువు తన కూతురైన ఆకూతిని రుచియనువానీకిచ్చెను. దక్షునికి ప్రసూతినీ, కర్ణమునకు దేవహూతి నొసగెను. వారీపుత్రుడు కపిలమహర్షి. దక్ష ప్రజాపతివలన ప్రసూతికి ఆరువది కన్యకలు పుట్టిరి. వారిలో ఎనమండుగురిని ధర్మునకు, రుద్రునకు పదకొండుమందిని, కశ్యపమహర్షికి పదముగ్గురినీ, చంద్రునకు ఇరువది ఏడుమందినీ, శివునకు సతియను కన్యను భార్యగా నిచ్చెను.
ధర్ముని భార్యల పేర్లు వరుసగా శాంతి, పుష్టి ధృతి, తుష్టి క్షమ. శ్రద్ధ, మతి, స్మతి. శాంతీ పుత్రుడు సంతోషుడు, పుష్టి కొడుకు మహాన్, ధృతికి ధైర్యుడు, తుష్టీకి హర్షదర్పులనే పుత్రులు క్షమకు సహిష్ణువు, శ్రద్ధకు ధార్మికుడు, మతికి జ్ఞానుడు, స్మృతికి జాతిస్మరుడు, ధర్మునీ మొదటిభార్యయైన మూర్తికి నరనారాయణులను ఋషులు ఉద్భవించిరి.
కళ, కళావతి, కాషా, కాళికా, కలహప్రియా, కందళీ, భీషణా, రాస్నా, ప్రమోచ, భూషణ శుకి ఆనువారు ఏకాదశ రుద్రుల భార్యలు. వీరికి కలిగిన పుత్రులంతా శివునికి అనుచరులైరి.
శివుని భార్యయైనసతి తండ్రియైన దక్షుడు, చేసిన యజ్ఞములో తన భర్తకు జరిగిన నిందను భరించలేక శరీరమున వదలి తరువాతి జన్మలో హిమవత్పర్వతమునకు కూతురుగా పుట్టి శంకరుని భార్యగా నయ్యెను.
కశ్యపునికి దేవతల తల్లియైన ఆదితి, దైత్యులకు తల్లియైన దితి, సర్పములకు తల్లియగు కద్రువ, పక్షులకు తల్లియైన వినత, గోవులకు, మహిషములకు మాతయైన సురభి, సారమేయములు మొదలగు చతుష్పాద జంతువులకు తల్లియైన సరమ, దానవులకు తల్లియైన దనువు మొదలైన భార్యలున్నోరు.
ఇంద్రుడు, ద్వాదశాదిత్యులు ఉపేంద్రుడు మొదలైన దేవతలు ఆదితిపుత్రులు. ఇంద్రునియొక్క కొడుకు జయంతుడు. ఇతడు శచీదేవియందు కలిగెను. ఆదిత్యునికి విశ్వకర్మకూతురైన సవర్ణయందు శని, యముడు, అనుకొడుకులు కాళింది అనుకూతురుపుట్టెను.
శౌనక ఉవాచ- శానకమహర్షి ఇట్లనెను.
సూతమహర్షీ! ఉపేంద్రునకు భూమియందు బలపరాక్రమశాలియైన మంగళు డేవిధముగా పుట్టెనో నాకు చక్కగా వివరింపుము.
సౌతిరువాచ- సౌతిమహర్షి ఇట్లు చెప్పెను.
ఉపేంద్రుని సుందర రూపమును చూచి భూదేవి మోహించి ప్రౌఢ వయస్సుగల సుందరీ రూపమును ధరించి జనరహితమైన అందమైన చందన వృక్షములతో విరాజిల్లే మలయ పర్వత ప్రాంతమున తన సర్వావయవములపై చందనము. పూసికొని మంచి రత్న భూషణములలో చిరునవ్వుతో పరుపుపై పడుకొని ఉన్న ఉపేంద్రుని సమీపించి, అతని శయ్యపై కూర్చుండి ఆందముగా నున్న మాలతీ మాలను. ఉపేంద్రుని మెడలో వేసెను. అట్టే కస్తూరీ కుంకుమలతో నున్న చందనమును అతనికి అద్దినది. ఉపేంద్రుడు భూదేవి మనస్సును గుర్తించి అనేక విధములైన శృంగార చేష్టలు చేసెను. శ్రీహరి శరీరము తగిలి బీజావాపము జరుగగా ఆమె మూర్చను పొందినది. నిద్రపోయినట్లు ఆమె మైమరిచినది. ఉపేంద్రుడు సుఖసంభోగపీడిత, సస్మితయైన భూదేవిని క్షణకాలము అక్కున చేర్చుకొని ఆమెను ముద్దులాడి వెళ్ళిపోయెను.
ఆకాశమార్గములో పోతున్న ఊర్వశీ మలయపర్వత ప్రాంతమున పడియున్న భూదేవిని తట్టిలేపి ఆమె వృత్తాంతమును అడిగి తెలుసుకో సను, ఆ భూదేవి ఉపేంద్రుని వీర్యమును భరించలేక పగడాల చీప్పలో ఆ వీర్యమునుంచెను. అందువల్లనే నారాయణుని పుత్రుడైన కుబాడు తేజస్సున సూర్యునివంటివాడై పగడపు కాంతిని కల్గియుండెను.
ఆ మంగళునకు భార్యని మేధ. వారిద్దరికి మిక్కిలి తేజస్సుకలవాడు, విష్ణుమూర్తీతో సమానమైన, ఘంటేశ్వరుడు కలిగెను.
దితికి హరణ్యకశిపు, హిరణ్యాక్షులను ఇద్దరు కొడుకులు, సింహిక అనుకూతురు పుట్టినది, నిర్ఋతి సింహికల పుత్రుడు సైఋతుడు, సైంహికేయుడు అనే పేర్లు గల రాహువు. ఇక హిరణ్యాక్షుడు ఆదివరాహ మూర్తిచేత సంతానము కలుగక ముందే చంపబడినాడు. హిరణ్యకశిపునకు వైష్ణవులలో శ్రేష్టుడైన ప్రహ్లాదుడు, ఆతనికి విరోచనుడు, విరోచనునకు బలి చక్రవర్తి, అతనికి మహాజ్ఞాని, శంకరుని సేవకుడైన మహాయోగి పుత్రుడు.
ఇది దితివంశము, కద్రూవంశమును ఇప్పుడు చెప్పుచున్నాను.
కద్రువుకు అనంతుడు, వాసుకి, కాళియుడు. ధనంజయుడు, కర్కోటకుడు, తక్షకుడు, పద్మము, ఐరావతము, మహాపద్మము, శంకు, శంఖుడు, సంవరణుడు, ధృతరాష్ట్రుడు, దుర్ణరుడు, దుర్జయుడు, దుర్ముఖుడు, గోక్షుడు, గోకార్ముకుడు, విరూపాక్షుడు మొదలైనవారు కొడుకులు. కూతురు మహాతపస్విని, లక్ష్మీదేవి అంశమునుండి పుట్టిన మనసాదేవి. ఈమె భర్త నారాయణుని కులమున పుట్టిన జరత్కారువు, వీరి పుత్రుడు ఆస్తీక మహాముని.
కద్రూ పుత్రుల పేర్లు విన్నంత మాత్రమున సర్పభయం తొలిగిపోతుంది. ఇక ఏనత యొక్క వంశమున పుట్టిన వారి పేర్లు వినుము.
వినతకు విష్ణుమూర్తితో సమానమైన తేజస్సుకల గరుత్మంతుడు, ఆరుణి అను కొడుకులు కలిగిరి. వీరివలన క్రమముగా తక్కిన పక్షిజాతులన్ని కలిగినవి.
గోవులు, మహిషములు సురభి వంశములో పుట్టినవి. సారమేయములన్నీ సరమవంశములో పుట్టినవి. దనువు యొక్క వంశములో దానవులు పుట్టినారు. ఇవి కాశ్యపవంశములో ఉన్నవారి పేర్లు, ఇక చంద్రుని సంబంధించిన కథను ఓ శౌనకమునీ! వినుము.
చంద్రుని భార్యల పేర్లు వరుసగా ఆశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష మఖ, పూర్వఫల్గుణి, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ఠ మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అనువారు. వారిలో రోహిణి మిక్కిలి అందగత్తె, రసికురాలు. ఆమె తన శృంగార చేష్టలతో చంద్రుని వశము చేసికొన్నది. రోహిణి ఇంటికి వెళ్ళిన చంద్రుడు ఇతర భార్యల ఇళ్ళకు వెళ్ళేవాడు కాడు. అందువలన రోహిణి తప్ప మిగిలిన ఆక్కచెల్లెండ్లందరు తండ్రి దగ్గరకు వెళ్ళి చావు కంటే గొప్పదైన సవతిబాధను చెప్పుకొనిరి. అందువల్ల దక్షుడు కోపముతో చంద్రుని మంత్రపూర్వకముగా శపించెను. దక్ష శాపమునకు భయపడి పరుగెత్తిన చంద్రునికి క్షయ వ్యాధి సంప్రాప్తించేను. ఆ క్షయవ్యాధివల్ల ప్రతిదినము చంద్రుడు క్షీణించుచు దు:ఖితుడాయెను. తనయొక్క సగము శరీరము క్షీణించగా శంకరునీ ఆతడు శరణువేడెను. శంకరుడు బాధలలో ఉండి తనను శరణుపొందిన చంద్రుని చూచి డయలో అభయమతనీకి నిచ్చెను. శంకరుడాతని క్షయ రోగ ముక్తుని గావించి తనకపోలస్థలమున స్థలము నీచ్చెను. చంద్రుడు శివుని ఆనుగ్రహము వలన ఆమరుడై భయవిముక్తుడు కాగా శివుని తలపై నుండెను. ఇట్లు చంద్రుడు తలపై ఆభరణముగా ఉన్నందువలన శివుడు చంద్రశేఖరుడాయెను. సమస్త దేవతలలో, సమస్తలోకములలో శివునివలె శరణు కోరిన వారిని రక్షించువాడెవడు లేడు.
దక్షకన్యలు తమ భర్తముక్తుడాయెనని మరల ఏడ్చుచు మహాతేజస్వి. తండ్రియైన దక్షుని దగ్గరకు వెళ్ళి మాటిమాటికి రొమ్ము కొట్టుకొనుచు పెద్దగా దుఃఖించిరి. అట్లే దైన్యము కల ఆ దక్షకన్యలు దీనుల రక్షించువాడు, బ్రహ్మదేవుని పుత్రుడైన దక్షునితో ఈవిధముగా అనిరి.
దక్షకాన్య ఊచుః – దక్షకన్యలిట్లనిరి
తండ్రీ! భర్త్రు సౌభాగ్యము కలిగి ఉండుడని ఇంతకుముందు నీవే మమ్ములనాశీర్వదించితివి. ఇప్పుడు మంచి గుణములు కల మా భర్త మానుండి దూరమైనాడు, కళ్ళు ఉంటేనే ప్రపంచము చీకటిగా ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. ఆటే మాకు ఇప్పుడు భర్త యొక్క ప్రాధాన్యము తెలిసినది. స్త్రీలకు భర్త కంటివంటివాడు. అతడే ఆధారము, ప్రాణములు, సంపద. ఈ సంసారమనే సముద్రములో సేతువువంటివాడు. ధర్మర్థ కామ మోక్షములను చతుర్వర్గములు పొందుటకు భర్తయే కారణము. అతడే స్త్రీలకు నారాయణుడు. వ్రతము, సనాతన ధర్మము. భర్త అంటే పడనివారికి వారు చేసిన సమస్త కర్మములు వృథా కాగలవు. సమస్త పుణ్యతీర్థములలో చేసిన స్నానములు, సమస్తయజ్ఞములలో ఇచ్చిన దక్షిణలు, సమస్త దానములు, సమస్త పుణ్యములు, సమస్త వ్రతములు, అన్నీ విధములైన నీయమములు, భగవదర్చన, ఉపవాసదీక్షలు, అన్ని విధములైన తపస్సులు భర్త పాద సేవయొక్క పదునారవ కళకు సమాసము కావు. బంధువులందరికి ఇష్టమైనవాడు ఐన కుమారుడు భర్తయొక్క ఆంశస్వరూపము, అందువలన భర్త నూరుగురు పుత్రులకంటే గొప్పవాడు. మంచి కులములో పుట్టని స్త్రీ భర్తను ద్వేషించును. ఆమె మనస్సు ఎప్పుడు చంచలమై, పరపురుషుని యందు నిమగ్నమై యుండును. భర్త మంచివాడైనా, చెడ్డవాడైనా పతీతుడైనా, రోగియైనా, దుష్టుడైనా, ధనహీనుడైనా, యువకుడైనా, ముసలివాడైనా పతివ్రతయైన స్త్రీ అతనిని వదలివేయదు. అటువంటి భర్తను ఏ స్త్రీ అయితే ద్వేషించునో, వదలివేయునో ఆ స్త్రీ సూర్యచంద్రులున్నంతవరకు నరకముననుండును. అచ్చట శునకములంత ఎత్తైన కీటకములు ఆమెను రాత్రింబగళ్ళు తినుచుండును. ఆమె చనిపోయిన వారి వసను, మాంసమును తింటూ దప్పిచే మూత్రము త్రాగును. తరువాత వేయికోట్ల జన్మలు గద్దగాను, వందజన్మలు పందిగాను, వందజన్మలు పులిగాను ఆతరువాత పూర్వసుకృతమువలన మానవ జన్మనెత్తినా విధవగానో, బీదస్త్రీగానో, రోగముతో బాధపడుతూనో ఉండును,
అందువలన బ్రహ్మ దేవుని పుత్రుడైన ఓతండ్రీ! నీవు మాకామమును దీర్చు భర్భదానమును చేయుము. నీవు బ్రహ్మదేవునివలె సృష్టించుటకు, రక్షించుటకు, మరల సృష్టించుటకు సమర్థుడవు. ఈవిధముగా తనను వేడుకొనుచున్న పుత్రికల మాటలు విని దక్షప్రజాపతి శంకరుని సన్నిధికేగెను. శంకరుడు దక్షుని చూడగానే లేచి నమస్కరించెను. దక్షుడు తనకన్నా వయస్సులో చిన్నవాడు, అల్లుడు ఐన శంకరునికి ఆశీస్సులిచ్చి, తన పూర్వకోపమును వదిలి పెట్టి తనకు నమస్కరిస్తున్న శివునితో ఈ విధముగా అనెను.
ఓశంభూ! నాకు మిక్కిలి ప్రియమైన వాడు, నా పుత్రికలకు ప్రాణములకన్న మిన్నయైన వారి భర్త, నాఆల్లుడు ఐన చంద్రుని నాకిచ్చివేయుము. లేకపోయినచో నేను నీకు భయంకరమైన శాపము నిత్తును. ఎవరు కూడా దీనిని తప్పించలేరు. దక్షుని ఈ మాటలు కృపానిధి, శరణాగత రక్షకుడైన శంకరుడు విని ఆమృతముకంటె చల్లనైన మాటలు పల్కెను.
శివ ఉవాచ - శివుడిట్లు పల్కెను.
దక్షుడా! నీవు నన్ను భస్మము చేసినా, లేక నాకు శాపము పెట్టినా శరణాగతుడైన చంద్రుని మాత్రము వదిలి పెట్టలేను, శివుని ఈ మాటలు విని దక్షుడు కోపముతో శపించబోయెను. శంకరుడప్పుడు ఆపదలనుండి తప్పించు విష్ణుమూర్తిని మనస్సులో తలచెను. అందువలన విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ వేషమున శివదక్ష ప్రజాపతుల దగ్గరికి రాగా వారిద్దరు వృద్ధ బ్రాహ్మణ వేషమున నున్న గోవిందునికి నమస్కరించిరి, విష్ణుమూర్తి వారిరువురరకు శుభాశీస్సులొసగి శంకరునితో ఈ విధముగా ఆనెను.
శ్రీ భగవానువాచ - భగవంతుడైన హరి ఇట్లనెను.
శంకరుడా తనకంటే ప్రియమైన వస్తువు సమస్త బంధువు లయందెచ్చట కనిపించదు. అందువలన నిన్ను నీవు రక్షించుకోని చంద్రుని దక్షునికి ఇచ్చివేయుము, వీపు తపస్సు చేయువారీలో ఉత్తముడవు, శాంతుడు, విష్ణుభక్తులలో శ్రేష్టుడవు, హింస; కోపము వదలి సమస్త జీవులయందు సమానముగా ఉన్న వాడవు. దక్షుడు ముక్కోపి, దుష్టుడు, తేజస్పి, బ్రహ్మయొక్క పుత్రుడు. మంచివాడు చెడ్డవానికి భయపడును కాని చెడ్డవాడు ఆట్లు కాదుకదా! నారాయణుని యొక్క ఈ మాటలు విని శంకరుడు నవ్వుచు నీతిసారము నీతిబీజము ఐన మాటలీట్లు పలికెను.
శంకర ఉవాచ - శంకరుడిట్లు పలికెను.
నేను నాతపఃఫలితమునిచ్చెదను. నాతేజస్సును, నాసర్వసిద్దులను, సంపదను, చివరకు ప్రాణములనైన ఇచ్చెదను కానీ శరణాగతుడైన వానిని వదలుకోలేను. ఎవరైతే భయపడి శరణాగతుడైనవానిని ఇతరులకిస్తారో వారిని ధర్మము భయంకరమైన శాపమునిచ్చి అతనిని వదలివేయును. నేను అన్నిటిని వదులుకొందును కానీ నా ధర్మమును మాత్రము వదలి పెట్టలేను. స్వధర్మమును వదలుకొనిన వాడు సర్వధర్మ బహిష్కృతుడు కాగలడు. ఎవరు తన ధర్మమును. ఎల్లప్పుడు రక్షించుకొనునో ఆతనినది సర్వదా రక్షించును. వేదేశ్వర ! నీవు నీమాయచే నాకు ధర్మవిరుద్ధమైన దానిని చెప్పుచున్నావు. నీవు అన్నిటికి కారకుడవు, సృష్టిచేయువాడవు, రక్షించువాడవు, నశింపచేయువాడవు. నీపై భక్తి ఎవనికి దృడముగానుండునో ఆతనికి భయమెక్కడిదీ. శంకరునిమాటలు సర్వభావములు తెలిపిన భగవంతుడు ఏవి శంకరుని శిరస్సుపై నున్న చంద్రుని నుండి చంద్రుని పేరు చేసి దక్షునకు ఇచ్చివేసెను. క్షయవ్యాధి రహితుడైన చంద్రుడు శివుని శిరస్సుపై నుండెను. వ్యాధి సహితుడైన చంద్రుని విష్ణుమూర్తి ఈయగా దక్షుడు సంతోషించి అతనిని స్తుతించెను. విష్ణుమూర్తి చంద్రుడు ఒక పక్షములో క్రమముగా సంపూర్ణుడగునట్లు, ఇంకొక పక్షములో క్షీణించునట్లు చేసి వారి కందరికి వరములిచ్చి తన గోలోకమునకు తిరిగిపోయెను. దక్షప్రజాపతి హరి తనకు ఇచ్చిన చంద్రుని తీసికొని తన కూతుళ్ళకు మరల అప్పగించెను. చంద్రుడు నాటినుండి తన భార్యలందరితో కలిసి మెలిసి తిరుగుచు అందరిపై సమాన దృష్టిలో ఉండెను.
ఓ శౌనకమహర్షీ! ఈ విధముగా నాకు గురువైన వేదవ్యాసుడు పుష్కర క్షేత్రములో నున్న మునుల సభలో శ్రుష్ఠి క్రమమున కొంత భాగమును నీకు చెప్పితిని.
శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణములో సౌతి శౌనక సంవాదమను బ్రహ్మఖండమున తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 9 of the Brahma Vaivarta Mahā Purana - Brahma Khaṇḍa is as follows:
In order to fulfill the cosmic mandate of populating the universe after Maharshi Nārada's detachment, Maharshi Daksha produced sixty virtuous daughters through his ascetic vows and mind-born potencies. These noble daughters were given in sacred marriage to the great progenitor sages, including Maharshi Kashyapa, Maharshi Dharma, Maharshi Chandra, and Maharshi Angiras. Through these divine unions, an extraordinary variety of living entities was born into the material world, including the Devas, Asuras, Nagas, celestial musicians, birds, beasts, trees, and human beings, thereby expanding the intricate web of living entities across all continents, oceans, and subtle dimensional realms under the watchful direction of the Supreme Lord.