శ్రీ మద్భాగవతము - ప్రధమ (1వ) స్కందము

14 -  చతుర్దశోఽధ్యాయః

సూతుడు ఇట్లు పలికేను: బంధువులను చూచుటకు మరియు శ్రీకృష్ణుని కార్యకలాపములను గురించి తెలుసుకొనుటకు అర్జునుడు ద్వార కకు వెళ్లి కొన్ని నెలలు గడచినవి. కాని, ఆతడు ఇంకనూ తిరిగి రాలేదు. ఇంతలో కురువంశశ్రేష్ఠుడగు ధర్మరాజునకు భయంకరమగు ఆకారము గల ఉత్పాతములు కానవచ్చినవి.

ఋతుధర్మములు తల్లక్రిందులు అగుటచే కొలము భయమును గొల్పుచుండెను. కోపము, పిసినారితనము మరియు అసత్యము అను వాటితో నిండిన హృదయములు గల జనులు బ్రతుకు తెరువు కొరకై పాప ములను చేయుచుండిరి. వ్యవహారమంతయు మోసపూరితముగా నుండే ను. మిత్రులు కూడ పరస్పరము వంచించు కొనుచుండిరి. తల్లి, తండ్రి, మిత్రుడు, సోదరుడు, భార్య మరియు భర్త అను వారలు ఒకరితో నొకరు కలహించు కొనుచుండిరి. కలికాలము రోగానే మానవుల స్వభావములో లోభము మొదలగు దుర్గుణములు ప్రవేశించేను. అనేకములగు ఉత్పాతములు కనబడుచుండెను. దీనినంతనూ గమనించిన ధర్మరాజు సోదరడగు భీషునితో నీట్లనెను.

            ధర్మరాజు ఇట్లు పలికెను: అర్జునుడు బంధువులను చూచుటకు, పవిత్రమగు కీర్తి గల శ్రీకృష్ణుని కార్యకలాపములను తెలుసుకొనుటకు ద్వారకకు పంపబడినాడు. ఆతడు వెళ్లి ఇప్పటికి ఏడు నెలలు అయినది. ఓ భీమసేనా! అయిననూ, ఆతడు ఇంకనూ రాకున్నాడు. కారణమేమియో నాకు స్పష్టముగా తెలియుట లేదు.

            శ్రీకృష్ణుడు తన లీలలను ప్రకటించుటకై స్వీకరించిన దేహమును దేవకార్యము పూర్తి అయిన పిదప విడిచి పెట్టునని నారదమహర్షి చెప్పి యున్నాడు. అట్టి సమయము వచ్చినదా యేమి?

మనకు సంపదలు, రాజ్యము, భార్య, ప్రాణములు, వంశము, పిల్ల లు మరియు శత్రువులపై విజయము శ్రీకృష్ణుని వలన మాత్రమే కలిగినవి. మనకు పుణ్యలోకములు కూడ ఆయన వలన మాత్రమే సిద్ధించును.

ఓ మనుష్యశ్రేష్ఠా! శరీరమునందు, భూమియందు, ద్యులోకము నందు కూడ అనేకములగు భయమును గొల్పే ఉత్పాతములు కానవచ్చు చున్నవి. ఇవి మనకు తొందరలో రాబోయే భయమును సూచించుచున్నవి. ఆ భయము మన బుద్ధిని మోహ పెట్టును, వాటిని గమనించుము.

ఓయీ! నాకు మాటిమాటికీ తొడలు. కన్నులు చేతులు అదురుచున్నవి. హృదయమునందు వణుకు పుట్టుచున్నది. ఈ లక్షణములు తొందరలో విపత్తును కలిగించును.

ఓ భీమా! ఆడునక్క నోటినుండి నిప్పులను గ్రక్కుతూ ఉదయించే సూర్యుని వైపు తిరిగి కూయుచున్నది. ఈ కుక్క భయము లేనిదాని వలె నావైపు తిరిగి మొరుగుచున్నది.

ఓ పురుషశ్రేష్టా! గోవులు మొదలగు ప్రశస్తములగు పశువులు నేను ఎడమ వైపు ఉండునట్లు, ఇతరములగు పశువులు నేను కుడివైపు ఉండునట్లు నడుచుచున్నవి. నా గుర్రములు ఏడ్చుచుండగా నేను చూచితిని.

ఈ పావురము మరణదేవతయొక్క దూత (మరణమును సూచించుచున్నది). ఒక గుడ్లగూబ, దానికి ఎదురుగా మరియొక గుడ్లగూబ నిద్రను వీడి కర్ణకఠోరముగా కూయుచూ జగత్తు వినాశమగుటను కాంక్షించు చున్నవి.

ధూళితో నిండిన దిక్కులు ఈ లోకమును కప్పివేయుచున్నవి. సూర్యచంద్రుల చుట్టూ మండలములు ఏర్పడుచున్నవి. పర్వతములతో సహా భూమి కంపించుచున్నది. మేఘములు లేకుండగనే గర్జనలతో కూడిన పెద్ద పిడుగు పడినది.

కఠినమగు స్పర్శ గల వాయువు ధూళిని రేగగొట్టి దట్టని చీకటిని కలిగించుచున్నది. మేఘములు రక్తమును వర్ణిస్తూ అంతటా బీభత్సమును సృష్టించుచున్నవి.

సూర్యుడు కాంతిని కోల్పోయినోడు. ఆకాశములో గ్రహములు ఒకదానితో నొకటి ఢీకొనుచున్నవి. చూడుము. ద్యులోకభూలోకములు భూతగణములతో క్రిక్కిరిసి మండుచున్నవా యన్నట్లు ఉన్నవి.

అన్ని రకముల చిన్న పెద్ద నదులు సరస్సులు మరియు జనుల మనస్సులు అల్లకల్లోలముగా నున్నవి. నేయిని వేసిననూ అగ్ని ప్రజ్వరి ల్లుట లేదు. ఈ కాలము ఏమి ముప్పును తేనున్నదో?

దూడలు పాలను త్రాగుట లేదు. ఆవులు పాలను ఇచ్చుట లేదు. ఆవులు కన్నుల వెంబడి నీటిని స్రవిస్తూ ఏడ్చుచున్నవి. గొల్లపల్లెలో ఎద్దులు ఉల్లాసముగా లేవు.

దేవతాప్రతిమలు ఏడ్చుచున్నట్లున్నవి. అవి చెమరుస్తూ ఎగిరి పడుచున్నవి. ఈ రాజ్యములు, గ్రామములు, నగరములు, ఉద్యానవనములు, గనులు, ఆశ్రమములు నశించిన శోభ గలవై ఆనందవిహీనముగా నున్నవి. ఇవి మనకు ఏమి దుఃఖమును సూచించుచున్నవి?

ఈ పెద్ద ఉత్పాతములను బట్టి, ఈ భూమి నశించిన సౌభాగ్యము గలదియై, ఇతరపురుషులలో లేని శోభ గల శ్రీకృష్ణభగవానుని పాద . చిహ్నము లకు నిశ్చయముగా దూరము కానున్నదని తలంచెదను.

ఉత్పాతములను చూచుటచే కల్లోలితమైన మనస్సుతో ధర్మరాజు ఈ విధముగా చింతిల్లుచుండగా, ద్వారకానగరమునుండి అర్జునుడు తిరిగి వచ్చెను.

అర్జునుడు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధముగా దుఃఖిస్తూ వచ్చి అన్నగారి పాదములపై పడేను. ఆతడు ముఖమును క్రిందకు దించు కోని, పద్మములవంటి కన్నులనుండి నీటి బిందువులను విడుచుచుండెను. ఈ విధముగా కాంతివిహీనుడై యున్న తమ్ముని చూచి, ధర్మరాజు ఉద్వేగ ముతో నిండిన హృదయము గలవాడై, నారదుని వచనములను స్మరిస్తూ, మిత్రుల యెదుటనే అర్జునుని ఈ విధముగా ప్రశ్నించెను.

ధర్మరాజు ఇట్లు పలికెను: ద్వారకానగరములో మన బంధువులగు మధు, భోజ, దశార్హ, ఆర, సాత్వత, అంధక, వృష్టి వంశములకు చెందిన యాదవులు సుఖముగా నున్నారా?

మన అమ్మగారీ తండ్రి, పూజనీయుడు అగు శూరసేనుడు కులా సాయేనా? వసుదేవుడు మామయ్య, ఆయన సోదరుడు కుశలముగా నున్నారా?

ఆయన భార్యలగు దేవకీదేవి మొదలైన ఏడురు అప్పచెల్లెళ్లు, వారి కొడుకులు, కోడళ్లు అందరు కుశలముగా నున్నారా?

ఉగ్రసేన మహారాజు కుశలమేనా? దుష్టుడగు కంసుడు మరణిం చుటచే ఆయన పుత్రుడు లేనివాడైనాడు. ఆయన సోదరుడగు దేవకుడు జీవించియే యున్నాడా? హృదీకుడు, ఆయన పుత్రుడగు కృతవర్మ, అక్రూ రుడు, శ్రీకృష్ణుని సోదరులగు జయంతుడు, గదుడు, సారణుడు కుశల మేనా?

శత్రుజిత్తు మొదలగు యాదవవీరులు కుశలమేనా? యాదవప్రభువు, పూజనీయుడు అగు బలరాముడు క్షేమమేనా?

వృష్టివంశస్థులందరిలో గొప్ప రథికుడగు ప్రద్యుమ్నుడు కులాసా యేనా? యుద్ధములో గొప్ప వేగమును ప్రదర్శించే పూజనీయుడగు అని రుద్ధుడు ఆనందముగా నున్నాడా?

సుషేణుడు, చారుదేష్ణుడు, జాంబవతియొక్క పుత్రుడగు సాంబుడు, ఋషభుడు మొదలగు శ్రీకృష్ణపుత్రులలో ప్రముఖమైనవారు, వారి సంతానము, శ్రీకృష్ణుని అనుచరులగు శ్రుతదేవుడు ఉద్దవుడు మొదలగు వారు, సునందుడు నందుడు మొదలగు యాదవప్రముఖులు, బలరామశ్రీ కృష్ణుల భుజబలమును ఆశ్రయించుకొని ఉండే అందరు కులాసాగా నున్నారా? వారికి మనయందు ప్రేమ మెండు. మన క్షేమమును వారు అర యుచున్నారా?

బ్రహ్మవేత్తలయందు, భక్తులయందు ప్రీతిగల శ్రీకృష్ణభగవానుడు కూడా ద్వారకానగరమునందు సుధర్మ అనే రాజసభలో మిత్రులతో గూడి సుఖముగా నున్నాడా?

అనంతుడు (బలరాముడు) తోడుగా గల శ్రీమన్నారాయణుడు లోకముల మంగళమును, క్షేమమును మరియు సమృద్ధిని సంపాదించు టకై క్షీరసముద్రమునుండి యదువంశమనే సముద్రములోనికి శ్రీకృష్ణరూపములో అవతరించి యున్నాడు.

శ్రీకృష్ణుని దృఢమగు బాహువులచే రక్షించబడే ద్వారకానగరము నందు నివసించే యాదవులు సర్వలోకసమ్మాన్యులై శ్రీమహావిష్ణువు యొక్క పార్షదుల వలె మహానందముతో విహరించుచున్నారు.

సత్యభామ మొదలగు పదునార వేల యువతులు కేవలము ఆయన పాదపద్మముల సేవ మాత్రమే ప్రముఖకర్తవ్యముగా గలవారై, ఆ బలముచే యుద్దమునందు దేవతలను జయించి, ఇంద్రుని ప్రియురాలగు శచీదేవి అనుభవించ దగిన పారిజాతము మొదలైన దేవభోగములను తమ స్వంతము చేసుకొనుచున్నారు.

శ్రీకృష్ణుని దృఢమగు బాహువుల ప్రభావమును ఆశ్రయించుకొని జీవించే యాదవవీరులు దేనికీ భయపడని వారై, ఇంద్రుడు మొదలగు లోక పాలకులు కూర్చుండ దగినది, బలాత్కారముగా తీసుకు రాబడినది అగు సుధర్మ అనే సభలో మామూలుగా ఇటునటు నడచు చుందురు.

వత్సా! నీవు కుశలమేనా? నాకు నీవు తేజస్సు తగ్గినవాని వలె కానవచ్చుచున్నావు. తమ్ముడూ! అచట నీవు చిరకాలము ఉండుటచే, వారు నిన్ను ఆదరించక పోగా, పైగా అవమానించినారా యేమి?

ఎవరైనా నిన్ను ప్రేమ కరువైన అమంగళకరమగు పదజాలముతో దుఃఖ పెట్టినారా యేమి? లేక, నీవు యాచకులకు ఇచ్చెదనని మాట ఇచ్చి, తరువాత ఈయకుంటివా?

శరణునిచ్చే నీవు శరణు జొచ్చిన బ్రాహ్మణుని, బాలకుని, గోవు ను, వృద్ధుని, రోగగ్రస్తుని, స్త్రీని, లేక ఏదేని ప్రాణిని విడిచి పెట్టలేదు గదా?

నీవు పొందకూడని స్త్రీని పొందితివా యేమి? లేక, పొందదగినదే అయిననూ అమర్యాదతో ప్రవర్తించితివా యేమి? లేక, దారిలో నీతో సమా నమైనవారు గాని, నీకంటే తక్కువ వారు గాని, నిన్ను పరాభవించినారా?

భోజనమునీయదగిన వృద్ధులను గాని, బాలకులను గాని విడిచిపెట్టి నీవు భుజించితివా యేమి? లేక, చేయదగని నిందాయోగ్యమగు ఏదేని కర్మను చేసినావా?

మిక్కిలి ప్రియతముడు, అత్మబంధువు, హృదయము వంటిపోడు అగు శ్రీకృష్ణుడు సర్వకాలములలో నీ వద్ద లేడు గనుక, ఆ కారణముగా మానసికవ్యథను అనుభవించుచున్నావా యేమి? అట్లు గానిచో, నీ మనో వ్యథకు కారణమేమియు లేదు.

శ్రీమద్భాగవతములోని ప్రథమస్కంధములో పదునాల్గవ అధ్యాయము ముగిసినది.