శ్రీ మద్భాగవతము - ప్రధమ (1వ) స్కందము
6 - షష్ఠోఽధ్యాయః
సూతుడు ఇట్లు పలికెను: ఓ శౌనకమహర్షీ! సత్యవతియొక్క పుత్రుడు, పూజనీయుడు అగు వ్యాసమహర్షి దేవర్షియగు నారదుని జన్మ వృత్తాంతమును, ఆయన చేసిన కర్మలను ఈ విధముగా విని, మరల ఇట్లు ప్రశ్నించెను.
వ్యాసుడు ఇట్లు పలికేను: నీకు జ్ఞానమును ఉపదేశించిన ఆ యతులు దూరదేశమునకు వెళ్లిపోగా, పిన్న వయస్సులోనున్న నీవు ఆ తరువాత ఏమి చేసితివి?
ఓ బ్రహ్మపుత్రా! నీయొక్క తరువాతి వయస్సు ఏ విధముగా గడి చినది? మరణకాలము సంప్రాప్తమైనప్పుడు నీవు ఏ విధముగా దేహ మును విడిచి పెట్టితివి?
ఓ దేవోత్తమా! సర్వమును కబళించి వేసే ఈ కాలము గడచిపో యిన కల్పమునకు సంబంధించిన నీ స్మృతిని చెరిపి వేయలేదు సుమా!
నారదుడు ఇట్లు పలికెను: నాకు జ్ఞానమునుపదేశించిన యతులు దూరదేశము వెళ్లిన తరువాత పిన్న వయస్సులోనున్న నేను దీనిని (చేప్ప బోవు దానిని) చేసితిని.
నా తల్లికి నేను ఒక్కడినే పుత్రుడను. అబల, చదువు రానిది మరియు దాసి అగు నా తల్లి మరియొక ఆశ్రయము లేని నన్ను తన ప్రేమతో కట్టి వేసినది.
ఆమె నా యోగక్షేమములను కోరునదే అయిననూ, అస్వతంత్రురాలు అగుటచే ఆమెకు సామర్థ్యము లేకుండెను. ఏలయనగా, మానవుడు ఈశ్వరునిచే ఆడించబడే ఆటబొమ్మ వంటివాడు.
దిక్కులు, దేశము మరియు కాలము అనే పరిజ్ఞానము అయిదు సంవత్సరముల వయస్సు గల బాలకుడనగు నేను కూడా యొక్క ప్రేమానుబంధమునకు కట్టుబడి ఆ బ్రాహ్మణుల బస్తీలో నివసించితిని.
ఒకనాడు ఆ దీనురాలు ఆవు పాలు పితుకుటకై ఇంటినుంచి బయలుదేరి వెళ్లుచుండగా, దారిలో పొమునకు ఆమె కాలు తాకగా అది మృత్యువుచే ప్రేరేపించబడి ఆమెను కాటు వేసెను.
అప్పుడు అది భక్తుల కల్యాణమును కోరే ఈశ్వరుని అనుగ్రహమేనని భావించి, నేను ఉత్తరదిక్కు వైపునకు పయనించితిని.
సిరిసంపదలతో నలరారు రాజ్యములను, రాజధానీ నగరములను, గ్రామములను, గొల్లపల్లెలను, గనులను, వ్యవసాయగ్రామములను, గిరిజ నుల నివాసములను, ఉద్యానవనములను, సహజములగు అడవులను, సామాజిక అడవులను, రంగు రంగుల ధాతువులతో విచిత్రముగా నున్న పర్వతములను, ఏనుగులచే విరువబడిన కొమ్మలు గల చెట్లను, పవిత్రజల ములు గల సరస్సులను, చిత్రమగు ధ్వనులను చేసే పక్షులతో మరియు వేగముగా తిరుగాడే తుమ్మెదలతో శోభిల్లుతూ దేవతలచే సేవించబడే పెద్ద చెరువులను ఒంటరిగా అధిగమించి, నేను నల అనే అడవి గడ్డితో, గట్టి వెదురు పొదలతో, రెల్లు గుబుళ్లతో, దర్భ గడ్డితో మరియు బొంగు వేదుళ్లతో చొరబడ వీలులేనిది, సహింప శక్యము కాని భయంకరమగు రూపము గలది, పాములకు గుడ్లగూబలకు నక్కలకు క్రీడాస్థానమైనది అగు పెద్ద అడవిని చూచితిని.
అలసి సొలసిన ఇంద్రియములు మరియు దేహము గల నేను అధికమగు దాహముతో మరియు ఆకలితో బాధపడుతూ, నదీగర్భములోని కుండములో స్నానము చేసి, నీటిని త్రాగి, ఆచమనమును చేసి అలసటను పోగొట్టుకుంటిని.
మనుజులు లేని ఆ అడవిలో రావిచెట్టు మొదట్లో కూర్చుని మనస్సుతో హృదయమునందు ఆత్మరూపముగా విరాజిల్లే ఈశ్వరుని ధ్యానించితిని.
నేను భక్తితో వశీకృతమైన మనస్సుతో భగవంతుని పొందవలెననే ఉత్కటమగు లాలసచే నీటిని జరజర రాల్చే కన్నులు గలవాడనై, ధ్యానము చేయుచుండగా, నా హృదయములో శ్రీహరి మెల్లగా ఆవిర్భవిం చెను.
ఓ మహర్షీ! ప్రేమాతిశయముచే నా శరీరముపైని రోమములు గగుర్పాటును చెందినవి. నేను అతిశయించిన శాంతిని పొందితిని. ఆనందముయొక్క మహాప్రవాహములో మునిగియున్న నేను ధ్యాతృ-ధ్యేయభేదమునకు అతీతుడనైతిని.
మనస్సునకు అభీష్టమైనది, దుఃఖమును పోగొట్టునది అగు భగవానుని ఆ రూపము నాకు మరల కనబడలేదు. నేను వెంటనే తొట్రుపాటు పడి వికలమైపోయిన మనస్సుతో లేచి నిలబడితిని.
నేను ఆ రూపమును మరల చూడగోరి మనస్సును హృదయము నందు ఏకాగ్రము చేసి చూచితిని. కాని, ప్రయోజనము లేకుండెను. ఆ రూపము విషయములో విశేషమగు తృప్తి నాకు కలుగలేదు. నేను రోగిని వలె అయితిని.
ఈ విధముగా నిర్జనమగు అడవిలో ప్రయత్నమును చేయుచున్న నన్ను ఉద్దేశించి, వాక్కులకు గోచరుడు కాని భగవానుడు గంభీరము మరియు మధురము అగు వాక్కుతో నా దుఃఖమును శాంతింపజేయుచు న్నోడా యన్నట్లు ఇట్లు పలికెను.
ఓయీ వెర్రివాడా! నీవు ఈ జన్మలో నన్ను చూచుటకు అర్హుడవు కావు. కొద్దిపాటి యోగము (తాత్కాలికమగు భక్తి) వలన కామాదిదోషముల న్నియు నశించవు. అట్టి స్థితిలో నా దర్శనము దుర్లభము.
ఓ పాపవిహీనుడా! నీయందు నాపై అనురాగము ఉదయించుటకై నా రూపమును ఒకే ఒకసారి చూపించితిని, నాయందు అనురాగము గల సాధుపురుషుడు మెల్లమెల్లగా సకలకామనలను విడిచి పెట్టును.
నీవు కొద్ది కాలము సాధుపురుష సేవను చేయుటచే, నీ మనస్సు నాయందు స్థిరముగా నిలుచుచున్నది. నీవీ నిందార్తమగు దేహమును విడిచి నా పార్షదస్థానమును పొందగలవు.
నాయందు స్థిరముగా నిలిచే ఈ నీ మనస్సు ఒకనాడైననూ ఆ స్థితినుండి చలించదు. ఈ సృష్టి విలీనమై పోయిన ప్రళయకాలమునందు కూడా నా అనుగ్రహము వలన నీకు సర్వము స్మృతిగోచరమగుచునే యుండును.
ఇంద్రియములకు మనస్సునకు గోచరము కాని, సర్వనియంత యగు ఆ పరమాత్మ ఆకాశమునందు శబ్దరూపముగా వ్యక్తమై ఇంతమా త్రము పలికి విరమించెను. ఈ విధముగా అనుగ్రహించబడిన నేను గొప్ప వారికంటే గొప్పవాడగు (నిరతిశయబృహత్ అగు పరంబ్రహ్మ) భగవానుని కొరకు తలను వంచి నమస్కరించితిని.
నేను అనంతుని రహస్యములు మరియు కల్యాణకరములు అగు నామములను సంకోచమును విడిచి కీర్తిస్తూ, లీలలను స్మరిస్తూ, కోరికలు తొలగి పోవుటచే సంతోషముతో నిండిన మనస్సు గలవాడనై, మదమాత్సర్యములు లేనివాడనై, కాలమును ప్రతీక్షిస్తూ భూమిని పర్యటించు చుంటిని.
ఓ వ్యాసమహర్షీ! ఈ విధముగా స్వచ్చమగు అంతఃకరణము గల నేను సంసారమునందు ఆసక్తి లేనివాడనై శ్రీకృష్ణునియందు మనస్సును నిలిపి జీవించుచుండగా, సమయము రాగానే మృత్యుదేవత మాలయొక్క ఆకారములోనుండే మెరుపు వలె ఆవిర్భ వించెను.
భగవంతుడు తాను చెప్పిన విధముగా నన్ను శుద్దమగు ఆ భగవత్పార్ష దస్థానమునకు గొనిపోయే సమయము రాగానే, ఈ పాంచభౌతికదేహమును ఆరంభించిన కర్మ పరిసమాప్తమగుటచే, అది నేల రాలేను.
కల్పము పూర్తి కాగానే నారాయణుడు ఈ జగత్తును తనలోనికి ఉపసంహరించి, ప్రళయసముద్రముయొక్క నీటియందు నిద్రించగా, ఆయనలో తన క్రియాశక్తితో సహా నిద్రించగోరే హిరణ్యగర్భుని (బ్రహ్మగారి) లోపల నేను ప్రవేశించితిని.
వేయి మహాయుగములు (నాలుగు యుగములు కలిసి ఒక మహా యుగము) గడచిన పిదప నిద్ర లేచి, ఈ జగత్తును సృష్టించుటకు సంకల్పించిన బ్రహ్మగారి ఇంద్రియములనుండి నేను మరియు మరీచి మొదలగు మహర్షులు జన్మించిరి.
శ్రీమహావిష్ణువుయొక్క అనుగ్రహముచే నేను భగవద్భజనము అనే వ్రతమును విడువకుండగా, మూడు లోకములయందు లోపల మరియు బయట ఎక్కడనైననూ ఆటంకము లేని ప్రవేశము గలవాడనై పర్యటించు చుందును.
స్వరబ్రహ్మాయే అలంకారముగా గల ఈ వీణను నొకు ఈశ్వరుడు ఇచ్చినాడు. దీనియందు నేను ఆరోహళి - అవరోహణస్వరములను పనిచేసి, శ్రీహరీయొక్క గాథను పాడుకుంటూ సంచరించెదను.
పరమేశ్వరుని పాదములనుండియే సమస్తతీర్థములు ఉద్గమించినవి. ఆయన కీర్తి గానము చేయుటకు చాల ప్రీతికరముగ నుండును. ఆయన వీరగాథలను గానము చేసే నా మనస్సులో ఆయన వెంట వెంటనే ఆహా తుని వలే సాక్షాత్కరించు చుండును.
మానవుల హృదయములు విషయభోగములయందలి తృష్ణచే పీడించ బడుచుండును. అట్టి పొగలకు మరల మరల చేయబాడే ఆ శ్రీహరి లీలలు వర్ణనము సంసారసముద్రమును దాటించే నావయని నా అనుభావము.
మానవుని మనస్సు కామలోభములచే పలుపర్యాయములు గాయపడి యున్నది. అట్టి మనస్సునకు శ్రీహరియొక్క సేవచే లభించేప్రత్యక్షమగు శాంతి వంటి శాంతి యమనియమములు మొదలగు యోగ మార్గములచే లభించదు.
పాపవిహీనుడవగు ఓ వ్యాసా! నా జన్మ మరియు సాధనల రహ స్యమును గురించి నీవు నన్ను ప్రశ్నించితివి. నీ మనస్సునకు సంతోష మును కలిగించే ఆ వివరములనన్నింటినీ నేను నీకు చెప్పితిని.
సూతుడు ఇట్లు పలికెను: తనకంటూ ఒక విశిష్ట ప్రయోజనము లేని, పూజ్యుడగు నారదమహర్షి సత్యవతీసూనుడగు వ్యాసునితో ఈ విధముగా సంభాషించి, ఆయన అనుమతిని తీసుకొని, వీణను వాయించుకుంటూ వెళ్లాను.
ఆశ్చర్యము! శార్జ్ఞమనే ధనస్సు గల శ్రీహరియొక్క కీర్తిని వీణతో గానము చేస్తూ తాను ఆనందిస్తూ, తాపత్రయతప్తమగు ఈ జగత్తును ఆనం దింపజేసే ఈ దేవర్షి ధన్యుడు.
శ్రీమద్బాగవత మహాపురాణములో ఆరవ అధ్యాయము ముగిసినది.
