శ్రీ మద్భాగవతము - ప్రధమ (1వ) స్కందము

10 -  దశమోఽధ్యాయః

శౌనకమహర్షి ఇట్లు పలికెను: తన రాజ్యమును అపహరింప బూనిన ఆతతాయులగు దుర్యోధనాదులను సంహరించిన పిదప ధార్మిక స్థుడగు ధర్మరాజు బంధువధచే సంకోచము చేయబడిన భోగము గలవా డై, సోదరులతో గూడి రాజ్యమునందు ఎట్లు ప్రవర్తిల్లినాడు? ఏమి చేసి సొడు?

జగత్తును సృష్టించి పాలించే శ్రీహరి వంశమనే అడవిలో (వెదుళ్ల గుంపు) పుట్టిన నిప్పుచే కాలి బూడిదయైన కురువంశములో మరల పరీ క్షిత్తు అనే మొలక వచ్చునట్లు చేసి, ధర్మరాజును తన సింహాసనముపై కూర్చుండబెట్టి, ప్రసన్నుడాయెను.

భీష్మశ్రీకృష్ణుల వచనములను వినుటచే ధర్మరాజునకు జ్ఞానము కలిగి మోహము దూరమయ్యెను. ఆయన శ్రీకృష్ణుడే శరణుగా గలవాడై, సోదరులు సేవించుచుండగా, సముద్రపర్యంతము గల సామ్రాజ్యమును ఇంద్రుని వలే ఏలేను.

మేఘదేవత చక్కగా వర్షించెను. భూమియందు అభీష్టములగు వస్తువులు సమృద్ధిగా లభించెను. పెద్ద పొదుగులు గల ఆవులు ప్రసన్న ములై గొల్లపల్లెలను పాలతో ముంచెత్తెను.

నదులు, సముద్రములు, పర్వతములు, చెట్టుచేమలు, అన్ని రక ముల పంటలు ప్రతి ఋతువునందు ఆ రాజునకు నిశ్చయముగా ఫలించిన వీ; అనగా, తమ విలువైన వస్తువుల నందజేసినవి.

అజాతశత్రువగు ధర్మరాజుగారి రాజ్యములో ప్రాణులకు ఏ కాలమునందైననూ శరీరవ్యాధులు గాని, మనోవ్యాధులు గాని, ఆధ్యాత్మిక-ఆధి భౌతిక-ఆధిదైవికములగు తాపములు గాని లేవు.

శ్రీకృష్ణుడు పాండవుల శోకమును పోగొట్టుటకు, సుభద్రకు ప్రీతిని కలిగించుటకు కొన్ని నెలలు హస్తినాపురములో నుండి, తరువాత ధర్మ రాజువద్ద సెలవు తీసుకొని, ఆయనను కౌగిలించుకొని నమస్కరించి రథ మునెక్కెను. కొందరు అయనను కౌగిలించుకొని నమస్కరించిరి.

సుభద్ర, ద్రౌపది, కుంతి, విరాటపుత్రియగు ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు, యుయుత్సువు, కృపాచార్యుడు, నకులసహదేవులు, భీముడు, ధౌమ్యుడు, సత్యవతి మొదలగు స్త్రీలు శార్ జ్ఞమనే ధనస్సుగల శ్రీహరి యొక్క వియోగమును సహించలేక స్పృహను గోల్పోయిరి.

మహాత్ముల తోడి సంగము వలన దుష్టసంగమును విడిచి పెట్టిన వివేకి ఆ మహాత్ములచే కీర్తించబడే రుచికరమగు శ్రీకృష్ణుని యశస్సును ఒక్కసారి వినిన తరువాత మరల దానిని విడుచుటకు ఇష్టపడడు.

పాండవులు ఆయననే చూస్తూ స్పృశిస్తూ, ఆయనతో మాటలోడుతూ కలిసి నిద్రిస్తూ కూర్చుని భుజిస్తూ గడిపిరి. ఇప్పుడు ఆయన విరహమును వారు ఎట్లు సహించగలరు?

ప్రేమకు పూర్తిగా వశమైన హృదయము గల వారందరి మన స్సులు శ్రీకృష్ణునిపై నుండుటచే వారాయనను రెప్పపాటు లేని కన్నులతో చూస్తూ ఇటునటు తిరుగాడుచుండిరి.

దేవకీనందనుడగు శ్రీకృష్ణుడు గృహమునుండి బయటకు వచ్చు చుండగా బంధుస్త్రీలు ఆయనయందలి ప్రేమాతిశయముచే కళ్లనుండి బయటకు ఉబుకుతున్న కన్నీటిని, అమంగళము కలుగకూడదనే కారణముచే బలముగా ఆపుకొనుచుండిరి.

ఆ సమయములో మధేళ్లు, శంఖములు, భేరీలు, వీణలు, డోళ్లు, బోకాలు, ధుంధురీ అనే వాద్యవిశేషములు, నగారాలు, గంటలు, దుందు భులు మొదలగునవి మ్రోగినవి.

కురుస్త్రీలు శ్రీకృష్ణుని చూడాలనే కోరికతో మేడల పైకి ఎక్కి, ఆయనను ప్రేమతో సిగ్గుతో చూస్తూ చిరునవ్వులు నవ్వుతూ పూలవానలను కురిపించిరి.

శ్రీకృష్ణునకు ప్రియమిత్రుడగు అర్జునుడు ముత్యాల దండలతో అలంకరింపబడి రత్నములు పొదిగిన దండము గల తెల్ల గొడుగును అత్యంతప్రీతిపాత్రుడగు ఆయనకు పట్టెను.

ఉద్ధవుడు సాత్యకి మిక్కిలి అచ్చెరువును గొలిపే వింజామరలను వీచిరి. దారిలో జనులు పూలను చల్లుచుండగా ఆయన ప్రకాశించెను.

నిర్గుణపరబ్రహ్మ, మాయామానుషవిగ్రహమును దాల్చినవాడు ఆశీర్వచనములు వినవచ్చెను. సత్యములగు ఆ ఆశీస్సులు ఆయన స్వరూపమునకు తగ్గట్లు ఉండెను.

కురువంశరాజధానియగు హస్తినాపురములోని యువతుల మన స్సులు ఉత్తమమగు కీర్తిగల శ్రీకృష్ణునియందు లగ్నమై యుండెను. వారు తమతో తాము చేసిన సంభాషణములు అందరి చెవులకు ఇంపుగా మన స్సును దోచునవిగా ఉండెను.

పరబ్రహ్మ ఆద్యంతములు లేని చైతన్యస్వరూపుడు మరియు అద్వితీయుడు. సత్త్వరజస్తమోగుణములకు అతీతుడగు ఆ పరబ్రహ్మయే జగద్రూపముగా ప్రకటమగును. మాయాశక్తియొక్క విలాసలు ఉపసంహ రింపబడిన ప్రళయములో సర్వప్రాణులు ఆయనయందు విలీనమగును. అప్పుడు ఆ పరబ్రహ్మ నిర్విశేషమగు స్వస్వరూపములో నుండును (నిద్రలో అవిద్యావిలాసములన్నియు అవ్యక్తమునందు విలీనమగుటచే, జీ వుడు స్వస్వరూపమగు అద్వితీయపరబ్రహ్మమునందు సంపన్నుడై యుండును). ఆ నిర్గుణపరబ్రహ్మ ఈ శ్రీకృష్ణుడే.

ఆ పరమాత్మయే ప్రళయాంతమునందు నామరూపములు లేని నిర్విశేషసత్తయగు తన స్వరూపమునందు నామరూపములను ప్రకటింపజేయగోరెను (నామరూపములు లేని జీవునకు నామరూపములను కల్పించగోరెను). అపుడు వేదములను లోకమునందు ప్రవర్తిల్ల జేసే ఆ పరమాత్మ తన శక్తిచే ప్రేరితమైనది, తన అంశలు అగు జీవులను మోహింప జేయునది, సృష్టిని చేయగోరునది అగు త్రిగుణాత్మకప్రకృతికి అధి సాద్యమాయను.

ఈ లోకములో విద్వాంసులు ప్రాణాయామపరాయణులై ఇంద్రియ ములను జయించి భక్త్యావేశముచే పవిత్రమైన బుద్ధితో ఏ పరమాత్మయొ క్క స్వరూపమును (పాదములను) కనుగొనెదరో, అట్టి పరమాత్మ మన ముందే ఉన్నాడు. మనస్సును శుద్ధము చేయదగిన వాడు ఈయనయే గాని, ఆ యోగసాధనలు కాదు గదా!

ఓ సఖురాలా! రహస్యమగు తత్త్వమును బోధించే మహర్షులు వేదములలో మరియు వేదాంతములలో ఆ పరమాత్మయొక్క పవిత్రమగు గాథలను గానము చేయుచున్నారు. అద్వితీయుడగు ఆ పరమాత్మ తన మాయాశక్తిచే ఈ జగత్తును సృష్టించి పాలించి ఉపసంహరించిననూ, ఆ కార్యములయందు ఆయనకు కర్తృత్వము గాని, ఆ జగత్తునందు రాగద్వేష ములు గాని లేవు. అట్టి పరమాత్మ ఈతడే.

ప్రతియుగమునందు తమోగుణప్రధానమగు బుద్ధి గల రోజులు అధార్మికులై జీవించే సమయములలో ఈ పరమాత్మ లోకకల్యాణము. కొరకై సత్త్వగుణమును స్వీకరించి అవతారములను దాల్చి, ఈశ్వరభావ మును సత్యమును ధర్మమును భూతదయను కీర్తిని నిలబెట్టును.

ఆశ్చర్యము! పురుషశ్రేష్ఠుడు, లక్ష్మీ ప్రియుడు అగు ఈ శ్రీకృష్ణుడు జన్మించుటచే యదువంశము మిక్కిలి కొనియాడదగినదిగను, సంచ రించుటచే వ్రజభూమి మిక్కిలి పవిత్రమైనదిగను ప్రకాశించు చున్నవి.

ఆశ్చర్యము! భూలోకమునకు పవిత్రతను సంపాదించి పెట్టే ద్వారకయొక్క కీర్తి స్వర్గముయొక్క కీర్తిని తల దన్నుచున్నది. ఏలయనగా,నిత్యము తమ ప్రభువగు శ్రీకృష్ణుని దర్శించే అచటి ప్రజలు ఆయన యొక్క చిరునవ్వుతో కూడిన కృపాదృష్టికి పాత్రులగుచున్నారు.

ఓ సఖురాలా! ఈయనను చెట్టబట్టిన పత్నులు నిశ్చయముగా వ్రతములు, తీర్థస్నానములు, హోమములు మొదలగు వాటిచే ఈశ్వరుని చక్కగా పూజించి యుందురు. ఏలయనగా, వారు ఈయన అధరామృత మును అనేకపర్యాయములు పానము చేయుదురు. ప్రజమునందలి స్త్రీలు దానిని కోరి, సమ్మోహమును పొందుచుందురు గదా!

శ్రీకృష్ణుడు స్వయంవరములో శిశుపాలుడు మొదలగు బలవంతు లను చిదకదన్ని పరాక్రమమే శుల్కము కాగా, రుక్మిణి జాంబవతి నాగ్నజితి మొదలగు ఎనమండుగురు భార్యలను పొందినాడు. వారికి క్రమముగా ప్రద్యుమ్నుడు, సాంబుడు, అంబుడు మొదలగు పుత్రులు కలిగిరి. ఇంతే గాక, ఆయన నరకాసురుని వధించిన సందర్భములో వేల సంఖ్యలో స్త్రీలకు రక్షణను కల్పించినాడు. పూర్ణమగు శౌచస్వాతంత్యములు లేని స్త్రీజీవనమునకు వీరు శోభను చేగూర్చినారు. ఆశ్చర్యము! ఏలయనగా, పద్మములవంటి కన్నులు గల ఈ శ్రీకృష్ణుడు వారికి భర్తయై తన పలుకు లతో బహుమానములతో హృదయములకు ఆనందమును కలుగజే ఇముచూ ఇంటినుండి ఒక్కనాడైననూ దూరము కాడు.

ఈ విధముగా మాటలాడుచున్న పురస్త్రీలను చిరునవ్వుతో కూడిన చూపుతో అభినందిస్తూ ఆ శ్రీకృష్ణుడు వెళ్లాను.

ధర్మరాజునకు శ్రీకృష్ణునిపై గల ప్రేమచే శత్రువులు ఆయనకు హానిని తల పెట్టెదరేమో యను శంక కలిగి, ఆయన రక్షణ కొరకై చతురంగ బలమును పంపించెను.

తరువాత దృఢమగు ప్రేమ ఉండుటచే విరహము వలన పీడింపబ ... డినవారై దూరము వరకు సాగనంప వచ్చిన పాండవులను వెనుకకు పంపి శ్రీకృష్ణుడు మిత్రులతో గూడి తన నగరమునకు వెళ్లాను.

ఓ శౌనకమహర్షీ! ఆ శ్రీకృష్ణుడు కురుజాంగల పాంచాల శూర సేన దేశములను, యమునానదీతీరమునందలి బ్రహ్మావర్త కురుక్షేత్రములను, మత్స్య సారస్వత మరుధన్వ దేశములను దాటి, సౌవీర-ఆభీర దేశములకు పశ్చిమమునందున్న ఆనర్తదేశమును చేరు సరికి గుర్రములు కొద్దిగా అలసి నవి.

దారి పొడుగునా జనులు శ్రీకృష్ణునకు ఎదురేగి సత్కరించి బహు మానములనిచ్చిరి. ఆయన ఈ విధముగా సాయంకాలమగు సరికి పశ్చిమ దిక్కును చేరెను. ఇంతలో సూర్యుడు అస్తమించెను.

శ్రీమద్భాగవతమహాపురాణములోని ప్రథమస్కంధములో పదవ అధ్యాయము ముగిసినది.