శ్రీ మద్భాగవతము - ప్రధమ (1వ) స్కందము

9 -  నవమోఽధ్యాయః

సూతుడు ఇట్లు పలికెను: తరువాత ఈ విధముగా ప్రజలకు జరి గిన ద్రోహము వలన భయపడుతున్న ధర్మరాజు ధర్మములను తెలియవలె ననే కోరికతో కురుక్షేత్రములో భీష్ముడు పడియున్న స్థలమునకు వెళ్లాను.

ఓ మహర్షులారా! అప్పుడు నలుగురు సోదరులు మాత్రమే గాక, వ్యాసుడు ధౌమ్యుడు మొదలగు వారందరు, బంగరు వస్తువులచే అలంక రింపబడి జాతి గుర్రములను పూన్చిన రథములపై, ధర్మరాజును అనుస రించి వెళ్లిరి.

ఓ శౌనకమహర్షీ! శ్రీకృష్ణుడు కూడ అర్జునునితో బాటు రథముపై వెళ్లాను. వారందరితో కూడియున్న ధర్మరాజు యక్షులతో కూడియున్న కుబేరుని వలే విశేషముగా ప్రకాశించెను.

నేలపై పడియున్న భీష్ముడు స్వర్గమునుండి జారిపడిన దేవతా మూర్తివలె నుండెను. పాండవులు శ్రీకృష్ణునితో సహా సపరివారముగా ఆయనకు నమస్కరించిరి.

మహాపుణ్యాత్ముడవగు ఓ శౌనకమహర్షీ! ఆ సమయములో అచట బ్రహ్మర్షులు, దేవర్షులు మరియు రాజర్షులు అందరు 'భరతవంశశిఖామణి యగు భీష్ముని చూచుటకై సమగూడిరి.

ఓ శౌనకమహర్షీ! పర్వతుడు, నారదుడు, ధౌమ్యుడు, పూజనీయు డగు వ్యాసుడు, బృహదశ్వుడు, భరద్వాజుడు, శిష్యులతో కూడియున్న పరశురాముడు, వసిష్ఠుడు, ఇంద్రప్రమదుడు, త్రితుడు, గృత్సమదుడు, అసితుడు, కక్షివంతుడు, గౌతముడు, అత్రి, విశ్వామిత్రుడు, సుదర్శనుడు, శుకుడు, కశ్యపుడు, అంగీరసుడు మొదలగు పవిత్రులగు మహార్డులు శిష్యులతో గూడ  విచ్పేసిరి:

దేశకాలముల విభాగమును, ధర్మములను తెలిసిన వసుశ్రేష్ఠుడగు భీష్ముడు అచటకు విచ్చేసిన ఆ మహాత్ములను చూచి వారిని (వాక్కులతో) పూజించెను.

జగన్నాథుడు, మాయాశక్తిచే మానవదేహమును దాల్చినవాడు అగు శ్రీకృష్ణుడు అక్కడ కూర్చుని యుండెను. ఆయన ప్రభావము భీష్మునకు బాగుగా తెలియును. భీష్ముడు ఆయనను హృదయములో ధ్యానించుచునే యుండెను. ఆయనను కూడ భీష్ముడు పూజించెను.

పాండవులు వినయముతో ప్రేమతో ఆయనకు దగ్గరగా కూర్చుం డిరి. ఆయనకు వారిని చూచుట తోడనే ప్రేమాశ్రువులతో కన్నులు నిండి చూపు కానరాలేదు. ఆయన వారితో నిట్లనెను.

అయ్యో! కష్టము! అన్యాయము! ఓ ధర్మానుయాయులారా! బ్రహ్మవేత్తలను ధర్మమును శ్రీకృష్ణుని ఆశ్రయించుకొని జీవించే మీరు కూడా కష్టములతో జీవించ వలసి వచ్చినది. ఇది అయోగ్యము!

పాండు మహారాజు మరణించు నాటికి కోడలు అగు కుంతి చిన్న పిల్లల తల్లి. ఆమె తన పిల్లలతో బాటు వారి కొరకై పలుమార్లు అనేకము లగు కష్టములను పడినది.

మీకు కూడ చాల కష్టములు కలిగినవి. అది అంతా కాలము యొక్క ప్రభావమేనని నేను తలచుచున్నాను. ఏలయనగా, మేఘసమూ హము వాయువుయొక్క అధీనములో నుండే విధముగా లోకపాలకులతో సహా జగత్తు కాలపురుషుని అధీనములో నున్నది.

సాక్షాత్తుగా ధర్మరాజు రాజై యుండగా, భీముడు గదను అస్త్రవేత్త యగు అర్జునుడు గాండీవమును పట్టుకొని రక్షించుచుండగా, శ్రీకృష్ణుడు మిత్రుడు మరియు రక్షకుడై యుండగా ఆపదలు వచ్చినవి.

ఓ ధర్మరాజా! ఈ శ్రీకృష్ణుడు ఎప్పుడు ఏమి చేయదలచుకుంటు న్నాడో ఎవరైననూ తెలియలేరు. ఈశ్వరుని అభీష్టమును తెలియాలని యత్నించి పండితులు కూడ మోహమును పొందుచున్నారు.

భరతవంశములో శ్రేష్టుడవగు ఓ రాజా! ప్రజానాథా! కావున, ఇది అంతా దైవమునకు అధీనమై యున్నదని నిశ్చయించుకొని, ఆ ఈశ్వరు నకు అనుయాయివై నాథుడు లేని ప్రజలను పాలించుము.

ఈ శ్రీకృష్ణుడే సాక్షాత్తుగా భగవానుడు, ఆదిపురుషుడు అగు నారాయణుడు. ఈయన యదువంశములో గూఢముగా నున్నవాడై లోక మును తన మాయాశక్తిచే మోహింప జేయుచూ సంచరించు చున్నాడు.

ఓ ధర్మరాజా! ఈ శ్రీకృష్ణుని రహస్యపూర్ణమగు మహిమను శివభ గవానుడు, దేవర్షియగు నారదుడు మరియు సాక్షాత్తు కపిల భగవానుడు యెరుగుదురు.

ఆ భగవానుని నీవు పినతల్లి కొడుకు, ప్రియమిత్రుడు, మహోప కారి అని భావించి, ఆయనను స్నేహము వలన నీకు మంత్రిగా, రాయబా రిగా మరియు సారథిగా మలచుకొంటివి.

సర్వమునకు ఆత్మ, సమదర్శి, అద్వితీయుడు, అనహంకారి, రాగాది దోషములు లేనివాడు అగు శ్రీకృష్ణునకు చిన్న పెద్ద పనులను చేయుట వలన కలిగే వ్యతిరేక భావము ఏ కాలమునందైననూ లేదు.

ఓ రాజా! ఆయన సర్వత్రా సమదర్శియే యైననూ, ఆయనకు ఏకాంతభక్తులయందు గల దయను చూడుము. ఏలయనగా, ప్రాణము లను విడువబోయే నాకు సాక్షాత్తుగా ఈ శ్రీకృష్ణుని దర్శనమైనది.

శ్రీకృష్ణునియందు మనస్సును లగ్నము చేసి, ఆయన నామ మును కీర్తిస్తూ ప్రాణములను విడిచి పెట్టే యోగి కామనలనుండి మరియు వాటిచే ప్రేరితమై చేయబడే కర్మలనుండి విముక్తుడగును.

దేవదేవుడైన ఆ శ్రీమన్నారాయణ భగవానుడు నాకు ధ్యానమార్గ ములో దర్శనమిచ్చుచున్నాడు. ప్రసన్నమగు చిరునవ్వుతో ఎర్రని కన్ను లతో ప్రకాశించే పద్మమువంటి ముఖము గల ఆయన శ్రీకృష్ణరూపములో నుండి చూచుచుండగా నేను ఈ దేహమును విడుచుచున్నాను.

ధర్మరాజు ఆ మాటను విని, ఋషులు అనుసరించి వినుచుండ గా, అంపశయ్య పై పరుండియున్న భీష్ముని వివిధ ధర్మములను గురించి ప్రశ్నించెను.

ఓ శౌనక మహర్షీ! తత్త్వవేత్తయగు భీష్ముడు మానవుని స్వభావమును బట్టి వర్ణాశ్రమములకు అనురూపముగా విధింపబడిన, మరియు రాగము వైరాగ్యము అనే మానసికస్థితులకు అనురూపమైన, ప్రవృత్తి-నివృతిరూపములగు ద్వివిధ ధర్మములను, దానధర్మములను, రాజులు పాటిoచదగిన ధర్మములను, మోక్ష హేతువులగు శమదమాది ధర్మములను స్త్రీల ధర్మములను, ఏకాదశీవ్రతము మొదలగు భగవతీతికనగు ధర్మములను కూడ విడివిడిగా సందర్భమును బట్టి సంక్షేపముగా మాత్రమే కాక విస్తారముగా కూడ వర్ణించెను. ఇంతేగాక, ఆయన వివిధములగు గాథలలో ముగియు ఇతిహాసములలో ఉన్న విధముగా మోక్షములనే గొలుగు విధముల పురుషార్థములను వాటి ఉపాయములతో సహ వర్ణించేను.

తాను కోరినప్పుడు మరణించే వరము గల జ్ఞానియగు భీష్ముడు 'ధర్మములను చెప్పుచుండగానే, అభీష్టమగు ఉత్తరాయణ పుణ్యకాలము సంప్రాప్తమయ్యెను.

యుద్దములో వేయి రథికులను నడిపించే భీష్ముడు ఆ సమయ ములో మాటలను ఆపివేసి, సాంసారికములగు ఆసక్తులనుండి విముక్తమై యున్న మనస్సును నాలుగు భుజముల ఆదినారాయణుడు, ప్రకాశించే పచ్చని జంట వస్త్రములను ధరించినవాడు, ఎదురుగా నిలుచున్నవాడు అగు శ్రీకృష్ణునిపై కన్నులను మూయకుండగనే లగ్నము చేసెను.

పరమపవిత్రమగు భగవద్రూపధ్యానముచే భీష్ముని దోష శేషము నశించెను. ఆయుధముల వలన కలిగిన శారీరకపీడ శ్రీకృష్ణుని దర్శనమా త్రముచే తొలగిపోయేను. భీష్ముడు సమస్తములగు ఇంద్రియముల వ్యాపా రములను, విలాసలను ఉపసంహరించి, దేహమును విడిచి పెడుతూ, నారాయణుని స్తుతించెను.

భీష్ముడిట్లు పలికెను: పరమాత్మ స్వరూపభూతమగు ఆనంద మును పొందియున్నవాడే అయిననూ ఒకానొకప్పుడు క్రీడించుటకై మాయాశక్తిని ఉపాధిగా స్వీకరించుచుండును. ఆ మాయాశక్తి వలననే ఈ జగత్తు అనే ప్రవాహము ఉదయించుచున్నది. అట్టి అనంతుడగు పరమేశ్వ రుడు యదువంశశిరోమణియగు శ్రీకృష్ణభగవానుని రూపములో నా యే దుట నున్నాడు. ధర్మము మొదలగు వాటి అనుష్టానముచే కామనలు లేకుండగా పవిత్రమైన నా మనస్సును ఆ అనంతునియందు సమర్పించు చున్నాను.

అనవద్యా = ఫలమందలి తృష్ణను యెరుగని, రతిః = ప్రీతి, అస్తు = కలుగు గాక!

నీలమేఘశ్యాముడు, ఉదయించే సూర్యుని వలె ప్రకాశించే పచ్చని శ్రేష్టవస్త్రములను ధరించువాడు, ముంగురులతో కూడిన పద్మము వంటి ముఖము గలవాడు అగు శ్రీకృష్ణుని రూపము ముల్లోకములలో సుందరమైనది. ఆ అర్జునసఖుడగు భగవానునిపై నాకు ఫలతృష్ణ లేని ప్రీతి కలుగుగాక!

యుద్ధములో గుర్రములచే రేగగొట్టబడిన ధూళిచే ఆయన ముంగురులు ధూసరవర్ణమును కలిగియుండెను. ఆయన ముఖమంతయు చెమటతో నిండి ప్రకాశించు చుండెను. నా వాడి బాణములు ఆయన కవచ మును పగులగొట్టి చర్మమును చీల్చుచుండెను. అట్టి శ్రీకృష్ణునియందు నా మనస్సు స్థిరమగు గాక!

మిత్రుడగు అర్జునుని మాటను విని వెంటనే రథమును తమ సైన్య మునకు శత్రు సైన్యమునకు మధ్యలో నిలిపి, చూపులతోనే శత్రు సైనికుల ఆయుర్దాయములను అపహరిస్తూ ఉండే పార్థసారథియగు శ్రీకృష్ణునియందు నాకు ప్రీతి కలుగుగాక!

అర్జునుడు దూరమునుండి కౌరవ సైన్యముయొక్క ముందుభాగ ములోనున్న భీష్ముడు మొదలగు బంధువర్గమును చూచి, తనకు బంధువధ ధర్మము కాదని తలచి, యుద్ధవిముఖుడై యుండగా, శ్రీకృ ష్ణుడు ఆతనికి ఆత్మవిద్యను బోధించి, అజ్ఞానమును పోనాడి, ధర్మాచరణమునందు ప్రవర్తిల్ల జేసెను. అట్టి శ్రీకృష్ణపరమాత్మయొక్క పాదముల -

యందు నాకు ప్రీతి కలుగుగాక!

రథమునందు కూర్చునియున్న శ్రీకృష్ణుడు యుద్ధములో ఆయు ధమును పట్టననే తన ప్రతిజ్ఞను ప్రక్కన పెట్టి, ఆయనచే ఆయుధమును పట్టించెదననే నా ప్రతిజ్ఞను సత్యము చేసి తద్ద్వారా నన్ను అధికుని చేయు టకై, ఏనుగును చంపబోయే సింహము వలె క్రిందకు దుమికి చేతిలో చక్ర మును పట్టుకొని, క్రింద నేల కంపించుచుండగా, పై కండువా జారిపోతూ ఉండగా, నా మీదకు వచ్చినాడు.

ధనస్సును చేతబట్టి యుద్దమును చేయుచున్న నాయొక్క వాడి బాణములచే కొట్టబడి కవచము చిల్లులు పడి శరీరమంతటా రక్తము కారు చుండగా, తనకు అడ్డువచ్చిన అర్జునుని ప్రక్కకు నెట్టి, నన్ను సంహరించు టకు వేగముగా వచ్చిన ఆ శ్రీకృష్ణభగవానుడు నాకు శరణు.

చేతిలో కోరడాను గుర్రముల కళ్లెములను పట్టుకొని అర్జునుని రథ మును జాగ్రత్తగా రక్షిస్తూ ఆ స్థితిలోని సౌందర్యముతో కన్నులకు పండుగ చేసే శ్రీకృష్ణభగవానునియందు మరణించ గోరే నాకు ప్రీతి కలుగుగాక! యుద్దములో ఆయననూ చూస్తూ మరణించినవారు సారూప్యమోక్షమును పొందినారు.

వయ్యారమగు నడక, ఒళ్లంతా హోయలు, తియ్యని చిరునవ్వు, ప్రేమను ఒలకబోసే చూపులు అనువాటి గోపికలు ఆయనకు గొప్ప పూజను చేసిరి. ఇంతలో ఆయన అదృశ్యము కాగా, వారు ఉత్కటమగు ప్రేమచే సర్వమును మరచి, గోవర్ధనోద్దారము మొదలైన ఆయన చేష్టలను అనుకరించిరి. అట్టి గోపికలు ఆయనలో ఐక్యమైనారు గదా!

ధర్మరాజుయొక్క రాజసూయములో మహర్షుల. గణములతో మరియు రాజులతో క్రిక్కిరిసియున్న సభామధ్యములో వారందరు కన్నుల పండువగా చూచుచుండగా, నా కన్నుల యెదుటనే ఈ శ్రీకృష్ణుడు పూజను అందుకొనినాడు. అట్టి శ్రీకృష్ణుడు ఇప్పుడు నాకు ఆత్మరూపునిగా దర్శనమునిచ్చుచున్నాడు.

పుట్టుక లేని పరమేశ్వరుడు తనచే నిర్మించబడిన (తనయందు కల్పించబడిన) ప్రాణుల ప్రతి హృదయమును ఆత్మరూపముగా అది ష్ఠించి, చూచే వాని ప్రతి కన్నులో వేర్వేరుగా భాసించే ఒకే ఒక సూర్యుని వలె, అనేకప్రకారములుగా ప్రకాశించుచున్నాడు. పటాపంచలు చేయబడిన భేదముయొక్క మోహము గల నేను అట్టి అద్వితీయపరబ్రహ్మస్వరూపు డగు ఈ శ్రీకృష్ణుని ఆత్మరూపునిగా కనుగొంటిని.

ఈ విధముగా ఆ భీష్ముడు ఆత్మరూపుడగు శ్రీకృష్ణభగవానుని యందు మనస్సు, వాక్కు, చూపు అనే మూడు వ్యాపారముల ద్వారా బుద్ధిని చక్కగా లగ్నము చేసి, లోపలనే విలీనమైన శ్వాస గలవాడై విర మించెను.

నిర్గుణపరబ్రహ్మయందు విలీనమగుచున్న భీష్మపితామహుని చూచి వారందరు, అస్తమించే సూర్యుని చూచు పక్షులు వలె, మిన్నకుండిరి.

అక్కడ ఆ సమయములో దేవతలు మరియు మానవులు భేరీలను మ్రోగించిరి. సాధుస్వభావము గల రాజులు కొనియాడిరి. ఆకాశమునుండి పూలవానలు కురిసినవి.

ఓ శౌనకా! ధర్మరాజు జీవన్ముక్తుడై మరణించిన భీష్మునకు దహన - సంస్కారము మొదలగు వాటిని చేయించి, కొంత సేపు దుఃఖించెను.

మునులు సంతోషించి శ్రీకృష్ణుని వేదోక్తములగు రహస్యనామము లతో స్తుతించి, తరువాత ఆయనయందే లగ్న మైన హృదయములు గల వారై, తమ తమ ఆశ్రమములకు మరలి వెళ్లిరి.

తరువాత ధర్మరాజు శ్రీకృష్ణునితో కలిసి హస్తినాపురమునకు వెళ్లి దుఃఖితులై యున్న గాంధారీధృతరాష్ట్రులను ఓదార్చేను.

సర్వసమర్థుడగు ధర్మరాజు ధృతరాష్ట్రుని అనుమతిని, శ్రీకృష్ణుని ఆశీర్వాదమును పొంది, తాత ముత్తాతలనుండి వచ్చుచున్న రాజ్యమును ధర్మబద్ధముగా పాలించేను.

శ్రీమద్బాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.