11 - పాశుపతయోజనామైకా

వాయువు పలికెను:- ఒక పూర్తి పగలు గాని, రాత్రి పగలు గలిసిన దీనము గాని, సగము నెల గాని, నెల గానీ, ఆరుమాసములతో గూడిన అయనము గాని, సంవత్సరము గాని, యుగములుగాని, మహాయుగ సహస్రములు గాని ఋషులు తపస్సు నందుండి మహాత్ములై దివ్యచక్షువుచే ప్రాణమును పాసింతురు. ఆ పైన భగవంతుడైన ప్రభువు చెప్పిన విధముగా ప్రాణాయామ ప్రయోజనమును ఫలమును చెప్పగలను. ప్రాణాయామము యొక్క ప్రయోజనములు నాలుగని తెలిసికొనుము అవి శాస్త్రి, ప్రశాస్త్రి దీప్తి, ప్రసాదము, అనునవి.

 దేహమును ధరించిన ప్రాణులు ఈ లోకమునను పరలోకమునను స్వయముగా కాలము ననుసరించి కొన్ని పనులు చేయుదురు. అవి వాని ఫలముననునరించి ఘోరములనియు శాస్త్రములనియు తెలియును బంధుసంబంధమైన సంకరములచే తల్లిదండ్రులు దోషవంతులగుదురు. దానిచే వారికి జనించిన సంతానము దుష్టమగును కషాయవర్ణముగా నంటిన యాపాపములను తపముచే శమింపచేయుట శాస్త్రీయను తపమనబడును. ఇహ పరలోకహితమునకై లోభము తోను, అభిమానము తోను జేసిన పాపములను గూడ తపమనబడును-5,6,7, జ్ఞానము విజ్ఞానము సంపద. గాగల ఋషులు ప్రసిద్ధులు వారికి సూర్యుడు చంద్రుడు తారలును సమానముగా గనబడుదురు. గడిచిన వానిని రాబోవువానినీ ప్రస్తుతము వర్తమానమగుచున్న వానిని జ్ఞాని సమానముగా జూడగలుగును అనగా వానియందు జ్ఞానియొక్కజొన ప్రకాశము సమానముగా బడి ప్రత్యక్షము జేయును. దీప్తియను తపమనబడును-8,9. కన్నుమొదలగు ఇంద్రియములు రూపము మొదలగు ఇంద్రియార్థములు మనస్సును ప్రాణాపానవ్యాన ఉదాన సమానములను ఐదు వాయువులు వీని నుద్రేకము నందకుండా ప్రసన్నముగానుంచు తపము ప్రసాదమనేడి తపమనబడును-10. ఈ విధముగా ప్రాణాయామము నాలుగు విధములుగా నుండు మొదటి ధర్మము దీనికి ఫలమతి సమీపములో నుండును. ఇది ప్రసన్నమైన కాలమున నప్పటికప్పుడు కలుగును.

ఆ పైన ప్రాణాయామ లక్షణమును జెప్పుదును. శరీర తత్త్యము ననుసరించి తగిన యాసనములో నుండవలెను. చిత్తవృత్తులను (మనోవ్యాపారములను) నిరోధింపవల-12 ఓంకారం నుచ్చరించి, చంద్రసూర్యులకు ప్రణమిల్లి, స్వస్తి కాసనమును గాని పద్మాసనమునుగాని, అర్ధాసనము గాని వేసి యుండవలెను-13. సమముగా నుంచిన మోకాళ్లు గలుగునట్లుగా గాని, ఒకే మోకాలుండు మోనట్లుగగాని, వెల్లికిల నుండిగాని, చక్కగా కూర్చున్నవాడై గూనితో ఒడుదుడుకులుగా గాక సమముగా గూర్చోన్న వాడై రెండు పాదములు ముడిచి దృఢమైన యాసనముననుండవలె-14. తరువాత నోరుమూసుకొని క్రిందుగా నర్థానిమీలితనేత్రుడై జొమ్మును ముందుకు నిక్కబొడిచి, కాలి మడమలతో వృషణములను లింగమును గప్పికూర్చొనవల-15. తరువాత తలను మెడను కొద్దిగా ఎత్తవలె, తన ముక్కు చివరకు చూడవలే. దీక్కులు చూడరాదు- . 16. తమో గుణమును రజో గుణముతో గప్పి, సత్య గుణముతో రజో గుణమును గప్పి వేయవలె. తరువాత సత్య గుణంలో నున్న వాడై చిత్తవృత్తుల నిరోధించుచు సమాధిలో నుండవలే-17. ఇన్షియములను వానివిషయములైన రూపాదులను, మనస్సును, ప్రాణాదులైన ఐదు వాయువులను అంతర్ముఖముగా లాగి, వానిని వెనుదిరుగునట్లు జేయుటకారంభింపవలె. (వానిని కరిగి యేకాగ్రముగా చిత్తమున లయమగునట్లు జేయవలె-18. తాబేలు తన యంగములను లోనికి ముడుచుకొనునట్లు కోరికలనన్నింటిని ఉపసంహరించు కొన్నవాడు ఆత్మయందే రతుడై ఆత్మలో పరమాత్మను జూడగలడు-19. శరీరమును (వాయువుచే) నింపి బాహ్యాంతరముల పరిశుద్దుడై కంఠమునుండి బొడ్డువరకు కలుపుయోగము చేత ప్రత్యాహారమును వాయువును చీల్చుకొనుటను ప్రారంభింపవలె.

కనురెప్పపాటు వేసి తెరచునంత కాలము కలామాత్రయని తెలియవలె అట్లే ప్రాణాయామము పండ్రెండు మాత్రలకాలము చేయవలెను-21. పండ్రెండు (మాత్రల) పొడవైనది ధారణ (చిత్తమునొక చోటనిలుపుట) రెండు ధారణలు యోగము అట్టి యోగము తో గూడినవాడు ఐశ్వర్యమును (ఈశ్వరత్వమును పొందును.తన తేజముతో దీప్యమానుడైన పరమాత్మను చూచును-22. నియతాత్ముడైప్రాణాయామయుక్తుడైన బ్రాహ్మణునకు సర్వదోషములు నశించును. వాడు సత్యగుణమునందున్న వాడగును.

ఈ విధముగా నియతమైన యాహారము గలవాడై ప్రాణాయామ పరాయణుడై భూమినెప్పుడు జయించి జయించియే మునియై యధిరోహింపవలెను-24. మహా భూమిని జయింపనిచో నది బహుదోషముల బుట్టించును. సమ్మోహమును గలుగజేయును. కావున జయింపని భూమినధిష్టింపరాదు-25 యస్త్రరూపమైన నాళముచే బలముతోగూడిన వాడై ప్రయత్నముతో నీరును సంపూర్ణముగా ద్రావిన విధమున శ్రమమును జయించినవాడై వాయువును జయింపవలెను-26. నాభియందు, హృదయమున, కంఠమున, వక్షః స్థలమున, ముఖమున, నాసాగ్రమున అట్లే నేత్రమున, కనుబొమ్మల మధ్యన, ఆ తరువాత శిరమున దానికి కొంచెము పైనున్న పరమునందు ప్రాణమును మనస్సును నిలిపీయుంచుట ధారణయనబడును. ప్రాణాపానములను చక్కగా నరికట్టి నిలుపుట చేత అది ప్రాణాయామమనబడును-27,28. మనస్సును నిలుపుట ధారణయనబడినది. విషయములనుండి మనస్సును మరల్చుట ప్రత్యాహారమనబడినది-29. అన్నింటియొక్క సమూహము నందైతే అది యోగలక్షణ (రూప)మైన సిద్ధియగును. ఆ సిద్ధిచే గలిగిన యోగము యొక్క ధ్యానము సిద్దిలక్షణ (రూపము ధ్యానయుక్తుడై సూర్యచంద్రులవలె నెల్లప్పుడు ఆత్మను జూడవలెను.

సత్యము గలుగనప్పుడు దర్శనము గలుగదు. తగని దేశమునను తగని కాలమునను జరిపిన యోగమునకు దర్శనముండదు-31. అగ్నిదగ్గర, వనమున, ఎండినయాకుల సమూహము (కుప్ప) యందు, అట్లే జన్తువులు తిరుగాడు చోట, శ్మాశానమున, పాడుబడిన గోశాలయందు, నాలుగుదారులు, గలిగిన చోట (చౌరస్తాలో) శబ్దముల యలజడియున్న చోట, భయమున్నచోట రచ్చమానులు పుట్టలు విని సమూహమున్న చోట, నీరు ద్రావు బావి దగ్గర, అట్లే నదీలో బాధ గలుగు చోటను, ఎప్పుడును యోగమును బూనరాదు-32,33. ఆకలి బాధ నున్న వాడు, సంతోషము లేనివాడు. వ్యాకులములైన కన్నులు గలవాడు, యోగమున పరమధ్యానమును జేయరాదు. కావున నెల్లప్పుడును యోగి ధ్యానపరుడై -34. ఈ దోషములను నిశ్చయించి తెలిసికొనవలెను. అవి యున్నను ప్రమాదమున యోగమును ఆచరించు వానికి శరీరములో దోషములు ప్రకోపించి యోగవిఘ్నకారకములగును-35. జడత్వము (చచ్చుపడిపోవుట పక్షపాతము వంటిది) చెవిటితనము, మూగతనమును పొందును. గ్రుడ్డితనమును, స్మృతిలోపమును (మతిచెడుట), జరారోగమును, పొందును.36 కావున అజ్ఞానమున పై దోషములుండగా యోగమునకు బూనినవానికి శరీరమున బహు దోషములు ప్రకోపించును. కావున శుద్దమైన జ్ఞానముతో ; సమాహితుడై (ఏకాగ్రచిత్తుడై యోగి తన యోగమునకు బూను కొనవలెను-37. ఎప్పుడును అప్రమత్తుడై (జాగరూకుడై ఎక్కడగూడ యోగిపై దోషములనొందరాదు. ఇక ఆ ప్రాణాయామమువలన గలిగిన దోషములను బోగొట్టు చికిత్సను యథాక్రమముగా జెప్పుదును.

మిక్కలి వేడిగానున్న యవల జావను నేయి గలిపి తిని తన యోగమును నిలుపవలెను. ఈ క్రమయోగముతో వాతమువలన గలిగిన గుల్మవ్యాధి శమించును-39. గుదావర్తవ్యాధికి తిరుగుడుగా నీ చికిత్స చేయవలెను. పెరుగుతోగూడిన యవలజావను తినవలెను. దాని వలన వాయువు పైకి పోవును-40. తరువాత వాయు గ్రంథి (ముడి) ని ఛేదించి వాయుదేశమున (వాయువును) ప్రయోగింపవలెను. అట్లేనను విశేషములేని (కనబడని) చో యోగధారణమును శిరస్సున జేయవలెను-41. ఈ విధముగ శరీరమును యోగముతో బూన్చి స్వస్థుడైన వానికి (శరీరికి) గుదావర్త ప్రతిఘాతము గలుగగా నీ చికిత్సను చేయవలెను-42. యోగమును ప్రారంభించిన యోగికి సమస్త శరీరము ప్రకంపనమును చెందినప్పుడు ఈ చికిత్సను చేయవలెను. దానిచేత వాడు సుఖియగును.

వ్రతమే దైననున్న మనస్సుతో దానిని చక్కగా నిలిపి ధారణ చేయవలెను. ఉరోద్ఘాతము గలిగినచో ఉరః స్థానమును కంఠస్థానమున యోగ ధారణ చేయవలెను-44. చర్మమునకవఘాతము గలిగినపుడు ఆ చర్మమును వాక్ స్థానమున యోగదారణచేయవలెను. చెవుడు కలిగినపుడు చెవులయందును. దప్పిక కలిగినపుడు నాలుకయందును యోగధారణ చేయవలెను. తంతువుల చేత మొదట స్నేహములను ఫలమును యోగి చింతింపవలేను. దాని వలన యోగి సుఖియగును-45. క్షయ, కుష్టు, కిలాసము, (సిబ్బెము) ఈ వ్యాధులు సంభవించినపుడు సర్వసాత్వికిని ధారణ చేయవలెను. ఏయే రజోదేశమున (బాధగలుగునో) ఆయా ప్రదేశమున యోగధారణాయుక్తుడై నిర్దేశింపవలెను-46. యోగోత్సన్నుడైన విప్రునకు ఈ చికిత్సను చేయవలెను. యోగధారణము చేయుచున్న వానియొక్క శిరస్సును వెదురు కీలము (మేకు)తో గొట్టవలెను. శిరమున (మేకు) కీలమునుంచి కట్టెను కట్టేతో గొట్టవలెను-47. దాని వల్ల భయభీతునకు పూర్వస్మృతి మరల రాగలదు. లేదా స్మృతిని గోలుపోయిన వానిని చేతులతో బట్టినిలుపవలెను-48. ఆ తరువాత స్మృతిని పొంది శిరమున యోగధారణమును చేయవలెను. నేయి గలిపిన దానిని కొద్దిగా భుజింపవలెను. దాని వలన సుఖి యగును.

యోగమును దెలిసినవాడు అమానుషమైన (మానవాతీతమైన) బలముతో (యోగమునుండి) మేలుకొనినపుడు, స్వర్ణమును, భూమిని, వాయువును అగ్నిని యోగధారణలో నిలుపవలెను-50. ప్రాణాయామముచే నదియంతయు దహింపబడుచున్నదై వశమగును అయినప్పటికీని దేహమును ప్రవేశింపవలె, తరువాత దానిని (ఆవహ్యమానమును) నిషేధింపవలేను-51. తరువాత స్తంభించి యోగముతో శిరమున ధారణచేయుచున్న యాతనికి ప్రాణాయామాగ్నిచే దహింపబడిన దంతయు విలయమును బొందును-52. నల్లనాగు బాముయొక్క అపరాధమునైతే (విషమును) రోమ్మునను కడుపులోను యోగధారణము చేయవలె మహోలోకమును, జనలోకమును, తపోలోకమును, సత్యలోకమును, హృదయమునందుంచి యోగ ధారణ చేయవలె-53. విషము యొక్క ఫలమును (జలమును) ద్రావి తరువాత విశల్యను (విషములేని దానిని) ధారణ చేయవలె అంతటను పర్వతములతో గూడిన భూమిని మనస్సున ధారణ చేయవలె-54. యోగజ్ఞుడైయోగమునందున్న వాడు సముద్రలను దేవతలను హృదయమున ధారణతోనిలిపి వేయికుండలతో స్నానము జేయవలె-55. కంఠమువరకు నీటిలో నుండి శిరమున యోగధారణ చేయవలె. విషావిష్ణుడైనవాడు ప్రవాహమున కెదురుగా నుండి సార్వగాత్రికిని (సర్వత్రధారణను) జేయవలె-56. సన్నగిల్లిన (బక్కచిక్కిన) యోగి జిల్లేడాకుల దొప్పలతో పుట్టమన్ను ద్రావవలె ఇది విషబాధితుడైన యోగికి చికిత్సావిధానము ఇదియోగనిర్మితమై ప్రసిద్ధమైనది-57. యోగదృష్టమైన హేతువుచే సంగ్రహముగా వ్యాఖ్యానింపబడినది. దీనినెక్కడనైనను ఎవడేని జెప్పవచ్చును. ఆ బ్రాహ్మణుని లక్షణమును దెలిసికొనుము (యోగము తోగనుగొన్న రహస్యం చెప్పరాదు)-58. అయినప్పటికిని మోహము వలన జెప్పినచో ఆ విజ్ఞానము ప్రళయం (నాశనము చెందును) కావున యోగప్రవృత్తినేమైనను చెప్పరాదు-59. సత్యము శాస్త్రి పూర్వకమైన బలము) ఆరోగ్యము, మిక్కిలికోరిక, రంగుయోక్కకాంతి, మంచిస్వరము సౌమ్యత, సుగంధము, అల్పమైన మూత్ర పురీషములు- ఇవి శరీరమున యోగమువల్ల మొదట గలుగు లక్షణములు-60. యోగి తనయోగమున, తనను, భూమిని జ్వలించుచున్నట్లుగా జూచి, తన్నువేరొకనిగా ప్రవేశించినచో, ఆతనికి సిద్ధి తనకడకు చేరినట్లుగా దెలిసికొనవలె.

ఇది వాయుప్రోక్తమైన మహాపురాణమున పాశుపత యోగమను పదనొకండవ ధ్యాయము.