భాగవత మహా పురాణము
16 - షోడశోఽధ్యాయః
సూత ఉవాచ ।
సూతుడిట్లు పలికెను: ఓ శౌనకమహర్షీ! పాండవుల మహాప్రస్థా నము తరువాత భాగవతోత్తముడగు పరీక్షిన్మహారాజు, ఆయన పుట్టిన ప్పుడు జాతకవిద్వాంసులు చెప్పిన విధముగా గొప్ప గుణములు గలవా డై, బ్రాహ్మణోత్తముల సదుపదేశానుసారముగా రాజ్యమునేలెను.
అ పరీక్షిత్తు ఉత్తరుని కుమార్తెయగు ఇరావతిని వివాహమాడి, ఆమెయందు జనమేజయుడు మొదలగు నలుగురు కుమారులను కనెను.
అ పరీక్షిత్తు ఉత్తరుని కుమార్తెయగు ఇరావతిని వివాహమాడి, ఆమెయందు జనమేజయుడు మొదలగు నలుగురు కుమారులను కనెను.
ఆయన కృపాచార్యుని గురువుగా చేసుకొని గంగాతీరమునందు గొప్ప దక్షిణలతో గూడిన మూడు అశ్వమేధములను చేసెను. వాటిలో హవిస్సులను స్వీకరించుటకు విచ్చేసిన దేవతలు కంటికి కానవచ్చెడివారు.
వీరుడగు పరీక్షిత్తు ఒకానొక సమయములో దిగ్విజయయాత్రను చేయుచూ రాజచిహ్నములను ధరించిన శూద్రుని రూపములో ఎద్దును ఆవును కాలితో తన్నుచున్న కలిని పట్టుకొనెను.
శౌనక ఉవాచ ।
శౌనకుడిట్లు పలికేను: పరీక్షిన్మహారాజు దిగ్విజయయాత్రలో కలిని పట్టుకొనుటకు కారణమేమి? చక్రవర్తిచిహ్నములను ధరించి గోవును కాలితో తన్నిన ఈ శూద్రుడు ఎవడు?
మహాత్మా! ఓయీ సూతా! ఆ విషయము శ్రీకృష్ణగాథతో సంబం ధము గలది గాని, లేదా శ్రీకృష్ణుని పాదపద్మముల మకరందమును ఆస్వా దించే సత్పరుషులకు సంబంధించినది గాని అయినచో, చెప్పము. అట్లు గానిచో, అల్పమగు ఆయుర్దాయము కలిగి శీఘ్రముగా మరణించబోతూ సత్యమును దర్శించవలెనని కోరే మావంటి వారికి ఇతరములైన అయోగ్య ములగు కబుర్లతో పని యేమి? అట్టి కబుర్ల వలన మానవుల ఆయుర్దాయము వ్యర్థముగా క్షయమగును.
పశువిశసనము అనే కర్మ కొరకై మృత్యుదేవత ఆహ్వానించబడి ఇప్పుడు ఈ యజ్ఞశాలలో నున్నాడు. మృత్యుదేవత ఇక్కడ ఉన్నంతవరకు ఏ మానవుడైననూ మరణించడు.
యమధర్మరాజును ఇచటకు ఆహ్వానించినచో, మానవులకు శ్రీహ రియొక్క లీలలను వర్ణించే అమృతవాక్కులను వినే అవకాశము లభించున నియే మహర్షులు ఆయనను ఇచటకు ఆహ్వానించినారు.
సోమరీ, మందబుద్ధి మరియు అల్పాయుష్కుడు అగు మానవుని ఆయుర్ధాయమును రాత్రియందు నిద్ర, పగలు వ్యర్థమగు పనులు అపహ రించి వేయుచున్నవి.
సూత ఉవాచ ।
సూతుడిట్లు పలికెను: కురుజాంగలదేశమునందు నివసించే యుద్ధవీరుడగు పరీక్షిన్మహారాజు తన సేనలచే పాలించబడే దేశములో కలి ప్రవేశించినాడనే చీకాకును కలిగించే వార్తను విని, ధనస్సును చేతబట్టెను.
పరీక్షిన్మహారాజు చక్కగా అలంకరించి నల్లని గుర్రములను పూన్చిన సింహధ్వజము గల రథమునెక్కి, రథములు గుర్రములు ఏనుగులు మరియు పదాతులతో కూడిన సైన్యము తోడురాగా, నగరమునుండి దిగ్విజయము కొరకై బయలు దేరెను.
ఆయన భద్రాశ్వ-కేతుమాల-భారత-ఉత్తరకురు-కింపురుషాది దే శములను జయించి వారివద్దనుండి బహుమానములను స్వీకరించెను.
రశీలుడగు పరీక్షిన్మహారాజు అక్కడక్కడ జనులు మహాత్ములగు తన పూర్వీకుల కీర్తిని, శ్రీకృష్ణుని మహిమను చాటే గాథలను, అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రముయొక్క తేజస్సునుండి శ్రీకృష్ణుడు తనను రక్షించిన సంగతిని, యాదవులకు పాండవులకు గల మైత్రిని, పాండవులకు శ్రీకృష్ణునియందు గల భక్తిని వర్ణించుచుండగా, వారి దగ్గర కూర్చుని వినెడివాడు. ఆ వృత్తాంతముల వలన ఆయన పరమానందమును పొంది, ప్రేమతో ఉప్పొంగే కన్నులు గలవాడై, వారికి బహుమూల్యములగు వస్త్రములను మరియు హారములను పంచి పెట్టేడివాడు.
శ్రీకృష్ణభగవానుడు సర్వలోకపూజ్యుడే అయిననూ, పాండవుల ప్రేమకు వశుడై వారికి సారథి పనిని చేసెను. సభాపతి కార్యమును చేసి పెట్టెను. వారితో స్నేహమును చేసి వారి మనస్సునకు అనుకూలముగా వర్తించుట మాత్రమే గాక, వారికి రాయబారకార్యమును నెరపెను. ఆయన రాత్రి కత్తిని చేతబట్టి వారికి పహరా కాసిన సందర్భములు కూడ లేకపోలే దు. ఆయన వారి వెంట వెంటనే నడిచి, వారిని స్తుతించి నమస్కారమును కూడ చేసెడివాడు. ఈ విషయములను విన్న పరీక్షిన్మహారాజునకు ఆయన పాదపద్మములయందు భక్తి కలిగెడిది.
ఈ విధముగా పరీక్షిన్మహారాజు తన పూర్వీకులగు పాండవుల సద్గుణములననుసరించి రాజ్యమునేలుచుండగా, తక్కువ కాలములోననే ఒక అద్భుతమగు ఘటన జరిగినది. దానిని నేను చెప్పెదను. తెలుసుకొనుము.
ధర్మము ఎద్దు రూపమును దాల్చి ఒక కాలితో కుంటుతూ నుండగా, బిడ్డను పోగొట్టుకున్న తల్లివలె ముఖములో కళ లేనిదై ఏడుస్తూ ఉన్న గోరూపములో నున్న పృథివిని చూచెను.
ధర్మ ఉవాచ ।
ధర్మము ఇట్లు పలికేను: ఓ తల్లీ! మంగళస్వరూపురాలా! నీ శరీర మునకు క్షేమమేనా? నీ ముఖము కొంచెము వాడి శోభను కోల్పోయినది. నీ మనస్సులో బెంగ ఉన్నదని సోకు తోచుచున్నది, ఎవరేని దూరపు బంధువును గురించి శోకించుచున్నావో యేమి?
మూడు పాదములను కోల్పోయి ఒకే పాదముతోనున్న నన్ను గురించి దుఃఖించుచున్నావా? లేక, నిన్ను భవిష్యత్తులో అధర్మజీవనులగు రాజులు పాలించబోతున్నందులకు దుఃఖించుచున్నావా? లేక, మానవులు యజ్ఞములను మానివేయుటచే హవిర్భాగములను కోల్పోయిన దేవతల గురించి దుఃఖించుచున్నావా? లేక, ఇంద్రుడు వర్షించుటను ఆపి వేసినం దులకు దుఃఖించుచున్నావా?
ఓ పృథివీ! స్త్రీలను రక్షించని భర్తలను చూచి దుఃఖించుచు స్నావా? లేక, రాక్షసుల వలె పిల్లలను కష్టములకు గురిచేయు మానవు లను చూచి దుఃఖించుచున్నావా? లేక,- దురాచారపరులగు బ్రాహ్మణుల వద్దనున్న విద్యను గాంచి దుఃఖించుచున్నావా? లేక, బ్రాహ్మణిద్వేషులగు రాజులను సేవించే ఉత్తమబ్రాహ్మణులను చూచి శోకించుచున్నావా?
అధర్మముతో నిండియున్న దుష్టక్షత్రియులను చూచి శోకించుచు న్నావా? లేక, వారు నాశనము చేసి విడిచి పెట్టిన రాజ్యములను చూచి దుఃఖించుచున్నావా? లేక, భోజనము, పానము, వస్త్రము, స్నానము, స్త్రీసహవాసములలో విధిని షేధములను ప్రక్కనబెట్టి ప్రవర్తిల్లే మానవులను చూచి దుఃఖించుచున్నావా?
ఓ పృథివీమాతా! అట్లుగాక, నీ పెనుభారమును పోగొట్టుటకు అవ తరించి ఇప్పుడు నిన్ను విడిచి అంతర్ధానమును చెందిన శ్రీహరియొక్క లీలలను స్మరించి దుఃఖించుచున్నావా? ఆ లీలలు స్మరించువారికి మోక్ష మునిచ్చును గదా!
ఓ పృథివీమాతా! నీవు మనోవ్యాధిచే చాల చిక్కియున్నావు. నీ మనోవ్యాధికి గల కారణమును నాకు చెప్పుము. బలవంతులకంటె బలవత్త రమగు కాలము దేవతలచే పూజించబడే నీ సౌభాగ్యమును ఒకచో అప రించినదా యేమి?
ధరణ్యువాచ ।
పృథివి ఇట్లు పలికెను: ఓ ధర్మమా! నీవు నన్ను ప్రశ్నించిన విషయములన్నియు నీకు తెలిసినవే సుమా! నీవు శ్రీహరియొక్క అనుగ్రహ ముచే నాలుగు పాదములతో నున్నవాడవై మానవులకు సుఖముల నొసగె దవు.
ఓ పూజ్యా! సత్యము, శౌచము, దయ, సహనము, త్యాగము, సంతృప్తి, ఋజుస్వభావము, మనోనిగ్రహము, ఇంద్రియనిగ్రహము, తపస్సు, సమత్వము, కష్టసహిష్ణుత, క్రియలనుండి ఉపసంహారము, శాస్త్రవి జ్ఞానము, బ్రహ్మజ్ఞానము, వైరాగ్యము, ఈశ్వరభావము, పరాక్రమము, తేజ స్సు, సామర్థ్యము, స్మరణము, స్వతంత్రత, నైపుణ్యము, కాంతి, ధైర్యము, మృదుస్వభావము, అతిశయించిన ప్రతిభ, వినయము, సాధుస్వభావము, సాహసము, ఉత్సాహము, బలము, సౌభాగ్యము, గాంభీర్యము, స్థిరత్వ ము, శ్రద్ద, కీర్తి, పూజ్యత్వము, అహంకారము లేకుండుట మొదలైన అనేక సహజగుణములకు శ్రీహరి నిధానము. మహత్త్వాకాంక్ష గలవారు ఈ గుణ ములను కోరుచుందురు. ఇవి ఆయనయందు ఏ కాలమునందైననూ క్షీణించవు. అట్టి శ్రీహరి ఇప్పుడు ఈ లోకమునందు లేడు. ఈ లోకము పై పాప హేతువగు కలియొక్క చూపు పడినది. నేనీ లోకమును గురించి దుఃఖించు చున్నాను.
నేను నా గురించి మాత్రమే గాక, దేవతోత్తముడవగు నిన్ను, దేవత లను, పితరులను, మహర్షులను, సాధుపురుషులను, అన్ని వర్ణముల వారిని మరియు ఆశ్రమముల వారిని ఉద్దేశించి దుఃఖించుచున్నాను.
బ్రహ్మ మొదలగు పూజ్యులు లక్ష్మీదేవియొక్క కరుణాకటాక్షసాత మును కోరువారై ఆమెను శరణు పొంది చిరకాలము తపస్సును చేయు చుందురు. అట్టి లక్ష్మి తన నివాసస్థానమగు పద్మవనమును వి పెట్టి, ఆ పరమేశ్వరుని పాదపద్మముల సౌభాగ్యమును అతిశయించిన అనురాగ ముతో సేవించుచున్నది.
నేను అట్టి శ్రీకృష్ణభగవానునియొక్క శోభాయుకములగు పాదములయందలి పద్మము, వజ్రము, అంకుశము, ధ్వజము అనునాటి ముద్ర లచే అలంకరించబడిన దేహము గలదాననై, ఆ భగవానుని నుండి సంపదను పొంది ముల్లోకములను తలదన్ని ప్రకాశించెడి దానను కానీ, ఆ సంపద అంతరించినది. గర్వించియున్న నన్ను ఆ భగవానుడు విడిచి పెట్టినాడు.
స్వతంత్రుడగు ఆ పరమేశ్వరుడు పెనుభారముగా తయారైన రాక్ష సవంశములకు చెందిన రాజుల వంద అక్షౌహిణీలను నశింప జేసెను. నీ పాదములు లోపించియుండగా, ఆయన యాదవవంశములో సుందరరూ పుడై అవతరించి పురుషకారముచే నిన్ను (ధర్మమును) తనయందు పూర్ణ రూపముతో నిలబెట్టెను.
పురుషోత్తముడగు శ్రీకృష్ణుని విరహమును ఎవతే సహించగ ల్లును? ఆయన తన ప్రేమతో నిండిన చూపులతో, ప్రీతికరమగు చిరున వ్వుతో మరియు మధురమగు కబుర్లతో మధువనమునందలి సత్యభామ మొదలగు మానవతుల గర్వమును మరియు అభిమానమును తొలగించే ను. ఆయన పాదముల చిహ్నములు పడగానే నాకు పులకాంకురములు (ప చ్చని గడ్డి, పంటలు మొదలగునవి) ఉదయించును.
ఆ పృథివీధర్ములు ఈ విధముగా సంభాషించుచుండగా, పరీక్షిత్తు అని ప్రసిద్ధిని గాంచిన రాజర్షి తూర్పువైపు ప్రవహించే సరస్వతీనదియొక్క తీరమునందున్న కురుక్షేత్రమును చేరెను.
శ్రీమద్బాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో పదునారవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 16 of the Bhāgavata Mahā Purana is as follows:
Mahārāja Parīkshit rules the earth with supreme righteousness and chivalry, establishing virtue and protection for all living beings throughout his empire. While traveling across his realm, the king encounters a harrowing sight: a cruel shūdra dressed as a king abusing a bull standing on a single leg and a cow weeping in distress, who are revealed to be the personifications of Dharma, the deity of religion, and Bhūmi, the mother earth.