భాగవత మహా పురాణము
13 - త్రయోదశోఽధ్యాయః
సూత ఉవాచ ।
సూతుడు ఇట్లు చెప్పెను: విదురుడు తీర్థయాత్రలో మైత్రేయుని నుండి ఆత్మజ్ఞానమును పొంది, దానిచే పూర్ణ మైన జ్ఞానతృష్ణ గలవాడై, హస్తినాపురమునకు తిరిగి వచ్చెను.
విదురుని ముందులో మైత్రేయుని అనేకప్రశ్నలను వేసెను. కానీ, ఒకటి రెండు ప్రశ్నలకు సమాధానమును వినుసరికి ఆయనకు గోవిందుని యందు ఏకాంతమగు భక్తి కుదిరెను. తరువాత ఆయన ఆ ప్రశ్నలను ఉప సంహరించు కొనెను.
ఓ శౌనకమహర్షీ! విచ్చేసిన బంధువగు విదురుని చూచి, ధర్మరా జు, ఆం:సన సోదరులు, ధృతరాష్ట్రుడు, యుయుత్సువు, సంజయుడు, ఈసారుడు. కుంతీ గోంగారి గౌరి సుభగ ఉత కకి ఇతరంధువులు, వారి భార్యలు, సంతానము అందరు ప్రాణమే లేచి వచ్చినట్లు మహానందముతో యెదురేగిరి. వియోగము వలన కలిగిన ఆదుర్దాకు అధీ నులై యున్న వారందరు ఆయనను యథావిధిగా కౌగిలించుకొని, నమస్క రించి, పలుకరించి, కన్నుల వెంబడి ఆనందాశ్రుప్రవాహములను విడిచిరి. ధర్మరాజు ఆయనను ఆసనముపై కూర్చుండబెట్టి సత్కరించెను.
విదురుడు భోజనమును చేసి విశ్రమించి కులాసాగా ఆసనముపై కూర్చుని యుండగా, ధర్మరాజు వినయముతో వంగి నమస్కరించి, వారందరు వినుచుండగా, ఇట్లు పలికెను.
యుధిష్ఠిర ఉవాచ ।
ధర్మరాజు ఇట్లు పలికెను: మేము మీ నీడలో పెరిగి పెద్దవారమైతి మి. మా తల్లిని మమ్ములను మీరు విషము, అగ్ని మొదలగు ఆపదలసమూహమునుండి రక్షించితిరి. మమ్ములను మీరు ఇప్పుడు స్మరించు చున్నారా?.
మీరు భూమండలమును సంచరించే సమయములో జీవననిర్వా హమునెట్లు సాగించితిరి? ఏయే తీర్థములను, ముఖ్యమగు క్షేత్రములనుసేవించితిరి?
ఓ ప్రభూ! మీవంటి భగవద్భక్తులు తామే స్వయముగా తీర్థముల వంటివారు. మీ హృదయములో గదాధారియగు శ్రీకృష్ణుడు సర్వదా నివా సముండుటచే, మీ వలన తీర్థములు కూడ పవిత్రమగును.
ఓ తండ్రీ! శ్రీకృష్ణుడే దైవముగా గల యాదవులు మాకు మిత్రులు మాత్రమే గాక బంధువులు కూడా. వారెవరైనా మీకు కనబడినారా? వారిని గురించి మీరు విన్నారా? వారు తమ నగరములో సుఖముగా నున్నారా?
ధర్మరాజు ఈ విధముగా ప్రశ్నించగా, విదురుడు తాను చూచిన సర్వమును ఉన్నది ఉన్నట్లుగా వరుసగా వర్ణించి చెప్పెను. కాని, యదువం శవినాశమును గురించి మాత్రము చెప్పలేదు.
దయామయుడు, దుఃఖించుచున్న వారిని చూచి సహించ లేని వాడు అగు విదురుడు ఎంతయు విషాదకరమైనది, మానవులకు సహింపశక్యము కానిది, తనంత తానుగా దాపురించినది అగు ఆ యదుకులవంశవి నాశమును గూర్చి చెప్పలేదు.
తరువాత ధర్మరాజు విదురుని దేవత వలె సత్కరించెను. ఆయన పెద్ద అన్నగారగు ధృతరాష్ట్రునకు తత్త్వమునుపదేశించుట ద్వారా శ్రేయ స్సును కలిగిస్తూ, అందరికీ ప్రీతిని కలిగిస్తూ, కొంతకాలము సుఖముగా అచటనే నివసించెను.
యముడు మాండవ్యమహర్షియొక్క శాపముచే వంద సంవత్సర ములు విదురుడుగా అవతరించి ఉండెను. ఆ కాలములో అర్యముడు పాపులను దండించే కార్యమును ధర్మబద్ధముగా నిర్వహించెను.
ధర్మరాజు రాజ్యమును తిరిగి పొంది వంశోద్ధారకుడగు మనుమని చూస్తూ, లోకపాలకుల వంటి సోదరులతో గూడినవాడై, సర్వోత్కృష్టమగు సంపదను అనుభవిస్తూ ఆనందించేను.
ఈ విధముగా ఆ పాండవులు ఇల్లు వాకిలి అను వాటియందు ఆసక్తి గలవారై గృహవ్యాపారములలో మునిగియుండగా, తెలియకుండు గనే ఆయుర్దాయము గడచి, ఎవ్వరికైననూ దాట శక్యము కాని మృత్యువు - సంప్రాప్తమయ్యెను.
ఆ విషయమును తెలుసుకొని విదురుడు ధృతరాష్ట్రునితో, ఓ రాజా! ముంచుకు వచ్చుచున్న ఈ భయమును గమనించి, నీవు తొంద రగా నిషమించుము అని పలికెను.
ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఈ లోకములో ఎక్కడనైననూ దేనివల నైననూ మృత్యువునకు ప్రతీకారము లేదు. అట్టి మృత్యుదేవత మనందరికీ సమీపించినది.
మృత్యుగ్రస్తుడగు మానవుడు తనకు అత్యంతప్రీతిపాత్రములగు ప్రాణములకు కూడ నిశ్చయముగా దూరమగును. ఇక ధనము మొదలగు వాటిని గురించి చెప్పునదేమున్నది?
ఆ నీ తండ్రులు సోదరులు మిత్రులు మరియు పుత్రులు యుద్ద ములో మరణించినారు. నీ వయస్సు దాటి పోయినది. దేహము ముదుసలి అయినది. అయిననూ, నీవు ఇంకనూ ఇతరుల ఇంటి పంచన వ్రేలాడుచున్నావు.
ఆశ్చర్యము! ప్రాణులకు గల జీవితాశ చాల పెద్దది. అది నిన్ను పూర్తిగా తన వశము చేసుకున్నది. ఏలయనగా, నీవు ఇంటి కాపలా కుక్క వలె భీముడు తెచ్చి పెట్టే ఆహారమును తినుచున్నావు.
పాండవులను అగ్నిప్రమాదములో చంపే ప్రయత్నము జరిగినది. వారీకి విషము ఈయబడినది. వారి భార్య అవమానించ బడినది. వారి రాజ్యము . మరియు ధనము అపహరించ బడినవి. అట్టి పాండవులు ఈ దుష్కృత్యములన్నింటికీ ఏదో విధముగా కారణమైన నీకు దయతో ఇచ్చిన ప్రాణములకు గల విలువ ఎంత?
దీనుడవు (అజ్ఞానివి) అగు నీవు ఇంకనూ జీవించ గోరుచున్నావు. నీకు ఇష్టము కాకున్ననూ, పెద్ద వయసుచే శిథిలము చేయబడిన నీ ఈ శరీ రము నీవు కట్టే వస్త్రముల జంట వలె క్షీణించు చున్నది.
ఎవడైతే వైరాగ్యమును పొంది మమకారమును వీడి తన చిరునా మాయైననూ ఇతరులకు తెలియని స్థితిలో ధర్మము మొదలగు ప్రయోజన ములను సాధించే సామర్థ్యము లేని ఈ దేహమును విడిచి పెట్టునో, వాడే ధీరపురుషుడని పెద్దలు చెప్పెదరు.
ఎవడైతే తనంత తానుగా గాని, ఇతరుని ఉపదేశము వలన గాని వైరాగ్యమును పొంది, మనోనిగ్రహము గలవాడై, హృదయములో హరవి నిలిపి, గృహమునుండి నిర్గమించి సన్న్యసించునో, వాడు మానవులలో శ్రేష్ఠుడు.
ఈ పైన రాబోయే కాలము ప్రధానముగా మానవుల సద్గుణము లను క్షీణింప జేయును. కావున, నీవు నీ బంధువర్గమునకు తెలియని విధ ముగా ఉత్తరదిక్కు వైపుగా పొమ్ము.
ఈ విధముగా సోదరుడగు విదురుడు ఉపదేశించగా, అంధుడు అజమీడవంశజుడు అగు ధృతరాష్ట్రమహారాజు ఆ ఉపదేశముచే కలిగిన వివేకదృష్టిచే తనవారియందు గల దృఢమగు మమకారపాశములను తెంపుకొని, సోదరుడగు విదురుడు దారిని చూపుచుండగా, ఇంటినుండి బయట పడెను.
అభిమానవంతులగు వీరులకు యుద్ధములో శత్రువుచే న్యాయబ ద్దముగా కొట్టబడిన గట్టి దెబ్బ యైననూ ఆనందకరమే. అదే విధముగా, సన్న్యాసముచే సకలప్రాణులకు అభయప్రదానమును చేసే యతులకు హిమాలయములు ఆనందమును కలిగించుచుండును. సుబలుని కుమార్తె, సచ్చీలవతి మరియు పతివ్రత అగు గాంధారి అట్టి హిమాలయములకు భర్త వెనుకనే వెళ్లాను.
ధర్మరాజు మిత్రదేవతాకమగు ప్రాతస్సంధ్యను ముగించి, అగ్ని హోత్రమును చేసి, బ్రాహ్మణులకు నువ్వులు ఆవులు భూమి మరియు బంగారము అను వాటిని దానము చేసి, వారికి నమస్కరించి, పెద్దలకు నమస్కరించుటకై ఇంటికి వెళ్లగా, అచట విదురుడు, ధృతరాష్ట్రుడు మరియు గాంధారి కానరాలేదు.
ఉద్వేగముతో నిండిన మనస్సు గల ధర్మరాజు అక్కడ కూర్చుని యున్న సంజయునితో, ఓ సంజయా (గవల్గణుని పుత్రుడు) ! పెద్దవాడు, కళ్లు లేనివాడు నగు మా తండ్రి ఏడి? అని ప్రశ్నించెను.
పుత్రులు సంహరించ బడిన కారణముగా దుఃఖితురాలై యున్న తల్లి గాంధారి ఎక్కడ? మహోపకారియగు పినతండ్రి విదురుడు ఎక్కడ? బంధువులు సంహరించ బడుటచే దుఃఖితుడై యున్న ధృతరాష్ట్రుడు నన్ను తప్పు పట్టుచున్నవాడై గంగలో దుమికినాడా యేమి?
మా తండ్రిగారు మరణించినప్పుడు మేము చాల చిన్న పిల్లలము. మమ్ములను మా తండ్రిగారి సోదరులిద్దరు (విదురుడు, ధృతరాష్ట్రుడు) ఆపదనుండి రక్షించిరి. వారిద్దరు ఇక్కడనుండి ఎక్కడకు వెళ్లిరి?
సూత ఉవాచ ।
సూతుడిట్లు పలికెను: సంజయుడు తనకు ప్రభువగు ధృతరాష్ట్ర మహారాజును కానరాక, దయచే మరియు ప్రేమచే కల్లోలితమైన మనస్సు గలవాడై, అధికమగు మానసిక పీడను పొంది, వియోగముచే కృశించినవా డై, ధర్మరాజునకు బదులు చెప్పలేదు.
సంజయుడు కొంత సేపటికి కన్నీటిని తుడుచుకొని తనకు తాను ధైర్యము చెప్పుకొని, తన ప్రభువగు ధృతరాష్ట్రుని పాదములను స్మరిస్తూ బదులు చెప్పెను.
సంజయ ఉవాచ ।
సంజయుడిట్లు పలికెను: వంశమునకు ఆనందమును కలిగించే గొప్ప బాహువులు గల ఓ ధర్మరాజా! నీ తండ్రులగు విదురధృతరాష్ట్రుల మనోగతము గాని, గాంధారి తలపు గాని నాకు తెలియదు. ఆ మహాత్ములు నన్ను వంచించినారు.
ఇంతలో పూజ్యుడగు నారదమహర్షి తుంబురునితో కలిసి అచటకు వచ్చెను. ధర్మరాజు సోదరులతో గూడి లేచి యెదురేగి వారికి నమస్క రించి, దుఃఖితుడై యుండుటచే పూజయొక్క చేష్టను చేసెను.
యుధిష్ఠిర ఉవాచ ।
ధర్మరాజు ఇట్లు పలికెను: ఓ పూజ్యా! నా తండ్రులగు విదురధృత రాష్ట్రులు, యుద్దములో పుత్రులు సంహరించ బడుటచే పీడితురాలై దుఃఖి స్తున్న నా తల్లి గాంధారి ఇక్కడనుండి ఎక్కడకు వెళ్లినారు? వారి పోకడ నాకు తెలియకున్నది. ఈ శోకసముద్రమును తరింప జేయగల నావికుడవు పూజ్యుడవగు నీవు మాత్రమే.
తరువాత పూజ్యుడగు నారదమహర్షి ఇట్లు పలికెను: ఓ రాజా! నీవు ఎవ్వరి గురించి యైననూ శోకించ వలదు. ఏలయనగా, ఈ జగత్తు ఈశ్వరునకు వశమై యున్నది.
ఈ లోకపాలకులు ఏ ఈశ్వరుని పూజించెదరో, ఆయనయే ప్రాణులను కలిపి విడదీయుచుండును.
ముక్కునందు కుట్టబడి తమ తమ ళ్లతో పెద్ద త్రాటికీ కట్టబడిన ఎద్దులు యజమాని వస్తువులను మోయు విధముగా, మానవులు వీధినీ షే ధరూపమగు వేదము అనే త్రాటికి తమ తమ వర్ణాశ్రమాదనామములచే కట్టబడినవారై ఈశ్వరుని ఆజ్ఞను పాలించుచున్నారు (పూజించుచున్నారు).
ఈ లోకములో ఆటబొమ్మలకు ఆటగాని ఇచ్చననుసరించి కలయిక గాని, విడిపోవుట గాని కలుగుచుండునో, అదే విధముగా మానవు లకు ఈశ్వరుని ఇచ్చనే సంయోగవియోగములు కలుగుచుండును.
జీవుడు నిత్యుడు (చైతన్యరూపములో) అని గాని, అనిత్యుడు. (దేహరూపములో) అని గాని, రెండు (ప్రకృతీపురుషుల, అనగా అనృతసత్య ముల కలయిక) అని గాని, ఏదీ కాదు (శుద్ధపరబ్రహ్మస్వరూపుడు) అని గాని నీవు ఏ పక్షమును స్వీకరించిననూ, మోహము వలన కలిగే ఆసక్తిని మినహాయిస్తే, వారిని గురించి నీవు శోకించుట తగదు.
ఓయీ! కావున, రక్షకుడు లేని దీనులగు ఆ ధృతరాష్ట్రాదులు, నేను లేకుండగా ఎట్లు జీవించెదరు? అనే అజ్ఞానకృతమగు మానసిక-ఆందోళనను నీవు విడిచి పెట్టుము.
ఈ దేహము అయిదు భూతములతో నిర్మాణమై, కాలమునకు ప్రారబ్ధకర్మకు సత్త్వరజస్తమోగుణములకు వశమై యున్నది. కొండచిలువ నోటికి చిక్కిన పురుషుడు మరియొకనిని ఎట్లు రక్షించగలడు? అదే విధము గా, అట్టి ఈ దేహము ఇతరులను ఎట్లు రక్షించ గల్గును?
ప్రాణులలో చేతులు గలవి చేతులు లేని ప్రాణులను, నాలుగు కాళ్ల జంతువులు కాళ్లు లేని ప్రాణులను, పెద్దవి చిన్నవాటిని తిని బ్రతుకుచున్నవి.
ఓ రాజా! అట్టి ఈ జగత్తు ఆ భగవానుడే. అద్వితీయుడు, భోక్తలగు జీవుల స్వరూపమైనవాడు, చైతన్యస్వరూపుడు అగు పరమేశ్వరుడు మాయాశక్తిచే సర్వమునకు లోపల మరియు బయట అనేకవిధములుగా కన్పట్టుచున్నాడు. సర్వమునందు ఆ ఈశ్వరుని మాత్రమే చూడుము.
ఓ మహారాజా! జగదుత్పత్తికి హేతువు అగు అట్టి ఈ పరమేశ్వ రుడు ఈ సమయములో రాక్షసవినాశము కొరకై ఈ భూలోకములో మృత్యురూపుడై అవతరించినాడు.
దేవకార్యము ఇంచుమించు పూర్తి అయినది. కొద్దిగా మిగిలి యున్నది. శ్రీకృష్ణభగవానుడు దాని కొరకు వేచియున్నాడు. ఆయన ఈ లోకములో నున్నంత వరకు, మీరు కూడ వేచి యుండుడు.
ధృతరాష్ట్రుడు విదురునితో మరియు. తన భార్యయగు గాంధా రితో కలిసి హిమవత్పర్వతమునకు దక్షిణదిక్కునందు గల ఋషుల ఆశ్ర మమునకు వెళ్లినాడు.
మందాకిని అచట తాను సప్త మహర్షుల ప్రీతి కొరకై ఏడు పాయ లుగా విడిపోయి ప్రవహించెను. అందు వలననే, ఆ తీర్థమునకు సప్తస్రో తస్సు అను పేరు వచ్చెను.
ధృతరాష్ట్రుడు ఆ తీర్థమునందు మూడు పూటలా స్నాన సెసు చేసి, అగ్నిహోత్రమును యథావిధిగా చేసుకుంటూ, నీటిని మాత్రమే కాక తూ, పుత్రాదులయందు ఆసక్తిని వీడి, ప్రసన్నమగు మనస్సు గలవాడై ఉన్నాడు.
ఆయన ఆసనసిద్ధిని పొంది ప్రాణాయామమును చేసి ఇంద్రియములను మనస్సును ఉపసంహరించి శ్రీహరిని ధ్యానము చేసి సతరజస్త మోగుణముల దోషములను నశింప జేసుకొని గుణాతీతుడైనాడు.
ధృతరాష్ట్రుడు మనస్సును విజ్ఞానాత్మయందు, దానిని క్షేత్రజ్ఞుని యందు, ఆ ద్రష్ణను ఘటాకాశమును మహాకాశమునందు వలె, సర్వము నకు ఆశ్రయమగు బ్రహ్మయందు విలీనము చేసి యున్నాడు. మాయాశక్తి యొక్క సత్త్వరజస్తమోగుణముల ఫలరూపములైన వాసనలు ఆయనలో నశించినవి. ఆయన ఇంద్రియములను, మనస్సును నిరోధించి, ఆహార మును పూర్తిగా విడిచి పెట్టి, విగ్రహము వలె కదలకుండగా నున్నాడు.
ఓ రాజా! సర్వకర్మసన్న్యాసమును చేసియున్న ఆయనకు నీవు విఘ్నమును కలిగించ వద్దు సుమా! ఈ నాటినుండి అయిదవ రోజున ఆయన తన దేహమును విడువగలడు. ఆ దేహము బూడిద యగును.
గార్హపత్యము, ఆహవనీయము, అస్వాహార్యపచనము అనే అగ్ను లు మరియు పర్ణశాలతో కలిపి ఆయన దేహము భస్మమగుచుండగా, బయటనున్న గాంధారి కూడ దానియందు ప్రవేశించును.
ఓ ధర్మరాజా! విదురుడు ఆ అద్బుతమును చూచి, ధృతరాష్ణుడు ముక్తిని పొందినందులకు ఆనందమును, గాంధారీధృతరాష్ట్రులు మరణించినందులకు దుఃఖమును అనుభవించి, తీర్థాటన కొరకై అచ్చోటీ నుండి వెళ్లగలడు.
నారదుడు ఈ విధముగా పలికి, తరువాత తుంబురునితో కలిసి స్వర్గమునకు వెళ్లాను. ధర్మరాజు నారదుని మాటలను తలచుకొని దుఃఖమును విడిచి పెట్టెను.
శ్రీమద్భాగవతములోని ప్రథమస్కంధములో పదమూడవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 13 of the Bhāgavata Mahā Purana is as follows:
Vidura returns from his long pilgrimage, transformed with divine wisdom after receiving knowledge from Maitreya Rishi, and re-enters Hastināpura to enlighten his elder brother Dhṛtarāshtra about the impermanence of material life. Moved by Vidura's piercing instructions on detachment and the inevitability of time, Dhṛtarāshtra silently leaves the palace in the dead of night accompanied by his devoted wife Gāndhārī to pursue severe austerities in the Himālayas, ultimately attaining liberation and merging into the spiritual realm.