భాగవత మహా పురాణము
12 - ద్వాదశోఽధ్యాయః
శౌనక ఉవాచ ।
శౌనకమహర్షి ఇట్లు పలికెను: అశ్వత్థామ గొప్ప తేజస్సు గల బ్రహ్మాస్త్రమును ప్రయోగించి ఉత్తర గర్భమునందలి శిశువును సంహరించ గా, శ్రీకృష్ణభగవానుడు మరల ఆ శిశువునకు ప్రాణము పోసినాడు.
గొప్ప బుద్ధిశాలి, మహాత్ముడు అగు పరీక్షిత్తు జన్మించి, గొప్ప కార్యములను చేసి, మరణించిన వృత్తాంతమెట్టిది ? మరణించిన తరువాత ఆయన ఎట్టి గతిని పొందినాడు?
నీవు చెప్ప దలచుకున్నచో, నేనీ విషయమును వినగోరుచున్నా ను. శుకమహర్షిచే జ్ఞానోపదేశము చేయబడిన ఆ పరీక్షిత్తుయొక్క వృత్తాంత మును శ్రద్ధాళువులమగు మేము వినగోరుచున్నాము.
సూత ఉవాచ ।
శ్రీకృష్ణుని పాదములను సేవించుటచే కోరికలన్నింటినుండియు విరక్తిని పొందిన ధర్మరాజు తన తండ్రి వలెనే ప్రజారంజకముగా రాజ్యము నేలెను.
ఆయనకు సంపదలు గలవు. పోటీలో ఆయన క్రతువులను చేసి, పుణ్యలోకములను జయించినాడు. ఆయనకు భార్య, సోదరులు గలరు. రాజ్యము గలదు. జంబూద్వీపముపై పెత్తనము గలదు. ఆయన కీర్తి స్వర్గము వరకు ప్రాకెను.
ఓ మహర్షులారా! దేవతలు కూడ కోరుకునే ఈ భోగములు శ్రీకృ ష్ణునియందు లగ్న మైన మనస్సు గల ధర్మరాజునకు ఆనందమును కలి గించినవా? లేదు. ఆకలి గొన్నవానికి ఆహారము తక్క ఇతరవిషయములు ప్రీతిని కలిగించునా?
ఓ కౌశికమహర్షీ! తల్లి గర్భములోనున్న వీరుడగు ఆ పరీక్షిత్తు తనను బ్రహ్మాస్త్రముయొక్క తేజస్సు దహించి వేయుచుండగా, ఒకానొక పురుషుని కనుగొనెను.
బొటనవ్రేలు. పరిమాణము గలవాడు, స్వచ్చమైనవాడు, ప్రకాశించే బంగరు కిరీటమును ధరించినవాడు, మిక్కిలి సుందరమగు రూపము గలవాడు, నల్లని వాడు, మెరుపు వలె పచ్చని వస్త్రములను దాల్చినవాడు, నిర్వికారుడు, అందమైన పొడవాటి నాలుగు చేతులు గలవాడు, మేలిమి బంగారముతో చేసిన కుండలములను ధరించినవాడు, ఎర్రని కన్నులవాడు అగు ఆ పురుషుడు చేతిలోని గదను నిరంతరముగా తనకు దగ్గరగా నలు వైపులా గిరగిర త్రిప్పుతూ, సూర్యుడు మంచును పారద్రోలినట్లు బ్రహ్మాస్త్ర ముయొక్క తేజస్సును శాంతిపజేయుచుండగా, గర్భమునందలి ఆ శిశువు చూచి, ఈతడు ఎవడు? అని ఆలోచించెను.
ఇంద్రియములకు మనస్సునకు అందని స్వరూపము గలవాడు, ధర్మమును రక్షించువాడు, సర్వవ్యాపకుడు అగు శ్రీహరిభగవానుడు ఆ అస్త్రమును శాంతింపజేసి, ఆ పదిమాసముల శిశువు చూచుచుండగా, అచటనే అంతర్ధానమాయెను.
తరువాత సకల లక్షణములు క్రమముగా ఒకదానిని మించి మరి యొకటి ఉన్న, అనుకూలములగు ఇతరగ్రహములతో కూడిన శుభగ్రహ ములు ఉదయించియున్న సమయములో పాండువంశమును నిలబెట్టే శిశువు పుట్టెను. ఆ తేజశ్శాలియగు బాలుడు మరల జన్మించిన పాండుమ హారాజువలె నుండెను.
ధర్మరాజు సంతోషముతో నిండిన అంతరంగము గలవాడై, ధౌమ్యుడు కృపాచార్యుడు మొదలగు బ్రాహ్మణులచే పుణ్యాహవాచన మును జాతకర్మను చేయించెను.
సంతానము కలిగిన పుణ్యసమయములో దానమును చేయవలె ననే దానధర్మము తెలిసిన ఆ ధర్మరాజు బ్రాహ్మణులకు బంగారము, గోవులు, భూమి, గ్రామములు, మంచి ఏనుగులు, జాతి గుర్రములు, మరియు మంచి ఆహారము అనువాటిని దానము చేసెను.
సంతోషించిన బ్రాహ్మణులు వినయశీలియగు ఆ ధర్మరాజుతోనిట్ల నిరిః ఓ పురువంశ శిరోమణీ! కురువుల శుద్ధమగు ఈ వంశపరంపర అనివా ర్యమగు దైవముచే నాశము చేయబడగా, సర్వసమర్థుడగు విష్ణువు మిమ్ములననుగ్రహించి ఈ బాలకుని ఇచ్చినాడు.
కావున, ఈతడు లోకములో విష్ణురాతుడు (విష్ణువుచే ఈయబడిన వాడు) అను పేరుతో గొప్ప కీర్తిని పొంది, గొప్ప భగవద్భక్తుడు మరియు మహాత్ముడు కాగలడు. సందేహము లేదు.
యుధిష్ఠిర ఉవాచ ।
ధర్మరాజు ఇట్లు పలికెను: ఓ మహాత్ములారా! ఈ బాలకుడు సాధుపురుషులచే కొనియాడబడే కీర్తిని సంపాదించి, మా వంశమునకు చెందిన పవిత్రమగు కీర్తిగల మహాత్ములగు రాజర్షులను అనుసరించునా?
బ్రాహ్మణా ఊచుః ।
ఓ ధర్మరాజా! బ్రహ్మవేత్తలయందు ప్రీతిగలవాడు, దశరథరా ముని వలె సత్యసంధుడు అగు ఈతడు సాక్షాత్తు మునుపుత్రుడగు ఇక్ష్వా కువు వలే ప్రజలను రక్షించును;
ఈతడు ఉశీనరదేశాధిపతియగు శిబిచక్రవర్తి వలే దాతయై శరణు పొందిన వారిని రక్షించును. ఈతడు దుష్యంతపుత్రుడగు భరతుని వలే తన వారి కీర్తిని మాత్రమే గాక యాజ్ఞికుల కీర్తిని కూడ విస్తరింప జేయగలడు. .
ఈతడు అర్జునుడు మరియు కార్తవీర్యార్జునుడు అనే ఇద్దరితో సమానమైన అగ్రేసరుడగు ధనుర్ధారి కాగలడు. ఇతడు అగ్నిహోత్రము వలే జయించ శక్యము కానివాడు, సముద్రము వలె తెలియజాలని గాంభీర్యము గలవాడు కాగలడు.
ఈతడు సింహమువంటి పరాక్రమము గలపోడై, హీమంతుని వలె సత్పురుషులచే సేవించబడ గలడు. ఈతడు భూమీ వలె క్షమ గలవా డు, తల్లిదండ్రుల వలె సహనశీలము గలవాడు కాగలడు.
ఈతడు సమభావమునందు బ్రహ్మతో, అనుగ్రహించుటలో శివుని తో, ప్రాణులనన్నింటినీ కాపాడుటలో లక్ష్మీపతియగు విష్ణుభగవానునితో పోల్చ దగినవాడు కాగలడు.
ఈతడు శ్రీకృష్ణభక్తుడై సకలసద్గుణముల మహిమను కలిగి, రంతి దేవుని వలె దయాశీలి, యయాతి వలె ధర్మాత్ముడు కాగలడు.
ఈతడు ధైర్యముతో బలిచక్రవర్తితో సమానమగువాడు కాగలడు. ఈతడు ప్రహ్రాదుని వలె శ్రీకృష్ణునియందు దృఢమగు భక్తిని కలిగియుండును. పెద్దలను సేవించే ఈతడు అనేకములగు అశ్వమేధయాగములను చేయగలడు.
ఈతడు రాజర్షులగు పుత్రులకు తండ్రియై, దుష్టులను దండించి, భూమాత కోరకు ధర్మము కోరకు కలిని నిగ్రహించ గలడు.
ఈతడు బ్రాహ్మణబాలకునిచే ప్రేరితుడైన తక్షకుని వలన తనకు మరణము కలుగునని విని సంసారమునందు ఆసక్తిని వీడి, శ్రీహరియొక్క ధామమును పొందగలడు.
ఓ ధర్మరాజా! ఈతడు వ్యాసపుత్రుడగు శుకమహర్షి వలన ఆత్మ జ్ఞానమును శ్రవణము చేసి, ఈ శరీరమును గంగాతీరములో విడిచి పెట్టి, నిరంకుశమగు అభయస్థానము (మోక్షము) ను నిశ్చయముగా పొందును.
జాతకపండితులు అందరు ఈ విధముగా రాజునకు జాతకఫల మును చెప్పి, ఆయనచే సత్కరించ బడినవారై, తమ గృహములకు వెళ్లిరి.
ఈ విష్ణురాతుడు తాను గర్భములో చూచిన పురుషుని గుర్తుకు తెచ్చుకొని, ఆయన వీరిలో నున్నాడా యేమి అని తన ఎదురుగా నున్న మనుష్యులను పరీక్షగా చూసేడివాడు. కావుననే, ఆయనకు లోకములో పరీక్షిత్తు అను పేరు ప్రసిద్ధిని గాంచినది.
శుక్లపక్షములో కొత్త కొత్త కళలు వచ్చి చేరుచుండగా ప్రతిదినము పెరిగే చంద్రుని వలె, ఆ రాజకుమారుడు ధర్మరాజాదులచే పెంచబడుతూ దినదిన ప్రవర్ధమానుడు కాజొచ్చెను.
జ్ఞాతిద్రోహము వలన కలిగిన దోషమును పరిహరించుటకై ధర్మ రాజు అశ్వమేధయాగమును తల పెట్టెను. కాని, దానికి కావలసినంత ధనము ఆయన వద్ద లేకుండెను. పన్ను వేసి మరియు దుష్టులను శిక్షించి తద్ద్వారా ధనమును రాబట్టుట ఆయనకు సమ్మతము కాదు. కావున, ఆయన మరియొక ఉపాయమును ఆలోచించు చుండెను.
ధర్మరాజుగారి అభీష్టమును గమనించిన సోదరులు శ్రీకృష్ణుని ప్రోత్సాహముచే ఉత్తరదిక్కునందు పూర్వము మరుత్తమహారాజు యజ్ఞ మును చేసి వదిలి పెట్టి వెళ్లిపోయిన బంగరు పాత్రలు మొదలగు సంప దను, అట్టి ద్రవ్యముపై రాజునకు గల అధికారమును బట్టి, తీసుకువచ్చిరి.
ధర్మపుత్రుడగు ధర్మరాజు జ్ఞాతిద్రోహము వలన కలిగిన దోషము నకు భయపడి ఆ ధనముతో యజ్ఞసామగ్రిని సంపాదించుకొని, మూడు అశ్వమేధయాగముల ను చెసెను.
శ్రీకృష్ణభగవానుడు ధర్మరాజుయొక్క ఆహ్వానమునందుకొని వచ్చి, బ్రాహ్మణుల సాహాయ్యముతో ధర్మరాజుచే యజ్ఞమును చేయించి, ప్రియమిత్రులగు పాండవుల ప్రీతి కొరకై కొన్ని మాసములు అచటనే మకాము చేసెను.
ఓ శౌనకమహర్షీ! తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజుగారి అనుమతిని తీసుకొని, ద్రౌపది, అర్జునుడు, బంధువులు మరియు యాదవులు. వెంట రాగా ద్వారకకు వెళ్లాను.
శ్రీమద్భాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో పన్నెండవ అధ్యాయము ముగిసినది .
Summary of chapter 12 of the Bhāgavata Mahā Purana is as follows:
King Yudhishtira performs three horse sacrifices to celebrate the divine order and honors the birth of his grand-nephew, the son of Abhimanyu and Uttarā, who was protected by Lord Kṛshṇa in the womb. The newborn child, having seen the Lord while still in the womb, constantly examined every person he met to find that same divine form, earning him the name Parīkshit, and the learned brāhmaṇas present at his birth prophesied his future greatness, unmatched chivalry, devotion, and his eventual ultimate departure.