15 -  పంచదశోఽధ్యాయః

సూత ఉవాచ

సూతుడు ఇట్లు పలికెను: శ్రీకృష్ణుని వియోగముచే దుఃఖించు చున్న, శ్రీకృష్ణుని ప్రియమిత్రుడగు అర్జునుని రూపము చూడగనే అనేక ములగు ఆశంకలకు తావునిచ్చుచుండెను. కావుననే, అన్నగారగు ధర్మరాజు ఆ రూపమును చూచి పలువిధముల ప్రశ్నలను వేసెను.

దుఃఖముచే అర్జునుని హృదయము నిండి, పద్మమువంటి ముఖము వాడిపోయెను. ఆతని ముఖములో కాంతి లేదు. ఆతడు శ్రీకృష్ణ . ప్రభుని గురించి మాత్రమే ఆలోచిస్తూ, బదులు చెప్పలేక పోయేను.

అర్జునునకు దుఃఖముచే కన్నీరు ఉబుకుచుండెను. ఆతడు దానిని చేతితో తుడుచుకొని, అతికష్టముతో కన్నీరు ప్రవహించకుండగా ఆపుకొనే ను. కంటికి కానరాని శ్రీకృష్ణునియందలి అతిశయించిన ప్రేమ వలన పుట్టిన ఉత్కంఠచే కల్లోలితహృదయుడై ఉన్న అర్జునుడు రథమును తోలుట మొదలగు సందర్భములలో శ్రీకృష్ణునితో తనకు గల చనువును, ఆయన చూపిన స్నేహభావమును, హితైషిత్వమును గుర్తు చేసుకొను చూ, కన్నీటితో బొంగురు పోయిన కంఠముతో అన్నగారగు ధర్మరాజును ఉద్దేశించి ఇట్లు పలికెను.

అర్జున ఉవాచ

అర్జునుడిట్లు పలికెను: ఓ మహారాజా! బంధువు రూపములో నున్న శ్రీహరి నన్ను మోసగించినాడు. దేవతలకు కూడ ఆశ్చర్యమును గొలిపే నా గొప్ప తేజస్సును ఆయన అపహరించినాడు.

ప్రాణము పోగానే ఈ దేహము శవము అని వ్యవహరింప బడును. అదే విధముగా, శ్రీకృష్ణుని క్షణమాత్రవియోగముచే ఈ లోకములో చూచి ఆనందించ దగినది ఏమీ కానరాదు.

ద్రుపదమహారాజు ఏర్పాటు చేసిన ద్రౌపదీస్వయంవరమునకు విచ్చేసిన రాజులందరు స్వయంవరమునకు ఆరంభములో ద్రౌపదియం దలి కామనచే మిక్కిలి మదించియుండిరి. కాని, నేను శ్రీకృష్ణుని ఆశ్ర యము వలన లభించిన బలముతో వారి తేజస్సును అపహరించుట మాత్రమే గాక, ధనస్సును ఎక్కు పెట్టి మత్స్యయంత్రమును గురి తప్పకుండగా కొట్టి, ద్రౌపదిని పొందితిని.

అహో! ఆ శ్రీకృష్ణుని సన్నిధిలో నేను దేవతాగణములతో కూడియున్న ఇంద్రుని నా బలముతో శీఘ్రముగా జయించి, ఖాండవవనమును అగ్నికి సమర్పించితిని. ఆ సందర్భములోననే మయుడు అద్భుతమగు పముతో మరియు ఇంద్రజాలములతో కూడియున్న సభను నిర్మించిఇచ్చెను. అదే సమయములో నీవు చేసిన రాజసూయయాగమునకు సర్వ దిక్కులనుండి రోజులు బహుమానములను తీసుకొని వచ్చి సమర్పించిరి. ఇది అంతయు ఆ శ్రీకృష్ణుని అనుగ్రహముచే సంప్రాప్తమయ్యేను.

పూజ్యుడు, పదివేల యేనుగుల ఉత్సాహము మరియు బలము గలవాడు, నీ సోదరుడు అగు భీమసేనుడు శ్రీకృష్ణుని తేజస్సుచే, రాజు లందరిని తన కాలిక్రింద తొక్కి పెట్టిన జరాసంధుని సంహరించి, వానిచే భైరవయాగములో బలినిచ్చుటకై తీసుకు రాబడిన రాజులను విడిపించేను. ఆ రాజులు కృతజ్ఞతాపూర్వకముగా నీ రాజసూయయాగమునకు ఉపహార ములను తీసుకొని వచ్చిరి.

రాజసూయయాగములో గొప్ప అభిషేకము చేయబడిన నీ భార్య యొక్క కేశపాశమును జూదగాళ్లు నిండు సభలో పట్టుకొని లాగి అవమా అంచగా, ఆమె కన్నీళ్లతో నిండిన ముఖముతో శ్రీకృష్ణుని పాదములపై పడే ను. ఆయన ఆ జూదగాళ్ల భార్యలు తమ భర్తలు మరణించగా జుట్టు విర భోసుకొని దుఃఖించునట్లు చేసెను.

దుర్వాసుడు పదివేల మంది శిష్యులతో కలిసి పంక్తికి అగ్రభాణి ములో భుజించును. మన శత్రువగు దుర్యోధనుడు ఆయనను అరణ్యవా పక్షు చేతుచున్న మన వద్దకు షంషీ మనకు అంతు లేని ఆపదను కల్పింసు.వ శ్రీకృష్ణుడు అడవికి వచ్చి, కూర వండిన పాత్రలో మిగిలి యున్న శాకకణమును భక్షించగా, నదిలో స్నానమును చేయుచున్న దుర్వాసునీ శిష్యవర్గము కేవలము తాము మాత్రమే గాక, ముల్లోకములు కూడ తృప్తిని చెందినట్లు భావించిరి. ఈ విధముగా ఆయన మనలను భయంకరమగు శాపము అనే గండమునుండి కాపాడెను.

ఇంతేగాక, నేను శ్రీకృష్ణుని తేజస్సు చేత మాత్రమే పార్వతీదేవితో కూడియున్న శూలపాణియగు శివభగవానునకు యుద్దములో ఆశ్చర్య, మును కలిగించగా, ఆయన పాశుపతాస్త్రమును నాకు ఇచ్చెను. లోకపాల కులు కూడ తమ తమ అస్త్రములను ఇచ్చిరి, నేను ఇ? కట్టెతో స్వర్గము నకు వెళ్లి ను హేంద్రుని భవనములో ఆయనయొక్క గొప్ప సింహాసనము నందు అర్ధభాగమును పొందితిని.

నేను ఆ సందర్భములో అచటనే స్వర్గములో విహరించుచుండ గా, ఇంద్రాది దేవతలు నీపోతకవచులనే రాక్షసుల సంహారము కొరకై నన్ను ఆశ్రయించిరి. గాండీవమనే ధనస్సును పట్టే నా దృఢమగు రెండు భుజములకు ఆ మహిమ శ్రీకృష్ణుని అనుగ్రహముచే మాత్రమే కలిగినది. ఓ ధర్మరాజా! అట్టి పరబ్రహ్మస్వరూపుడగు శ్రీకృష్ణుడు ఈనాడు నన్ను వంచించినాడు.

భీష్ముడు మొదలగు భయంకరములగు తిమింగలములు గలది, అతి గంభీరమైనది, ఆవలి ఒడ్డు లేనిది అగు కౌరవ సైన్యమనే సముద్ర మును శ్రీకృష్ణుడే రక్షకుడుగా గల నేను ఒంటరిగా రథముపై దాటి వేసితి ని. ఇంతేగాక, కౌరవులు అపహరించిన గోధనమును తీసుకొని వచ్చి వీరా టునకు అప్పజెప్పితిని. యుద్దములో మూర్చిల్లిన ఆ కౌరవవీరుల శిరస్సు లనుండి వారి ప్రభావమునకు చిహ్నములగు కిరీటముల రత్నములను కూడ నేను లాగుకొంటిని.

ఓ మహారాజా! భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, శల్యుడు అనే సేనానులచే నడిపించ బడిన కౌరవసైన్యమునకు మహారథికులు తమ రథ ముల పరిభ్రమణములతో శోభను చేగూర్చెడివారు. ఆ సైన్యముపై నా కంటే ముందు శ్రీకృష్ణుని చూపు పడెడిది. ఆయన తన చూపుతోనే ఆమహారథికుల ఆయుర్దాయమును, ఉత్సాహశక్తిని మరియు బలమును అప హరించెడివాడు.

ద్రోణాచార్యుడు భీష్ముడు కర్ణుడు అశ్వత్థామ సుశర్మ శల్యుడు సైంధవుడు బాహ్లికుడు మొదలగు వీరులు ప్రయోగించిన మొక్కవోని ప్రభావము గల అస్త్రములైననూ, నృసింహస్వామియొక్క భక్తుడగు ప్రహ్లాదునిపై హిరణ్యకశిపుడు ప్రయోగించిన ఆయుధములు వలె, శ్రీకృష్ణుని చేతులలో పెట్టబడిన నన్ను స్పృశించలేక పోయినవి.

ఆ ఈశ్వరుడు భక్తులకు తనను తాను సమర్పించి వేయును. ఆయన పాదపద్మములను శ్రేష్ఠపురుషులు మోక్షము కొరకై ఆరాధించు చుందురు. నేను యుద్ధములో గుర్రములు అలిసినప్పుడు రథము దిగి నేలపై నిలబడి యుండగా, ఆయన మహిమచే కింకర్తవ్యతావిమూఢులైన శత్రువులు నన్ను తమ బాణములతో కొట్టకుండిరి. అట్టి శ్రీకృష్ణుని దుర్బుద్ధి నగు నేను నా రథమునకు సారథి కమ్మని కోరితిని.

ఓ మహారాజా! శ్రీకృష్ణుడు గంభీరము మరియు ప్రీతికరము అగు చిరునవ్వు నవ్వుతూ నన్ను పరిహాసము చేసెడివాడు. ఓ అర్జునా! పృథాకు మారా! కురువంశమునకు ఆనందమును కలిగించువాడా! మిత్రమా!అంటూ నాతో హృదయంగమముగా కబుర్లాడెడివాడు. ఆ విషయములు గుర్తుకు వచ్చి నా హృదయము క్షోభను పొందుచున్నది.

పరుండుట, కూర్చుండుట, భుజించుట మొదలగు కార్యములలో నేను ఆయనతో సమముగా పోటీకి దిగుతూ, నా గొప్పలను చెప్పుతూ, ఓయీ మిత్రమా! నీవు సత్యసంధుడవు సుమా! అని వెక్కిరించి నిరాకరిం చెడీ పొడను. అయిననూ, ఆ మహామహుడగు శ్రీకృష్ణుడు మహోదారుడ గుటచే, మిత్రుని అపరాధమును మిత్రుడు వలె, పుత్రుని అపరాధమును తండ్రి వలె, దుర్బుద్ధినగు నా అపరాధమును సర్వమును సహించెడివాడు.

ఓ మహారాజా! అట్టి నేను ప్రియమిత్రుడగు శ్రీకృష్ణభగవానునకు దూరమైనాను. నా హృదయము శూన్యమైనది. ఆయన భార్యలను రక్షిస్తున్న నన్ను దారిలో దుష్టులగు గోపాలకులు స్త్రీని వలె సునాయాసముగా , జయించిరి.

అదియే ధనస్సు. అవియే బాణములు. అదియే రథము. అవియే గుర్రములు. ఏ నన్ను చూచీ రాజులు వినయముగా నమస్కరించెడి వారో, ఆ నేనే తథికుడను. కానీ, శ్రీకృష్ణుడు లేని ఈ సర్వము బూడిదలో పోసిన ఆహుతి వలె, ఐంద్రజాలికుని వద్దనుండి లభించిన మిథ్యావస్తువు వలె, చవిటి నేలలో వేసిన విత్తనము వలె, కొరగానిది ఆయేను.

ఓ మహారాజా! నీవు ద్వారకలో నివసించే మన మిత్రుల గురించి ప్రశ్నించితివి. వారందరు బ్రాహ్మణశాపముచే వివేకమును పూర్తిగా కోల్పోయి, పీకెల దాకా మద్యమును త్రాగి, ఆ మైకములో ఒళ్లు మరిచి, ఒకరికి మరియొకరు తెలియని వాళ్లువలె ఒకరినొకరు పిడికిళ్లతో కొట్టుకొని మర ణించిరి. కేవలము నలుగురు, అయిదుగురు మాత్రమే మిగిలిరి.

ఇది వాస్తవములో సర్వేశ్వరుడగు శ్రీకృష్ణభగవానుని లీలయే. ఏలయనగా, ప్రాణులు ఒకప్పుడు పరస్పరము పాలించుకొనును. మరి యొకప్పుడు పరస్పరము చంపుకొనును.

ఓ మహారాజా! నీటిలో నివసించే ప్రాణులలో పెద్దవి చిన్నవాటిని, బలము గలవి బలము లేనివాటిని తిని బ్రతికే విధముగనే, పెద్దవి మరియు బలము గలవి కూడ వాటిలో అవి పరస్పరము చంపుకొని తినుచుండును.

అదే విధముగా, శ్రీకృష్ణభగవానుడు బలవంతులగు యాదవులచే ఇతరులను, యాదవులలో ఒకరిచే మరియొకరిని సంహరించునట్లు చేసి భూభారమును తగ్గించేను.

శ్రీకృష్ణభగవానుని వచనములు దేశకాలములకు తగిన విషయ ములతో నిండియున్నవై హృదయములోని తాపమును చల్లార్చెడివి. అవి నాకు గుర్తుకు వచ్చి మనస్సును ఆకర్షించు చున్నవి.

ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని పాదపద్మములను మిక్కిలి గాఢమగు ప్రేమతో ధ్యానించుచుండగా, స్వచ్చమగు ఆతని మనస్సులోనిదుఃఖము ఉపశమించెను.

            సమర్థుడగు అర్జునుని బుద్ధిలో గల కామాదిదోషములు శ్రీకృష్ణభ గవానుని ధ్యానించుటచే పెరిగిన వేగము గల భక్తిచే నిశ్శేషముగా నిర్మూ లించ బడినవి. యుద్దమునకు ఆరంభములో భగవానుడు బోధించిన గీతా జ్ఞానము కాలక్రమములో కర్మలు మరియు భోగములయందలి ఆసక్తిచే కప్పివేయబడి యుండెను. దానిని ఆతడు ఇప్పుడు మరల స్మృతికి దెచ్చు కొనెను.

అర్జునుడు బ్రహ్మజ్ఞానమును పొందెను. అవిద్య నశించుటచే సూక్ష్మశరీరాభిమానము (కర్తృత్వభోక్తృత్వాభిమానము) తొలగి, ఆతడు గుణాతీతుడు (త్రిగుణాత్మకమగు సంసారమునకు అతీతుడగు జీవన్ము కుడు) ఆయెను. నేను, జగత్తు వేర్వేరుగా నున్నాము అనే భేదము ఆలంబ నముగా గల సంశయములన్నియు పటాపంచలై, శోకము దూరమయ్యెను. ఆతనికి పునర్జన్మ లేదు.

శ్రీకృష్ణభగవానుడు అవతారమునుపసంహరించుట, యదువంశము వినాశమగుట అనే వృత్తాంతమును విని ధర్మరాజు నిశ్చలమగు చిత్తము గలవాడై, తాను కూడ స్వర్గమును పొందవలెనని నిశ్చయించెను.

కుంతి కూడా శ్రీకృష్ణభగవానుని అవతారోపసంహారము, యాదవ కులనాశము అను విషయములను అర్జునుడు చెప్పగా విని, ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కాని భగవత్స్వరూపమునందు అన్యమునేరుం గని భక్తిచే మనస్సును విలీనము చేసి, జీవన్ముక్తురాలు ఆయెను (దేహ మును విడిచి పెట్టెను).

పుట్టుక లేని పరమేశ్వరుడు ఏ దేహముతో ముల్లును ముల్లుతో వలె భూభ్రమును పోగొట్టెనో, ఆ దేహమును విడిచి పెట్టెను. ఆయనకు భూమికి భారమును కలిగించిన దేహము, దానిని పోగొట్టిన దేహము అనే రెండు సమానమే.

భగవానుడు నటుని వలె మత్స్యాద్యవతారములను స్వీకరించి ఉపసంహరించెను. అదే విధముగా, శ్రీకృష్ణరూపమును దాల్చి, భూభార మును హరించిన తరువాత దానిని కూడ విడిచి పెట్టెను.

వినదగిన పుణ్యగాథలు గల శ్రీకృష్ణభగవానుడు తన దేహముతో ఏ నాడు ఈ భూమిని విడిచిపెట్టెనో, అదే రోజున కలి ఆరంభమై వివేకహీ నులలో అధర్మవర్తనమును కలిగించ నారంభించెను.

లోభము, అసత్యము, మోసము, హింస మొదలగు అధర్మరూప ములలో కలి దేశములో, నగరములో, తన యింటిలో, ప్రాణిమాత్రము నందు (లేదా, తనయందు కూడా) ప్రసరించుట మొదలయ్యేనని విద్వాం సుడగు ధర్మరాజు గమనించి, దేహమును విడిచి పెట్టవలెనని నిశ్చయించె ను.

ధర్మరాజు తనతో సమానమైన గుణవంతుడు, వినయశీలియగు తన మనుమడు పరీక్షిత్తును సముద్రముచే చుట్టువారబడియున్న భూమికి చక్రవర్తిగా హస్తినాపురములో అభిషేకించెను.

సమర్థుడగు ధర్మరాజు అదే విధముగా మథురలో అనిరుద్ధుని పుత్రుడగు వజ్రుని శూరసేనదేశాధిపతిగా అభిషేకించి, తరుపోత ప్రాజాప త్యేష్టిని చేసి, అగ్నులను తన లోనికి ఆరోపించు కొనేను (అనగా, గృహస్థా శ్రమమును విడిచి, సన్న్యసించెను).

అహంకారమమకారములు లేనివాడు, పటాపంచలైన సకలసంసా రాసక్తులు గలవాడు అగు ధర్మరాజు వస్త్రములు ఆభరణములు మొదలగు సర్వమును అచటనే విడిచి పెట్టి, వాక్కును, అనగా అన్ని ఇంద్రియములను తమ తమ వ్యాపారములతో సహా మనస్సునందు, మనస్సును ప్రాణము నందు, ప్రాణమును అపానమునందు, అపానమును దాని అధిష్టానదేవత యగు మృత్యువునంగు, మృత్యువును పాంచభౌతిక దేహమునందు (భావ నారూపముగా) హోమము చేసెను.

తరువాత మననశీలుడగు ధర్మరాజు పౌంచభౌతిక దేహమును త్రిగుణాత్మికయగు ప్రకృతియందు, ఆ ప్రకృతిని సర్వవిధముల ఆరోపము లకు మూలమగు అవిద్యయందు, దానిని జీవునియందు, జీవుని అవినాశి యగు బ్రహ్మయందు హోమము (విలీనము) చేసెను.

ధర్మరాజు నారబట్టలను ధరించి, ఉపవసించి, మౌనమును పాటి స్తూ, జుట్టుముడిని విడదీసి, జడుడా లేక పిచ్చివాడా .లేక పిశాచమా యన్నట్లు తన రూపమును చూపిస్తూ, వెనుకకు తిరిగి చూడకుండగా, చెవిటి వాని వలె శబ్దములను వినకుండగా ఇంటినుండి బయలు దేరెను. ఆయన మనస్సులో పరబ్రహ్మను ధ్యానిస్తూ పూర్వమునందు అనేకమహా త్ములచే నడువబడిన ఉత్తరదిక్కును ప్రవేశించెను. ఈ విధముగా దేహ మును త్యాగము చేయువారికి పునర్జన్మ ఉండదు.

భూలోకములో జనులయందు అధర్మమునకు మిత్రుడగు కలి ప్రవేశించుటను గాంచి మిగిలిన పాండవులు కూడ నిశ్చయము చేసుకొని అన్నగారి వెనుక బయలు దేరిరి.

పాండవులు జీవితములో పురుషార్థములను చక్కగా అనుష్టించి యుండిరి. పరమపురుషార్థము శ్రీమహావిష్ణువుయొక్క పాదపద్మములేనని పోరు తెలుసుకొంటిరి. పోరా సమయములో ఆ భగవానుని పాదములను మనస్సులో ధ్యానము చేయుచుండిరి,

ఆ శ్రీహరిని ధ్యానించుటచే పాండవుల హృదయములలో భక్తిభా వము పొంగి పొరలెను. వారి అంతఃకరణములు పరిశుద్దమయ్యేను. వారు ఆ నారాయణుని పాదపద్మములయందు (స్వరూపమునందు) అనన్య ముగా నిమగ్నమైన మనస్సులు గలవారై, విషయభోగాసక్తులగు దుష్టు లచే పొంశక్యము కానిది, నశించిన దోషములు గలవారు నివసించునది అగు గతిని (మోక్షమును) నిర్దోషమగు ఆత్మతో (ఆత్మరూపముగా) పొంది

ఇంద్రియవిజేతయగు విదురుడు కూడ శ్రీకృష్ణునియందలి భక్తి యొక్క ఆవేశముచే మనస్సును ఆయనయందు లగ్నము చేసి, ప్రభాసక్షే త్రమునందు దేహమును విడిచి పెట్టి, పితృదేవతలతో కలిసి తన నగరము నకు వెళ్లాను.

ద్రౌపది కూడ తన భర్తలు విరాగులై నిషమించినారని తెలుసు కొని, శ్రీకృష్ణభగవానునియందు సంలగ్నమైన మనస్సు గలదై, ఆయనను పొందెను.

 ఎవడైతే భగవంతుని అనుగ్రహమునకు పాత్రులగు పాండవుల ఈ విధమైన మహాప్రయాణమును గురించి శ్రద్ధతో వినునో, అట్టివాడు సకల మంగళములకు ఆస్పదము మరియు పావనము అగు శ్రీహరియందలి భక్తిని పొంది, మోక్షమును పొందును.

శ్రీమద్భాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో పదునైదవ అధ్యాయము ముగిసినది.