శ్రీ మద్భాగవతము - ద్వితీయ (2వ) స్కందము
9 - నవమోధ్యాయః
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను: ఓ మహారాజా! అనుభూతి స్వరూపమగు ఆత్మ చైతన్యము దేహాదులకంటే విలక్షణమైనది. అట్టి ఆత్మకు దేహము మొదలగు దృశ్యవర్గముతో, స్వప్నద్రష్టకు స్వప్నదృశ్యములతో వలె, వాస్తవముగా సంబంధము లేదు. కాని, పరమాత్మయొక్క మాయచే అట్టి సంబంధము ఘటిల్లుచున్నది.
ఈ మాయాశక్తి దేవతలు, మనుష్యులు, బాల్యము, యౌవనము మొదలగు అనేకరూపములలో ప్రకటమగుచుండగా, ఆత్మచైతన్యము కూడ ఆయా ఉపాధులలో అనేకరూపములు గలది వలె కన్పట్లుచున్నది. జీవుడు ఈ మాయాదేవియొక్క గుణములచే నిర్మితమైన దేహాదుల యందు రమించువాడై, నేను, నాది అనే భ్రాంతికి గురి యగుచున్నాడు.
మానవుడు ఏ కాలమునందైతే కాలమునకు మరియు ప్రకృతికి (ప్రకృతికార్యములగు దేహాదులకు) అతీతమైన చైతన్యస్వరూపమునందు ప్రతిష్ఠితుడై రమించునో, ఆ కాలములో తొలగిన వ్యామోహము గలవాడగుటచే అహంకార మమకారములను రెండింటినీ త్రోసిపుచ్చి, ఉదాసీనుడై (గుణములకు అతీతుడై) యుండును.
బ్రహ్మ నిష్కామమగు తపస్సును చేసి శ్రీహరిని ఆరాధించెను. అపుడాయన బ్రహ్మగారికి తన సత్యజ్ఞానస్వరూపమును ప్రకటించి, ఆత్మత త్వసాక్షాత్కారము కొరకై సాధనమును ఉపదేశించి యున్నాడు. దానిని నేను చెప్పగలను.
జగత్తులకు వేదరాశిని అందించిన ఆదిగురువు మరియు ఆదిదే వుడు అగు బ్రహ్మగారు తన ధామమునధిష్టించినవాడై, సృష్టిని చేయవలె నని సంకల్పించి, ఆలోచించ మొదలిడెను. కాని, జగత్తును రచించుటకు యోగ్యమగు ప్రకారమును తోపింపజేసే ప్రజ్ఞ ఆయనకు భాసించలేదు.
ఓ మహారాజా! సర్వసమర్థుడగు ఆ బ్రహ్మగారు ఒక సమయ ములో ప్రళయజలమునందు తనకు దగ్గరలో తపః (తపస్సు) అనే పద మును రెండు సార్లు వినెను. దరిద్రులకు గల ఏకైకధనము ఈ తపస్సేనని మహాత్ములు చెప్పుచున్నారు.
ఆ మాటను విన్నవెంటనే బ్రహ్మగారు ఆ మాటను పలికిన వ్యక్తి కొరకై నలువైపులా వెదికెను. కాని ఆయనకు ఎవ్వరు కానరాలేదు. అపుడాయన తన ధామము (పద్మము) నందు కూర్చున్నవాడై, తపస్సు తనకు మేలు చేయగలదని నిర్ణయించుకొనెను. ఎవరో ఒకరు స్వయముగా ఉపదే శించినారా అన్నట్లు ఆయన తన మనస్సును తపస్సు పై లగ్నము చేసెను.
తపః అనే పదమును విని బ్రహ్మ చేసిన ఊహ వ్యర్థము కాలేదు. బ్రహ్మ తపస్సును చేయువారందరిలో శ్రేష్ఠుడగు తపశ్శాలి. ఆయన కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను నియమించి (ప్రత్యాహారము), వాయువును మనస్సును జయించి (ప్రాణాయామము, ధారణ, ధ్యానము), ఏకాగ్రమగు మనస్సుతో (సమాధి) వేయి దివ్యసంవత్సరములు తపస్సును చేసెను. ఆ తపస్సుయొక్క ప్రభావముచే ఆయనకు సకలలోకములను సృష్టించే ప్రజ్ఞ ప్రకాశించెను.
ఈ విధముగా బ్రహ్మ తపస్సు చేసి ఆరాధించబడిన శ్రీహరి భగవానుడు సర్వోత్కృష్టమగు తన వైకుంఠలోకమును ఆయనకు చూపిం చెను. ఆ లోకమునందు అవిద్యా-అస్మితా-రాగ-ద్వేష-అభినివేశములనే చిత్తమలములకు గాని, వ్యామోహమునకు గాని, భయమునకు గాని తావు లేదు. గొప్ప పుణ్యము గలవారు, ఆత్మజ్ఞానులు అగు దేవతలు దానిని అధికముగా కొనియాడుచుందురు.
వైకుంఠములో రజస్తమోగుణములకు గాని, వాటితో కలిసియున్న సత్త్వగుణమునకు గాని ప్రవేశము లేదు. అనగా, కేవలసత్వగుణము మాత్రమే అచటనుండును. కాలముయొక్క వినాశసామర్థ్యము అచట. చెల్లుబాటు కాదు. అచట మాయయే లేదన్నచో, మాయాకార్యములగు రాగలోభాదులు ఉండవని వేరుగా చెప్పవలయునా? అచట ఇంద్రుడు మొదలగు దేవతలు, ప్రహ్లాదుడు మొదలగు రాక్షసులు శ్రీహరియొక్క అనుయాయులను, భక్తులను పూజించెదరు.
అక్కడి వారు అందరు నల్లని దేహకాంతితో, పద్మములవంటి నిడివి కన్నులతో గొప్పగా ప్రకాశించుచుందురు. పచ్చని వస్త్రములను ధరించే వారికి నాలుగు బాహువులు గలవు. వారందరు మిక్కిలి సుంద రులు మరియు సుకుమారులు. గొప్ప తేజశ్శాలురగు వారు ఉజ్జ్వలమగు గొప్ప మణులు పొదిగిన పదకములను మరియు ఇతరములగు ఆభరణ ములను ధరించియుందురు. పగడములు వైడూర్యములు మరియు తామ రతూడులవంటి ప్రకాశము గల ఆ పార్షదులు నలువైపులా కాంతులను విరజిమ్మే కుండలములను కిరీటములను మరియు మాలలను ధరించేదరు.
ఆ లోకములో అంతటా మహాత్ముల విమానములు వరుసలలో దేదీప్యమానముగా ప్రకాశించుచుండును. గొప్ప యువతుల కాంతులచే ఆ విమానముల శోభ మరింత ఇనుమడించుచుండును. అట్టి ఆ లోకము మెరుపు తీగలతో కూడిన మేఘపంక్తులతో నిండియున్న ఆకాశము వలె విశేషముగా ఒప్పారుచుండును.
వైకుంఠమునందు సంపద మూర్తిని దాల్చి శ్రీహరియొక్క పాద ములను పలు విభవములతో సేవించును. వేదములలో గొప్పగా స్తుతించ బడే ఆ భగవానుని పాదములకు అతిలోకసుందరియగు లక్ష్మీదేవి తన సఖురాండ్రతో గూడి గొప్పగా పూజను చేయును. ఒకచో ఆ లక్ష్మీదేవి ఉయ్యలనూగుతూ తన ప్రియుడగు శ్రీహరియొక్క గుణములను గానము చేయుచుండగా, వసంతుని అనుచరులగు కోకిల చిలుక మరియు తుమ్మెదలు తాము ఆయేయొక్క సౌందర్యమును గానము చేయుచున్నవా యన్నట్లు మధురమగు ధ్వనులను చేయుచుండును.
భక్తులందరికీ రక్షకుడు, లక్ష్మీపతి, యజ్ఞములచే ఆరాధించ బడు వాడు, జగన్నాథుడు, సర్వశక్తిమంతుడు అగు శ్రీహరిని ఆ వైకుంఠలోకములో బ్రహ్మ దర్శించెను. ఆయన పార్షదులలో ప్రముఖులగు సునందు డు, నందుడు, ప్రబలుడు, అర్హణుడు మొదలగువారు ఆయనను అన్ని విధ ములుగా సేవించుచుండిరి.
శ్రీహరి సర్వదా తన భక్తులను అనుగ్రహించుటకు అభిముఖుడై యుండును. ఆయన చూపులు ఆసవము వలె భక్తులకు ఆనందమును కలిగించును. ఆయన ముఖము ప్రసన్నమగు చిరునవ్వుతో ఎర్రని కన్నులతో ఒప్పారుచుండును. నాలుగు భుజములతో ప్రకాశించే శ్రీహరి కిరీటమును, కుండలములను, పచ్చని వస్త్రములను ధరించియుండును. ఆయన వక్షఃస్థ లము పై స్వర్ణరేఖ రూపములో లక్ష్మీదేవి ప్రకాశించుచుండును. అట్టి శ్రీహ రిని బ్రహ్మ చూచెను.
యంతయగు శ్రీహరిని.
శ్రీహరి సర్వోత్కృష్టము, అతిపూజనీయము అగు సింహాసనము నధిష్టించి యుండెను. ప్రకృతి, పురుషుడు, అహంకారము, మహత్తత్త్వ ము, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, అంతఃకరణము, ఐదు మహాభూతములు, ఐదు వాటి తన్మాత్రలు వెరసి ఇరువది ఐదు తత్త్వములు ఆయనను సేవించుచుండెను. ఇతరులలో అనిత్యముగా ప్రకట మయ్యే ఈశ్వరభావము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అనే ఆరు గుణములు ఆయనకు స్వభావసిద్దములు. స్వీయమగు సచ్చిదానందస్వరూపమునందు ప్రకాశిస్తూ ఆత్మారాముడై యున్న సర్వజగన్ని యంతయగు శ్రీహరిని బ్రహ్మ కనుగొనెను.
ఆ శ్రీహరిని చూచిన వెంటనే సృష్టికర్తయగు బ్రహ్మయొక్క హృదయము ఆనందముతో పొంగిపొరలి, కన్నులు ప్రేమాశ్రువులను వర్షించెను; శరీరము గగుర్పాటును చెందెను. సర్వకర్మసన్న్యాసపూర్వకజ్ఞానని స్థచే జ్ఞానులు పొందే శ్రీహరి పాదపద్మములకు ఆయన నమస్కరించెను.
ఆ సమయములో విచ్చేసి తన దర్శనముచే ఆనందమును పొందుచున్న, తనకు ప్రియుడగు బ్రహ్మను ఆయనచే ప్రేమించబడే - శ్రీహరి చూచెను. తన శాసనముచే ప్రజాసృష్టికి ఒడగట్టబోయే బ్రహ్మను చూచి ఆయనకు మనస్సులో చాల ప్రీతి కలిగెను. శ్రీహరి బ్రహ్మను చేతితో పట్టుకొని, చిరునవ్వుయొక్క శోభతో నలరారే వాక్కుతో ప్రీతి కలు గువిధముగా ఇట్లు మాటలాడెను.
శ్రీహరి భగవానుడు ఇట్లు పలికెను: ఓ వేదనిధీ! నీవు సృష్టిని చేయగోరి చిరకాలము తపస్సును చేసి నన్ను బాగుగా సంతోష పెట్టితివి. కపటయోగులు నాకు సుతరాము ప్రీతిని కలిగించలేరు సుమా! .
ఓ బ్రహ్మా! నేను వరములనిచ్చే ప్రభుడను. నీవు నానుండి అభీష్ట మైన వరమును కోరుకొనుము. నీకు మంగళమగు గాక! పురుషుడు శ్రేయస్సు (మోక్షము) ను పొందుట కొరకై చేసే సాధన నా దర్శనముతో పర్యవసానమును పొందుచున్నది.
నా సంకల్పప్రభావముచే మాత్రమే నీకు నా లోకమును దర్శించే భాగ్యము కలిగినది. ఏలయనగా, నేను కంటికి కానరాకుండగనే తపః అను పదమును ఉచ్చరించగా, ఒంటరిగానున్న నీవు ఆ మాటను విని కఠోరమగు తపస్సును అనుష్ఠించితివి.
ఓ పాపరహితుడా! ఆ సమయములో నీవు సృష్టికార్యము విషయ ములో విశేషమగు వ్యామోహమును పొందియుండగా, తపస్సును చేయు మని నేను నీకు ఉపదేశించితిని. తపస్సు సాక్షాత్తుగా. నా హృదయము; అనగా, నాకు అత్యంతప్రీతిపాత్రము. తపస్సు నా స్వరూపమే; అనగా, తపస్సు రూపములో నేనే ఉన్నాను.
నేను ఈ జగత్తును తపస్సుయొక్క ప్రభావముచే మాత్రమే సృష్టించి, పాలించి పోషించి, మరల ఉపసంహరించుచున్నాను. నా శక్తి కఠోరమగు తపస్సు మాత్రమే.
బ్రహ్మ ఇట్లు పలికెను: ఓ భగవానుడా! నీవు సకలప్రాణుల బుద్దిగు హయందు సాక్షి రూపుడవై నిలిచి, ఆటంకములు లేని నీ చిర్ఘనస్వరూపముచే ఆ ప్రాణుల అంతఃకరణములోని సంకల్పములను దర్శించుచునే యున్నావు.
ఓ తండ్రీ! అయినప్పటికీ, నేను ఒక కోరికను కోరుచున్నాను. నేను సృష్టికార్యము విషయములో పీడను పొందియున్నాను. నాకు సృష్టిసామ ర్థ్యమును ఇమ్ము, మరియు, రూపవిహీనుడవైన నీకు మాయాసంబంధ ముచే సంప్రాప్తమైన స్థూలసూక్ష్మరూపములను రెండింటినీ నేను యథాత ధసుగా తెలియగోరుచున్నాను. నా కోరికను తీర్చుము.
ఓ లక్ష్మీపతీ! సాలె పురుగు తనను మాత్రమే ఉపాదానముగా చేసుకోని గూడును అల్లు విధముగా, మొక్కవోని సంకల్పము గల నీవు నిన్నే జగద్రూపముగా ప్రకటించుచున్నావు. నీవు మాయాశక్తియొక్క ఉపా ధిని స్వీకరించు వాడవై, ఇరువది ఐదు తత్త్వములతో కూడియున్న జగత్తును సృష్టించి పాలించి పోషించి ఉపసంహరిస్తూ క్రీడించుచున్నావు. నీవు ఈ జగత్తుయొక్క సృష్టిస్థితిలయములను చేసే విధానము యథాతథ ముగా నాకు అవగాహనకు వచ్చునట్లు జ్ఞానమును ఇమ్ము.
నేను భగవానుని ఆదేశముచే ప్రజాసృష్టిని నిశ్చితముగా సోమరిత నము లేకుండగా చేసెదను. కాని, భగవానుని అనుగ్రహము వలన సృష్టిని చేసే నాయందు కర్తృత్వము (అహంకారము) మొదలగు దోషములు బయలుదేరి, నన్ను బంధించకుండును గాక!
ఓ ఈశ్వరా! నీవు నాకు హితమును చేసే మిత్రుడవు. నన్ను మిత్రుని వలె నీతో సమానముగా ఆదరించినావు. నేను మనోవ్యాకులత లేని వాడనై ప్రజాసృష్టి అనే నీ సేవయందు స్థిరముగా నున్నాను. నేను వివిధ ప్రాణులను సృష్టించెదను. కాని, సృష్టిని చేయుచున్న నాకు, జన్మలేని వాడను, స్వతంత్రుడను అనే ఉత్కటమగు గర్వము కలుగకుండును గాక!
శ్రీభగవానుడు ఇట్లు పలికెను: నేను నీకు మిక్కిలి రహస్యమైనది, భక్తితో కూడియున్నది, అనుభవముతో జతగూడినది అగు నా జ్ఞానమును, దానిని పొందే సాధనమును ఉపదేశించేదను. స్వీకరించుము.
నేను ఎంతటివాడను? నా ఉనికి (స్వరూపము) ఎట్టిది? నా రూప మేది? గుణములు ఎయ్యవి? నా చేష్టలు ఎట్టివి? ఈ విషయములన్నియు నీకు నా అనుగ్రహముచే యథాతథముగా అనుభవపూర్వకముగా తెలియుగాక!
సృష్టికి పూర్వమునందు ఉన్నది నేను మాత్రమే. అప్పుడు ఈ గాని లేవు. సృష్టి తరువాతనైననూ ఈ కంటికి కనబడే విశ్వము నేనే. ప్రలయమునందు మిగిలి ఉండేది కూడ నేనే.
ఆకాశములో రెండు చంద్రులు లేరు. అయిననూ, కంటికి వ్రేలును అడ్డుగా పెట్టి చూచినచో, రెండు చంద్రులు కానవచ్చెదరు. మరియు, గ్రహ మండలములో రాహువు ఉన్ననూ, కానవచ్చుట లేదు. అదే విధముగా, అధిష్ఠానమగు బ్రహ్మయందు నానాత్వము (జగత్తు) వాస్తవముగా లేకున్న నూ, కొనవచ్చుచున్నది. సద్రూపమగు (ఉనికియే స్వరూపముగా గల) బ్రహ్మ భాసించుటనే లేదు. ఇదియే నా మాయ.
భౌతికపదార్థములు పంచమహాభూతముల వికారములగుటచే ఒక దృష్టికోణములో ఆ మహాభూతములు వాటియందు ప్రవేశించి యున్నవని చెప్పదగును. కానీ, మరియొక దృష్టికోణములో కారణములగు మహాభూ తములయందు మాత్రమే కార్యములు భాసించుచుండుటచే, అవి సర్వకా లములలో ముందే ఉండియుండుటచే, కొత్తగా ప్రవేశించినవని చెప్ప బని లేదు. అదే విధముగా విశ్వములోని సర్వదృశ్యవస్తువులు నాయందు అధ్య స్తములై భాసించుచున్నవి. కావున, ఒక దృష్టికోణములో సర్వమునందు సత్తాస్ఫూర్తిరూపముగా నేను ప్రవేశించి యున్నానని చెప్పిననూ, పరమా ర్థములో నాకంటే భిన్నముగా రెండవ వస్తువు లేదు గనుక, వాస్తవమగు ప్రవేశము పొసగదు. (ఈశ్వరుడు ప్రవేశించినాడనగా, సర్వపదార్థములలో సత్తాస్ఫూర్తుల రూపముగా ఈశ్వరుడు ఉపలభ్యమగుచున్నాడని మాత్రమే తాత్పర్యము).
ఏదైతే సర్వదేశకాలములలో కారణరూపముగా అనువృత్తమగుచు న్ననూ, పరమార్థములో కార్యముకంటే విలక్షణముగా నుండునో, లేదా, జాగ్రత్తు మొదలగు అనుభవములన్నింటిలో స్పూర్తి రూపముగా అనువృత్త మగుచున్ననూ, పరమార్థముగా అనుభవములకు అతీతమగు చిదనమై యుండునో, అదియే ఆత్మ. ఆత్మతత్త్వమును తెలియగోరు జిజ్ఞాసువు ఈ విధమగు విచారమును చేసిన చాలును.
స్థిరమగు చిత్తైకాగ్రతతో నేను చెప్పిన ఈ సిద్ధాంతమునందు చక్కగా నిలిచి యుండుము. నీవు కల్పములో చేసే వివిధసృష్టులలో ఏ కాలమునందైననూ మోహమును పొందవు.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను: పుట్టుక లేని శ్రీహరి పుట్టుక గల ప్రాణులపై సర్వాధిపతియగు బ్రహ్మకు ఈ విధముగా ఉపదేశించి, ఆయన చూచుచుండగనే తన ఆ రూపమును అంతర్ధానము చేసెను.
శ్రీహరి అంతర్ధానమై తన రూపమును బ్రహ్మ కన్నుల యెదుట నుండి ఉపసంహరించెను. సకలప్రాణుల సమష్టిస్వరూపుడగు బ్రహ్మ ఆయనకు చేతులను జోడించి నమస్కరించి, పూర్వకల్పమునందు వలెనే ఈ జగత్తును సృష్టించెను.
ధర్మమును పాలించే ఆ బ్రహ్మ ఒకనాడు ప్రజల కల్యాణమును గురించి దీర్ఘముగా ఆలోచించెను. ప్రజలకు కల్యాణమును కలిగించ వలె ననే కోరికతో ఆయన అహింస, సత్యము, పరధనమును భావనలోనైననూ అపహరించకుండుట, బ్రహ్మచర్యము, భోగలాలసత లేకుండుట అనే ఐదు యమములను, లోపల బయట శుద్ధి, ఉన్నదానితో సంతృప్తిని చెందుట, తపస్సు, మోక్షశాస్త్రమును అధ్యయనము చేయుట, ఈశ్వర శరణాగతి అనే అయిదు నియమములను అనుష్ఠించెను.
ఓ మహారాజా! గొప్ప భగవద్భక్తుడగు నారదమహర్షి బ్రహ్మ యొక్క పుత్రులందరిలో ఆయనకు మిక్కిలి ప్రియమైనవాడు మరియు విధే యుడు. ఆ నారదుడు మాయను వశము చేసుకొనియున్న శ్రీహరియొక్క మాయను గురించి తెలియగోరి, తన తండ్రియగు బ్రహ్మగారిని సచ్చీలము తో, వినయముతో మరియు ఇంద్రియనిగ్రహముతో సేవించి, ఆయనను సంతోషపెట్టెను.
లోకములకు ఆదికర్త, పితామహుడు అగు తన తండ్రి తన విషయ ములో సంతసించి యున్నాడని గమనించిన దేవర్షియగు నారదుడు ఆయ నను, నీవు నన్ను అడిగిన విధముగనే ప్రశ్నించెను.
ప్రాణులను సృష్టించిన బ్రహ్మ తన పుత్రుడగు నారదుని విషయ ములో చాల సంతసించి శ్రీహరి భగవానునిచే తనకు బోధించబడిన ఈ భాగవత పురాణమును ఆయనకు బోధించెను. దీనియందు పది లక్షణ ములు గలవు.
ఓ మహారాజా! సరస్వతీ నదీతీరమునందు మహాతేజశ్శాలియగు వ్యాసమహర్షి పరబ్రహ్మను ధ్యానము చేయుచుండగా, నారదుడు విచ్చేసి ఆయనకు దీనిని బోధించెను.
ఈ జగత్తు విరాట్ పురుషునినుండి ఉద్భవించిన విధమెట్టిది? అని కూడ నీవు నన్ను ప్రశ్నించితివి. ఆ ప్రశ్నకు మాత్రమే గాక, ఇతరప్రశ్నలకు కూడ సంపూర్ణముగా సమాధానమును చెప్పగలను.
శ్రీమద్భాగవత మహాపురాణములోని రెండవ స్కంధములో తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.
