శ్రీ మద్భాగవతము - ద్వితీయ (2వ) స్కందము

7 - సప్తమోఽధ్యాయః

బ్రహ్మ ఇట్లు పలికెను: అనంతుడగు శ్రీహరి భూమండలమును పైకి తీసుకు వచ్చుట కొరకై సకలయజ్ఞస్వరూపమగు వరాహరూపమును దాల్చి సన్నద్ధుడైనాడు. దితియొక్క మొదటి సంతానమైన సుప్రసిద్ధుడగు హిరణ్యాక్షుడు విశాలమగు సముద్రముయొక్క మధ్యలో తన మీదకు రాగా, ఇంద్రుడు వజ్రముతో పర్వతముయొక్క రెక్కలను దునిమిన విధముగా ఆయన వానిని తన కోరతో చీల్చి చంపెను.

            ఆ పరమేశ్వరుడు రుచిప్రజాపతికి ఆకూతియందు పుత్రుడై అవతరించి, సుయజ్ఞుడు అను పేరుతో ప్రసిద్ధిని గాంచి, దక్షిణ అనునామెను వివాహమాడి, ఆమెయందు సుయములు అనే దేవతలను కనెను. తరువాత ఆయనయే ఆ దేవతలకు అధీశ్వరుడై ముల్లోకముల ఇడుములను బొపగా, స్వాయంభువ మనువు ఆ కారణముచే ఆయనకు హరి (కష్టములను హరించువాడు) అని పేరు పెట్టెను.

ఓ నారదా! ఇంకా ఆ శ్రీహరి కర్దముప్రజాపతికి ఓపహుంటదు తొమ్మిది మంది అమ్మాయిల తరువాత జన్మించి, కపిలుడను పేరుతో తన తల్లికి బ్రహ్మవిద్యను ఉపదేశించెను. ఆమె సత్త్వరజస్తమోగుణములతోడి సంగము అనే బురదను, బుద్ధియందలి మాలిన్యమును ఆ జ్ఞానముచే కడి గివేసి అదే జన్మలో కపిలుడు బోధించిన ఆత్మతత్త్వమును పొందెను; అన గో, మోక్షమును పొందెను.

అత్రి మహర్షి సంతానమును కోరి తపస్సును చేయగా, భగవా నుడు సంతోషించి, నన్ను నేను నీకు ఇచ్చుచున్నాను అని పలికెను. అపు డాయన అత్రికి పుత్రుడై జన్మించి దత్తుడు (ఈయబడినవాడు) అను పేరు (దత్తాత్రేయ) తో ప్రసిద్దిని బడసినాడు. యదు మహారాజు, కార్తవీర్యార్జు నుడు మొదలగువారు ఆయన పాదపద్మముల ధూళీచే పవిత్రములైన దేహములు గలవారై, ఆయన అనుగ్రహముచే ఇహలోకములో అణిమ  మొదలగు అష్టసిద్దులను మాత్రమే గాక, దేహమును వీడిన తరువాత మోక్షమును కూడ పొందినారు.

నేను సృష్టికి పూర్వము వివిధములగు లోకములను సృష్టించగోరి , తపస్సును చేసి, దానిని శ్రీహరికి సమర్పించితిని. అప్పుడు ఆ సమర్పణ. వలన శ్రీహరి సనత్కుమార సనక సనందన సనాతనులనే నల్గురు దేవ రుల రూపములో అవతరించెను. ఈ అవతారములో ఆయన పూర్వకల్ప ముయొక్క అంతమునందలి ప్రళయములో కనబడకుండా పోయిన ఆత్మ జ్ఞానమును చక్కగా బోధించగా, మహర్షులు ఆయన బోధనలను వింటూనే తమ బుద్ధిలో ఆ ఆత్మస్వరూపమును సాక్షాత్కరించు కొనిరి.

            దక్షుని కుమార్తెయగు మూర్తి ధర్ముని భార్య. శ్రీహరి ఆ దంపతులకు సంతానమై నర నారాయణుల రూపములో అవతరించెను. వారి తపస్సు అసాధారణమైనది. దానిలో వారికి వారే సాటి. మన్మథుని సేనలు అన దగిన అప్సరసలు సర్వప్రాణులలో ఆత్మరూపముగానుండే నారాయణుని తపస్సును భంగము చేయుటకు ప్రయత్నించి తామే భంగపడిరి. పైగా, వారు ఆయన వద్దనుండి ఆవిర్భవించి తమను పోలియున్న ఊర్వశి మొద లగు అప్సరసలను కూడ కనుగొనిరి.

రుద్రుడు మొదలగు మహాత్ములు క్రోధముతో నిండిన చూపుతో కామమును (మన్మథుని) దహించి వేయగల్గుదురు. కానీ, ఆ మహానుభా వులు కూడా సహింప శక్యము కాని వేగముతో తమ హృదయములను దహించి వేయుచున్ననూ ఆ క్రోధమును జయింప లేకున్నారు. అట్టి ఆ క్రోధము నిర్మలమగు నరనారాయణుల అంతఃకరణములో ప్రవేశించుటకై ననూ గడగడ వణికి పోవును. అట్టిచో, వారి హృదయములలో కామము నకు తాను ఎక్కడిది?

ఉత్తానపాద మహారాజుయొక్క సన్నిధిలో ఆయన కుమారుడగు ధ్రువుని సవతి తల్లి సూటిపోటి మాటలతో గాయపరచగా, ధ్రువుడు పసి ఊడి పరకనక ఈael # #జన్సీన జిక, తీహారిని మెప్పించెను;తనకు ప్రత్యక్షమైన శ్రీహరిని ఆ బాలుడు స్తుతించగా, ఆయన సంతోషిం చి, ఆతనికి ధ్రువపదమును ఇచ్చెను. ఆ పదముయొక్క మహిమను దానికి పైన ఉండే భృగువు మొదలగు దేవర్షులు, దానికి క్రింద ఉండే సప్తర్షులు కూడ కొనియాడుచుందురు.

బ్రాహ్మణశాపము అనే వజ్రము వేన మహారాజుయొక్క పురుషకా రమును, సౌభాగ్యమును నశింప జేసెను. ఆతడు అధర్మమార్గములో నడిచి నరకములో పడబోవుచుండగా, మహర్షుల ప్రార్థనను. ఆలకించి, శ్రీహరి ఆతని పుత్రుడు అగు పృథువు రూపములో అవతరించి, ఆ వేనుని రక్షించెను. పుత్రుడు అనగా పున్నామనరకమునుండి రక్షించువాడు అను పదమును ఆయన ఈ విధముగా జగత్తులో సార్థకము చేసెను. ఇంతేగాక, ఆ అవతారములో ఆయన గోవు రూపములోనున్న పృథివినుండి సమస్త సంపదలను పాల రూపములో పితికెను.

సుదేవి, నాభుడు అనే దంపతులకు ఈ శ్రీహరి ఋషభుడను పేరుతో కుమారుడై జన్మించెను. సర్వజగత్తు పరబ్రహ్మయే అధిష్ఠానముగా గల మిథ్య అనే సమ్యగ్లర్శనము ఆయనకు గలదు. అందువలననే, ఆయన విషయభోగములయందు ఆసక్తి లేనివాడగుటచే ఇంద్రియములను వాటి నుండి ఉపసంహరించి, ఆత్మస్వరూపనిష్ఠుడై, జడుని వలె కన్పట్టిననూ నిత్యసమాధియందు ఉంటూ జీవనచర్యను గడి పెను. ఋషభయోగీంద్రుని ఈ స్థితి (చిహ్నము) పరమహంసస్వభావమని మహర్షులు వర్ణించుటయే గాక, దానిని తమ జీవితములో అభ్యసించుచున్నారు.

ఇంతేగాక, నేను సత్రయాగమును చేయుచుండగా, యజ్ఞములచే ఆరాధించబడే పరమపురుషుడు, వేదములు యజ్ఞములు మరియు సకలదే వతలు అనే రూపములలో ప్రకటమగువాడు, బంగరు మేని రంగు గల వాడు అగు ఆ శ్రీహరి భగవానుడు సాక్షాత్తుగా హయగ్రీవరూపములో అవ తరించినాడు. గాలిని పీల్చుచున్న ఆ హయగ్రీవుని ముక్కు రంధ్రముల నుండి సుందరమగు వేదవాణి ప్రకటమయ్యెను.

చాక్షుషమన్వంతరము పూర్తి అయి జగత్తు ప్రళయజలములలో మునిగిపోవుచుండగా, శ్రీహరి మత్స్యరూపుడై అవతరించెను. ఆయనను వైవస్వత మనువు కనుగొనెను. ఆ మహామత్స్యము నౌకరూపములోనున్నపృథివిని నిలబెట్టి తద్ద్వారా సకలజీవరాశులకు ప్రాణదానమును చేసి, నా ముఖమునుండి జారిపోయిన వేదములను తిరిగి రాబట్టి, మహాభయంకర మగు ఆ ప్రళయజలములలో విహరించెను.

అమృతమును పొందగోరిన దేవతలు మరియు రాక్షసనాయకులు కలిసి మందరపర్వతముతో పాల సముద్రమును మథించుచుండగా, ఆదిదే. వుడగు శ్రీహరి కూర్మరూపమును దాల్చి తన వీపుపై ఆ పర్వతమును మోసెను. ఆ పర్వతమును' ఇటునటు త్రిప్పగా కలిగిన రాపిడిచే ఆయనకు వీపుమీది దురద తోలగి పోయి సుఖముగా కొద్ది సేపు నిద్రించే అవకాశము లభించేను.

దేవతలకు వచ్చిన మహాభయమును పోగొట్టే ఆ శ్రీహరి సుడులు తిరుగుచున్న కనుబొమలతో మరియు కోరలతో రాక్షసులకు మాత్రమే గాక. దేవతలకు కూడ భయమును గొల్పే ముఖము గల నరసింహావతారమును దాల్చి, అట్టహాసమును చేయుచున్నవాడై, గదను చేతబట్టి తన మీదకు కదము తొక్కుతూ దుముకుచున్న రాక్షసరాజగు హిరణ్యకశిపుని శీఘ్ర ముగా పట్టి తొడపై వేసుకొని గోళ్లతో చీల్చివేసెను.

గజేంద్రుని సరస్సు మధ్యలో మహాబలశాలియగు మొసలి కాలి యందు పట్టి లాగుచుండెను. అపుడాతడు గొప్ప దుఃఖమును పొందినవా డై, తొండముతో పద్మమును పట్టుకొని ఆ పరమేశ్వరునితో ఇట్లు మొర పె ట్టుకొనెను: ఓ ఆదిపురుషా! సర్వజగన్నాథా! నీ కీర్తి జీవులను పవిత్రము చేయును. నీ నామమును విన్నంత మాత్రాన జీవులకు మంగళములు కలుగును.

            ఇంద్రియములకు మరియు బుద్ధికి గోచరము కానివాడు, సుదర్శ నచక్రము ఆయుధముగా గలవాడు అగు శ్రీహరి భగవానుడు తనను శరణు జొచ్చిన ఆ గజేంద్రుని మొరను విని, దయతో పక్షిరాజగు గరుత్మం తుని భుజమునధిష్టించి వచ్చి, ఆ గజేంద్రుని తొండముతో పట్టుకొని, చక్ర ముతో మొసలి నోటిని చీల్చివేసి, దానిలో చిక్కుకొనియున్న గజేంద్రుని పాదమును విడిపించి, ఆతనిని ఒడ్డునకు తెచ్చి రక్షించెను.

యజ్ఞములకు ప్రభువగు శ్రీహరి అదితికి పుత్రుడై అవతరించెను. ఆయన ఆమె పుత్రులందరిలో చిన్నవాడైననూ, గుణములలో దిట్టయే. ఆ వామనుడు బలిచక్రవర్తి చేయుచున్న యజ్ఞమునకు వెళ్లి మూడు అడుగుల భూమిని ఆ చక్రవర్తినుండి దానముగా పొందెను. ఆ చక్రవర్తి మాట ఇచ్చిన మరుక్షణమే ఆయన మూడు అడుగులతో ముల్లోకములను కొలిచివేసి, ఆ నెపముతో ఆతని రాజ్యమును తన వశము చేసుకొనెను. దీనిని బట్టి ఒక విషయము స్పష్టమగుచున్నది. సన్మార్గములో నడిచే వ్యక్తిని, యాచనకు పాల్పడకుండగా, తన స్థానమునుండి చలింప జేయుట ఎంతటి సమర్థులకై ననూ సంభవము కాదు.

ఓ నారదా! విస్తారమగు పాదన్యాసము గల శ్రీహరియొక్క పాద ములను కడిగి ఆ నీటిని ఆదరముతో శిరస్సు పై అంతటా ధరించిన బలి చక్రవర్తికి దేవలోకప్రభుత్వము పురుషార్థము (నిశ్చితముగా కోరి సంపా దించ దగినది) కాదు. ఆ బలి మూడు అడుగులను ఇచ్చేదనని తాను చేసిన ప్రతిజ్ఞకు వ్యతిరేకముగా మరియొక విధముగా చేయుటకు శుక్రాచా ర్యుడు ప్రేరేపించిననూ ఇష్టపడలేదు. ఆయన శిరస్సును వంచి శ్రీహరి యొక్క మూడవ అడుగునకు తన దేహమును సమర్పించిన మహాత్ముడు.

ఓ నారదా! శ్రీహరిభగవానుడు నీయొక్క మిక్కిలి ఉద్రిక్తమైన భక్తికి సంతసిల్లినవాడై హంసరూపములో అవతరించి. నీకు భక్తియోగము ను, ఆత్మస్వరూపమును ప్రకాశింపజేసే జ్ఞానమునకు సాధనమగు భాగవ తధర్మమును చక్కగా బోధించినాడు. వాసుదేవుని శరణు పొందిన భక్తులు మాత్రమే దీనిని అనాయాసముగా తెలియ గల్గుదురు.

శ్రీహరి ఆయా మన్వంతరములయందు మనువు రూపములో అవతరించి మనువంశమును రక్షించువాడై, ఎదురు లేని తన తేజస్సును సుదర్శనచక్రమును వలె పది దిక్కులయందు ప్రసరింప జేసి ప్రాణులను పాలించి పోషించుచున్నాడు. ఇంతేగాక, దుష్టులగు రాజులను శిక్షించి, వివి ధములగు చరితములను చేయుచూ, తన మనోహరమగు కీర్తిని ముల్లోక ములలో మాత్రమే గాక వాటికి పైన ఉండే సత్యలోకములో కూడ వ్యాపింప జేసినాడు.

శ్రీహరిభగవానుడు లోకమునందు ధన్వంతరియై అవతరించి గొప్ప కీర్తిని పొందెను. ఆయన పేరు చెప్పినంత మాత్రాన మానవుల పెద్ద పెద్ద రోగములు వెంటనే నయమగును. ఆయన దేవతలకు అమృతమును జరామరణములు లేని జీవనమును ఇచ్చి, తననుండి అపహరించబడిన యజ్ఞభాగములను తిరిగి పొందెను. ఆయన లోకములో ఆయుర్వేదమును ప్రవర్తిల్ల జేసెను.

ఒక సమయములో క్షత్రియజాతి బ్రాహ్మణులను ద్వేషిస్తూ వేద మార్గమును విడనాడి, నరకములోని పీడలను పొందగోరుచున్నదాయన్నట్లు వర్తిల్లెను. ఈ విధముగా దురదృష్టవశాత్తు సమాజమునకు కంటక ములవలే తయారైన ఆ దుష్టరాజన్యుల సమూహము వినాశపు అంచులకు నెట్టివేయబడి యుండెను. అప్పుడు పరమాత్మయగు శ్రీహరి భయంకర మగు పరాక్రమము గల పరశురాముడై అవతరించి పొడవైన వాడి అంచు గల గండ్ర గొడ్డలితో ఇరవై ఒక్క పర్యాయములు వారిని సంహరించి నీర్మూలము చేసెను.

మనలను అనుగ్రహించుటకై సర్వదా సుముఖుడుగానుండే మాయాధీశ్వరుడగు శ్రీహరి భరతుడు మొదలగు అంశలతో గూడి ఇక్ష్వా కువంశమునందు శ్రీరాముని రూపములో అవతరించెను. ఆయన తన తండ్రియగు దశరథుని మాటను నిలబెట్టుటకై తమ్ముడగు లక్ష్మణునితో మరియు భార్యయగు సీతతో గూడి అడవికి వెళ్లాను. అచట రావణుడు ఆయనతో విరోధమును బూని వినాశమును పొందెను.

            శ్రీరాముడు రుద్రుని వలె శత్రువగు రావణుని నగరమును దహింప గోరుచుండెను. ఆయనకు దారిలో అడ్డముగా నిలచిన సముద్రు నకు ఆ కారణముగా భయము ఏర్పడి, ఆయన శరీరములో కంపము పుట్టు చుండెను. తన ప్రియురాలగు సీతాదేవి తనకు దూరముగా నున్నదనే భావన మాత్రముచే శ్రీరాముని హృదయము క్షుభితమై కోపము చెలరేగు చుండెను. ఆ కోపము వలన ఆయన కన్నులు ఎర్రగా నుండెను. అట్టి కన్ను లతో ఆయన చూచుచుండగా ఏర్పడిన తాపమును మొసళ్లు పాములు తిమింగలములు మొదలగు సముద్రజంతువులు సహింప లేకుండెను. అపుడు సముద్రుడు వెంటనే శ్రీరామునకు దారిని ఇచ్చెను.

రావణుడు మహేంద్రుని యుద్దమును చేసిన సందర్భములో ఇంద్రుని వాహనమగు ఐరావతమనే ఏనుగుయొక్క దంతములు వాని వక్షః స్థలమునకు తగిలి ఆ తాకిడికి విరిగి పడినవి. ఆ దంతముల శకలములచే తెల్లగా చేయబడిన దిక్కులను రావణుడు పాలించును. అట్టి రావణుడు గర్వముతో అట్టహాసమును చేయుచూ, సైన్యమధ్యములో గంభీరముగా ఇటునటు సంచరించుచుండగా, శ్రీరాముడు కేవలము తన ధనస్సు యొక్క టంకారధ్వనులచే మాత్రమే వానీ అట్టహాసమును, దానితో పాటు ప్రాణములను కూడ వెంటనే తుడిచి పెట్టగలడు.

రాక్షసుల అంశలచే జన్మించిన రాజులు మరియు వారి సైన్యము భూమికి పెనుభారముగా తయారైనప్పుడు, భూదేవియొక్క భారమును నశింప జేయగోరి, భగవానుడు బలరామకృష్ణుల రూపములో అవతరించు ను. ఆయనయొక్క తెల్లని కేశములు ప్రకాశించే దేహవర్ణము గల బలరా ముడుగను, నల్లని కేశములు నల్లనయ్యగను అవతరించును. ఆయన సాక్షాత్తుగా పరమేశ్వరుడే యను విషయము సామాన్యజనులకు తెలియదు. ఆయన ఆ విధముగా గుప్తముగా నున్ననూ, తన మహిమను ప్రక టించే అనేకములగు లీలలను నెరపును.

శ్రీకృష్ణుడు పిల్లవాడుగా నుండగనే పూతన అనే రాక్షసిని సంహ రించును. మూడు మాసముల వయస్సులో ఆయన బండిని తల్లక్రిందులు చేయును. మోకాళ్లపై పాకే వయస్సులో మిక్కిలి ఎత్తైన జంట మద్ది చెట్ల మధ్యలో దూరి వాటిని నేల గూల్చును. ఆయన అవతారపురుషుడు కానిచో, ఈ సర్వము సంభవము కాబోదు.

నందగోకులములో విషజలమును త్రాగిన పశువులను, వాటి పాల కులను శ్రీకృష్ణుడు తన అనుగ్రహముతో కూడిన చూపులతో జీవింప జేసి, తరువాత యమునా నదిని శుద్ధి చేయుట కొరకై దానియందు విహరిస్తూ, విషబలముచే 'మిక్కిలి చంచలమైన జిహ్వలు గల సర్పరాజును అచట నుండి వెళ్లగొట్టును. ఇది సామాన్యమానవుడు చేయగలిగే పని కాదు.

నందగోకులములోని జనులందరు ఒకనాటి రాత్రి గాఢనిద్రలో నుండగా, వేసవి వేడికి ఎండి ఉన్న. అడవిలో దావాగ్ని పుట్టి నలువైపులా ప్రసరించును. దాని మూలకముగా ఆ ప్రజవాసులకు మృత్యువు నిశ్చ - యమనే పరిస్థితి దాపురించును. ఇంతలో, ఊహింప శక్యము కాని పరాక్ర మము గల శ్రీకృష్ణభగవానుడు బలరామునితో గూడి వారిని కళ్లను - మూసుకొనమని చెప్పి, వారినందరినీ ఆ దావాగ్నినుండి రక్షించును. ఇది ఖచ్చితముగా అలౌకికమగు లీలయే సుమా!

            బాలకుడగు శ్రీకృష్ణుని అల్లరిని కట్టుబాటు చేయగోరి తల్లియగు యశోద ఆతనిని త్రాడుతో కట్టివేయుటకు యత్నించెను. కానీ, ఆమె ఏ త్రాడును తెచ్చిననూ, అది ఆతని నడుమునకు సరిపడకుండెను. మరియు, ఆమె ఒకనాడు ఆ పిల్లవాడు ఆవులించుచుండగా నోటిలో పదునాలుగు భువనములను కనెను. ఆమె హృదయము శంకతో నిండిపోయెను. కాని, ఇంతలో ఆమెకు ఆ బాలకుడు ఈశ్వరావతారమనే సత్యము అవగాహనకు వచ్చేను. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు కానిచో, ఈ లీలలు సంభవమయ్యెడివి కావు.

శ్రీకృష్ణుడు వరుణపాశము వలన కలిగిన భయమునుండి నందుని రక్షించగలడు. మయుని పుత్రుడగు వ్యోమాసురుడు గోపాలకులను గుహ లలో దాచి పెట్టగా, శ్రీకృష్ణుడు వారిని విడిపించును. గోకులములోని జనులు పగలు లౌకికవ్యవహారములలో తలమున్కలై రాత్రియందు అలసి నిద్రించెదరు. అనగా, వారికి సాధనలను చేసే అవకాశము లేదు. అయిన నూ, భగవానుడు పొరికి తన నిత్యనివాసమగు వైకుంఠము (మోక్షము) ను అనుగ్రహించును.

గోపాలకులు ప్రతిసంవత్సరము చేసే ఇంద్రయాగమునకు శ్రీకృ ష్ణుడు విఘ్నమును కలిగించగా, కోపించిన ఇంద్రుడు గోకులమును ముంచెత్తి వినాశము చేయుట కొరకై అధికముగా వర్షించును. అప్పుడు ఆయన వయస్సు ఏడు సంవత్సరములు మాత్రమే. అయిననూ, ఆయన పశువులను మరియు అమాయకులగు జనులను రక్షించగోరి, గోవర్ధన పర్వతమును ఎత్తైన కుక్క గొడుగును వలె సునాయాసముగా ఒంటి చేతితో పైకెత్తి ఏడు రోజులు నిలబెట్టి ఉంచును.

రాత్రియందు చంద్రుని కిరణములచే తెల్లగా ప్రకాశించే అడవిలో శ్రీకృష్ణుడు విహరిస్తూ రాసక్రీడకు సంసిద్దుడగుచుండెను. ఆయన తన మురళిపై మధురమగు పదములు మరియు దీర్ఘమగు ఆలాపన కలిగిన గీతమును గానము చేయగా, దానిచే వర్ధిల్లజేయబడిన మన్మథతాపము గల గోపికలను కుబేరుని అనుచరుడగు శంఖచూడుడు అపహరించును. అపుడాయన వాని తలను నరికి వేయగలడు.

ప్రలంబాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, కేశి, అరిష్టాసు రుడు, చాణూరుడు మొదలగు మల్లవీరులు, కువలయాపీడమనే ఏనుగు, కంసుడు, కాలయవనుడు, నరకాసురుడు, పౌండ్రకుడు, శాల్వుడు, ద్వివి దుడనే కోతి, బల్వలుడు, దంతవక్తూడు, నగ్నజిత్, యొక్క ఏడు ఎద్దులు, శంబరాసురుడు, విదూరథుడు, రుక్మి మొదలగువారు, కాంబోజ-మత్స్య -కురు-కైకయ-సృంజయదేశాధిపతులు మరియు ఇతరులు యుద్ధరంగ ములో ధనస్సులను ఎక్కు పెట్టి బీరములను పలికెదరు. వారిని బలరాము డు, భీముడు, అర్జునుడు అనే రూపములలో శ్రీకృష్ణుడు సంహరించగా, వారు ఆయనయందు లయమగుదురు. శ్రీకృష్ణుడు వారికి తన దివ్యధామ మగు వైకుంఠమును (మోక్షమును) అనుగ్రహించును.

కలికాలముయొక్క ప్రభావముచే మానవుల బుద్ధిశక్తి సంకుచితమ గును. మరియు వారికి ఆయుర్ధాయము కూడ తక్కువే. కావున, వారు అపారమగు వేదరాశిని అధిగమించలేరు. అయ్యో! అని ఆలోచించిన శ్రీహరి సత్యవతియందు వ్యాసుని రూపముగా అవతరించి, యుగధర్మము వకు తగిన విధముగా వేదమనే మహావృక్షమును శాఖల రూపములో విభా గము చేయగలడు.

మయుడు త్రిపురాసురులకు కంటికి కానరాని వేగము గల మూడు నగరములను నిర్మించి ఇచ్చును. వారు వేదమార్గమునందు నిష్ఠ గలవారే అయిననూ, ఆ నగరములను ఆశ్రయించుకొని లోకములను హింసించు చుందురు. వారికి బుద్ధియందు వ్యామోహమును కలిగించి వారి బుద్ధికి తప్పు మార్గమునందు లాలసత్వమును కలిగించుట కొరకై శ్రీహరి పాఖం డవేషమును దాల్చి నాస్తికసిద్ధాంతమును అధికముగా బోధించగలడు.

కలియుగము అంతమయ్యే కాలములో సత్పురుషుల ఇళ్లలో కూడ శ్రీహరి గాథలను వినుటకు అవకాశము లేని విధముగా ఆటంక ములు ఉండును. ఉపనయనసంస్కారమును పొందదగిన జనులు వేదనీం దకులు అగుదురు. రాజులు అధర్మమార్గములో పాలించెదరు. ఎక్కడై ననూ స్వాహా స్వధా వషట్ అనే పదములు వినబడవు. అనగా, యజ్ఞ ములు, పితృకర్మలు లుప్తమై పోవును, అట్టి కాలములో శ్రీహరి కల్కిభగ వానుని రూపములో అవతరించి అధర్మమును నశింప జేయగలడు.

సృష్టియందు తపస్సు, నేను, మరీచి మొదలగు తొమ్మిదిమంది మహర్షులు, దక్షుడు మొదలగు ప్రజాపతులు, స్థితియందు ధర్మము, విష్ణువు, మనువు, దేవతలు మరియు రాజులు, సంహారమునందు అధర్మ ము, రుద్రుడు, క్రోధవశములనే సర్పములు, రాక్షసులు మొదలగు వారు అనంతశక్తిసంపన్నుడగు ఆ పరమేశ్వరుని మాయయొక్క విభూతుల రూప ములో ప్రకటమగుచున్నారు.

ఈ లోకములో శ్రీహరియొక్క పరాక్రమమును లెక్క వేయగల మొనగాడెవ్వడు గలడు? భూమియొక్క ధూళికణములనన్నింటినీ లెక్క వేసిన మహాబుద్ధిశాలియైననూ శ్రీహరియొక్క పరాక్రమములను లెక్కించ. లేడు. ఏలయనగా, ఆయన త్రివిక్రమావతారములో ముల్లోకములను తొట్రు పాటు లేని తన పాదములతో వేగముగా కొలుచుచుండగా, ప్రకృతియొక్క ఆవరణతో మొదలు పెట్టి ముల్లోకములు మరియు వాటికి పైన ఉండే సత్య .. లోకముతో సహా సర్వము అధికముగా కంపింప జొచ్చెను. అపుడాయన దానిని స్థిరము చేసి నిలబెట్టెను.

            సృష్టిస్థితిసంహారకారణమగు మాయ శ్రీహరియొక్క శక్తి. ఆ శక్తి యొక్క అంతమును నేను గాని, నీ అన్నలగు మరీచి మొదలగు మహర్షులు గాని తెలియలేకున్నారు. ఇక ఇతరుల గురించి చెప్పునదేమున్నది? వేయి పడగలు గల ఆదిదేవుడగు శేషుడు ఆ శ్రీహరి గుణములను గానము చేయుచునే యున్నాడు. అయిననూ, ఇప్పటికి కూడా ఇంకనూ అంతము చేరుకొనలేదు.

ఎవరైతే కపటము లేకుండగా ఏకాగ్రమగు మనస్సుతో ఆ అనంత భగవానుని పాదములను ఆశ్రయించెదరో, వారియందు ఆయన నిశ్చయముగా దయను చూపును. ఆ కారణముగా మిక్కిలి క్లేశముతో మాత్రమే తరించ శక్యమయ్యే దేవమాయను వారు అతిక్రమించెదరు. కుక్కలకు నక్కలకు ఆహారముగా పనికి వచ్చే ఈ దేహమునందు వారికి ఇది నాది, ఇది నేను అనే వ్యామోహము ఉండదు.

ఓయీ నారదా! పరమపురుషుడగు శ్రీహరియొక్క మాయను నేను, నీవు, నీ అన్నలగు సనకాదులు, శివ భగవానుడు, రాక్షసవంశశ్రేష్టు డగు ప్రహ్లాదుడు, స్వాయంభువ మనువు, ఆయన పత్నియగు శతరూప, వారి పుత్రులగు ప్రియవ్రత-ఉత్తానపాదులు, వారి పుత్రికయగు దేవహూతి, ప్రాచీనబరీషుడు అనే ప్రజాపతి, ఋభుడు అనే సిద్దుడు, అంగుడు, ధ్రువు డు, ఇక్ష్వాకు మహారాజు, ఇలుని పుత్రుడగు పురూరవుడు, ముచుకుందు డు, జనక మహారాజు, గాధి, రఘు" మహారాజు, అంబరీషుడు, సగరుడు, గయుడు, నహుషుని పుత్రుడగు యయాతి, మాంధాత, అలర్కుడు, శతధ న్వుడు, అనువు, రంతిదేవుడు, భీష్మ పితామహుడు, బలి చక్రవర్తి, అమూ గ్రరయుడు, దిలీపుడు, సౌభరి, ఉత్తంకుడు, శిబి చక్రవర్తి, దేవల మహర్షి, పిప్పలాదుడు, సారస్వతుడు, ఉద్ధవుడు, పరాశరుడు, భూరి షేణుడు, విభీ షణుడు, హనుమంతుడు, శుకదేవుడు, అర్జునుడు, ఆర్ష్టిషేణుడు, దురుడ, శ్రుతదేవుడు మొదలగు ఎందరో మహానుభావులు తెలుసుకున్నారు.

స్త్రీలు, శూద్రులు, హూణులు భిల్లులు మాత్రమే గాక, పాపపపీల మగు జీపనము గల మానవులు మరియు ఏనుగు మొదలగు జంతువులు కూడ శ్రీహరి భక్తులను సేవించి వారివద్ద భగవచ్చింతనమును నేర్చిన పక్ష ములో నిశ్చయముగా దేవమాయను తెలుసుకొని, దానిని అతిక్రమించెద రు. ఇట్టి స్థితిలో వేదవేత్తల గురించి చెప్పునదేమున్నది? ఆ భగవానుడు వామనావతారములో ముల్లోకములను తన పాదములతో అత్యద్భుత ముగా కొలిచి వేసినాడు.

వచ్చి పోయే సుఖదుఃఖముల బెడద లేని నిత్యప్రసన్నస్వరూప ము, భయమునకు తావు లేనిది, జ్ఞానఘనము, సంసారముయొక్క సంగ ము అనే దోషము లేనిది, భేదము లేనిది, కార్యకారణములకు అతీతమైన ది, జ్ఞాతయొక్క స్వరూపమగు ఆత్మయైనది, సదానంద స్వరూపము, శోక సంస్పర్శ లేనిది అగు పరబ్రహ్మతత్త్వమే పరమపురుషుడగు శ్రీహరి భగ వానుని ధామము (స్వరూపము) అని మహర్షులు తెలియుచున్నారు. అనే కకారకముల (క్రియాసాధనముల) తో గూడిన యజ్ఞయాగాది కర్మలను బోధించే వేదవాక్కు ఆ బ్రహ్మను ఇదమిత్తముగా బోధించలేదు. ఈ పర మాత్మతత్త్వము ఆప్యము (పయనించి పొందదగినది), సంస్కార్యము (సం స్కారకర్మచే సంపాదించ దగినది), వికార్యము (మార్పు వచ్చుటచే లభిం చేది), ఉత్పాద్యము (కోత్తగా నిర్మించ దగినది) అనే నాలుగు రకముల కర్మఫలము కాదు. ఈ ఆత్మజ్ఞానముయొక్క సన్నిధిలో మాయాదేవి సిగ్గు పడి దూరముగా తొలగి పోవును. అనగా, ఆత్మజ్ఞానికి సంసారబంధము లేడు. తన స్వరూపమైన జలపూర్ణమగు మేఘముయొక్క రూపములో ప్రకాశించే ఇంద్రునకు నూతిని తవ్వే గునపముతో ఏ విధముగానైతే ప్రయో జనము లేదో, అదే విధముగా దీనియందు ప్రతిష్టితమైన మనస్సులు గల యతీంద్రులకు భేదమును నిషేధించే జ్ఞానసాధనములతో పని లేదు.

మానవులు తమ స్వభావమునకు అనురూపముగా చేసే శుభకర్మలు ప్రేరకుడగు ఆ పరమేశ్వరుని వలన మాత్రమే చక్కగా ఘటిల్లు చున్నవి. కర్మల ఫలమగు మంగళములను ఇచ్చే ప్రభుడు ఆయనయే. మహత్తు మొదలగు తత్త్వముల పరిణామము వలన ఉత్పన్నమయ్యే ఈ కార్యజగత్తుయొక్క ఉనికి ఆయనయందు మాత్రమే గలదు. మజ్జ, మాంసము మొదలగు ధాతువుల కలయికచే ఏర్పడిన ఈ దేహము శిథి లమై పోయిననూ, దానియందలి ఆకాశము ఏ విధముగానైతే వికారమును పొందదో, అదే విధముగా ఆ దేహమును ప్రకాశింపజేసిన జన్మమరణరహి తుడగు చేతనపురుషుడు ఆ దేహముతో బాటు శిథిలము కాబోడు.

వత్సా! జగత్తును సృష్టించే శ్రీహరి భగవానుని గురించి నేను నీకు సంక్షేపముగా చెప్పితిని. కార్యకారణరూపమగు ఈ జగత్తు జగత్కారణ మగు శ్రీహరికంటె భిన్నముగా లేదు. కాని, శ్రీహరి జగత్తుకంటే విలక్షణ మగు చేతనఘనుడై భాసించుచున్నాడు.

ఈ భాగవతమని ప్రసిద్ధిని గాంచిన శాస్త్రమును శ్రీహరి నాకు ఉపదేశించినాడు. దీనియందు భగవానుని మహిమలు సంగ్రహముగా వర్ణించబడినవి. దీనిని నీవు విస్తారముగా వర్ణించుము.

ఏ విధముగా వర్ణించినచో, మానవులకు సర్వజగత్స్వరూపుడు, - సర్వమునకు ఆత్మయైనవాడు, సర్వజగత్తుయొక్క ఉనికికి ఆశ్రయమైన వాడు, షడ్గుణేశ్వర్యసంపన్నుడు అగు శ్రీహరియందు భక్తి కలుగునో, ఆ విధముగా సంకల్పమును చేసి వర్ణించుము.

ఈ పరమేశ్వరుని లీలలను నిత్యము శ్రద్ధతో వర్ణించు వారలకు, విని అనుమోదించు వారలకు, బుద్ధి అవిద్యచే వ్యామోహమును పొందదు.

ఇది శ్రీమద్భాగవత మహాపురాణములోని రెండవ స్కంధములో ఏడవ అధ్యాయము  ముగిసినది.