శ్రీ మద్భాగవతము - ద్వితీయ (2వ) స్కందము

1 - ప్రథమోధ్యాయః

శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను: ఓ మహారాజా! మానవులు విని కీర్తించి స్మరించదగిన వాటిలో సర్వోత్కృష్టమైనది యేది? అని నీవు వేసిన ఈ ప్రశ్న చాల గొప్పది. ఏలయనగా, లోకమునకు హితమును గూర్చే ఈ ప్రశ్న బ్రహ్మవేత్తలకు చాల అభీష్టమైనది.

ఓ మహారాజా! గృహస్థులగు మానవులు కుటుంబపోషణలో భాగముగా పొయ్యి, రోలు మొదలగు వంట సాధనములను వాడే సందర్భము లలో తమకు తెలియకుండగనే హింసకు పాల్పడుచుందురు. లౌకికజీవన మునందు తీవ్రమగు ఆసక్తి గలవారు ఆత్మస్వరూపమును తెలియజాలరు. అట్టి మానవులకు నిత్యకృత్యములలో భాగముగా విని స్మరించదగిన విషయములు అసంఖ్యాకముగా నుండును.

ఓ మహారాజా! మానవుని ఆయుర్దాయములోని రాత్రిభాగము నిద్రలో మరియు శారీరకసుఖములలో, పగటి భాగము ధనమును. సంపాదీంచి కుటుంబమును పోషించుకొనుటలో గడిచి పోవుచున్నదీ.

             మానవునకు ఈ సంసారయాత్రలో సహకరించే దేహము, సంతాన ము, జీవితభాగస్వామి మొదలగు పరికరములు కాలముతో చేసే పోరాట మునకు సమర్థములు కావు. ఈ పరికరములు మిథ్యాభూతములు మాత్రమే గాక, కొన్ని సందర్భములలో చేటును కొనితెచ్చును. కాని, వాటి యందు లగ్నమైన మనస్సు గల మానవుడు తన తండ్రి మొదలగు వారి జీవితములో వాటి వినాశమును చూచుచున్ననూ, వాటి అనిత్యత్వమును గమనించ లేకపోవుచున్నాడు.

భరతవంశములో జన్మించిన ఓ మహారాజా! కావున, మోక్షమును గోరు మానవుడు శ్రీవిష్ణుభగవానుని గురించి శ్రవణము చేసి, ఆయనను కీర్తించి, ఆయననే స్మరించవలెను. సర్వజగన్నాథుడగు ఆ భగవానుడు సర్వప్రాణులలో ఆత్మరూపముగా నున్నాడు.

            మానవుడు తన కర్తవ్యమును నియమము తప్పకుండా పాటిస్తూ, కర్మయోగముననుష్ఠించి, ఆత్మానాత్మవివేకము గలవాడై, ఆత్మస్వరూప జ్ఞానమును పొంది, మరణకాలములో నారాయణుని స్మరిస్తూ దేహమును విడిచి పెట్టినచో, అదియే మానవజన్మయొక్క మహాఫలము.

ఓ మహారాజా! సర్వకర్మసన్న్యాసముచే విధిని షేధములకు అతీ తులైన మహర్షులు నిర్గుణపరబ్రహ్మయందు నిష్ఠ గలవారే అయిననూ, తరచుగా శ్రీహరియొక్క గుణములను గానము చేయుటలో ప్రీతిని కలిగియుందురు సుమా!

భాగవతమని ప్రసిద్ధి గాంచిన ఈ వేదముతో సమానమగు పురాణ మును నేను కలియుగారంభములో నా తండ్రియగు వేదవ్యాసమహర్షి వద్ద అధ్యయనము చేసితిని.

ఓ రాజర్షీ! నేను త్రిగుణములకు అతీతమగు పరమాత్మతత్త్వము నందు నిష్ఠను కలిగియున్న అంతఃకరణము గలవాడనే అయిననూ, ఉత్తమ మగు కీర్తిగల శ్రీహరియొక్క లీలలచే ఆకర్షించ బడినవాడనై భాగవతపురా ణమును అధ్యయనము చేసియుంటిని. ఈ పురాణమునందు శ్రద్దను చూపు జనులకు మనస్సు శీఘ్రమే శుద్దమై శ్రీహరియందు లగ్నమగును. నీవు మహాపురుషుడగు శ్రీకృష్ణునకు ప్రియుడవు. ఈవున, అట్టి భాగవతగా థను నేను నీకు చెప్పెదను.

ఓ మహారాజా! వైరాగ్యమును పొంది అభయస్థానమగు మోక్ష మును కోరే కర్మయోగులకు మాత్రమే గాక, ఇహపరలోకములలోని భోగ ములను కోరువారికి కూడ ఈ హరినామసంకీర్తనమే ఉత్తమసాధనముగా పెద్దలచే నిర్ణయించబడినది. జ్ఞానులు పొందే మోక్షరూపఫలము కూడ ఇదియే.

విషయభోగములయందు తగుల్కొని అజ్ఞానములో జీవించే వ్యక్తికి గడచిపోయిన అనేకసంవత్సరముల కాలము అంతయు వ్యర్థమే. మానవజన్మయొక్క ప్రయోజనము గురించి తెలిసిన కాలము గంటయై ననూ అట్టి చాల సంవత్సరముల కంటె గొప్పది. ఏలయన, దాని వలన మానవుడు మోక్షము కొరకు ప్రయత్నించును.

ఖట్వాంగుడనే రాజర్షి తనకు కేవలము ముహూర్తకాలము మాత్రమే ఆయుర్దాయము మిగిలి యున్నదని తెలుసుకొని, సర్వమును విడిచి పెట్టి, ఆ ముహూర్తకాలముచే మాత్రమే భయమును పోగొట్టే శ్రీహ రిని పొందినాడు.

కురువంశములో జన్మించిన ఓ మహారాజా! నీకైతే ఇంకా ఏడు రోజుల ఆయుర్దాయము మిగిలి యున్నది. నీవు ఆ కాలమును వినియోగిం చుకోని ఉత్తమగతిని ఇచ్చే సాధనమునంతను సంపాదించుకొనుము.

మానవుడు తనకు మరణకాలము ఆసన్నమైనప్పుడు మరణభ యమును విడనాడి, దేహమునందు మరియు దానిని అనుసరించి సంప్రాప్త మైన వస్తువాహనాదులయందు గల ప్రీతిని అనాసక్తి (ప్రాపంచిక వస్తువుల యందు తీవ్రమగు అభిలాష లేకుండుట) అనే ఆయుధముతో ఛేదించుకొన వలెను.

మానవుడు ఇంద్రియజయము గలవాడై, ఇంటినుండి బయట పడి, పవిత్రమగు తీర్థజలములో స్నానమాడి, ఏకాంతప్రదేశములో శుద్ద మగు స్థానమునందు యథావిధిగా ఆసనమును ఏర్పాటు చేసుకొని, దానిపై యధోచితమగు ఆసనమును బంధించి, ఓంకారమును జపించవలె ను. అకార-ఉకార-మకారముల కూర్పు అగు ఓంకారము పరమేశ్వరుని బోధించే శబ్దములలో సర్వశ్రేష్ఠమైనది. అట్టి పవిత్రమగు ఓంకారముపై నుండి మనస్సును ఇతరము పైకి మళ్లనీయకుండగా ప్రాణాయామమును చేయుచూ, మనస్సును వశము చేసుకొనవలెను.

            కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము అనే అయిదు ఇంద్రియ ములు వరుసగా రూపము (రంగు), శబ్దము, గంధము, రసము (రుచి), స్పర్శ (కోమలము ఇత్యాది) అనే ప్రాపంచిక విషయములయందు ప్రసక్త ములై యుండును. మనస్సు వీటిద్వారా ప్రపంచములో విహరించుచుండు ను. సాధకుడు శరీరము అనే రథమును నడిపే నిశ్చయాత్మకమగు బుద్ది అనే సారథి ద్వారా మనస్సు అనే కళ్లెముతో గుర్రముల వంటి ఇంద్రియ ములను భోగములలో చిక్కుకొనని విధముగా వెనుకకు మళ్లించవలెను; అనగా, మనస్సును అంతర్ముఖము చేయవలెను (ప్రత్యాహారము). మనస్సు కర్మవాసనలచే ఆకర్షించబడి విక్షేపము (చెల్లాచెదరు అగుట) ను పొందుచుండును. సాధకుడు సత్సంస్కారములతో కూడిన బుద్దిచే అట్టి మనస్సును సకలకల్యాణనిలయమగు భగవద్రూపమునందు స్థిరముగా నిలుప వలెను (ధారణ).

 సాధకుడు భగవంతుని పూర్ణరూపమునుండి జారిపోని (ఇటునటు చెదిరిపోని) మనస్సుతో ఆ భగవత్స్వరూపమునందలి ఒక్కొక్క అవయవ మును ధ్యానించవలెను (ధ్యానము). మనస్సును విషయాసక్తినుండి మరల్చి ఆ పైన భగవద్రూపముకంటే భిన్నమగు మరియొక దానిని స్మరిం చరాదు (సమాధి). అదియే శ్రీమహావిష్ణువుయొక్క పరమపదము. దాని యందు లగ్నమైన మనస్సు ప్రసన్నమగును. లేదా, దేనియందు లగ్నమై మనస్సు ప్రసన్నమగునో, అట్టి ధ్యేయము శ్రీమహావిష్ణువుయొక్క సర్వోత్కృష్టమగు స్వరూపము మాత్రమే.

మనస్సునందలి రజోగుణము దానిని ఇటునటు చెదరగొట్టును. తమోగుణము మనస్సునకు భగవద్రూపమును భావించే సామర్థ్యము లేకుండగా చేయును. అట్లు జరిగినప్పుడు సాధకుడు ధైర్యము గలవాడై, భగవత్స్వరూపమును ధ్యానము చేస్తూ మనస్సును తన వశము చేసుకొన వలెను. అట్టి భావన వలన మనస్సులోని రజస్తమోగుణముల మాలిన్యము తొలగి పోవును.

సాధకుడు స్థిరచిత్తముతో ఈ విధముగా చక్కగా మంగళకరమగు భగవత్స్వరూపము పై మనస్సును నిలిపియున్నచో (ధారణ), దాని వలన శీఘ్రమే ఆతని హృదయములో భగవతేమ (భక్తి) మొలకెత్తి, దాని ప్రభా వముచే ఆతడు భగవంతుని పొందును.

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను: ఓ మహర్షీ! ధారణను చక్కగా స్థిరముగా చేసే విధమెట్టిది? దేనిపై చేయవలెను? మానవుని మనస్సులోని మాలిన్యమును వెంటనే పోగొట్టే ధారణయొక్క స్వరూపమెట్టిది?

శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను: సాధకుడు అభ్యాసముచే ఆసన మును జయించి, అనగా స్థిరముగా సుఖముగా ఆసనమునందు కూర్చుండి, శ్వాసను జయించి, అనగా ప్రాణాయామముయొక్క అభ్యాసముచే శ్వాసను వశము చేసుకొని, ప్రాపంచిక విషయములపై ఉండే ఆసక్తిని జయించి, ఇంద్రియములను వశపరచుకొని, నిశ్చయాత్మకమగు బుద్ధి ద్వారా మనస్సును భగవంతుని స్థూలరూపముపై చక్కగా నిలిపి యుంచవలెను.

భూతభవిష్యద్వర్తమానకాలములలో కార్యరూపములోనున్న సక లచరాచరప్రాణికోటికి మరియు సకలపదార్థజాతమునకు ఆశ్రయమై మన కంటికి కానవచ్చే ఈ బ్రహ్మాండమే ఆ పరమేశ్వరుని దేహము. ఈ విరాడ్ (స్థూల) దేహము పెద్ద వాటన్నింటికంటే పెద్దది.

ఈ బ్రహ్మాండము భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకా శము అనే పంచభూతములు, అహంకార మహత్తత్త్వములు వెరసి ఏడు ఆవరణములతో కూడియున్నది. ఈ విరాట్ దేహమునకు అభిమానియైన చేతనతత్త్వమే హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్బుని రూపములోనున్న భగ వానునిపై మనస్సును స్థిరముగా నిలిపి ధ్యానించవలేను.

జగత్తును సృష్టించిన ఈ హిరణ్యగర్భునకు పాతాళలోకము పాదముల క్రింది భాగమనియు, రసాతలము కాలి ముందు వెనుక భాగములని యు, మహాతలము చీలమండలనియు, తలాతలము పిక్కలనియు మహర్షులు చెప్పుచున్నారు.

ఓ మహారాజా! బ్రహ్మాండరూపములో ప్రకటమైన ఆ పరమేశ్వరు నకు సుతలము మోకాళ్లనియు, వితలము మరియు అతలము రెండు తొడ లనియు, భూతలము పొత్తికడుపు అనియు, అంతరిక్షము సరస్సు వంటి నాభి అనియు మహాత్ములు చెప్పుచున్నారు.

ఆదిపురుషుడగు ఆ హిరణ్యగర్భునకు స్వర్గలోకమే వక్షఃస్థలమనియు, మహర్లోకము కంఠమనియు, జనలోకము నోరనియు, తపోలోకము నుదురనియు, అనంతములగు శిరస్సులు గల ఆ పరమేశ్వరుని శిరస్సుల సమూహమే సత్యలోకమనియు మహర్షులు భావన చేయుచున్నారు.

ఈ పరమేశ్వరునకు ఇంద్రుడు మొదలగు దేవతలే అనేకములగు బాహువులనియు, దిక్కులు చెవి దొప్పలనియు, శబ్దము (ఆకాశతన్మాత్ర) శ్రోత్రేంద్రీయమనియు, అశ్వినీదేవతలు ముక్కు పుటములనియు, గంధత న్మాత్ర ఘ్రాణేంద్రియమనియు, ప్రజ్వరిల్లే అగ్నియే వాగింద్రియమనియు మహాత్ములు చెప్పుచున్నారు.

ఈ శ్రీమహావిష్ణువునకు ద్యులోకమే రెండు కన్నులు కాగా, సూర్యుడు నేత్రేంద్రియమగుచున్నాడు. ఆయనకు రాత్రింబగళ్లు కనురె ప్పలు కాగా, చతుర్ముఖబ్రహ్మయొక్క స్థానము ఆయన కనుబొమల విలా సము అగును. నీరు (మహాభూతము) ఆయనకు దౌడ కాగా, రసతన్మాత్ర (సూక్ష్మమహాభూతము) నాలుక అగుచున్నది.

అనంతుడగు శ్రీమహావిష్ణువునకు వేదములే బ్రహ్మరంధ్రమని యు, యముడు దంతములనియు మహాత్ములు చెప్పుచున్నారు. సకలప్రా ణులలో సంతానము మొదలగు వాటియందు సహజమగు ప్రేమ కానవ చ్చును. అట్టి ప్రేమలేశములే ఆయన పళ్లు. జనులకు మోహమును కలి గించే మాయాశక్తియే ఆయన చిరునవ్వు. ఈ అపారమగు సృష్టి ఆ మాయాశక్తియొక్క కడగంటి చూపు మాత్రమే.

            ఈ పరమేశ్వరునకు సిగ్గు పై పెదవి, లోభము క్రింది పెదవి, ధర్మము స్తనము, అధర్మమార్గము వీపు, ప్రజాపతి జననేంద్రియము, మిత్రావరుణులు అండములు, సముద్రములు పొట్ట, పర్వతములు ఎము కల సమూహములు అగుచున్నవి.

ఓ మహారాజా! బ్రహ్మాండమే దేహముగా గల ఈ శ్రీమహావిష్ణువు నకు సడులే నాడులు కాగా, చెట్లు రోమములు అగును. అనంతమగు శక్తి గల యువు ఆయన శ్వాస. కాలమే ఆయన చలనము. సత్త్వరజస్తమో గు, ప్రవాహమనదగిన కలప్రాణిసృష్టిపరంపర ఆయన చేసే పని.

  ఓ కురువంశశ్రేష్టా! జగన్నాథుడు, పరబ్రహ్మస్వరూపుడు అగు శ్రీప, నిష్ణువునకు మేఘములే కేశములనియు, సంధ్య వస్త్రమనియు, ప్రక్క ఒక మృదయమనియు మహర్షులు చెప్పుచున్నారు. ఇంతేగాక, ఓషధులలోని రసవికారములన్నింటికీ ఆశ్రయముగా ప్రసిద్ధి చెందిన చంద్రుడే ఆయనకు మనస్సు.

సర్వము తానే అయి ఉన్న ఆ పరమేశ్వరునకు మహత్ (సమష్టి బుద్ది) తత్త్వము జ్ఞానశక్తి అనియు, రుద్రుడు అహంకారమనియు మహ రులు వేదానుసారముగా చెప్పుచున్నారు. గుర్రము, కంచరగాడిద, ఒంటే, ఏనుగు అను జంతువులు ఆయన గోళ్లు. లేడి మొదలగు సర్వమృగములు, ఆవు మొదలగు సకలపశువులు ఆయన కటిప్రదేశమని భావన చేయవ లెను.

ఆ పరమేశ్వరుని అద్భుతమగు శిల్పనైపుణ్యమే పక్షుల రూపము లోను, ఆయన షడ్డము మొదలగు సంగీతస్వరములను స్మరించినప్పుడు ఆ స్మృతులే గంధర్వ-విద్యాధర-చారణ-అప్సరసలు అనే దేవయోనుల రూపములోను రూపు దిద్దుకున్నవి. స్వాయంభువ మనుపు ఆయన బుద్ధి కాగా, మానవుడు ఆ పరమేశ్వరుని నివాసస్థానము. ఆయన పరాక్రమము రాక్షససమూహముల రూపములో ప్రకటమైనది.

బ్రాహ్మణుడు ఆయనకు ముఖము, క్షత్రియుడు భుజములు, వైశ్యుడు ఊరువులు, శూద్రులు పాదములు కాగా, ఆయన సర్వజగద్రూపుడై, వసు-రుద్ర మొదలగు అనేకనామములు గల దేవతాగణములతో కూడి యున్నాడు. హవిస్సు మొదలగు ద్రవ్యములచే చేయబడే విస్తారమగు యజ్ఞప్రయోగము ఆయన కర్మ.

ఈ విధముగా విస్తరించియున్న ఈశ్వరుని విరాడ్రేహముయొక్క అవయవసంస్థానమును నేను నీకు చెప్పితిని, సాధకులు తమ బుద్ధి ద్వారా మనస్సును ఈ పరమేశ్వరుని స్థూలదేహమునందు ధారణ చేయుదురు.ఈ విరాడ్రూపము కంటే భిన్నముగా ఈ జగత్తులో ఏదీ లేదు.

పరమేశ్వరుడు సకలప్రాణులలో ఆత్మరూపముగా నున్నవాడై ఆయా ప్రాణుల మనోవృత్తులచే సకలజగత్తును దర్శించి అనుభవించుచు న్నాడు. మనిషి స్వప్నములో తనను మాత్రమే వివిధజనుల రూపములో మరియు పదార్థముల రూపములో దర్శించును. ఆ విధముగా దర్శించ బడే స్వప్నప్రపంచము ద్రష్ట కంటే భిన్నముగా లేదు. అదే విధముగా ఈ జగత్తు పరమేశ్వరుని కంటే భిన్నముగా లేదు. అనగా, ఆ పరబ్రహ్మ అద్వి తీయము. నిర్విశేషమగు ఉనికియే స్వరూపముగా గల ఆనందఘనుడగు ఆ పరమేశ్వరుని సాధకుడు సేవించవలేను. సాధకుడు ఇతరములగు ప్రాపంచిక విషయములయందు తీవ్రమగు ఆసక్తిని కలిగియుండరాదు. ఏల యనగా, అట్టి ఆసక్తి మానవుని పతితుని చేయును.

శ్రీమద్బాగవత మహాపురాణములోని రెండవ స్కంధములో మొదటి అధ్యాయము ముగిసినది.