భాగవత మహా పురాణము
13 - పురాణముల శ్లోకసంఖ్య - శ్రీమద్భాగవత మహిమ
సూత ఉవాచ ।
శ్రీసూత మహర్షి ఇట్లు పలికెను --- ఆ పరమాత్మను బ్రహ్మదేవుడు, వరుణుడు, ఇంద్రుడు, రుద్రులు, మరుద్గణములు దివ్యములైన స్తోత్రములతో స్తుతించుచున్నారు. సామవేద విద్వాంసులు అంగములు, పదము, క్రమము, ఉపనిషత్తులతో కూడిన వేదములతో ఆ పరమాత్మను కీర్తించుచున్నారు. యోగులు ధ్యానముచే మనస్సును నిశ్చలముగా తల్లీనము చేసి ఆ పరమాత్మను ధ్యానించుచున్నారు. దేవతల మరియు ల గణములకు ఆ పరమాత్మయొక్క పూర్ఖతత్త్వము తెలియదు. ఆ ప్రకాశపరమాత్మకు నమస్కారము.
శ్రీహరి తాబేలై బరువైన మందరపర్వతమును వీపుపై మోయు డు దాని బండరాళ్ల కోనల రాపిడిచే దురద తీరి నిద్ర వచ్చెను. ఆయన శ్వాస గాలుల తాకిడి సముద్రజలములయందు ఈ సంస్కారరూపముగా మిగిలియే యున్నది. కావుననే, సముద్రము క్షోభ అనే మిషతో అలుపునేరుగకుండా ఆటుపోటులు వచ్చుచునే నవి. అట్టి భగవానుని శ్వాసవాయువులు మిమ్ములను రక్షించు గాక!
పురాణముల శ్లోకసంఖ్యను, వాటి మొత్తమును, ఈ పురాణముయొక్క విషయప్రయోజనములను, దానమును, దానమహిమను, పాఠము మొదలగువాటి మహిమను గురించి తెలియుడు.
బ్రహ్మపురాణములో పదివేలు, పద్మపురాణములో ఏభై అయిదు వేలు, శోభాయుక్త మైన విష్ణుపురాణములో ఇరవై మూడు వేలు, శివపురాణములో ఇరవై నాలుగు వేలు శ్లోకములు గలవు.
శోభాయుక్తమైన భాగవతములో పద్దెనిమిది వేలు, నారదపురాణములో ఇరవై అయిదు వేలు, మార్కండేయ పురాణములో తొమ్మిది వేలు, అగ్ని పురాణములో పది హేను వేల నాలుగు వందల శ్లోకములు గలవు.
భవిష్యపురాణములో పధ్నాలుగు వేల ఐదువందలు,వైవర్తపురాణములో పద్దెనిమిది వేలు, లింగపురాణములో పదకొండు శ్లోకములు గలవు. –
వరాహపురాణములో ఇరవై నాలుగు వేలు, స్కందపురాణములో ఎనభై
వేల ఒక వంద, వామనపురాణములో పది వేల శ్లోకములు గలవు.
కూర్మపురాణములో పది హేడు వేలు, మత్స్యపురాణములో పద్నాలుగు వేలు, గరుడపురాణములో పందొమ్మిది వేలు, మండపురాణములో పన్నెండు వేల శ్లోకములు గలవు.
ఈ విధముగా పురాణముల మొత్తము శ్లోకసంఖ్య నాలుగు లక్షలు. వాటిలో శ్రీమద్భాగవతములో పద్దెనిమిది వేల శ్లోకములు గలవు.
పూర్వము నాభియందలి పద్మములో ఉండి సంసారము వలన భయపడిన బ్రహ్మదేవునకు శ్రీహరి భగవానుడు ఈ పురాణమును చక్కగా ప్రకాశింప జేసెను.
భాగవతములో ఆరంభము, మధ్య, అంతములయందు వైరాగ్యమును కలిగించే గాథలు గలవు. దీనియందలి శ్రీహరి లీలల గాథల సముదాయ మనే అమృతము సత్పురుషులనే దేవతలకు ఆనందమును కలిగించును.
లోపనిషత్తులు బ్రహ్మ మరియు ప్రత్యగాత్మల ఐక్యమునే సారతత్త్వ ప్రతిపాదించుచున్నవి. అట్టి ఐక్యమే అసాధారణధర్మముగా గల ది లేని పరమార్థతత్త్వమేది గలదో, దానియందు భాగవతము తమైనది. భాగవతమునకు ఏకైకప్రయోజనము మోక్షము మాత్రమే.
భాద్రపదపూర్ణిమనాడు భాగవతమును బంగరు సింహాసనములో పెట్టి చేయువాడు సర్వోత్కృష్టమైన గతి (మోక్షము) ను పొందును.
సత్పురుషుల సమాజములో ఎంతవరకైతే సాక్షాత్తు శ్రీమద్భాగవతము కానరాదో, అంతవరకు మాత్రమే ఇతరపురాణములు ప్రకాశించును.
ఏలయనగా, శ్రీమద్భాగవతము సకలోపనిషత్తుల సారము. దానిని పఠించుటచే రసానుభవము కలిగి, అమృతమువంటి ఆ రసముచే సంతృప్తి జెందినవానికి ఇతరపురాణముల పై ప్రీతి కలుగదు.
నదులలో గంగ యెటులనో, దేవతలలో శ్రీహరి భగవానుడు యెటులనో, విష్ణుభక్తులలో శివుడు యెటులనో, పురాణములలో ఈ శ్రీమద్భాగవతమట్టిది.
మహర్షులారా! సకల క్షేత్రములలో నిశ్చయముగా కాశీ ఎటులనో, నే పురాణములన్నింటిలో శ్రీమద్భాగవతము సర్వశ్రేష్ఠము.
శ్రీమద్భాగవతము నిర్దుష్టమైన పురాణము. ఇది విష్ణుభక్తులకు రము. దీనియందు పరమహంసలకు హితము, అద్వితీయము, చైతన్యస్వరూపము అగు పరబ్రహ్మ గానము చేయబడును. రుందు ఆత్మజ్ఞానము, వైరాగ్యము, భక్తి అనువాటితో కూడిన ంతిక-కర్మనివృత్తి ఆవిష్కరించబడినది. దీనిని భక్తితో శ్రవణము చేసి, యణ చేసి, నిష్ఠగా మననము చేయువాడు విముక్తుడగును.
ఈ భాగవతము సాటి లేని జ్ఞానమనే గొప్ప దీపము. దీనిని ఆ పరమాత్మ పూర్వము సృష్ట్యాదియందు బ్రహ్మదేవుని కొరకు, ఆ బ్రహ్మ దేవుని రూపముతో నారద మహర్షి కొరకు, నారద మహర్షి రూపముతో కృష్ణ ద్వైపాయన మహర్షి కొరకు, ఆ వ్యాస మహర్షి రూపముతో యోగివర్యుడగు శుకమహర్షి కొరకు, ఆ శుక మహర్షి రూపముతో దయచే భగవంతునియందు ప్రీతి గల పరీక్షిత్తు కొరకు ప్రకాశింప జేసెను. అట్టి పరమాత్మ శుద్దము, ప్రాకృతదోషములు లేని పరమార్థము. శోకము మరియు వినాశము లేని అట్టి పరబ్రహ్మను ధ్యానించుచున్నాము.
ఆసాక్షియగు ఆ వాసుదేవ భగవానుని కొరకు నమస్కారము. ఆ ముడు మోక్షకామియగు బ్రహ్మదేవుని కొరకు దయతో ఈ కమును వివరించి చెప్పెను.
యోగులలో శ్రేష్ఠుడగు శుకమహర్షి పరబ్రహ్మస్వరూపుడు. ఆయన నమస్కారము. ఆయన సంసారమనే సర్పముచే కరువబడిన ్మహారాజును సంసారబంధమునుండి విముక్తుని చేసెను.
దేవుడవగు ఓ ప్రభూ! నీవే మాకు నాథుడవు. కాబట్టి, మాకు న్మలయందు నీ పాదములపై భక్తి కలుగునట్లు చేయుము. .
॥ ఏకాదశ స్కంధస్సమాప్తః ॥
॥ శ్రీమద్భాగవత మహాపురాణం సమాప్తమ్ ॥
శ్రీమద్భాగవత మహాపురాణము పన్నెండవ స్కంధములో పురాణముల శ్లోకసంఖ్యను, శ్రీమద్భాగవత మహిమను వర్ణించే పదమూడవ అధ్యాయము ముగిసినది .
ద్వాదశ స్కంధము ముగిసినది.
శ్రీమద్భాగవత మహాపురాణము సమాప్తము.
శ్రీ గురుభ్యో నమః, హరిః ఓమ్, తత్సత్, శ్రీకృష్ణార్పణమస్తు.
శ్రీవేంకటేశ్వరార్పణమస్తు.
Summary of chapter 13 of the Bhāgavata Mahā Purana is as follows:
The final chapter brings the *Śrīmad Bhāgavata Mahāpurāṇam* to a transcendent close, declaring its total verse count to be precisely **eighteen thousand verses** (*Ashṭādaśa-sahasra*) across **twelve cantos**. It is glorified as the essence of all Vedāntic philosophy (*Sarva-vedānta-sāram*), the mature fruit of the Vaidika desire tree, and the literary incarnation of Svayam Bhagavān Śrī Kṛshṇa. Sūta Gosvāmī concludes with the celebrated, immortal benediction: > *"Nāma-saṅkīrtanaṁ yasya sarva-pāpa-praṇāśanam |* > *Praṇāmo duḥkha-śamanas taṁ namāmi hariṁ param ||"* He declares that the congregational chanting of the holy names of Bhagavān Hari destroys all sins and relieves all suffering, granting eternal spiritual shelter at the lotus feet of Svayam Bhagavān Śrī Kṛshṇa.