భాగవత మహా పురాణము
3 - శ్రీకృష్ణ భగవానుని లీలలను వర్ణించుట
ఉద్ధవ ఉవాచ !
ఉద్ధవుడు ఇట్లు పలికెను --- తరువాత శ్రీకృష్ణుడు తన తల్లిదం డ్రులకు సుఖమును కలిగించగోరి, బలరామునితో గూడినవాడై నందవ్రజమునుండి మథురా నగరమునకు వచ్చెను. ఆయన అచట తమ శత్రుసముదాయమునకు నాయకుడగు కంసుని కొట్టి చంపి ఎత్తైన సింహాస నమునుండి నేల పై పడవేసి ఈడ్చెను.
ఆ విధముగా ఆయన ఆరు అంగములతో కూడిన వేదమును అధ్యయనము చేసెను. ఆ గురువుగారి పుత్రుడు ఎప్పుడో మరణించెను. శ్రీకృష్ణుడు పంచజనుడను రాక్షసుని ఉదరమునుండి ఆ పుత్రుని తీసుకువచ్చి గురువుగారికి వరము (దక్షిణ) గానిచ్చెను.
భీష్మకుని పుత్రియగు రుక్మిణి స్వయంవరమునకు ఆమె అన్న రుక్మి శిశుపాలుడు మొదలగు వారిని ఆహ్వానించెను. ఆ రుక్మిణి లక్ష్మీదేవి వలె నుండెను. ఆమె సౌందర్యమే ఆహ్వానము కాగా ఆమెను పొందగోరి వారందరు విచ్చేసిరి. శ్రీకృష్ణుడు, రుక్మిణి పరస్పరము ప్రేమించుకొని సంకేతములను చేసుకొని యుండిరి. ఆమె ఆయనకు నిత్యసహచారిణి. ఆయన గాంధర్వవిధానముచే ఆమెను వివాహమాడగోరి అందమగు రథ ముపై వచ్చెను. ఆ శిశుపాలాదులు చూచుచున్ననూ లెక్క చేయకుండగా, ఆయన వారి శిరస్సులపై తన కాలిని మోపి (వారిని చిత్తుగా ఓడించి), గరుత్మంతుడు అమృతమును వలె, ఆమెను తీసుకొని పోయెను.
శ్రీకృష్ణప్రభుడు భోగలాలసుని తరహాలో ప్రియురాలగు సత్యభామకు ప్రియమును చేయగోరి స్వర్గమునుండి పారిజాత వృక్షమును తెచ్చేను. దీనిపై ఇంద్రుడు మండిపడి, కోపముతో గ్రుడ్డివాడై, వజ్రమును చేతబట్టి, సైన్యముతో శ్రీకృష్ణునిపై దండెత్తాను. తన ప్రియురాలి ప్రేరణచే అట్లు చేసిన ఇంద్రుడు నిశ్చయముగా ఆడువారి చేతిలో కీలుబొమ్మయే.
యుద్దములో తన విశాలమగు దేహముతో అంతరిక్షమును మ్రింగుచున్నాడా యన్నట్లు ఉన్న నరకాసురుని శ్రీకృష్ణుడు తన చక్రముతో సంహరించెను. అపుడు వాని తల్లియగు భూదేవి కోరగా, ఆయన మిగిలిన రాజ్యమును వాని పుత్రుడగు భగదత్తునకు ఇచ్చి, వాని అంతఃపురములో ప్రవేశించేను.
భూపుత్రుడగు నరకుడు తీసుకు వచ్చిన రాజకన్యలు ఆ అంతఃపు రములో గలరు. కష్టములోనున్నవారిని రక్షించే శ్రీకృష్ణుని చూడగానే వారు లేచి నిలబడిరి. వారు గొప్ప ఆనందమును పొంది, సిగ్గుతో మరియు ప్రేమతో ఆయనను చూస్తూ, వెంటనే ఆయనను భర్తగా వరించిరి.
ఆయన ఆ యువతులనందరినీ వారి వారికి తగిన రూపములను తన మాయచే దాల్చినవాడై ఒకే ముహూర్తమునందు వేర్వేరు గృహము లలో యథావిధిగా వివాహమాడెను.
ఆయన ఆ భార్యలలో ప్రతి ఒక్కరియందు పది మంది పిల్లలను, తనకు అన్ని విధములుగా తగినవారిని కనెను. తద్ద్వారా సృష్టి విస్తరించెను.
కాలయవనుడు, మగధదేశాధిపతియగు జరాసంధుడు, శాల్వుడు. మొదలగు వారు సేనలతో మథురను, ద్వారకను ముట్టడించినప్పుడు, శ్రీకృష్ణుడు ఇతరులను కేవలము నిమిత్తముగా చేసుకొని, తానే వారిని మట్టుబెట్టెను. పైగా, అర్జునుడు మొదలగు తన భక్తులకు దివ్యమగు పరాక్ర మమును ఇచ్చెను.
శంబరుడు, ద్వివిదుడు, బాణుడు, మురుడు, బల్వలుడు, దంతవ కూడు మొదలగు వారిలో కొందరిని శ్రీకృష్ణుడు స్వయముగా సంహరించెను; మరికొందరిని ఇతరులచే వధింపజేసెను.
తరువాత ఆయన నీ సోదరులగు పాండు ధృతరాష్ట్రుల సంతాన మగు పాండవుల మరియు కౌరవుల పక్షములలో జేరి వచ్చిన రాజులను సంహరింప జేసెను. ఆ రాజులు తమ తమ సైన్యములతో గూడి కురుక్షేత్ర మునకు వచ్చుచుండగా, భూమి కంపించెను.
కర్ణుడు దుశ్శాసనుడు మరియు శకుని ఇచ్చిన చెడు సలహాల ఫలి తముగా దుర్యోధనుని సంపద నశించి, ఆయువు మూడెను. ఆతడు తొడలు విరుగగొట్టబడగా, అనుచరులతో గూడి యుద్ధరంగములో నేలపై పడియుండెను. కాని, అట్టి దుర్యోధనుని చూచిన శ్రీకృష్ణునకు సంతోషము కలుగలేదు.
పెనుభారమును తగ్గించినారు. కాని ఇది యెంతటిది? ఏలయనగా, ఇంకనూ సహింప శక్యము కాని యాదవబలము మిగిలియే యున్నది.
ఈ యాదవులు మద్యమును త్రాగి గట్టి నిషాతో ఎర్రనైన కన్నులు గలవారై ఒకరితో మరియొకరు పోట్లాడుకొనెదరు. వీరి వధకు ఇంతకంటే మరియొక ఉపాయము లేదు. నేను అవతారమును చాలించుటకు సిద్దపడు చుండగా వారు తమంత తాముగా నశించగలరు.
శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా ఆలోచించి ధర్మరాజును ఆయన రాజ్యమునందు స్థాపించి, తన ప్రవృత్తిచే సత్పురుషుల నడవడిని లోకమునకు చూపిస్తూ బంధుమిత్రులకు సంతోషమును కలిగించెను.
పూరువంశమును నిలబెట్టువాడు, అభిమన్యుని పుత్రుడు అగు శిశువు ఉత్తరయొక్క గర్బములో చక్కగా పెరుగుచుండగా, ద్రోణపుత్రు డగు అశ్వత్థామ అస్త్రమును ప్రయోగించి, ఆ శిశువును సంహరించేను. అపుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ శిశువునకు మరల ప్రాణమును పోసెను.
శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుచే మూడు అశ్వమేధయాగము లను చేయించెను. ధర్మరాజు కూడ తమ్ములతో కలిసి రాజ్యమునేలుచూ, శ్రీకృష్ణుని నిష్ఠతో అనుసరించువాడై, సుఖించెను.
జగత్తునకు ఆత్మ, అధిష్ఠానము అగు శ్రీకృష్ణ భగవానుడు తాను కూడ లోకమర్యాదను పాలిస్తూ, వైదిక ధర్మమును అనుష్ఠిస్తూ, సచ్చిదానం దమగు ఆత్మయందు నిష్ఠ గలవాడగుటచే సంసారమునందు ఆసక్తి లేనివాడై, ద్వారకా నగరములో భోగములననుభవించెను. ఆయన ఆ విధముగా లోకములో సాంఖ్యయోగము (జ్ఞానమార్గము) ను నిలబెట్టెను.
శ్రీకృష్ణుని ప్రేమతో నిండిన చిరునవ్వు తోడైన చూపులకు, అమృ తమువంటి పలుకులకు, దోషరహితమగు చరితములకు, లక్ష్మీదేవికి (సౌం దర్యమునకు) నివాసస్థానమగు రూపమునకు ఈ లోకములోని జనులు, విశేషించి యాదవులు మాత్రమే గాక, స్వర్గాదిలోకములలోని వారు కూడ ముగ్ధులైరి. ఆయన రాత్రియందు కొద్ది సమయము లభించిన సందర్భము లలో, ఉత్సాహముతో కూడియున్న గోపికల అనురాగపూర్ణములగు చూపు లను స్వీకరిస్తూ, రాసక్రీడయందు రమించెను.
ఆయన ఈ విధముగా అనాసక్తుడై అనేక సంవత్సరములు రమిం చెను. అపుడాయనకు గృహస్థాశ్రమమునకు సంబంధించిన కామోపభోగ ములయందు, వాటి సాధనములయందు వైరాగ్యము కలిగెను.
కర్మయోగ మార్గములో గాని, లేదా జ్ఞానమార్గములో గాని యోగే శ్వరుడగు శ్రీకృష్ణ భగవానుని నిష్టతో సేవించే ఏ పురుషుడు భోగముల యందు నమ్మకమును కలిగియుండును? ఏలయనగా, మానవుడు తాను స్వయముగా ఈశ్వరునకు అధీనుడై యున్నాడు. భోగములు కూడ ఈశ్వ రాధీనములుగనే యున్నవి. ఇట్టి స్థితిలో భగవానుడు భోగాసక్తుడు కాడనీ వేరుగా చెప్పవలయునా? (భగవానుడే విరక్తుడు కాగా, ఆయనను అనుస రించే భక్తుడు కూడ అటులనే చేయును గదా!)
ఒకనాడు ద్వారకా నగరములో యదుభోజవంశములకు చెందిన కుమారులు ఆటలాడుతూ మహర్షులకు కోపమును కలిగించిరి. శ్రీకృష్ణ భగవానుని అభిమతము ఆ మహర్షులకు తెలిసి యుండుటచే, వారు శపించిరి.
కొన్ని మాసముల తరువాత దైవముచే మోహింపజేయబడి యున్న వృష్టి-భోజ-అంధక మొదలగు వంశములకు చెందిన యాదవులు గొప్ప ఉల్లాసముతో రథములనెక్కి ప్రభాస క్షేత్రమునకు వెళ్లిరి.
వారు ఆ ప్రభాసతీర్థమునందు స్నానము చేసి, దేవ-పితృ-ఋషి తర్పణములను ముగించుకొని, బ్రాహ్మణులకు మంచి లక్షణములతో కూడిన ఆవులను దానము చేసిరి.
ఆ యాదవులు తమ జీవితమును శక్తిని అంతనూ గోవులను మరియు బ్రాహ్మణులను రక్షించుట కొరకై వినియోగించెడివారు. అట్టి శూరులగు ఆ యాదవులు బంగారము, వెండి, శయ్యలు, విలువైన వస్త్ర ములు, మృగచర్మములు, కంబళ్లు, పల్లకీలు, రథములు, ఏనుగులు, కన్య లు, పంటలు పండే భూములు, నానావిధముల రుచ్యములగు ఆహార పదార్థములు అనువాటిని బ్రాహ్మణులకు దానము చేసిరి. అట్లు చేయుచూ వారు మనస్సును భగవంతునిపై నిలిపి, ఆ దానములను ఈశ్వరార్పణలుద్దితో చేసిరి. తరువాత వారా బ్రాహ్మణులకు సాష్టాంగప్రణామముల నాచరించిరి,
శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో మూడవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 3 of the Bhāgavata Mahā Purana is as follows:
Uddhava continues his affectionate recollection of Lord Kṛshṇa's heroic and divine deeds after leaving the pastoral glades of Vṛndāvana. He recounts the vanquishing of Kamsa, the liberation of His parents, the establishment of the magnificent city of Dvārakā, the abduction of Rukmiṇī, and the alleviation of the earth's heavy burden through the Kurukshetra war, highlighting how the Lord acted out His supreme will while remaining entirely unattached.