భాగవత మహా పురాణము
4 - సతీదేవి ప్రాణములను విడిచి పెట్టుట
మైత్రేయ ఉవాచ ।
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- శంకరుడు ఇంత మాత్రము పలికీ మిన్నకుండెను. సతీదేవిని వెళ్లకుండగా వారించుట, వెళ్లుటకు అను మతించుట అనే రెండు పక్షములలో ఆమె దేహత్యాగము ఘటిల్లవచ్చుననే ఆశంక ఆయనకు కలిగెను. ఆమెకు ఒక వైపు తన బంధువులను చూడవలె ననే కోరిక ఉండెను. మరియొక వైపు తాను వెళ్లినచో, శంకరుని ఆజ్ఞను. ఉల్లంఘించిన దోషము కలుగునేమో యను ఆశంక గలదు. ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లి, మరల వెనుకకు మరలి వస్తూ, ఇటునటు తేల్చుకొన లేక సతమతమయ్యేమ.
సతీదేవికి బంధువులను చూడవలెననే కోరిక గట్టిగా ఉండెను. ఆ కోరికకు విఘాతము కలుగగానే ఆమె మనస్సు. చెడిపోయెను. ఆమె దుఃఖ ముతో కన్నులనుండి వీటిని విడుచుచుండెను. బంధువులయందలి ప్రీతి వలన మనస్సు మిక్కిలి కల్లోలితమగుటచే రోదించుచున్న ఆమెకు శరీర ములో వణుకు పుట్టెను. తనతో సాటియైనవారు ఎవ్వరూ లేని శివుని, అట్టి సతీదేవి రోషముతో దహించివేయునా యన్నట్లు చూచెను.
అప్పుడు సతీదేవి తన హృదయములో, శివుడు తనను వెళ్లవద్ద న్నందులకు కోపముతో, శివుని మాటను ఉల్లంఘించుచున్నందులకు దుఃఖ ముతో, చాల తాపమును కలిగియుండెను. అపుడామె దీర్ఘముగా నిట్టూర్చి, ఆ శివుని విడిచి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాను. సత్పురుషులకు ప్రియుడగు శివుడు ఆమెకు ప్రేమతో తన అర్ధభాగమును ఇచ్చెను. కాని, ఆమె బుద్ధి యందు స్త్రీసహజమగు ప్రేమ వలన వ్యామోహము నెలకొనెను. కావున నే, అట్టి శివుని ఆమె విడిచి వెళ్లాను.
ఆ సతీ దేవి ఒంటరియై వేగముగా నడిచి వెళ్లుచుండగా, మణిమం తుడు, మదుడు మొదలగు శివుని కింకరులు ఇతరులగు పార్షదులతో మరియు యక్షులతో గూడినవారై, వేల సంఖ్యలో నందీశ్వరుని ముందడు కొని, వేగముగా ఆమెను అనుసరించి వెళ్లిరి. శివుని అనుచరులగుటచే వారు నిర్భయులే అయిననూ, సతీదేవిని చూచి వారికి దుఃఖము ముంచుకు వచ్చెను.
వారు ఆ సతీదేవిని నందీశ్వరునిపై అధిష్ఠింపజేసిరి. వారు మైనా పక్షి (ముద్దుగా కబుర్లు చెప్పే పక్షి), బంతి మొదలగు వినోదసాధనముల ను, అద్దము పద్మము పుష్పమాల మొదలగు అలంకరణసామగ్రిని, తెల్లని గొడుగు వింజామరలు మొదలగు మహారాజచిహ్నములను దోడ్కొని వెళ్లిరి. వారి యాత్రకు భేరీలు, శంఖములు, పిల్లన గ్రోవులు మొదలగు సంగీత సాధనములు శోభను చేగూర్చినవి.
దక్షుని యజ్ఞశాలలో వేదధ్వనులు మిన్ను ముట్టుచుండెను. వివిధ హోమముల మధ్యకాలములో పండితులు స్పర్ధతో శాస్త్రచర్చలను చేయు చుండిరి. ఆ యజ్ఞవాటికను అన్ని రకముల దేవతలు, వేదవేత్తలు మరియు మహర్షులు సేవించుచుండిరి. ఆ స్థానము మట్టి, చెక్క, ఇనుము, బంగార ము, దర్భలు మరియు తోలు అనువాటితో నిర్మించబడిన వివిధపాత్రలతో నిండియున్నది. అట్టి యజ్ఞస్థానములో సతీదేవి ప్రవేశించెను.
అక్కడకు చేరుకున్న సతీదేవిని దక్షుడు అవమానించెను. ఆమె తల్లి, అక్కచెల్లెళ్లను మినహాయించి, యజ్ఞమును చేయుచున్న దక్షుని భయము వలన, ఏ ఒక్క రైననూ ఆమెను ఆదరించలేదు. అక్కచెల్లెళ్లు, తల్లి మాత్రము ఆమె రాకకు చాల సంతోషించిరి. ప్రేమతో వారి కన్నులలో నీరు నిండెను. వారి కంఠములు బొంగురువోయెను. వారామెను కౌగిలించు కొనిరి.
తండ్రియగు దక్షుడు ఆ సతీదేవిని ఆదరపూర్వకముగా ఆహ్వానిం చలేదు. కాని, ఒకే తల్లి కడుపున పుట్టినవారగుటచే అక్కచెల్లెళ్లు కుశలప్రశ్న లను వేసి యథోచితమగు పలుకులను పలికిరి. ఆమె తల్లి, తల్లి తోబుట్టు వులు ఆమెను ఆదరపూర్వకముగా లోపలికి గొనిపోయి పరిచర్యను చేసి, ఉత్తమమగు ఆసనమును సమర్పించిరి. కాని, తండ్రి అవమానించిన కారణ ముగా, సతీదేవి ఆ పరిచర్యలను గాని, ఆసనమును గాని స్వీకరించలేదు.
ఆ యజ్ఞములో రుద్రునకు హవిర్భాగములు సమర్పింపబడలేదు. తండ్రి ఆ విధముగా సర్వసమర్థుడగు శివదేవుని అవమానించుటను సర్వ లోకములకు ఆధీశ్వరియగు సతీదేవి స్వయముగా చూచెను. పైగా, దక్షుడు యజ్ఞవాటికలో ఆమెను కూడ అవమానించి యుండెను. అపుడామె తీవ్ర మగు కోపమును పొందెను. ఆమె ఆ కోపముతో లోకములను తగులబెట్టి బోవుచున్నదా యన్నట్లు ఉండెను.
సతీదేవి కోపమును చూచి ప్రమథగణములు లేచి నిలబడినవి. ఆపుడామె వారివైపు తీక్ష్ణముగా చూడగనే, వారు ఆగిపోయిరి. పొగ (అ జ్ఞానము) తో నిండియున్న కర్మమార్గములో, శ్రమిస్తూ గర్వించి శివుని ద్వేషించే తండ్రిని చూచి, ఆమె అక్కడి జనులు అందరు వినుచుండగా, కోపముతో తడబాటు పడుతున్న పలుకులతో ఆతనిని నిందించెను.
శ్రీదేవ్యువాచ ।
శ్రీసతీదేవి ఇట్లు పలికెను --- ఈ సృష్టిలోని సకలప్రాణులలో ఆ శివుడే ఆత్మరూపుడై యున్నాడు. కావున, ఈ సృష్టిలో ఆయనకంటే మొన గాడు మరియొకడు లేడు. అదే విధముగా, సకలప్రాణులకు ఆత్మయే అయి ఉన్న ఆయనకు ఒకడు ప్రియుడనియు, మరియొకడు ద్వేష్యుడ నియు భేదము లేదు. మరియు, సత్యస్వరూపుడగు ఆ శివునకు ఎవరితోనై ననూ విరోధము లేదు. అట్టి ఆ శివునకు ప్రతికూలమును నీవు తప్ప మరి యెవ్వరు ఆచరించెదరు?
ఓయీ! నేను బ్రాహ్మణుడను అని నీవు విర్రవీగుచున్నావు. నీవంటి దుష్టులు (అధములు) ఇతరుల గుణములయందు కూడ దోషములను దర్శించేదరే గాని, ఇతరుల గుణములను దర్శించలేరు. మధ్యరకమునకు చెందినవారు ఇతరుల గుణదోషములను యథాతథ ముగా స్వీకరించెదరు. సాధుపురుషులు ఇతరుల దోషములను విడిచి పెట్టి, గుణములను మాత్రమే చూచెదరు. కాని, మహాత్ములు ఇతరుల దోషము లను దర్శించకపోవుట మాత్రమే గాక, వారి అల్పములగు గుణములను కూడ గొప్పవిగా స్వీకరించెదరు. అట్టి మహాత్ముల విషయములో నీవు అప రాధమును చేసి పాపమును మూటగట్టుకొంటివి.
శవమువంటి శరీరమే ఆత్మయని స్వీకరించే స్వభావము గల దుష్టులు సర్వకాలములలో ఓర్వలేనితనమును కలిగియుందురు. వారు మహాత్ములను అధికముగా నిందించుటలో ఆశ్చర్యము లేదు. కాని, అట్టి దుష్టుల తేజస్సును తుడిచి పెట్టుటకు ఆ మహాత్ముల పాదధూళియే చాలు ను. పైగా, ఆ దుష్టులకు అట్టి మహాత్ముల నింద కాలక్రమములో కలిగే శిక్ష ద్వారా శోభను కూడ చేకూర్చును. మరియు, దుష్టుల నింద వలన మహా త్ముల శోభ ఇనుమడించునే గాని, వారికి అపకీర్తి లేదు.
శివ అనే రెండు అక్షరముల నామము వేదశాస్త్రములలో ప్రసిద్ధమై యున్నది. దానిని మానవులు బుద్ధిపూర్వకముగా కాకున్ననూ, ప్రసం గవశముచేనైననూ ఒక్కసారి నోటితో ఉచ్చరించినచో, వారి పాపములు వెంటనే నశించును. శివుని కీర్తిని గానము చేయుటచే మానవుడు పావనుడగును. ఆయన ఆజ్ఞను ఉల్లంఘించగలవారు సృష్టిలో లేరు. అట్టి మంగళక రుడగు శివుని కూడ. నీవు ద్వేషించుచున్నావు. ఇది ఆశ్చర్యము! వీవు పాప రూపుడవు, అమంగళకరుడవు.
తుమ్మెదలు తేనెకొరకై పద్మము చుట్టూ తిరుగును. అదే విధము గా, బ్రహ్మానందమును ఆస్వాదించగోరే మహాత్ముల మనస్సులు పద్మము ను బోలియుండు శివుని పాదములను నిరంతరముగా ధ్యానించుచుండు ను. ఆ శివుని పాదములు భక్తజనులకు కోరికలను వర్షించుచుండును. జగ త్తునకు తండ్రియగు అట్టి శివుని నీవు ద్వేషించుచున్నావు.
శంకరుడు పేరుకి శివుడు (మంగళకరుడు) అయినా, వాస్తవ ములో అశివుడు (అమంగళరూపుడు) అని నీవు చెప్పితివి. ఈ సంగతి నీకే గాని, బ్రహ్మగారు మొదలగు వారికి తెలియదా యేమి? ఏలయనగా, ఆ శివుడు జటలను విరబోసుకోని పిశాచములతో బాటు శ్మశానములో మకాము చేసియున్నాడు. పైగా, శ్మశానములోని మాలలను, భస్మను, మనుజుల పుర్రెను ధరించినాడు. కాని, ఆ బ్రహ్మాదులు ఆయన పాదముల నిర్మాల్యమును తమ శిరస్సులపై ధరించుచున్నారు. నీకు తెలిసిన సత్యము వారికి తెలియదా యేమి?
ధర్మరక్షకుడు, జగన్నాథుడు అగు శివుని సభలోని జనులు నిందిం చినప్పుడు, ఆ నిందలను విన్న భక్తుడు సమర్థుడు కానిచో, అక్కడనుండి నిషమించవలెను. లేదా, ఆ వ్యక్తి సమర్థుడైనచో, చెడుకూతలను కూసే ఆ నాలుకను కోసివేయవలెను. అట్లు చేయక, నిందలను విన్నచో, ప్రాణ ములను విడిచి పెట్టవలెను. ధర్మము ఈ మూడు విధములుగా నున్నది.
దేవతలకు ఉపకారమును చేయుటకొరకై విషమును త్రాగి. నీలకం తుడైన శివుని నిందించుటయే నీవు పనిగా పెట్టుకున్నావు. కావున, నేను నీనుండి పుట్టిన ఈ దేహమును ధరించియుండను. ఏలయనగా, భ్రమ వలన ఒకడు తినకూడని ఆహారమును తిన్నచో, వమనము చేయుటయే దానికి విరుగుడు అని పెద్దలు చెప్పెదరు.
గొప్ప మననశీలుడగు జ్ఞాని ఆత్మ అనే లోకమునందు మాత్రమే నిష్ఠను పొంది ఆనందమునందు నిమగ్నుడై యుండును. అట్టి జ్ఞాని యొక్క బుద్ధి వేదోక్తములగు విధినిషేధములయందు ప్రవర్తిల్లదు. అనగా, ఆతడు వేదోక్తములగు విధిని షేధములకు అతీతుడు. దేవతలు, మను ష్యులు ఒకే మార్గములో సంచరించుట లేదు. అదే విధముగా కర్మఠులు, జ్ఞానులు ఒకే పద్దతిలో జీవించుట లేదు. మానవుడు ఈ సత్యమును గుర్తిం చి, తాను తనకు ఉద్దేశించబడిన ధర్మమును అనుష్ఠించవలెను. అంతేగాని, ఇతరులను తన ధర్మము అనుష్టించని కారణముగా గాని, లేక మరియొక ధర్మమును అనుష్ఠించుచున్న కారణముగా గాని, నిందించరాదు.
కర్మ ప్రవృత్తి, నివృత్తి అని రెండు విధములుగా నున్నది. విషయ. సుఖములయందు రాగము గల వ్యక్తికి అగ్నిహోత్రము మొదలగు స్వర్గసాధనములగు కర్మలను వేదము- విధించినది. వైరాగ్యము గలవానికి అదే వేదము శమదమాది నివృత్తిరూపమగు కర్మను విధించినది. ఈ రెండు మార్గములు పరస్పరము విరుద్ధములగుటచే, ఒకే వ్యక్తి ఒకే కాలము నందు ఈ రెండింటినీ కలిపి అనుష్ఠించుట సంభవము కాదు. అంతేగాక, పరబ్రహ్మయగు శివునియందు ఈ రెండు విధముల మార్గములు అన్వ యించవు. అనగా, శివుడు ప్రవృత్తి మార్గమును గాని, నివృత్తి మార్గమును అనుసరించ దగిన ఆవశ్యకత లేదు.
ఓ తండ్రీ! మాకు (నాకు, శివునకు) ఉండే అణిమాది సిద్దులు బయటకు ప్రకటము కావు. ఆ సిద్దులను కేవలము బ్రహ్మవేత్తలు మాత్రమే కలిగియుందురు. ఇంద్రియభోగములయందు లాలసులైన నీవంటి వారలు యజ్ఞశాలలయందు. కామ్యకర్మలను చేస్తూ, ఆ పొగలో మగ్గుతూ, ఆ యజ్ఞాన్నమును తిని తృప్తిని చెందేదరు. నీవంటి వారకు మా సిద్ధుల మహిమ అవగతము కాదు. నీవంటి వారలు దక్షిణమార్గములో స్వర్గాదిలోక ములను పొంది అచట కర్మఫలరూపములగు అల్పభోగములననుభవించి, మరల జన్మించెదరు. నీవంటి వారలకు శివుని మహిమ గోచరము కాదు.
నీవు శివుని యెడల పాపమునాచరించినావు. అట్టి నీ దేహము వలన జన్మించిన ఈ నా దేహము మిక్కిలి నింద్యమైనది. దీనితో నాకు ప్రయోజనమేమియు లేదు. దుష్టుడవగు నీతో ప్రసంగించినందులకు నాకు సిగ్గు వేయుచున్నది. శివునివంటి మహాత్ముల యెడల అపరాధమును చేసిన నీ వలన కలిగిన ఈ నా జన్మ నిందనీయము.
శివుని ధ్వజమునందు వృషభము చిహ్నముగా నుండును. ఆయన ధర్మరక్షకుడు. అప్పుడప్పుడు ఆ భగవానుడు నన్ను దాక్షాయణి (దక్షుని కుమార్తె) అని పిలిచెడివాడు. ఆ సమయములలో నాలోని పరిహా సము తొలగిపోయి, చిరునవ్వు మాయమై, నేను మనస్సులో చాల భేద మును పొందెడిదానను. కావున, నీ దేహమునుండి పుట్టిన శవప్రాయమగు ఈ శరీరమును నేను వెంటనే విడిచి పెట్ట బోవుచున్నాను.
మైత్రేయ ఉవాచ ।
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- కామము, క్రోధము మొద లగు అంతశ్శత్రువులను జయించిన ఓ విదురా! ఈ విధముగా యజ్ఞశా లలో ఆ సతీదేవి దక్షునితో పలికి, వెంటనే పలుకులను విరమించేను. ఆమె పచ్చని వస్త్రమును కప్పుకున్నదై ఆచమనమును చేసి, ఉత్తరదిక్కు వైపు తిరిగి నేలపై కూర్చుండి, కన్నులను మూసుకొని యోగమార్గములో సమాధిస్థితిని పొందెను.
దోషము లేని ఆ సతీదేవి దృఢమగు ఆసవమును బంధించి, ప్రాణాయామమును చేసి ప్రాణాపానములను సమానముగా చేసెను. అపు డామె ఉదావము (ప్రాణశక్తి శరీరమును విడుచునట్లు చేసే వాయువిశేష ము) ను నాభిస్థానము (మణిపూరకచక్రము) నుండి పైకి లేపి, మెల్లగా బుద్ధితో సహా హృదయస్థానమునందలి అనాహతచక్రములో ప్రవేశపెట్టేను. అక్కడనుండి దానిని కంఠమునందలి విశుద్ది చక్రములోనికి, కంఠమునుండి కనుబొమల మధ్యయందలి ఆజ్ఞాచక్రములోనికి ప్రవేశ పెట్టెమ.
సనకుడు మొదలగు మహాత్ములచే పూజించబడే శివుడు ప్రేమతో సతీదేవిని తన అంకముపై పలుమార్లు అధిష్టింపజేసెడివాడు. అభిమాన వతి మరియు ధైర్యవంతురాలు అగు సతీదేవి దక్షుని కోపము కారణముగా అట్టి తన దేహమును విడువగోరెను. ఆమె అప్పుడు యోగమార్గములో మనస్సునందు వాయువును, అగ్నిని ధారణ చే పెను.
తరువాత ఆ సతీదేవి జగత్తునకు తండ్రి, తనకు భర్తయగు శివుని పాదపద్మములను మనస్సులో ధ్యానించుచుండెను. అట్టి ధ్యానము వలన ఆమెకు అమృతమువంటి హృదయానందము కలిగెను. ఆమె సమాధియం దున్నదై బాహ్యస్పృహ లేకుండెను. ఆ ధ్యానముచే ఆమె దేహమునకు దక్షుని దేహమునుండి పుట్టుట అనే దోషము దూరమయ్యెను. అపుడా సమాధినుండి పుట్టిన అగ్ని ఆమె దేహమును శీఘ్రమే కాల్చివేసెను.
దేవతలు మొదలగువారు ఆ గొప్ప ఆశ్చర్యమును చూచి, అయ్యో! అయ్యో! అంటూ బిగ్గరగా హాహాకారములను చేసిరి. అయ్యో! శివుడు దేవాధిదేవుడు. ఆయన ప్రియురాలగు సతీదేవికి దక్ష ప్రజాపతి తీవ్ర మగు కోపము వచ్చునట్లు చేయగా, ఆమె ప్రాణములను విడిచి పెట్టెను అని పలుకుతూ, వారు చేసిన హాహాకారములు భూమిపై మరియు ఆకాశములో మారుమ్రోగినవి.
ఆశ్చర్యము! సకలచరాచరప్రాణులను ప్రేమగా చూడవలసిన ఈ దక్షప్రజాపతియొక్క అతిశయించిన దౌర్జన్యమును చూడుడు, తన కుమా ర్తెయగు సతీదేవిని అవమానించినాడు. గొప్ప అభిమానవతియగు ఆ సతీ దేవిని ఎన్ని మార్లు గౌరవించిననూ, ఆమె అట్టి గౌరవమునకు అర్హురాలే.. ఈతడు అవమానించిన కారణముగా పవిత్రహృదయురాలగు ఆమె ప్రాణ ములను విడిచి పెట్టినది.
ఈ దక్షుని హృదయము చెడు ఆలోచనలకు పుట్ట. ఈతడు శివుని ద్వేషించి ఆయన యెడల ద్రోహమునే చేసినాడు. ఈతనికి లోకములో పేద్ద అపకీర్తి కలుగును. ఏలయనగా, ఈతడు చేసిన అవమానము వలన స్వంత కుమార్తె మరణించుటకు సిద్ధపడగా, ఈతడు ఆపే ప్రయత్నమునై ననూ చేయలేదు.
జనులు ఈ విధముగా చెప్పుకొనుచుండిరి. సతీదేవి చేసిన ఆ అద్బుతమగు ప్రాణత్యాగమును చూచిన రుద్రానుచరులు ఆయుధములను దాల్చినవారై, దక్షుని సంహరించుటకు సంసిద్దులైరి.
భృగు మహర్షి గొప్ప మంత్రశక్తి గలవాడు. తమ మీదకు వేగముగా దూసుకువచ్చుచున్న రుద్రానుచరులను చూచి, ఆతడు దక్షిణాగ్నియందు యజ్ఞమును చెడగొట్టువారిని నశింపజేసే యజుర్వేదమంత్రముతో హోమ మును చేసెను.
అధ్వర్యుడైన భృగుమహర్షి ఆ విధముగా అగ్నిలో హోమమును చేయుచుండగనే, ఋభువులు అని ప్రసిద్దిని గాంచిన దేవతలు గొప్ప వేగ ముతో ఆవిర్భవించిరి. ఈ దేవతలు పూర్వము తపస్సును చేసి, చంద్రలోకమును మరియు యజ్ఞములోని సోమములో భాగమును పొందియుండిరి.
బ్రహ్మవర్చస్సుతో ప్రకాశించే ఆ దేవతలు మండే కర్రలనే ఆయు ధములుగా పట్టుకొని, యక్షులతో కూడియున్న రుద్రానుచరులను కొట్టజో చ్చిరి. అపుడు వారందరు నలు దిక్కులకు పారిపోయిరి.
శ్రీమద్భాగవతములోని నాల్గవ స్కంధములో సతీదేవి ప్రాణములను విడుచుట అనే నాల్గవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 4 of the Bhāgavata Mahā Purana is as follows:
Ignoring the compassionate warnings of Mahādeva Śiva, Satī-devī proceeded to her father’s sacrificial arena, where she was met with cold indifference by Daksha and fear-stricken silence from the assembly. Heartbroken by her father’s blatant disrespect toward her spotless spouse, Satī publicly condemned Daksha’s arrogance and false piety. Sitting in deep yogic trance, she ignited the mystic fire within her own body through internal pranayama, forfeiting the physical frame born of Daksha and leaving the entire cosmic assembly in profound shock and grief.